3వ విడత అఖండ బాలకాండ పారాయణం..
Ens Balu
6
Tirumala
2021-11-01 08:17:42
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నవంబరు 2వ తేదీ మంగళవారం మూడవ విడత అఖండ బాలకాండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరుగనుంది. బాలకాండలోని 8 నుంచి 13 సర్గల వరకు గల 163 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది.