స్వయం సహాయక సంఘాలు బలపడాలి..


Ens Balu
3
Vizianagaram
2021-08-12 13:56:04

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయం సహాయక సంఘ సభ్యులతో “ఆత్మ నిర్భర్ నారీ శక్తి సే సంవాద్” ముఖాముఖి కార్యక్రమం గురువారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పధక సంచాలకులు, డి.ఆర్.డి.ఎ – వై.కె.పి, అదనపు పధక సంచాలకులు – వై.కె.పి, సంఘ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానమంత్రి  మాట్లాడుతూ స్వయం సంఘ సభ్యులు ఆర్ధికంగా బలపడాలని తెలియజేసినారు. సంఘ సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను online ద్వారా అమ్మకాలు జరిపి లాభాలా బాటలో నడవాలని తెలియజేసినారు.  సంఘ ఇస్తున్న బ్యాంక్ లింకేజ్ మొత్తము రూ. 10.00 లక్షల రూపాయలను రెండు రెట్లు అనగా రూ.20.00 లక్షలు పెంచుతున్నారని, వీటి ద్వారా జీవనోపాధులను పెంపొందించుటకు దోహద పడునని తెలియజేసినారు. అన్ని రాష్ట్రాలలో గల మహిళా సంఘ సభ్యులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసినారు.