1 ENS Live Breaking News

ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఖదంగా

ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సిపిఆర్ఓ) గా కౌశలేంద్ర కిషోర్ ఖదంగా భువనేశ్వర్ లోని మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సిపిఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఖదంగా మంచేశ్వర్ వర్క్‌షాప్‌లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈయన ఎంటెక్‌ ను జపాన్‌లోని టోక్యోలోని వాసెడా విశ్వవిద్యాలయంలో పూర్తిచేసి అనంతరం  2010 బ్యాచ్ ఆఫ్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ (IRSME) కేడర్‌కు ఎంపికయ్యారు. అనంతరం డీజిల్ లోకోషెడ్ లో  ADME, DME లోని వివిధ ముఖ్యమైన పోస్టులలో కూడా పనిచేశారు... జైకాలోని మెక్సిట్ స్కాలర్‌షిప్ కింద జపాన్‌లోని టోక్యోలో హై స్పీడ్ రైల్‌లో 2 సంవత్సరాల మాస్టర్స్ కోసం  ఖదంగాను భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. జపాన్ నుండి తిరిగి వచ్చిన తరువాత, ఖుర్దా డివిజన్, పూరి కోచింగ్ డిపో, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.

Bhubaneswar

2020-08-18 20:27:34

180 అడుగుల వంతెన 3వారాల్లో పూర్తి..బిఆర్ఓ

ఉత్తరాఖండ్ లోని పిథోరాగఢ్ జిల్లా, జౌల్ జీబీ సెక్టార్ లో భారీ వర్షాలు కురిసి కొండచరియలు విరిగి పడుతున్నప్పటికీ సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఓ.)  180 అడుగుల బెయిలీ వంతెనను మూడు వారాలలోపు  నిర్మించింది.  2020 జూలై,  27వ తేదీన ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు. 50 మీటర్ల పొడవైన పొడవైన  కాంక్రీట్ వంతెన పూర్తిగా కొట్టుకుపోవడంతో, నల్లాలు, నదులు పొంగి పొర్లి విపరీతమైన వేగంతో బురద ప్రవాహానికి కారణమైంది. అంతేకాదు  కొండచరియలు విరిగిపడటం వల్ల కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.  రాకపోకలు తీవ్రంగా  దెబ్బతిన్నాయి. బి.ఆర్.ఓ. వెంటనే వంతెన నిర్మాణానికి అవసరమైన వనరులను, వంతెన నిర్మాణ వ్యవస్థను అక్కడికి తరలించింది.  తరచుగా కొండచరియలు విరిగి పడటం మరియు భారీ వర్షాల కారణంగా పిథోరాగఢ్ నుండి నిర్మాణ సామాగ్రిని అక్కడికి రవాణా చేయడం అతి పెద్ద సవాలుగా మారింది.  ఈ వంతెన 2020 ఆగష్టు 16వ తేదీన విజయవంతంగా పూర్తయింది.  ఈ వంతెన ద్వారా జౌల్ జీబీ, మున్సియారీ తో అనుసంధానం కావడంతో, వరద ప్రభావిత గ్రామాలను చేరుకోడానికి అవకాశం కలిగింది. 20 గ్రామాల్లోని 15 వేల మందికి ఈ వంతెన ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతుంది.   ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో జౌల్ జీబి నుండి మున్సియారీ వరకు 66 కిలోల మీటర్ల రహదారి పై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.  జౌల్ జీబీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో గరిష్ట మరణాలు సంభవించిన లుమ్టి మరియు మోరి గ్రామాల గురించి స్థానిక పార్లమెంటు సభ్యుడు అజయ్ తమ్తా ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ గ్రామాల పునరావాసం కోసం అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Uttarakhand

2020-08-17 16:11:27

ప్రతి భారతీయుడికీ నేషనల్ హెల్త్ కార్డు: ప్రధాని మోడీ

74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలకు ఆరోగ్య కానుక ప్రకటించారు. ఎర్రకోట వేదికగా  ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించిన ఆయన  దీని ద్వారా ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించి హెల్త్ కార్డ్ ఇస్తామన్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు.‘దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది’ అని మోదీ వెల్లడించారు. ఈ ఎన్‌డీహెచ్‌ఎం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. దీనికింద మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్‌, ఈ- ఫార్మసీలు సేవలు అందనున్నాయి. అలాగే ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలగనుంది. 

