1 ENS Live Breaking News

22న శ్రీకాకుళంజిల్లాలో జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో నిరుద్యోగ యువతకు ఈ నెల 22న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. శ్రీకాకుళంలో గల హోటల్ నాగావళి మరియు బిగ్ బాస్కెట్ టాటా ఎంటర్ ప్రైజెస్, విశాఖపట్నం వారి కంపెనీలలో గల వివిధ ఉద్యోగాల భర్తీకై జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హెటల్ నాగావళి నందు 22 పోస్టులు, బిగ్ బాస్కెట్ నందు 55 పోస్టులు వెరశి 77 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నాగావళిలో పనిచేయు అభ్యర్ధులకు 18 నుండి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలని, బిగ్ బాస్కెట్ నందు పనిచేయు అభ్యర్ధులకు 18 నుండి 38 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారై ఉండాలని స్పష్టం చేసారు. బిగ్ బాస్కెట్ వాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 20, పేకర్స్/స్తేకర్స్ పోస్టులు 20 వెరశి 40 పోస్టులకు ఎస్.ఎస్.సి విద్యార్హత కలిగిన అభ్యర్ధులు అర్హులని వీరికి నెలకు రూ.12వేలు జీతం ఉంటుందన్నారు. అలాగే బైక్ డెలివరీ బాయ్స్ పోస్టులు 15 ఉన్నాయని ఎస్.ఎస్.సి విద్యార్హత కలిగిన అభ్యర్ధులు అర్హులని వీరికి ప్రతి ఆర్డరుకు రూ.40/-లు చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. నాగావళి హోటల్ నందు మూడు ఎఫ్ అండ్ బి సర్వీస్ కెప్టన్/ఆర్డర్ టేకర్స్ పోస్టులు, రెండు కిచెన్ సూపర్ వైజర్స్ పోస్టులు ఉన్నాయని వీరికి నెలకు జీతం రూ.10 వేలు ఉంటుందన్నారు. 18 నుండి 30 ఏళ్ల వయస్సు లోపు గల అభ్యర్ధులు అర్హులని, డిగ్రీ విద్యార్హతతో పాటు తెలుగు,ఇంగ్లీష్, హిందీ భాషలు మాట్లాడగలిగిన వారై ఉండాలన్నారు. ఎలక్ట్రీషియన్ /ప్లంబర్ పోస్టులు రెండు ఉన్నాయని వీరికి నెలకు రూ.10వేలు జీతం ఉంటుందన్నారు. ఐటిఐ విద్యార్హతతో పాటు హిందీ, తెలుగు మాట్లాడగలిగి ఉండాలని చెప్పారు. హౌస్ కీపింగ్ బాయ్స్ పోస్టులు 5 ఉన్నాయని,పదవ తరగతి విద్యార్గత కలిగిన అభ్యర్ధులు అర్హులని వీరికి నెలకు రూ.9వేలు జీతం , ఎఫ్ అండ్ బి సర్వీస్ వైటర్స్ పోస్టులు 10 ఉన్నాయని, ఇంటర్ పాసై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు మాట్లాడిగలిగిన వ్యక్తులు అర్హులని వీరికి నెలకు రూ. 8వేలు జీతం చెల్లించడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. అసక్తి గల అభ్యర్ధులు తమ విద్యార్హత,ఉద్యోగ అనుభవ వివరాలను www.ncs.ap.gov.in వెబ్ సైట్ నందు నమోదు చేసుకొని ఏప్రిల్ 22న ఉదయం 10.00గం.లకు జిల్లా ఉపాధి కార్యాలయం, గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర, శ్రీకాకుళం వద్దకు బయోడేటా, సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు మరియు నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను తీసుకొని హాజరుకావాలని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు. 

