మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ తాత్వికత అయిన ఆరోగ్య స్వావలంబన ద్వారా సంపూర్ణ స్వావలంబన సంధించడం అనే అంశం పై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పూణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాచురోపతి (ఎన్ఐఎన్) వరుస వెబినార్లను నిర్వహించనుంది. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వెబినారు్ల నవంబర్ 18, నేచురోపతి డే వరకు సాగుతాయి. మనందరికీ సులభంగా అందుబాటులో ఉన్న సరళమైన సహజ (ప్రకృతి) పద్ధతులను అవలంబించడం దా్వరా ప్రజలు తమ ఆరోగ్యానికి తామే బాధ్యత తీసుకోవచ్చనే సందేశాన్ని ఈ వెబినార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాయని కేంద్ర ఆయుష్ విభాగం పేర్కొంది. ప్రకృతి వైద్య పద్ధతులనుతారి్కకంగా నిరూపించడం ద్వారా ప్రజలలో ప్రకృతి వైద్యం పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. లైవ్ చాట్ల ద్వారా, ఆ వృత్తిని అవలంబిస్తున్న వారితో చర్చల ద్వారా ఫీడ్ బ్యాక్ తో సెషన్లను బలోపేతం చేయనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమై 48 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమం రోజుకు ఒక గంటపాటు, అది కూడా భారతీయ కాలమానం (ఐఎస్టి) ప్రకారం నిర్ధిష్ట సమయంలో జరుగుతుంది. నవంబర్ 18న నేచురోపతీ దినోత్సవం సందర్భంగా వర్చువల్ వెబినార్లు ముగియన నున్నాయి. ఇదే రోజున మహాత్మా గాంధీ ఆలిండియా నేచర్ క్యూర్ ఫౌండెషన్ ట్రస్టుకు జీవితకాల చైర్మన్గా బాధ్యతలు తీసుకుని, అన్ని వర్గాల ప్రజలకు ప్రకృతి వైద్య ఉపయోగాలను, లాభాలను అందించే లక్ష్యంతో ఒక ఒప్పందంపైఔ సంతకం చేశారు. వెబినార్లతో పాటుగా కాలేజీ, పాఠశాల విద్యార్దులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు, సాధారణ ప్రజలకు సోషల్ మీడియాలో పోటీలు నిర్వహించనున్నారు. అలాగే అంతర్జాతీయ గాంధేయ సంస్థలైన మహాత్మా గాంధీ కెనెడియన్ ఫౌండేషన్ ఫర్ వరల్్డ పీస్, జర్మనీకి చెందిన గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్, మహాత్మా గాంధీ సెంటర్ ఫర్ గ్లోబల్ నాన్ వయొలెన్్స వర్జీనియా, యుఎస్ఎ, యుటిఎస్, సిడ్నీ, ఆస్ర్టేలియాకు చెందిన ప్రముఖ వక్తలు కూడా ఇందులో పాల్గొననున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీలో శీతాకాలపు నెలల్లో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. వాయు కాలుష్యం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పౌరులు కలసికట్టుగా కృషి చేయవలసి ఉంటుందన్నారు. మంగళవారం ఈమేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వాయు కాలుష్యంపై ఢిల్లీతోపాటు, దాని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పర్యావరణ శాఖా మంత్రుల వర్చువల్ సమావేశం అక్టోబరు 1న నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే మొదట సదరు సమస్యను గుర్తించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో గాలి నాణ్యతా సూచికను ప్రారంభించారని చెప్పారు. వాయుకాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, కాలుష్యాన్ని నియంత్రణకు విధానపరమైన చర్యలు తీసుకునేలా తగిన సూచనలు చేయడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. న్యూఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యానికి వాతావరణ సంబంధమైన కారణాలున్నాయని మంత్రి వివరించారు. గాలి, వాయు ప్రసరణ సరిగా లేకపోవడమే ఢిల్లీలో గాలి నాణ్యతను దెబ్బతీస్తోందన్న మంత్రి శీతాకాలాల్లో చలిగాలి, పొడిగాలులు, మైదానం ఉపరితలంపై మంద్రస్థాయి గాలుల కారణంగా ఢిల్లీ నగరంలో గాలి స్తబ్దుగా ఉండిపోతోందన్నారు. శీతాకాలాల్లో దేశం ఉత్తరాది నుంచి, వాయవ్య దిశనుంచి తూర్పు దిశగా వీచే గాలులు చివరకు తీవ్రమైన కాలుష్యానికి, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. వాయుకాలుష్యం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తీసుకున్న చర్యలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. బందార్ పూర్ విద్యుత్ ప్లాంట్.ను మూసివేయడం, సోనీపట్ విద్యుత్ ప్లాంట్.ను దశలవారీగా నిలిపివేయడం, తక్కువ కాలుష్యం వెదజల్లే బి.ఎస్.-VI వాహనాలను ప్రవేశపెట్టడం, ఇంధన ప్రమాణాలను నిర్దేశించడం, ఢిల్లీ చుట్టూ ఎక్స్.ప్రెస్.వే రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం, విద్యుత్ వాహనాలకు సబ్సిడీ సదుపాయం కల్పించడం తదితర చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు.
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ షోడశదిన సుందరకాండ దీక్షను ప్రారంభించామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని వసంత మండపంలో మంగళవారం ప్రారంభమైన ఈ దీక్ష అక్టోబరు 14వ తేదీ వరకు జరుగనుంది. షోడషాక్షరి మహామంత్రం ప్రకారం మొదటి రోజు రా అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుందరకాండలోని మొదటి సర్గలో 211, రెండో సర్గలో 58 కలిపి మొత్తం 269 శ్లోకాలను పారాయణం చేశారు. మొదట సంకల్పంతో ప్రారంభించి శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆ తరువాత 16 మంది ఉపాసకులు శ్లోక పారాయణం చేశారు. బుధవారం నాడు మూడో సర్గ నుండి ఆరో సర్గ వరకు మొత్తం 152 శ్లోకాలను పారాయణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః అనే మహామంత్రం ప్రకారం సీతాసమేతుడైన శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తే సంకల్పసిద్ధి చేకూరుతుందని, ఈతిబాధలు తొలగుతాయని తెలిపారు. ఈ మహామంత్రంలో 16 అక్షరాలు ఉన్నాయని, ఈ అక్షరాలకు ఉన్న బీజాక్షరాలను కూడితే ఆ సoఖ్య 68 అవుతుందన్నారు. సుందరకాండలో మొత్తం 68 సర్గలు ఉన్నాయని వివరించారు. వీటిలోని 2,821 శ్లోకాలను 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేస్తారని తెలియజేశారు. ఉపాసకులు ఒకపూట మాత్రమే భోజనం, బ్రహ్మచర్యం, నేలపై విశ్రమించడం లాంటి నియమాలను పాటిస్తారని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. పారాయణం శ్లోకాలను ఎస్వీబీసీలో స్క్రోలింగ్ ఇస్తున్నామని, www.svbcttd.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని భక్తులు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. శ్లోకాలను పలకలేని వారు ఏకాగ్రతతో విన్నా సమానమైన ఫలితం లభిస్తుందన్నారు. భక్తులందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొని సంకల్పసిద్ధి పొందాలని కోరారు. ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయస్వామివారి అనుగ్రహంతో ప్రపంచంలోని మానవులు ధర్మాని ఆచరిస్తూ, సకల శుభాలను పొందాలని ఆకాంక్షిస్తూ షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తోందన్నారు. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, డెప్యూటీ ఈవో(ఆర్1)బాలాజి, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్ఆర్.రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, అన్నప్రసాదం ఏఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 50 లక్షల మైలురాయి దాటింది. సోమవారం ఆ సంఖ్య 50,16,520 కి చేరింది. ప్రతి రోజూ ఇలా పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో భారత్ లో కోలుకుంటున్న తీరు అదే పనిగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 74,893 మంది కోలుకున్నారు. కొద్దిరోజులుగా దేశమంతటా కోలుకుంటున్నవారి సంఖ్య సగటున రోజుకు 90 వేలకు పైగా ఉంటోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా ఐదు రెట్లు ఎక్కువగా నమోదైంది. కోలుకుంటున్నవారి సంక్యలో పెరుగుదల గత నెల రోజులలో దాదాపు వందశాతం పెరగటం కూదా గమనార్హం. జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి శాతం 82.58% గా నమోదైంది. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైంది. కొత్తగా కోలుకుంటున్న కేసులలో 73% పది రాష్ట్రాలనుంచే ఉండటం కూడా గమనార్హం. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు. వీటిలో 13,000 మంది కోలుకున్నట్టు నమోదైన మహారాష్ట్ర ఈ జాబితాలో ముందుంది. 2020 జూన్ లో కోలుకున్నవారి సంఖ్య లక్ష ఉండగా అది చాలా వేగంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 11 రోజులలోనే ఈ సంఖ్యకు 10 లక్షలు జోడించినట్టయింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వలన, మౌలిక సదుపాయాలు పెంచటం, ప్రామాణిక చికిత్సావిధానాలు అమలు చేయటం, వైద్య, పారామెడికల్ సిబ్బంది అంకితభావంతో అందించిన సేవలు ఒక సంపూర్ణ విధానం రూపంలో అమలుకావటం వలన ఈ ఫలితాలు సాధించటం సాధ్యమైంది. కోలుకున్న వారిలో మొత్తం 78% కేవలం పది రాష్ట్రాలనుంచే నమోదయ్యాయి. కోలుకున్నవారి సంఖ్య లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆ తరువాత రెండు స్థానాల్లో నిలిచాయి.
