మిజోరం గవర్నర్ గా హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గతవారంలోనే కేంద్రం ఆయనను మిజోరం గవర్నర్ గా నియమించింది. ఆయన ఐజ్వాల్ లో ఆయన గవర్నర్ గాఈరోజు ప్రమాణం చేశారు. దేశవ్యాప్తంగా ఇటీవలనే గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర పరిధిలో లాక్డౌన్ అమల్లో ఉంది. దీంతో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. హరిబాబు మిజోరం రాష్ట్రానికి 22వ గవర్నర్ గా ఇవాళ భాద్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో సీఎం జోరామ్తంగా, టాన్లూయా,ఉప ముఖ్యమంత్రి స్పీకర్,లాలిన్లియానా పైలో, మంత్రుల మండలి ముఖ్య కార్యదర్శి,డీజీపీతో పాటు పలు పార్టీ ముఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.