Srikakulam

2022-04-20 16:21:41

పారామెడికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలోని పలు పోస్టుల భర్తీకై  నిరుద్యోగ యువతీ యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్  తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేసారు.  ఏ.పి.వి.వి.పి, శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్దతిన  45 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇందులో కాంట్రాక్టు పద్ధతిలో ఫార్మాసిస్టు గ్రేడ్ –2 పోస్టులు 12, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 10 వెరశి 22 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. అలాగే ఔట్ సోర్సింగ్ పద్దతిలో 4 రేడియోగ్రాఫర్లు, 4 జూనియర్ అసిస్టెంట్లు, 2 రికార్డ్ అసిస్టెంట్లు,  2 పోస్టుమార్టమ్ అసిస్టెంట్లు, 6 ఆఫీస్ సబార్డినేట్లు, 2 ఆఫ్తలిమిక్ అసిస్టెంట్లు, 2 ఆడియో మెట్రిషియన్లు, ఒక లేబ్ అడెంటెంట్ పోస్టులతో సహా మొత్తం 45 పోస్టులను భర్తీచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ నెల 29 సాయంత్రం 05.00గం.ల లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాల కొరకు జిల్లా వెబ్ సైట్ http://srikakulam.ap.gov.in సందర్శించాలని కలెక్టర్  ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2021-11-22 15:45:43

గ్రామ వాలంటీరు పోస్టులకు ధరఖాస్తులు ఆహ్వానం..

శంఖవరం మండలంలోని అన్నవరం, కత్తిపూడి, వజ్రకూటం గ్రామసచివాలయాల పరిధిలోని 7 గ్రామ వాలంటీరు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీఓ జె.రాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు శంఖవరంలోని మీడియాకు మంగళవారం నోటీవిఫికేషన్ వివరాలను విడుదల చేశారు. సెప్టెంబరు 3వ తేదీలోపు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు 7వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి 9వ తేదీన నియామక పత్రాలు అందిస్తామన్నారు. అన్నవరంలో3, కత్తిపూడిలో 3, వజ్రకూటంలో 1 వాలంటీరు పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

శంఖవరం

2021-08-31 15:24:56

కాంట్రాక్టు పద్దతిలో స్పెషలిస్టు పోస్టులు..

జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాంలో కాంట్రాక్టు పద్దతిలో పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి. చంద్రనాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు.  కమిషనర్, ఆఫ్ హెల్త్ ఎండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ మరియు జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, శ్రీకాకుళం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో స్పెషలిస్టు ఎం.డి(జనరల్ మెడిసిస్)-03, ఆఫీసర్ స్పెషలిస్టు మెడికల్ (ఒ.బి.జి)-01, కార్డియలజిస్ట్-01, సైకాలజిస్ట్-01, ఒ.టి. టెక్నీషియస్-03, మరియు సైకాలజిస్ట్-01 పోస్టులకు సంబంధించి ధరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటనలో తెలిపారు.  ఒక సంవత్సర కాలం పాటు కాంట్రాక్టు పద్దతిలో, రోస్టర్ ప్రాతిపదికపై నియామకం జరుగుతుందని పేర్కొన్నారు.  ఇతర వివరములకు www.srikakulam.ap.gov.in వెబ్ సైట్ లో లబించునని, దరఖాస్తు చేయుటకు ఈ నెల 20వ తేదితో ఆఖరు అని ఆ ప్రకటనలో తెలిపారు.

శ్రీకాకుళం

2021-08-13 18:02:01

బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

శ్రీకాకుళం జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల  బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2018-19 లో భాగంగా దరఖాస్తు చేసిన అభ్యర్ధుల యొక్క అర్హత మేరకు వివిధ పొస్ట్ ల వారీగా, వివిధ వికలాంగత్వ కేటగిరీ వారీగా మెరిట్ జాబితాలు , అనర్హత జాబితాలు కలక్టరు  కార్యాలయం, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు శాఖ కార్యాలయం, అన్ని మండల తహశీల్దారు కార్యాలయాల నోటిసు బోర్డులలో, శ్రీకాకుళం జిల్లా వెబ్ సైటు “srikakulam.ap.gov.in” లో పొందు పరిచినట్టు ఆ ప్రకటనలో వివరించారు.  సదరు జాబితాలపై ఎటువంటి అభ్యంతరాలున్నా.. రేపటి నుంచి ఏడు (7) దినములలో (తే.19.08.2021 ది లోగా) కలక్టరు కార్యాలయములో దరఖాస్తు చేసుకోవలసినదిగా ఆ ప్రకటనలో తెలిపారు..

Srikakulam

2021-08-12 15:17:41

స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనం..

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసినదిగా జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. బి. సూర్యారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  శ్రీకాకుళం జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలలో స్టాఫ్ నర్స్ లు-8 పోస్టులు (BC-E-3, BC-C-1, EX(G)-2, PH-VH-1, PH-HI-1 కాంట్రాక్టు పద్దతిపై మరియు యం.యన్.ఓ-BC-C-1 ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎ.పి.వి.వి.పి. ఆసుపత్రులలో పనిచేయుటకు సంబంధించిన ఇతర వివరాల కొరకు శ్రీకాకుళం జిల్లా వెబ్ సైట్ ను www.srikakulam.nic.in  సందర్శించి పొందుపరచిన విదంగా అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి, శ్రీకాకుళం వారి కార్యాలయంలో ఆగష్టు 7వ తేది నుండి ఆగష్టు 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలసినదిగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  ఇతర వివరములకు 08942 – 223308 సంప్రదించవలసినదిగా ఆయన కోరారు.

Srikakulam

2021-08-06 16:19:50

ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల ఎంపిక రేపు..

సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సీడాప్ ) మరియు డి.ఆర్.డి.ఏ  ధ్వారా SYNAPTICS Labs,పవర్ సెక్యూరిటీ సర్వీసెస్ లో ఉద్యోగాల కోసం ఆగస్టు 6న ఎంపిక  నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేసారు.  ఉదయం 09.30గం.ల నుండి మధ్యాహ్నం 01.00గం. వరకు ఎచ్చెర్లలోని టి.టి.డి.సి లో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్ధులు ఈ ఉద్యోగాలను పొందాలని ఆమె ఆకాంక్షించారు. విశాఖపట్నంలోని  SYNAPTICS LABSలో పనిచేయుటకు సిద్దంగా ఉండాలన్నారు. 2016 –2020సం.లలో ఇంటర్, డిగ్రీ, యం.యస్.సి విద్యార్ధులు అర్హులని, వీరి వయస్సు 18 నుండి 25 ఏళ్లకు మించరాదని తెలిపారు. అభ్యర్ధులకు కంపెనీ నిబంధనల మేరకు భోజన సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. అలాగే  తగరపువలసలోని దీవిస్ ల్యాబ్ నందు పనిచేయుటకు 10వ తరగతి నందు ఉత్తీర్ణులై 18 -30 ఏళ్ల మధ్య వయస్సు గల పురుష అభ్యర్ధులు పవర్ సెక్యూరిటీ సర్వీసెస్ పోస్టులకు అర్హులని, ఆసక్తి గల అభ్యర్ధులు ఈ ఎంపిక కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. పై ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూనకు హాజరయ్యే అభ్యర్ధులు తమ విద్యార్హత ధృవపత్రాలతో పాటు బయోడేటా, ఆధార్ కార్డుతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె సూచించారు.
 

Srikakulam

2021-08-05 15:51:47

బ్యాంకు ఉద్యోగాలకి ఉచిత శిక్షణ..

ఇండియ‌న్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ స‌ర్వీసెస్ (ఐబీపీఎస్‌) ప‌రీక్ష‌ల ఔత్సాహిక ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏపీ స్ట‌డీ స‌ర్కిల్ ద్వారా ఉచిత శిక్ష‌ణ అందించ‌నున్న‌ట్లు సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాల‌కులు జె.రంగ‌ల‌క్ష్మీ దేవి వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆమె ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఏడాదికి సంబంధించి ఉచిత శిక్ష‌ణ అందించేందుకు ఆగ‌స్టు 1వ తేదీన కోవిడ్ కార‌ణంగా ఆన్‌లైన్‌లో అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అభ్య‌ర్థులు ఈ నెల 22వ తేదీలోపు https://jnanabhumi.ap.gov.in/ వెబ్‌సైట్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని వెల్ల‌డించారు.

కాకినాడ

2021-07-13 09:44:06

జాతీయ యువ వాలంటీర్ల ఎంపిక..