New Delhi

2020-08-15 21:07:07

ఈఎన్ఎస్ లైవ్ తో వార్తలు, ఆదాయం..బాలు

ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా తాతా వార్తలు వీక్షించడంతోపాటు మీరూ కూడా జర్నలిస్టుగా మారి వార్తలు అప్ లోడ్ చేసి ఆదాయం సంపాదించడంతోపాటు మంచి వార్తలను విశ్వవ్యాప్తం చేసుకునే అవకాశం వుందని ప్రధాన సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(బాలు) చెప్పారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాఠకులకు అరచేతిలోనే విశ్వవార్తల సమాహారం అందించే సంకల్పంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ తోపాటు, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ద్వారా మీడియా వార్తలు అందిస్తున్నామని చెప్పారు. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల అనుమతులతోపాటు, ట్రేడ్ మార్క్,ఐఎస్ఓ గుర్తింపు కలిగిన ఏకైక న్యూస్ ఏజెన్సీగా ఏపీలో గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. ఈఎన్ఎస్ వార్తా సంస్థకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపేనల్ కలిగిన దిన పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, ఎఫ్ఎం ఛానళ్లు, యూట్యూబు ఛానళ్లు చందాదారులుగా ఉన్నారని వివరించిన ఆయన త్వరలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పూర్తిస్థాయి న్యూస్ బులిటిన్ ప్రసారాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఒక యాప్ లోనే న్యూస్ కార్డ్, వీడియో న్యూస్ కార్డ్, ఫోల్ కార్డ్, యూట్యూబ్ న్యూస్ కార్డ్ , ఫుల్ ఇమేజ్, ఫుల్ ఇమేజ్ మల్టీలలో తాజా వార్తలు అందించే లక్ష్యంతో ఈ యాప్ ను అనుదినం తాజా సాంకేతికతో అభివ్రుద్ధి చేస్తున్నట్టు బాలు వివరించారు.

Visakhapatnam

2020-08-13 13:52:34

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ ఆరోగ్యం మరింత విషమం

బ్రెయిన్ సర్జరీ కారణంగా ఆసుపత్రిలో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ ఆరోగ్యం మరింత క్షిణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు ఈ మేరకు ప్రణబ్‌ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు.  మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్‌ సర్జరీ చేసి మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. తరువాత చికిత్స పొందుతున్న ఆయనకు పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

New Delhi

2020-08-11 21:36:52

కరోనా టెస్ట్ నెగిటివ్ అయితేనే అయ్యప్ప దర్శనం...

శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల కోసం దేవస్థానం, అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పను చూడాటినికి వచ్చే స్వాములు తప్పనిసరిగా కరోనా పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్టు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలని పేర్కొంది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. 2 నెలల దర్శనాల నిమిత్తం ఆలయం నవంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా దాదాపు 5 నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు.

2020-08-11 13:10:08

ఊరూ..వాడా..ఘనంగా శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు..!

శ్రీక్రిష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున క్రిష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నిపిల్లకు గోపికల వేషం వేసి శ్రీక్రిష్ణుడికి పూజలు చేయించారు. వేకువ జామునుంచే శ్రీక్రిష్ణ ఆలయాలన్నీ కిటకిటలాడాయి. చాలాచోట్ల స్వామికి ఇష్టమైన వెన్నను భక్తులు నైవేద్యంగా పెట్టారు. ఉట్టివేడుకలతోపాటు, ప్రత్యేక ఎంటర్ టైన్ మెంట్ యాప్ లు అందుబాటులోకి రావడంతో చిన్నిపిల్లల ఫోటోలను శ్రీక్రిష్ణుడి గెటప్ లో కి మార్చి వాటికి మంచి పాటలను సెట్ చేసి తల్లితండ్రులు, చిన్నపిల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తులంతా కరోనా వైరస్ ను రూపుమాపాలంటూ  శ్రీక్రిష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Visakhapatnam

2020-08-11 09:47:30

మన కరెన్సీనోట్లు తయారీకి ఎంత ఖర్చుఅవుతుందంటే..

