బంగారు కోడిపెట్టను చంపేస్తున్న కేంద్రం..
Ens Balu
8
New Delhi
2021-09-10 10:43:29
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు బంగారు గుడ్లు పెట్టే కోడిపెట్టను కోసేస్తున్నట్టే కనిపిస్తుంది. ఏంటీ వెరైటీగా ఉంది అనుకుంటున్నారా..అలా అయితే మీరూ ప్రభుత్వాల్లా ఆలోచిస్తున్నట్టే లెక్క. వ్యాపారస్తులను ముక్కు పిండి వసూలు చేయడానికి అమలు చేసిన జిఎస్టీ విషయంలో రిటర్న్స్ దాఖలు చేయని సంస్థలపై ఫైన్లు వేసి దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయాలను ఒకే సారి సంపాదించాలని చూస్తున్నాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడే ప్రభుత్వాలు తప్పుచేశాయి. గత రెండేళ్ల నుంచి కరోనాతో వ్యాపారాలు లేని సంస్థలు జిఎస్టీ రిటర్న్స్ లు ఏ విధంగా చేస్తాయనే విషయంలో కాస్త కూడా ఆలోచించడం లేదు. అలాగని ఫైన్లు వేసి వసూచే చేయడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంటు కు టార్గెట్లు ఇచ్చి మరీ కేసులు పెడుతున్నాయి. ఇలా చేయడం వలన ఒక్కసారి మాత్రమే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. తరువాత జిఎస్టీ అధికారులు సంగతి తెలుసుకున్న వ్యాపారస్తులు జిఎస్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయించడం మానేస్తారు. అలాకాకుండి కరోనాలో వ్యాపారం లేని సంస్థలకు రిటర్న్స్ ఎలాంటి ఫైన్లు లేకుండా దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తే.. ప్రస్తుతం ఉన్న జిఎస్టీ నెంబర్లు రద్దు కాకుండా ఉంటాయి. పైగా ప్రస్తుతం కరోనా సమసి పోతున్న తరుణంలో వున్నవారంతా జిఎస్టీ రిటర్న్లు వేయించుకోవడానికి ముందుకొస్తారు. తద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు జిఎస్టీ ద్వారా ఆదాయం జీవనదిలా అలా వస్తూనే ఉంటుంది. అలాకాకుండా ప్రభుత్వం ఒకేసారి ఆదాయం సమకూర్చుకోవడానికి చిన్నా చితకా సంస్తలపై క్యాన్సిలేషన్స్ కోసం పడితే మాత్రం ఉన్నది..ఉంచుకున్నదీ రెండూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్ల రూపాయాల్లో ఆదాయం కోల్పోయే అవకాశం వుంటుంది. పైగా ప్రభుత్వం ఇలా వేలల్లో ఫైన్లు వేస్తుందనే విషయాన్ని ప్రస్తుతం జిఎస్టీ నెంబర్లు తీసుకున్నవారంతా ప్రతీఒక్కరికీ చెప్పడం ద్వారా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. దానితో ప్రభుత్వం ఎంతో ఆశతో వ్యాపార సంస్థల ద్వారా గూడ్స్ టాక్స్ పేరుతో సంపాదించాలనుకున్న ఆదాయ మార్గానికి పూర్తిగా గండి పడుతుంది. అయితే ప్రస్తుతం, రాష్ట్రాల్లోనూ, దేశంలో నిధుల కొరత ఉండటంతో ఒకేసారి ప్రభుత్వాలు చిన్నా చితకా వ్యాపార సంస్థల నుంచి జిఎస్టీపేరుతో ఆర్జించాలని చూస్తున్న విధానానికి ఇప్పటికే వ్యాపారస్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు జిఎస్టీ అకౌంట్లు రద్దు చేసి, తద్వారా ఆదాయం సంపాదించుకోవాలని చూటడం కంటే.. ఆదాయపు పన్నులు వేయని వారికి అవకాశం ఇచ్చినట్టుగా ఎలాంటి ఫైన్లు లేకుండా జిఎస్టీ రిటర్న్స్ కు కూడా అవకాశం ఇస్తే ప్రభుత్వానికి కోట్ల లో వచ్చే ఆదాయం అలా వస్తూనే వుంటుంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది..!