శ్రీకాకుళం జిల్లాలో 2021-22 జాతీయ యువ వాలంటీర్ పోస్టులకు రెవిన్యూ డివిజన్ల వారీగా ఇంటర్వూలను నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువత అధికారి జి.మహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఈ నెల 14వ తేదీన టెక్కలి, 15న శ్రీకాకుళం, 16న పాలకొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువత శ్రీకాకుళం ఆర్.టి.సి.కాంప్లెక్స్ ప్రక్కన గల  నెహ్రూ యువ కేంద్రం కార్యాలయానికి ఉదయం 09.00గం.లకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు. వాలంటీరు పోస్టునకు ఆసక్తి గల అభ్యర్ధులు 10వ తరగతి లేదా తత్సామాన మార్కుల లిస్టు మరియు ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ మార్కుల లిస్టులు తీసుకురావాలని, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ తప్పనిసరి అని స్పష్టం చేసారు. వీటితో పాటు కంప్యూటర్ నందు అనుభవం ఉన్నఎడల ఆ ధృవీకరణ పత్రం, యస్.సి,యస్.టి.,బి.సి., మైనారిటీ వర్గాలకు చెందిన వారైతే కుల ధృవీకరణ పత్రం, ఎన్.ఎస్.ఎస్.,ఎన్.సి.సి లేదా స్పోర్ట్స్ అభ్యర్ధులయినచో సంబంధిత ధృవీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు లేదా నేటివిటి సర్టిఫికేట్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలను అభ్యర్ధుల వెంట తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. అభ్యర్ధులు ఇదివరకు యూత్ క్లబ్ లేదా మహిళా మండలి సభ్యులు అయినట్లైయితే సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆయన సూచించారు. ఇతర వివరాల కొరకు 08942 – 222028 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-07-12 17:00:53

సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ..

శ్రీకాకుళం జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో 27 మంది సపోర్టింగ్ స్టాఫ్ ను ( యం.యన్.ఓలు, ఎఫ్.యన్.ఓలు ) అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు డి.యస్.సి ఛైర్మన్ శ్రీకేశ్ లాఠకర్ శనివారం తెలిపారు. సపోర్టింగ్ స్టాఫ్ ను 6 నెలల కాలానికి మాత్రమే తీసుకుంటున్నామని, ప్రాధాన్యత క్రమంలో కోవిడ్ ఏ.పి.వి.వి.పి ఆసుపత్రులలో పనిచేయాలని కలెక్టర్  చెప్పారు.    ఆసక్తి గల అభ్యర్ధులు వారి దరఖాస్తులను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి, శ్రీకాకుళం వారి కార్యాలయంలో ఈ నెల 5 నుండి 9వ తేది సాయంత్రం 05.00గం.లలోగా సమర్పించాలన్నారు. గడువు పూర్తై వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఇతర వివరాల కోసం www.srikakulam.nic.in  ను సందర్శించవచ్చని లేదా 08942 – 223308 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని  కలెక్టర్ ఆ వివరించారు.

Srikakulam

2021-07-03 15:10:10

491 వాలంటీర్ పోస్టుల నియాకం..

శ్రీకాకుళంజిల్లాలో 491 వాలంటీర్ పోస్టుల నియామకానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి వి. రవికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఈనెల 23వ తేదీ నుండి 27 వ తేదీ వరకు ఎం.పి డి. ఓ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి 27వ తేదీన దరఖాస్తులు పరిశీలిస్తారని, 28 నుంచి 30వ తేదీ వరకు ఎంపిక కమిటీ మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూ) నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వాలంటీర్లకు వెంటనే నియామకపు ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు జూలై ఒకటో తేదీ నుండి తమ విధులు నిర్వహించాలని రవికుమార్ తెలిపారు.  గ్రామ పంచాయతీల్లో ఖాళీల వివరాలను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో తెలుసుకోవచ్చని సూచించారు.

శ్రీకాకుళం

2021-06-22 15:26:04

ఆ పోస్టుల భర్తీ మున్సిపల్ కౌంటింగ్ తరువాతే..

