ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి అంటే ఒక ప్రత్యేక హోదా..వెనుక నలుగురు గన్ మెన్లు...ఐదు కార్ల కాన్వాయ్...ఎదుట పైలెట్ వెహికల్...మంత్రి ప్రయాణించే కారు బాగా ఖరీదైనదే వుంటుంది. అంతటి హోదాని వదిలి ఒక సాధారణ ఆటోలో ప్రయాణించడమంటే అదొక చిన్నచూపుగా ఫీలవుతారు ఎవరైనా అయితే.. కానీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి పేదల మనసు తెలుసు. తాను చేసే సహాయం మంత్రికి చెప్పడానికి వచ్చిన ఒక సేవకుడి ఆటోలో ఎక్కిమరి ప్రయాణించిన మంత్రి తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు తన ప్రయాణానికి గుర్తుగా ఆటో చార్జికూడా తనజోబులోనుంచి తీసి చెల్లించారు. ఈ అరుదైన సంఘటన విశాఖలోని సీతమ్మధారలో జరిగింది. గోపాలపట్నానికి చెందిన ఊళ్ళూరు ప్రకాశరావు ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్నారు. గర్భిణీలు, వృద్దులకు, ప్రయాణించే వాళ్లకు తన వంతుగా.. ఉచితంగా తీసుకెళుతూ తనవంతు సహాయం అందిస్తున్నాడు. ఆ విషయాన్ని మంత్రికి చెబుదామని వచ్చిన ప్రకాశరావు ఆటోలో ఎక్కి అలా ఒక్కసారి ప్రయాణించి వచ్చారు మంత్రి.. వెనుక ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇదంతా జరిగింది. అంతేకాదు మంచి సేవలందిస్తున్నఆటో డ్రైవర్నుఅభినందించి సేవలు మరింతగా చేయాలని, ఎలాంటి సహకారం కావాలన్నా నేరుగా నాదగ్గరకు రావాలని మంత్రి భరోసా ఇచ్చారు. స్వయంగా మంత్రి ముత్తంశెట్టి తన ఆటోలోఎక్కి ప్రయాణించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు ప్రకాశరావు. చాలా మంది మంత్రి కోసం చెబితే ప్రచారం అనుకున్నానని, కాని స్వయంగా చూసిన తరువాత ఆయన మంచి మనసు తెలిసిందని చెప్పాడు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహంలో మరింత మందికి సేవలందిస్తానని గర్వంగా చెప్పాడు. ఎంతైనా మనుసున్న మంత్రులు చేసే కొన్ని మంచికార్యక్రమాలు ఇలానే వుంటాయని ఈఎన్ఎస్ లైవ్ కూడా ఆ తంతు మొత్తాన్ని మీ కళ్లముందుంచే ప్రయత్నం చేసింది..
లాక్డౌన్ కారణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్(tirupatibalaji.ap.gov.in) ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-దర్శన్ మరియు ఎపి ఆన్ లైన్ కౌంటర్ల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్లైన్లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు మరియు ఎపి ఆన్ లైన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను excel టెక్ట్స్ లో టైపు చేసి refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాలని టిటిడి కోరుతోంది. మెయిల్ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తారు. టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని టిటిడి కోరుతోంది.
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నవంబరు 3వ తేదీ మంగళవారం 6వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతుంది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకునే, ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసినట్టుగా కూడా టిటిడి పేర్కొంది. తిరుమలలో నిర్వహించే ఈ పారాయణంకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థలో రెండు విభాగాల్లో పోస్టులు ఆది నుంచి భర్తీకాకుండా అలా మిగిలిపోతున్నాయి. రెండోవసారి సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉద్యోగ ప్రవేశ పరీక్షలో కూడా సెరీకల్చర్, యానిమల్ హజ్బంజడరీ సహాయకుల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిసోస్తోంది. దానికి కారణం ఆ విద్య చదివిన వారు తక్కువ గా ఉండటమే. తొలుత తీసిన ఉద్యోగాలు అత్యంత తక్కువగా మార్కులు వచ్చినప్పటికీ ఆ ఉద్యోగాలను భర్తీచేసిన ప్రభుత్వం ఈ సారి భర్తీచేయకపోవచ్చునని చెబుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు కూడా రాకపోవడం విశేషం. వాస్తవానికి గ్రామస్థాయిలో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు భర్తీచేయడం వలన చాలా ఉపయోగాలు, సేవలు ప్రజలకు అందుతాయి. కానీ ఆ చదువు చదివిన వారు తక్కువగా ఉండం వలన ఆపోస్టులు భర్తీకావడం లేదు. కొన్ని ఫిషరీష్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ కాకపోవడం విశేషం. ఈ సారి గ్రామసచివాలయాల ఉద్యోగాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ర్యాంకింగ్ విధానం ప్రవేశ పెట్టడంతో ఎంత మంది ఉద్యోగాలొస్తాయో తెలియని పరిస్తితి నెలకొంది. అదే జరిగితే ర్యాకుంలో మార్కులు తక్కువ వచ్చిన వారికి వేలల్లో వస్తాయి...అనుకున్నట్టుగా ఆ శాఖల సిబ్బంది భర్తీ కాకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు..