భారతదేశంలో ప్రజలు, ప్రభుత్వం నిత్యం వినియోగించే డబ్బు(కరెన్సీ నోటు) తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అయితే ఇది మీకోసమే...మనం నిత్యఅవసరాలు, కొనుగోలు, బ్యాంకుల్లో దాచుకునే కరెన్సీ నోట్ల తయారీకి అయ్యే ఖర్చుని ఆర్బీఐ వెల్లడించింది. వరుసగా రూ. 50 నోటుకు 82 పైసలు,రూ. 20 నోటుకు 85 పైసలు,రూ. 10 నోటుకు రూ. 75 పైసలు చొప్పున ఖర్చవుతోందని తెలిపింది. అంతేకాకుండా  1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసినట్టుగా కూడా చెప్పింది. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు,రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించిందిని సవివరంగా వెల్లడింది. అదన్నమాట సంగతి...

Delhi

2020-08-10 12:02:00

రక్షణరంగ ఉత్పత్తులు ఇక దేశీయంగానే..రాజ్ నాథ్

'ఆత్మనిర్భర్  భారత్' లో భాగంగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులను  దేశీయంగానే తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం 2020-2024  మధ్య వాటి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. 101 ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తులను దేశీయంగా కొనుగోలు చేసేందుకు 52 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించినట్లు రాజ్‌నాథ్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల బడ్జెట్‌ను దేశీయ కొనుగోళ్లు, విదేశీ కొనుగోళ్లుగా విభజిస్తున్నట్లు కూడా రాజ్ నాధ్ స్పష్టం చేశారు.

Delhi

2020-08-09 23:04:26

శ్రీవారి కళ్యాణం కారణంగానే అయోధ్య లైవ్ ఇవ్వలేదు..

ఎస్వీబీసీలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం కారణంగా అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించలేకపోయామని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. కావాలనే ఎస్వీబీసీ ద్వారా రామ మందిరం భూమిపూజ లైవ్ కవరేజీ చేయలేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. శ్రీవారి కళ్యాణం కారణంగా ఇవ్వలేని లైవ్ ప్రాసారాన్ని ఆ త‌రువాత న్యూస్ బులెటిన్లో ప్ర‌ముఖంగా ప్ర‌సారం చేశామని వివరించారు. ఇందులో ఎలాంటి ఇత‌ర ఉద్దేశాలు లేవన్నారు. కొంత‌మంది దీనిపై అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు చేసే ప‌ని ప్రారంభించడం తగదన్నారు. వాస్తవాలు తెలుసుకొన్న తరువాత తప్పుఉంటే మాట్లాడాలని సూచించారు. హిందూధార్మిక కార్యక్రమాలన్నింటినీ ఎస్వీబీసీలో ప్రముఖంగా చూపిస్తున్నట్టు ఈఓ చెప్పారు.