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయశాఖలో భర్తీకాకుండా మిగిలిపోయిన 8402 పోస్టులను రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడీ పూర్తయిన తరువాత భర్తీచేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగిలిపోయిన ఈ పోస్టుల చార్జును ఏపీపీఎస్సీకి అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే ఈ ఉద్యోగాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వం ఈ ఉద్యోగాలు కూడా భర్తీచేసేస్తే రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అన్ని ఉద్యోగాలను భర్తీచేసినట్టు అవుతుంది. ఇప్పటికే రెండు దఫాలుగా గ్రామసచివాలయ శాఖకు ఉద్యోగాలు భర్తీచేయాలని చూసినా ఇంకా కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. అలా మిగిలిపోయిన అన్నిపోస్టులనూ భర్తీచేసి ప్రజలకు గ్రామస్థాయిలోనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆసమయానికి ఇంకా ఎవరైనా సచివాలయ సిబ్బంది రిటైర్ అయినా, సదరు ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈపోస్టుల భర్తీ అనంతరం ఎంపీడీఓల పదోన్నతులకు కూడా మర్గం సుగమం అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎంపీడీఓ పదోన్నతులు జరగకుండా ఉండిపోయాయి. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రమోషన్లకు కూడా  లైన్ క్లియర్ అయ్యింది.

Tadepalle

2021-03-12 12:53:44

ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..

విశాఖపట్నం జిల్లాలో గల పశుసంవర్ధక శాఖ నందు  9 ల్యాబ్ అటెండెంట్స్  పోస్టుల కొరకు పోరుగుసేవలు పద్దతిలో పనిచేయుటకు SSC పాస్ అయిన 18 నుండి 42 సంవత్సరాల మద్య  వయస్సు గల SC/ST/BC అభ్యర్థులకు- 5 సంవత్సరాలు, ఎక్స్- సర్వీసు మెన్ కు 3 సంవత్సరాలు, వికలాంగు అభ్యర్థులకు- 10 సంవత్సరాలు సడలింపు తో, అభ్యర్థులు విశాఖ జిల్లా వాసులై ఉoడి, తేది: 09-03-2021 నుండి 20-03-2021 సాయంత్రం 5.00 గంటల వరకు 100/-రూపాయల ఫీజు చెల్లించి http://ahd.aponline.gov.in వెబ్ సైట్ లో ధరఖాస్తు అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. మరిన్ని వివరాలకై  DR.D.RAMAKRISHNA, FAC, JOINT DIRECTOR, ANIMAL HUSBANDRY DEPT, VISAKHAPATNAM, 9989932828 సంప్రదించవచ్చు.

Visakhapatnam

2021-03-08 17:29:01

ఇంటర్వ్యూలో 60 మంది సాగర మిత్రాలు ఎంపిక..

సాగర్ మిత్ర పోస్టులకు మౌకిక పరీక్షలు సంయుక్త సుమిత్ కుమార్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగాయి.మొదటి విడతలో భర్తీచేయనున్న 60మంది సాగర్ మిత్ర పోస్టుల కొరకు జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి విదితమే. అందులో భాగంగా 682 మంది అభ్యర్ధులు ఈ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోగా, అర్హతల మేరకు 190 మందిని ఎంపికచేయడం జరిగిందని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో 100 మందిని పూర్తి అర్హులుగా  గుర్తించి వారందరికీ గురువారం మౌకిక పరీక్షలకు నిర్వహించడం జరిగిందని, వారిలో 60 మందిని సాగర్ మిత్ర పోస్టుల కొరకు ఎంపికచేసినట్లు ఆయన చెప్పారు. ఎంపికైన 60 మంది అభ్యర్ధులలో 9 మంది డిప్లమో ఇన్ ఫిషరీస్ చేసిన వారు ఉన్నారని, వీరందరికి నియామక పత్రాలను సంయుక్త కలెక్టర్ చేతుల మీదుగా అందించనున్నట్లు ఆయన చెప్పారు. కాంట్రాక్ట్ పద్దతిలో కొనసాగే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.15 వేలు పారితోషికం ఉంటుందని, 2025 మార్చి వరకు ఈ పోస్టులు కొనసాగనున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం.ప్రసాదరావు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ, గోపీకృష్ణ, ఎఫ్.డి.ఓలు గంగాధర్, ధర్మరాజు పాత్రో , ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-03-04 13:51:53