తిరుమల శ్రీవారికి స్వర్ణకఠారి విరాళం..


Ens Balu
7
Tirumala
2021-07-19 14:53:41

తిరుమల శ్రీవారికి సోమవారం స్వర్ణకఠారి విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన దాత  ఎం.ఎస్.ప్రసాద్ ఈ మేరకు స్వర్ణకఠారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అందించారు.  ఈ స్వర్ణకఠారిని 2 కిలోల బంగారు, 3 కిలోల వెండితో తయారు చేశారని, దీని విలువ ఒక కోటి రూపాయలకు పైగా ఉండొచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, తను శ్రీవారికి స్వర్ణకఠారిని ఇస్తానని మొక్కుకున్నానని ఇప్పటి స్వామివారి మొక్కు తీరిందని అన్నారు. స్వామి దయతో కరోనా వైరస్ పూర్తిగా నశించి జనజీవనం సాధారణ స్తితికి రావాలని కోరుకుటున్నానని అన్నారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.