ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి బడి గంటలు మోగబోతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభించిన తరువాత మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామన్న మంత్రి కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు. తగ్గించిన సిలబస్తో విద్యా సంవత్సరం పూర్తిచేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు ఇళ్లకు పంపించేస్తామని మంత్రి సురేష్ వివరించారు. మొత్తం 180 పనిదినాలు ఉండేలా కార్యాణచరన రూపొందించి వాటికి అనుగుణంగానే సిలబస్ పూర్తిచేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశింమని వివరించారు..
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం అన్నాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం సుమారు 150 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం 5 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
గీతం భూఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మేకతోటి సుచిరత స్పష్టం చేశారు. విశాఖలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ ఎంతో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పుడు సమాచారం అందించిందన్నారు. ఇప్పటికే ఈ విషయమై విశాఖలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతోపాటు, ప్రజా సంఘాలు కూడా నిరవధికంగా గీతం విషయంలో ఆందోళనలు చేస్తున్నాయన్నారు. గీతంపై చర్యలు తీసుకునే సమయంలో విద్యార్ధులకు ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. గీతంను ఆంధ్రాయూనివర్శిటీకి అటాచ్ చేసే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో చర్చలు జరుపుతున్నామని హోంమంత్రి వివరించారు. గీతం మొత్తంగా 48 ఎకరాలు భూమిని ఆక్రమించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, దీనిపై పూర్తిస్థాయి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమత్రి వివరించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు..
భారత దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. ఇది ఒక రకంగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామసచివాలయ వాలం టీర్లకు చేదు వార్తే.. పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుందని ఈ మేరకు పబ్జీ ఫేస్బుక్ పేజీలోఅధికారిక ప్రకటన చేసింది. నేటి (అక్టోబర్ 30,2020) నుంచి వినియోగదారులందరికీ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించారు. అయితే తమ తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్జీని ఆడుకోవచ్చు. అత్యధికంగా గ్రామవాలంటీర్లు ఈ గీమ్ ని ఎక్కువగా తమ మొబైల్స్ ఆడుతున్నారు. అదీ ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్స్ నే ఆడుతుండటం విశేషం. ఆ విషయం ఆయా గ్రామసచివాలయ అధికారులు ద్రుష్టి కేంద్రీకరిస్తే వాస్తవాలు తెలిసే అవకాశం వుంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం కూడా అందరు యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా కరోనా వైరస్ విస్తరణ, సరిహద్దు వద్ద చైనా దుశ్చర్య నేపథ్యంలో గోప్యత, భద్రత కారణాల రీత్యా భారత ప్రభుత్వం పబ్జీ సహా118 చైనా యాప్స్ని నిషేధించి నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, దీనిని విపరీతంగా వినియోగించడం విశేషం..