గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం..
Ens Balu
5
Tirumala
2021-10-27 15:16:23
అమెరికాలోని ప్రవాస భారతీయులు వేంకటేశ్వరరావు, మాధవి దంపతులు రూ. 10 లక్షలు ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళంగా అందించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో గురువారం దాత తన తల్లి ఎం.వసంత జ్ఞాపకార్థం చెక్కును టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి అందించారు. ఏపీఎన్ ఆర్టీ ద్వారా వీరు ఈ విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, తిరుమల కేంద్రంగా గోవులను పరిరక్షించేందుకు ఎంతో మంచి కార్యక్రమం టిటిడి చేపట్టడం ఆనందంగా వుందన్నారు. గోవులను ఎక్కడైతే పూజిస్తారో ఆ ప్రాంతం శుభిక్షంగా వుంటుందని తాము ప్రగాఢంగా నమ్ముతామని అన్నారు. ఈ కార్యక్రమంతో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.