1 ENS Live Breaking News

ఏపీలో విద్యార్ధుల కోసం ఉచిత ఎంసెట్ మాక్ పరీక్ష

ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ టెస్ట్‌ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్‌ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Guntur

2020-07-06 23:02:37

ఏపీలో విద్యార్ధుల కోసం ఉచిత ఎంసెట్ మాక్ పరీక్ష

ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ టెస్ట్‌ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్‌ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Guntur

2020-07-06 23:02:31

నెలాఖ‌రు వ‌ర‌కు శ్రీవారి ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచేదిలేదు

 దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నం తిరిగి ప్రారంభించామ‌ని తెలిపారు. స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ ద్వారా స్వామివారి క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tirumala

2020-07-04 19:43:18

అనాధలను ఆదుకోవడమే తన లక్ష్యం..గంట్ల

విశాఖ పాతనగరంలో ఎంతో మంది అనాధలకు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ పలువురు కి బాసటగా నిలిచిన శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థకు గడచిన 2నెలల్లో లక్ష రూపాయలు తనవంతు  విరాళంగా అందించినట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు  అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్ విజేఫ్  ప్రెస్ క్లబ్ లో రూ.25 వేల చెక్ ను ఆ సంస్థ అధ్యక్షుడు సూరాడ  అప్పారావుకు  శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అనాధ ఆశ్రమానికి 50నుంచి 75 వేల రూపాయలు తాను  విరాళంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.. దీంతోపాటు మంచాలు, ఆయా సందర్భాల్లో నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తు లో కూడా తనసాయం కొనసాతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Dabagarden Main Road Bus Stop

2020-06-22 13:13:07

కరోనా వైరస్ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక వేత్త సానా రాధ అన్నారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు విశాఖలోనూ పెరుగుతున్నాయని, వీటి నియంత్రణకు ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను, ముసలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్ దరచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీరు అధికంగా తాగాలని సూచించారు. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పరిశరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు అవసరం అయితేనే బయటకు వెళ్లాలని లేదంటే ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఆరోగ్యసేతు యాప్ ని అంతా ఇనిస్తాల్ చేసుకొని అందులోని సూచనలు పాటించాలని సారా రాధ కోరారు.

2020-06-21 15:27:47