ఏళ్ల తరబడి కదలరు..వదలరు-సమాచార శాఖలో ఇంతేమరి..!


Ens Balu
109
Visakhapatnam
2024-07-24 18:13:29

సమాచార పౌర సంబంధాలశాఖ..ఈ శాఖ పనేంటో.. ఈ వార్త చదువులున్న ఉన్నతాధికారులు, జిల్లాల్లో పనిచేసే డిపీఆర్వోలో, జోన్ లలో పనిచేసే ఆర్జేడీలు, రాష్ట్ర కార్యాలయంలో ఉన్న అడిషనల్ డైరెక్టర్లు, కమిషనర్, డైరెక్టర్లకు కూడా పూర్తిగా తెలియదు. అదేంటి..? ఇన్నేళ్లుగా 75 ప్రభుత్వశాఖల్లో ఒక శాఖ ఉన్న సమాచారశాఖలో వారి ఉద్యోగాలేంటో వారికి తెలియవా.. నిజమా..? కాస్త అర్ధమయ్యేలా చెప్పండి సారూ అంటే.. ఇదిగో ఈ స్టోరీ అందుకే కదా మరి రాస్తున్నది.. ప్రెస్ అండ్ మీడియా కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈశాఖలో అటెండరు దగ్గర నుంచి కమిషనర్, డైరెక్టర్, డిపీఆర్వో, ఏపీఆర్వో, ఆర్జేడీలంతా మీడియా కోసం, మీడియా రూల్సు కోసం మాట్లాడేవారే తప్పితే. వాళ్లు మాత్రం రూల్స్ పాటించరు. అవి వీరికి వర్తించవు. మరీ గట్టిగా మాట్లాడితే సదరు పత్రిక, ఛానల్ కి ప్రభుత్వ సమాచారం(ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు, ఆహ్వానాలు) ఇవ్వరు. ఆయా గ్రూపుల్లో నుంచి ఈమెయిల్ ఐడీలు, వాట్సప్ నెంబర్లు డిలీట్ చేసేస్తారు. ఇలా చేస్తే దేశానికేమైనా నష్టమా..? వార్త రాయాలనుకున్న జర్నలిస్టు రాసేతీరతాడు, సమాచారం తెచ్చుకోవలనుకుంటే ఎలాగైనా తెచ్చుకుంటాడు జర్నలిస్టు. జర్నలిస్టుకి ఆ స్థాయి నెట్వర్క్ ఉంటుంది. కానీ ఒక్కసారి జర్నలిస్టు ఏ ప్రభుత్వశాఖపైనైనా దృష్టిపెడితే మాత్రం అక్కడ విషయాలన్నీ ఆధారాలతో  సహా బయటకు వచ్చేస్తాయి.. ఇదిగో ఇలా వార్తల రూపంలో రోజుకొకటి అచ్చైపోతాయ్. ఇంత అవసరమా మీరు అనుకోవచ్చు.. కేవలం మీడియాకోసం, ప్రెస్ కోసం, పత్రికల కోసం ఏర్పాటైన ఈ ప్రభుత్వశాఖలోని క్రిందిస్థాయి నుంచి పెద్దస్థాయి వరకూ అధికారులు మీడియాకి సర్వీసులు అందించాల్సింది పోయి యక్షప్రశ్నలు వేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది మరి.. ఇక విషయానికొచ్చేద్దాం..

