1 ENS Live Breaking News

7న '' కీచ‌క సంహారం-నారీ నీరాజ‌నం ''..

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదికపై జూలై 15వ తేదీ నుంచి టిటిడి నిర్వ‌హిస్తున్న విరాట‌ప‌ర్వం - లోక క‌ల్యాణ పారాయ‌ణంలో భాగంగా ఈ నెల 7వ తేదీ కీచ‌క సంహార ఘ‌ట్టాన్ని పారాయ‌ణం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు '' కీచ‌క సంహారం - నారీ నీరాజ‌నం '' పేరిట మ‌హిళ‌ల‌చే వినూత్నంగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.  తిరుమ‌లలోని గోకులం అతిథి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి ఈ కార్య‌క్ర‌మం ఏర్పాట్ల‌పై వివిధ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. విరాట‌ప‌ర్వంలో కీల‌క ఘ‌ట్ట‌మైన కీచ‌క సంహారం సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌తో దీపాలు ( ప్ర‌మిద‌లు) వెలిగించి ఈ ఘ‌ట్టంలోని సారాంశాన్ని తెలియ‌జేసే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.  కోవిడ్ -19 జాగ్ర‌త్త‌లు ప‌క్క‌గా అమ‌లు చేస్తూ త‌గిన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఎస్వీబీసీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డానికి ముందుగానే అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు. ఎస్వీబీసీ, ఆరోగ్య, విజిలెన్స్‌, వ‌స‌తి, అన్న‌దానం విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌న్నారు.       కార్తీక మాసం సంద‌ర్భంగా ఎస్వీబీసీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేలా త‌గిన ప్ర‌ణాళిక రూపొందించాల‌న్నారు. కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫ‌లితాలు, ఇందుకు సంబంధించిన ప్ర‌వ‌చ‌నాలు, వ్యాఖ్యానాలు వీక్ష‌కులను ఆకట్టుకునేలా రూపొందించాల‌న్నారు. ‌ఎస్వీబీసీ సిఇవో  సురేష్ కుమార్‌, ఎస్ ఇ- 2 నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోలు  బాలాజి,  నాగ‌రాజు, ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు  ద‌క్షిణామూర్తి, విజివో  మ‌నోహ‌ర్‌, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్  శ్రీ‌నివాసులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

Tirumala

2020-11-04 16:12:11

కోర్టు విషయాలు ముందుగా నిమ్మగడ్డ మీడియాకి చెప్పారు..

రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఎలక్షన్‌ కిమషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ నీతి, న్యాయం పాటించకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌ రెడ్డి మట్లాడుతూ.. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నమే తాము చేస్తున్నామని, ఎవరిని టార్గెట్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఎస్‌ఈసీ  నిమ్మగడ్డ రమేశ్‌ ‌కుమార్ హైకోర్టులో నిన్న(మంగళవారం) అఫిడవిట్ వేసినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. హైకోర్టుకు  నిన్ననే ఈసీ నివేదించినట్లు పత్రికల్లో వచ్చిందని, హైకోర్టులో మాత్రం ఆ అఫిడవిట్ బుధవారం ఫైల్ అయినట్లుగా ఉందని పేర్కొన్నారు. ముందుగానే పత్రికలకు నిమ్మగడ్డ రమేష్ ఎందుకు లీక్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలా నమ్మాలని నిలదీశారు. పైగా ప్రభుత్వం తనకు ఎలాంటి సహకారం అందించలేదని చెప్పడం దేనికనిన్నారు. నిమ్మగడ్డ చేసే పనులన్నీ  చంద్రబాబు ఆదేశాలతో చేస్తున్నట్టు ఈ ఒక్కవ్యవహరంతోనే రుజువైందన్నారు.. స్వార్థం కోసం వ్యవస్థలను తాకట్టు పెడుతున్నారని శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.  రెండు కేసులు వచ్చి నపుడు కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేసిన ఆయన ఇప్పడు సరాసరిగా ౩ వేల కరోనా కేసులు రోజుకు వస్తున్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ ఎలా నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏమీ చేయడం లేదు. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ది శూన్యం. అమరావతిలో చంద్రబాబు అడుగుకు 12వేలు దోచుకుని సర్వనాశనం చేశారు. విజయవాడలో దుర్గ వారధిని కూడా కొద్దిగా చేసి వదిలేస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరిట చంద్రబాబు  వేల కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా  గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, రాజ్యాంగ  వ్యవస్థలను గౌరవించే తత్వం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పినట్లుగా  ఎస్ఈసీ రమేష్ పని చేస్తున్నారన్న శ్రీకాంత్‌ రెడ్డి  స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లోంచి బయటకు రాని నాయకుడు చంద్రబాబు. జూమ్ మీటింగ్‌లలో ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లడం చంద్రబాబుకి వెన్నతోపెట్టిన విద్య అని మండిపడ్డారు..