Tirumala

2020-08-09 22:36:34

రిపోర్టు చూపిస్తే..వ్య‌క్త‌గ‌త క్వారంటైన్ మిన‌హాయింపు

విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం కాస్త సడలించింది. కరోనా సోకలేదని ధ్రువీకరించేలా వ్యాధి నిర్ధారణ పరీక్ష రిపోర్టును సమర్పించేవారికి వ్యవస్థాగత (ఇన్‌స్టిట్యూషనల్‌) క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిచ్చింది. ఈ నెల 8 నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి 96 గంటల్లోపు చేసుకున్న పరీక్షకు సంబంధించిన రిపోర్టునే ప్రయాణికులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. తప్పుడు నివేదికలు సమర్పిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చేవారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోవడం, తీవ్ర అనారోగ్యం, గర్భం, పదేళ్లలోపు కుమారులు/కుమార్తెలు ఉండటం వంటి తప్పనిసరి కారణాలతో భారత్‌కు వచ్చేవారు ఇకపై 14 రోజుల హోం క్వారంటైన్‌ను ఎంచుకోవచ్చునని కూడా అందులో పేర్కొంది. ఇందుకోసం భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి కనీసం 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇన్నాళ్లూ వారు తొలుత ఏడు రోజులు సొంత ఖర్చులతో వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండి, ఆపై ఏడు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది.

Delhi

2020-08-03 17:14:23

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు తెచ్చుకునేందుకు అనుమతి..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వ్యాధిగ్రస్థులు తమ వెంట స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వీటి సాయంతో వారు వీడియో సమావేశాల రూపంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుగలుగుతారని, తద్వారా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందగలుగుతారని తెలిపింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ గర్గ్‌ రాష్ట్రాల వైద్యశాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆరోగ్య పరిస్థితితో పాటు రోగుల మానసిక పరిస్థితి కూడా గమనించేలా వైద్యులకు సూచనలు చేయాలని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్లను తీసుకెళ్లడానికి కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు అనుమతి ఇవ్వకపోతుండడంతో ఆయన ఈ లేఖలు రాశారు. ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)..నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. దీంతో చికిత్స విధానాలు, ఏ మందు ప్రభావం ఏ వయసు వారిపై ఎలా ఉంది? తదితర అంశాలను సూక్ష్మంగా విశ్లేషించి అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుంది. కరోనా లక్షణాలు ఇంకా స్పష్టంగా వెల్లడికానందున ఇలాంటి విశ్లేషణ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దిల్లీ ఎయిమ్స్‌ సహా దేశంలోని 15 ప్రముఖ వైద్య విద్యా సంస్థలను, వంద ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ఈ రిజిస్ట్రీని నెలకొల్పారు.

Delhi

2020-08-03 17:09:36

భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ద విమానాలు..

రాఫెల్ రాకతో భారత వైమానికదళం శత్రు దుర్భేద్యం కానుంది. భారత్ అమ్ములపొదలో అత్యాదునిక "రాఫెల్' యుద్ద విమానాలు కొలువుదీరనున్నాయి. గంటకు 2200 కి.మీ ప్రయాణం అత్యంత వేగంగా చేయగల సత్తా రాఫెల్ కలిగివుంది. అలాగే 9000 కేజీల బరువు తీసుకెళ్ళే సామర్థ్యం రాఫెల్ సొంతం. 40 లక్ష్యాలను ఎంచుకొని ఒకేసారి చేధించగల సత్తా కలిగిన రాఫెల్ యుద్ద విమానాలు అవలీలగా చేస్తాయి. అత్యాదునిక రాడార్ సాంకేతిక వ్యవస్థతో ఎలాంటి వాతావరణంలోనైనా క్షిపణి ఫైరింగ్ లో సుదూర ప్రాంతాలలో ఉన్న టార్గెట్ లను  మిస్ కాకుండా చేయగలడంలో రాఫెల్ మేటి. అలాంటి యుద్ధ విమానాలు భారత భూభాగంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈఎన్ఎస్ లైవ్ సాదర స్వాగతం పలుకుతుంది. మరి కసేపట్లో అంబాలా ఎయిర్ బేస్ లో దిగనున్న శుభ తరునంలో భారతీయులుగా మనందరం గర్వపడాలి. ఇదే ఉత్సాహంతో శత్రుదేశాలకు మన సత్తా కూడా రాఫెల్ తోనే తెలియజేయాలని కూడా ఈఎన్ఎస్ లైవ్ సగర్వంగా మనవి చేస్తుంది.

Ambala

2020-07-29 15:17:47