ఆంధ్రప్రదేశ్ లోని సమాచార పౌర సంబంధాల శాఖలోని అధికారుల రూటే సెపరేటు. ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నప్పుడు అంతే ఇపుడు అవి 26 జిల్లాలు అయినా అంతే.. ఇడక్క డబ్బూ, పాలిష్ ఉంటే ఒకే జిల్లాలో 25 ఏళ్లుగా ఉండిపోవచ్చు. అప్పుడు నిబంధనలు కనిపించవు. అమలవవు. ఇదేశాఖలోని కమిషనర్ గానీ, డైరెక్టర్ గానీ ఇదేంటని ప్రశ్నంచరు కూడా. కానీ ఏ విషయంలోనైనా సొంత శాఖలో పనిచేసే సిబ్బంది ప్రశ్నిస్తే మాత్రం అలాంటి వారికి అదనపు విధులు అప్పగించేస్తారు. దానికి టిఏ,డీఏలు కూడా ఇవ్వరు. నిబంధనలు అమలు చేయరు. అంతేనా.. కనీసం ప్రెస్ నోటు కూడా రాయడం రానివారిని ఏపీఆర్వోగా కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ లో తీసేసుకొని నెల నెలా కూర్చోబెట్టి మరీ జీతాలు కట్టబెడతారు. ప్రభుత్వ సమాచారం, ప్రెస్ నోట్లు, ఫోటోలు కావాలని ఎవరైనా మీడియా ప్రతినిధులు అడిగితే మాత్రం వీరికి వెంటనే రూల్స్ గుర్తొచ్చేస్తాయ్.. ఖాళీలేని పనులన్నీ అప్పుడే వచ్చి పడిపోతాయ్.. ముందు వేసే ప్రశ్న ఏంటమ్మా నువ్వు అసలు జర్నలిస్టా కాదా(చూశారా ఎంత మర్యాదో.. ఈ జర్నలిస్టేదో వాళ్ల క్రింద పనిచేస్తున్నట్టు..వాళ్లే ఈ జర్నలిస్టుని పెంచి పోషించేస్తున్నట్టు ఏకవచన మాటల వాడకం, మరికొందు సిబ్బంది అయితే ఏకంగా ప్రతీవాడు జర్నలిస్టే అంటూ మొదలెట్టి కనీసం గౌరవం లేకుండా పేరుపెట్టి మరీ మాట్లాడతారు.. మళ్లీ ఆ విధంగా తిరిగి జర్నలిస్టు మాట్లాడినా.. పేరు పెట్టి పిలిచినా వీళ్లకి మనిషికి వచ్చినంత కోసం వచ్చేస్తుంది. గౌరవం అంటే ఎలా వస్తుందో తెలియని తేడా అధికారులు, సిబ్బందికి మాత్రమే)..? మీడియాకి సంబంధించిన డిపార్ట్ మెంట్ లోని అధికారులతో జర్నలిస్టులు కాకుండా ఇంకెవరు మాట్లాడతారు.? ఏదైనా ప్రభుత్వ నిబంధన ప్రకారం అడిగితే మీరు అలా మాట్లాడితే ఏ సమాచారం రాదు.. ఇవ్వరు.. ఇవ్వనివ్వం అని ఖరాకండీగా చెప్పేస్తారు..ఈ ప్రభుత్వ శాఖ మొత్తం వీరయ్య జాగిరులా. అసలు అడిగిన సమాచారం ఇవ్వను అని చెప్పడానికి ఏ నిబంధన వర్తిస్తుంది.. ఏ రూలు చెబుతుంది.. సమాచారశాఖలో ఎవరు దీనికి లిఖత పూర్వక ఆదేశాలిచ్చారు.. 

ఇక్కడితో ఒకసారి ఆగి మళ్లీ అసలు విషయానికి వద్దాం.. సమాచారశాఖలో ప్రోటోకాల్ అస్సలు పాటించరు అనడానికి ఇక్కడ ఉన్నతాధికారులు కమిషనర్/డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు చేసే నిర్వాకమే ఒక ఉదాహరణ. విశాఖజిల్లా అంటే ఎంతో మంది ప్రముఖులు వచ్చే మహానగరం. ఇలాంటి జిల్లాలో సమాచారశాఖలోని సిబ్బంది కొరత అని చెప్పి పార్వతీపురం ప్రాంతం నుంచి ఒక డివిజనల్ పీఆర్వోని తీసుకొచ్చిన అధికారులు.. ఇక్కడ పనిచేసే ఏపీఆర్వోని మాత్రం.. డివిజనల్ పీఆర్వో పనిచేయాల్సిన అనకాపల్లి జిల్లాకి పంపేశారు. ఇదేమంటే మేము చేసిందే రూల్.. మేమిచెప్పిందే చేయాలని అంటున్నారు. జిల్లా కేంద్రంలో డిపిఆర్వో ప్రధాన జిల్లా సమాచార అధికారిగానూ, అదనపు సమాచార అధికారిగా డివిజనల్ పీఆర్వో ఉంటారు. డిపీఆర్వో లేకపోతే ఆ ప్రాంతానికి డివిజనల్ పీఆర్వోని పంపాలి. అది ఈశాఖలో నిబంధన. మరలాగైతే ఏ నిబంధనతో డివిజనల్ పీఆర్వోని విశాఖలో ఉంచి.. ఏపీఆర్వోని ఓడి డ్యూటీ క్రింద అనకాపల్లి పంపించారో..దానికి ఇటీవలే ఈ శాఖకు డైరెక్టరుగా నియమితులైన హిమాంశు శుక్లా పర్యవేక్షణలో పనిచేస్తున్న ఆర్జేడీలు సమాధానం చెప్పాల్సి వుంది. అంటే నిబంధనలు వీరికి పట్టవనే డివిజనల్ పీఆర్వో పనిచేయాల్సిన చోటకి ఏపీఆర్వోని  పంపేశారని క్లియర్ గా అర్ధమైపోతుంది. అంతేకాదు జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ అధికారి హోదాలో ఉన్నవారి కొత్తజిల్లాల్లో డిఐపిఆర్వోలుగా కూడా నియమించేశారు. వారికి ప్రభుత్వ సమాచారం మీడియాకి ప్రెస్ నోటు రూపంలో తయారుచేసి పంపించాలంటే ఆ.. అంటే ఈ రాదు. అలాంటి వారిని డిఐపీఆర్వోలుగా నియమించేసి.. డిపీఆర్వో పోస్టులు ఖాళీలు లేవన్నట్టుగా కాగితాలపై ప్రభుత్వానికి చూపించేశారు. పని రానివారిని జిల్లా అధికారులుగా నియమిస్తే.. ఉపయోగం ఏంటి..? సాంతిక విభాగంలో అధికారులుగా పనిచేసిన వారు డిపీఆర్వో, డివిజనల్ పీఆర్వో, ఏపీఆర్వోలుగా ఎలా పనిచేస్తారో వీరిని నియమించిన రాష్ట్ర అధికారులకే తెలియాలి.. ఇక్కడ కూడా నిబంధనలు పట్టకుండానే చేశారనేది తేట తెల్లం అయిపోయింది.