Tadepalle

2020-11-04 16:01:02

2020-11-04 15:17:30

2020-11-04 08:25:08

ఉద్యోగార్ధులూ మీకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ ప్రభుత్వం గ్రామసచివాలయ ఉద్యోగాలకు అర్హత పరీక్ష రాసిన వారికి శుభవార్త చెప్పింది. ఇటీవల అర్హత పరీక్ష రాసిన వారికి లక్కీ చాన్స్ కొట్టే అవకావం వస్తుంది. దీనితో గతంలో మిగిలిపోయిన పోస్టులు, ప్రస్తుతం ఖాళీగా వున్న పోస్టులను అన్నిజిల్లాల్లో ఒకేసారి నవంబరు నెలాఖరునాటికి భర్తీచేసి డిసెంబరు మొదటి వారానికి  పూర్తిస్థాయిని సిబ్బందిని ఉంచడానికి పక్కాగా రూపకల్పన చేస్తున్నది ప్రభుత్వం. దీనికోసం అన్నిజిల్లాల్లో గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న ఖాళీలను ఈసారే భర్తీచేయాలని అన్నిజిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో గతంలో ప్రకటించిన పోస్టులతోపాటు, అదనంగా ఖాళీగా ఉద్యోగాలు కూడా భర్తీజరుగుతుంది. గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. అన్ని రకాల సేవలు గ్రామస్థాయిలోనే అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి సిబ్బంది కొరత అడ్డురావడంతో ఉద్యోగప్రకటన జారీచేసి, వాటికి కరోనా తగ్గిన తరువాత పరీక్షలు నిర్వహించింది. ఈసారి అభ్యర్ధులకు ర్యాంకులను కూడా ప్రకటించిన ప్రభుత్వం ఆదిశగానే అభ్యర్ధుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేసి అర్హత సాధించినవారందరికీ నియామకాలను చేపట్టనుంది. అంతా అనుకున్నట్టు జరిగితే డిసెంబరు మొదటివారానికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు సిబ్బందితో కనిపిస్తాయి.

Velagapudi

2020-11-04 07:44:14

2020-11-04 07:34:36

2020-11-03 20:35:24

సంక్రాంతికి కొత్తజిల్లాల ప్రకటన..?

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు 28 జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు...దానికోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు భవనాలు, ప్రభుత్వ ఆస్తులు వివరాలు వాయువేగంతో సేకరిస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయనున్నారు. అయితే కొన్నిప్రాముఖ్యత ప్రాంతా ప్రజల మనోభావాలు, చరిత్రను బట్టి జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తోంది. గతంలోనే ప్రాముఖ్యత ప్రాంతాలను మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగానే కొన్ని పేర్లను పరిశీలన చేశారు. అయితే అప్పట్లో పంచాయతీ ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని వాటి పనిని పక్కన పెట్టారు. నేడు పంచాయతీ ఎన్నికలు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్ర్యా పక్కనపెట్టి జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ద్రుష్టిసారించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న ఐటిడిఏలు, డివిజనల్ కేంద్రాలు, పార్లమెంటు నియోజకవర్గాల ప్రాంతాల్లో జిల్లా కార్యాలయాలకు సరపడ భవన సముదాయం కోసం ప్రభుత్వం వెతులాట ప్రారంభించింది. భవనాలు,ఆస్తులు వివరాలు కొలిక్కి వస్తే జిల్లా పునర్వవ్యస్తీకరణ చేసి జిల్లాల పేర్లు ఖరారు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విజన్ కి అనుగుణంగా జిల్లా విభజన జరుగుతుందని, ఇప్పటికే మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయా ప్రాంతాల వారీగా ఉన్న సెంటిమెంటను ద్రుష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాలను డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. అందులో భాగంగా ముందుగానే ఒక్కోజిల్లాకి ముగ్గురు జెసిలను నియమించింది. ప్రస్తుతం వీరంతా ఆయా జిల్లాల్లో వివిధ విభాగాలకు జెసిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్నట్టుగా జిల్లాల వర్గీకరణ జరిగితే కొత్త జిల్లాలకు సీనియర్ జెసిలను కలెక్టర్లుగా నియమించే అవకాశం కనిపిస్తుంది. అందుకోసమే జిల్లాలపై పట్టు సాధించాలనే లక్ష్యంతో డివిజన్ కేంద్రాల్లోనూ, జిల్లాల్లో అధికంగా ఐఏఎస్ లను ప్రభుత్వ నియమించింది. జల్లాల విభజన జరిగితే జిల్లాకి ఇద్దే ఐఏఎస్ అధికారులంటారు...ఒకరు జిల్లా కలెక్టర్ కాగా, మరొకరు సచివాలయాల జెసిగా వుంటారు. ప్రస్తుతం అధనంగా వున్నఐఏఎస్ అధికారుల్లో సీనియర్లు కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులవుతారని తెలుస్తుంది. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి వీలుపడుతుందని ప్రభుత్వ అభిప్రాయం. కొత్త జిల్లాల ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి అయి జనవరికి కొత్తజిల్లాల ప్రకటన చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి..

