విఐపి బ్రేక్‌ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు..


Ens Balu
3
Tirumala
2021-09-28 12:07:46

తిరుమలలో శ్రీ‌వారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌రు 5వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు.  ఈ కార‌ణంగా అక్టోబ‌రు 4వ తేదీన విఐపి బ్రేక్‌ దర్శనాల కొరకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒకప్రకటనలో తెలియజేశారు. ఈ విషయాన్నిభక్తులు ఈ  గమనించి టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 

సిఫార్సు