విశాఖలోని గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వానికి చెందిన 43.50 ఎకరాల భూమిని అక్రమంగా ఖబ్జాచేసి అందులో కొంతభాగంలో మెడికల్ కాలేజీ, ఆసుప త్రులు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించిన విషయం ఇపుడు నేషనల్ మెడికల్ కమిషన్ ద్రుష్టికి వెళ్లినట్టు సమాచారం. వాస్తవంగా దేశవ్యాప్తంగా నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజీలు, మెడికల్ యూనివర్శిటీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అనుమతులు, సీట్ల కేటాయింపు చేస్తుంటుంది. అలాంటి గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీతోపాటు మెడికల్ కాలేజీ భూములన్నీ సక్రమం కాదు, అక్రమమని తెలిస్తే మెడికల్ కాలేజి గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నేరుగా రాష్ట్రప్రభుత్వమే కొలతలు వేసి, నోటీసులు కూడా ఇచ్చి ఈ ప్రభుత్వ భూమి గీతం ఆక్రమించిందని నోటిఫై చేసిన తరువాత ఈ విషయం మరింత ముదిరి పాకాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గీతం విషయంలో సిబిఐకి ఫిర్యాలు వెళ్లడం, కోర్టు నుంచి ఉత్తర్వులు తేవడం వంటి విషయాలు గీతంను చక్రబంధం చేసేటట్టు కనిపిస్తున్నాయి. అక్రమాల గీతంలో భూ ఆక్రమణల విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుతున్న తరుణంలో గీతం మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. అదీ ప్రభుత్వంలోని పెద్దలు ఈ ఫిర్యాదులు చేసివుంటే...ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ విచారణ చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా గీతంపై ఎన్ఎంసీ విచారణ చేస్తే...గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ విషయంలోనే సదుపాయాలు, వసతి సక్రమంగా లేవని సీట్లలో కోత విధించిన ఎన్ఎంసీ, ఇపుడు ఏకంగా గీతం పూర్తి అక్రమ భూ కబ్జా మెడికల్ కాలేజీ అని తేలితే ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా వుంటాయని తెలుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి..
గ్రామసచివాలయాల్లో కొలువుల కోసం వేచిస్తున్నవారికి శుభవార్త. ఇటీవల నిర్వహించిన గ్రామసచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రజలకు ఇంటి వద్దే సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మిగిలిన 16208 ఉద్యోగాలను నేటి ఫలితాలతో భర్తీచేయనున్నామని అన్నారు. అభ్యర్ధుల ఫలితాలు, వచ్చిన మార్కులు ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తరువాత అపాయింట్ ప్రక్రియ మొదలవుతుందని అంతా కలిపి రెండు నెలల్లో ఈ ప్రక్రియ ముగించి వచ్చే జనవరి నాటికి పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సిబ్బందిని భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్ టీమ్) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు అభ్యర్ధుల హాల్ టిక్కెట్ల ఆధారంగా వారికి వచ్చిన మార్కులను సరిచూసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ రెండవ దశ విజ్రుంభించే ప్రమాదం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా వున్న జర్నలిస్టులు వచ్చే రెండు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చేసిన హెచ్చరికల నేపథ్యంలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలుతు 45 రోజుల్లో కరోనా వైరస్ నీరసిస్తుందని భావించినా దాని ప్రభావం ఇపుడే అధికంగా కనిపిస్తుందని ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. వైద్యులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్న తరుణంలో జర్నలిస్టులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విధినిర్వహణలో బయటకు వెళ్లే ప్రతీ జర్నలిస్టూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ 5.0 నిబంధనలు సులభరతరం చేసినా, వార్తా సేకరణలో మాత్రం జర్నలిస్టులు మరో నెల రోజులు ముఖ్యమైన వాటికి మాత్రమే బయటకు రావాలన్నారు. మీమీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని గంట్ల శ్రీనుబాబు గుర్తు చేశారు.
వైయస్ఆర్ రైతుభరోసా 2వ విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమవారతిలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,115 కోట్ల నగదును కంప్యూటర్ లో నొక్కి బదిలీ చేశారు. తొలిసారిగా ఖరీఫ్లో నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు ఖరీఫ్ లోనే ఇన్పుట్ సబ్సిడీ రూ. 135.7 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ లక్ష మంది గిరిజన రైతులకు రూ. 11,500 చొప్పున రూ.104 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. రబీ సీజన్కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ROFR) రైతులకూ రైతు భరోసా సాయం అందుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని, రైతులను సాయమందించడం గర్వంగా ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 90శాతం నెరవేర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్నితోపాటు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.