తిరుమల శ్రీవారిని శనివారం రాత్రి సుప్రీం కోర్టు జడ్జి పిఎస్ నరసింహ దర్శించుకున్నారు. ఈ సందర్భంతా తిరుమలకు చేరుకున్న ఆయనకు అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. అనంతరం ఆయన అదనపు ఈఓ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.