తిరుపతిలో ఐనా మహల్ ప్రారంభం..
Ens Balu
3
Tirupati
2021-08-22 15:54:14
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రూ. 66 లక్షలతో ఆధునీకరించిన ఐనా మహల్ను ఆదివారం రాత్రి టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఐనా మహల్ లో సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, పుండరీక వల్లి అమ్మవారి ఉత్సవర్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, గోవింద రాజాస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్ ను శ్రావణ పౌర్ణమి పుణ్యదినం సందర్భంగా పునఃప్రారంభించామని లిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 ఏళ్ళ కిందట నిర్మించిన ఐనా మహల్ ను ఆధునీకరించి పునః ప్రారంభించామన్నారు. ఇక మీదట ఇక్కడ రోజూ స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ఐనా మహల్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, జెఈవో సదా భార్గవి, ఎఫ్ఏసిఎ వో బాలాజి, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, డెప్యూటీ ఈవోలు గోవిందరాజులు, రమణ ప్రసాద్, ప్రధాన అర్చకులు ఎపి.శ్రీనివాస దీక్షితులు, ఏఈవో రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటాద్రి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కామరాజు పాల్గొన్నారు.