కేబుల్ ఆపరేటర్లపై పడే పన్నుల భారాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ గౌరవాధ్యక్షుడు, వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోరారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలో రాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ ముఖ్య కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేబుల్ ఆపరేటర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేబుల్ వ్యవస్థలో వినూత్నమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. భద్రత లేని రంగమే కేబుల్ రంగం అని, 50వేల మంది ఆపరేటర్లు ఏపీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్తో కేబుల్ ఆపరేటర్లకు నష్టం లేకుండా చూడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 2020 వచ్చినా ఆపరేటర్ల స్థితిగతులు మాత్రం మారలేదన్నారు. కరోనా సమయంలో కేబుల్ ఆపరేటర్లు ప్రాణాలకు తెగించి ఇంటింటికీ సర్వీసు అందిస్తున్నారని అన్నారు. మంత్రుల కమిటీని కలిసి సమస్యలన్నీ వివరించి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గౌతమ్ రెడ్డి తెలిపారు
సప్తగిరి మాసపత్రికపై రాజకీయ కుట్రకోణం దాగుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గతంలోనూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారం, తిరుమల కొండల్లో సిలువ పెట్టారని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఎవరు చూస్తున్నారో.. వారి ఇంగిత జ్ఞానానికి వదిలి వేస్తున్నాం. మధ్యలో ఎవరైనా కవర్లు మార్చారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. టీటీడీ కార్యాలయంలో అన్యమత పుస్తకాలు ఎందుకు ఉంటాయి? దేవుడిపైనే నింద వేయాలని చూస్తున్నారని’’ ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ సమయంలో ప్రజలను కాపాడమని సుందరకాండ, వేద పారాయణం టీటీడీ తరపున చేశామని, భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో రాజకీయ దురుద్దేశ్యం తో చేస్తున్న ఆరోపణలు సరికావని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.
ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్ టెస్ట్ వివరాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్ టెస్ట్ వివరాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి రోజువారీ భక్తుల సంఖ్యను ఈ నెలాఖరు వరకు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించామని తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ కరోనా పాజిటివ్ రాలేదని స్పష్టం చేశారు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ ద్వారా స్వామివారి కల్యాణోత్సవం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ పాతనగరంలో ఎంతో మంది అనాధలకు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ పలువురు కి బాసటగా నిలిచిన శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థకు గడచిన 2నెలల్లో లక్ష రూపాయలు తనవంతు విరాళంగా అందించినట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్ విజేఫ్ ప్రెస్ క్లబ్ లో రూ.25 వేల చెక్ ను ఆ సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావుకు శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అనాధ ఆశ్రమానికి 50నుంచి 75 వేల రూపాయలు తాను విరాళంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.. దీంతోపాటు మంచాలు, ఆయా సందర్భాల్లో నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తు లో కూడా తనసాయం కొనసాతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక వేత్త సానా రాధ అన్నారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు విశాఖలోనూ పెరుగుతున్నాయని, వీటి నియంత్రణకు ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను, ముసలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్ దరచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీరు అధికంగా తాగాలని సూచించారు. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పరిశరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు అవసరం అయితేనే బయటకు వెళ్లాలని లేదంటే ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఆరోగ్యసేతు యాప్ ని అంతా ఇనిస్తాల్ చేసుకొని అందులోని సూచనలు పాటించాలని సారా రాధ కోరారు.