ఇక ఏళ్ల తరబడి ఒకే జిల్లాలో ఉండిపోయిన సిబ్బంది, అధికారులు సమాచారశాఖలో చాలా మందే ఉన్నారు. ఇక్కడ వారి వారి సామాజిక వర్గాలు, కక్షలు, కార్ఫణ్యాలు, కావాలని చేసిన నియామకాలు, పదోన్నతులు కల్పించకుండా అదనంగా చేసిన నియామకాలే కనిపిస్తాయి. అంతెందుకు డిపిఆర్వో నుంచి ఆర్జేడీగా పదోన్నతి లభించి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కార్యాలయానికి బదిలీపై వెళ్లినా పాత జిల్లాల పరిధిలోని జోన్ లో మళ్లీ ఆర్జేడీలుగా నియమితులైన అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వారికి నిబంధనలు ఏ విధంగా వర్తిస్తాయి. అలాంటి వారిలో ఏసీబీ కేసులు ఎదుర్కొన్నవారు, శాఖాపరమైన కేసుల విచారణలు జరగకుండా పక్కన పెట్టించుకున్నవారు కూడా ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ ఏ నిబంధనతో సమాచార పౌర సంబంధాలశాఖలోని ఉన్నతాదికారులు వెలగబెట్టారో.. వారికి ప్రత్యేకంగా కమిషనర్ లేదా డైరెక్టర్ ఎలాంటి అనుమతులు ఇచ్చారో ఇక్కడి ముఖ్యఅధికారే చెప్పాల్సి వుంది. సమాచాశాఖ అధికారులు మీడియాకి సమాచారం ఇచ్చే విషయంలోనూ, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రెస్ అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలోనూ గుర్తొచ్చే నిబంధనలు మరి వారి విధి నిర్వహణ విషయంలోనూ.. తేడాగా చేసిన పనుల విషయంలో ఎందుకు గుర్తుకి రాలేదూ మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. అలాంటి తేడా పనులు, తెరచాటు వ్యవహారాలను బహిర్గతం చేయడానికి రంగంలోకి దిగారు సమాచార హక్కుచట్టం దరఖాస్తు దారులు. వారు అడిగిన సమాచారానికి ఇపుడు ఇదే సమాచారశాఖ రాష్ట్ర కార్యాలయం, జిల్లా కార్యాలయాలు అన్నీ మల్ల గుల్లాలు పడుతున్నారు. మాట్లాడితే నిబంధనలు, రూల్స్, రెగ్యులైజేషన్స్ అంటూ తెగ బీరాలు పోయే ఇక్కడి అధికారులు ఏళ్లతరబడి పాతుకుపోయిన ఉద్యోగులు, అధికారులు ఏ నిబంధనలతో ఉండిపోయారో సమాచారహక్కుచట్టం దరఖాస్తులో అడిగిన సమాచారంలో ఈశాఖ ఇవ్వాల్సి ఉంది. అసలు ఏ ఏ అంశాలపై సమాచార హక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. వీరు అతిక్రమించిన నిబంధనలేంటి.. మీడియాకి పెట్టని ఖర్చులు పెట్టినట్టు చూపించిన చిట్టాలేంటి.. తదితర అంశాలను రేపటి ప్రత్యేకధనంలో తెలుసుకుందాం.. తవ్వేకొద్దీ వస్తుంటాయి సమాచార పౌర సంబంధాలశాఖలోని చాలా కీలకమైన విషయాలు.