కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు. అనంతరం దాతలు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన అధికారులు దాతల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.