Velagapudi

2020-11-03 20:23:07

లోక కళ్యాణార్ధం సుందరాకాండ పారాయణం..

సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ సుంద‌రకాండ  20 నుండి 24వ‌ సర్గ వరకు ఉన్న మొత్తం185 శ్లోకాల‌తో 6వ విడ‌త అఖండ పారాయ‌ణం నిర్వ‌హించిన‌ట్లు టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌‌వారం ఉద‌యం జరిగిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ గ‌త ఆరు నెల‌లుగా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన‌ప్ప‌టి నుండి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై "సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం, భ‌గ‌వ‌ద్గీత పారాయణం" ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను తిరుమ‌ల‌లో నిరం‌త‌రం కొన‌సాగించ‌నున్న‌ట్లు ఈవో తెలియ‌జేశారు. అఖండ పారాయ‌ణంలో దాదాపు 300 మంది వేద పండితులు, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్న‌ట్లు వివ‌రించారు.            సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ ‌ప్ర‌పంచ ప్ర‌జ‌ల యోగ‌ క్షేమం కొర‌కు టిటిడి 208 రోజులుగా శ్రీ‌వారి అనుగ్ర‌హంతో మంత్ర పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు తెలిపారు. సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయ‌ని వివ‌రించారు.  టిటిడి ఎస్వీ సంగీత నృత క‌ళాశాల అధ్యాప‌కులు  వంద‌న బృందం  " ‌ రామ రామ ...... భ‌జే శేష సుంద‌రం...... " ‌, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ గోపినాథ్ బృందం " శ్రీ హ‌నుమ‌...జై హ‌నుమ ..అంజ‌లి త‌న‌య జ‌య హ‌నుమ ‌.." అనే  సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.  ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి‌, రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి  విభీష‌ణ శ‌ర్మ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2020-11-03 17:13:54

2020-11-03 09:54:32

కులం కాని వ్యక్తిని పద్మశాలీ కార్పోరేషన్ డైరెక్టర్ చేస్తారా..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మిన అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సంఘం ప్రకటిచింది. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను కలిసి కొప్పలరామ్ కుమార్, తెడ్లపు వెంకటేశ్వర్లు, బిపిఎస్ కళ్యాణి, అలేటి హేమలత లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదే సమయంలో పద్మశాలీ కాని వ్యక్తిని పద్మశాలీ కార్పోరేషన్ కు చైర్మన్ గా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పద్మశాలీ వంశ వ్రుక్షంలో ఎక్కడా  విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నియమించిన తమ్మిన  రామ లక్ష్మణ రావు ఇంటిపేరు లేదన్నారు. ఆయన యొక్క గోత్రనామాలేంటో కూడా తెలియదని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం పద్మశాలీ కార్పోరేషన్ నుంచి తమ్మిన రామ లక్ష్మణ రావు తప్పించాలని డిమాండ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ్మిన అనే ఇంటి పేరు పద్మశాలీలకు లేదు. వారు నగరాలు కులానికి చెందినవారని స్పష్టం చేశారు. పద్మశాలి అమ్మాయిని చేసుకోవడం వలన, అప్పటిలో నగరాలు OC లు గాను, పద్మశాలీలు బీసీలు గాను ఉండడం వలన వారు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం తో పద్మశాలీల గా చలామణి అవుతున్నారని చెప్పారు. ఈ నియామకం పద్మశాలీల మనోభావాలకు తీవ్రంగా బంగం కలిగించిందన్నారు. ఈ విషయంలో రాష్ట్రకమిటీ అన్నిజిల్లా కలెక్టర్ విచారణ జరిపించి నివేదిక ప్రభుత్వానికి పంపించాలని వారు మీడియా ముఖంగా కోరారు.

Visakhapatnam

2020-11-02 21:22:58

2020-11-02 20:01:37

2020-11-02 19:27:28

2020-11-02 18:59:19