దేశంలో రవాణా కోసం స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా, సీఎన్జీ ఇంజిన్లలో హెచ్-సీఎన్జీ (18 శాతం హైడ్రోజన్ మిశ్రమం) వినియోగాన్ని అనుమతిస్తూ కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా కోసం స్వచ్ఛమైన ఇంధనాలుగా అనేక ప్రత్యామ్నాయ ఇంధనాలను మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వాహనాల కోసం, హైడ్రోజన్ సమృద్ధిగా ఉన్న సంపీడన సహజ వాయువు (హెచ్-సీఎన్జీ) లక్షణాలను (ఐఎస్ 17314:2019) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కూడా రూపొందించింది. సీఎన్జీతో పోలిస్తే, హెచ్-సీఎన్జీ ద్వారా వెలువడే ఉద్గారాలను పరిశీలించడానికి కొన్ని సీఎన్జీ ఇంజన్లను పరీక్షించారు. హెచ్-సీఎన్జీని రవాణా వాహనాల ఇంధనంగా చేరుస్తూ, మోటారు వాహనాల చట్టం-1989కి సవరణలు చేస్తూ, జీఎస్ఆర్ 585 (ఇ) ద్వారా ఈనెల 25వ తేదీన మంత్రిత్వ శాఖ ప్రకటన ఇచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదాను జులై 22న ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీనిపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు రాలేదు. దీంతో హెచ్-సీఎన్జీకి కేంద్రం పచ్చజెండా ఊపింది.
దేశంలో కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా కోవిడ్ నుంచి బైటపడుతున్న కేసుల సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,043 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీళ్లలో 76% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అందులో మహారాష్ట్ర 23,000 కు పైగా కేసులతో ముందు వరుసలో ఉండగా 9,000 పైబడ్ద ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 88,600 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అందులోనూ 20,000 కు పైగా కొత్త కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్ర ముందుండగా, 8,000 కు పైగా కేసులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోను, 7,000 కు పైగా కేసులతో కర్నాటక మూడో స్థానంలోను నిలిచాయి. గడిచిన 24 గంటలలో 1124 మరణాలు నమోదయ్యాయి. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 84% కోవిడ్ మరణాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 430 (38%) మరణాలు సంభవించగా, కర్నాటకలో 86 మరణాలు, తమిళనాడులో 85 మరణాలు నమోదై ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరణించినట్లు దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ ఆసుపత్రి ఆదివారం ప్రకటించింది. ఈ ఉదయం 6.55 గంటలకు తుది శ్వాస విడిచారని వెల్లడించింది. ఆయన సెప్సిస్తో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరారు. మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ కూడా తలెత్తింది. దీనికి సంబంధించి చికిత్స అందిస్తుండగా..తలకు తగిన తీవ్రమైన పాత గాయం కారణంగా ఈ ఉదయం గుండెపోటు వచ్చినట్లు ఆసుపత్రి వెలువరించింది. జశ్వంత్ సింగ్ను బతికించడానికి నిపుణుల బృందం తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. కాగా.. ఆయనకు చేసిన కొవిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "దేశానికి జశ్వంత్ జీ ఎంతో చిత్తశుద్ధితో, శ్రద్ధతో సేవలందించారు. మొదట ఒక సైనికుడిగా దేశానికి సేవలందించిన జశ్వంత్ సింగ్, తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. అటల్ బిహారీ వాజ్.పేయి హయాంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై ఆయన ఎంతో బలమైన ముద్ర వేశారు. ఆయన మరణం చాలా బాధాకరం" అని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
దేశంలో కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా కోవిడ్ నుంచి బైటపడుతున్న కేసుల సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,043 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీళ్లలో 76% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అందులో మహారాష్ట్ర 23,000 కు పైగా కేసులతో ముందు వరుసలో ఉండగా 9,000 పైబడ్ద ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 88,600 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అందులోనూ 20,000 కు పైగా కొత్త కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్ర ముందుండగా, 8,000 కు పైగా కేసులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోను, 7,000 కు పైగా కేసులతో కర్నాటక మూడో స్థానంలోను నిలిచాయి. గడిచిన 24 గంటలలో 1124 మరణాలు నమోదయ్యాయి. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 84% కోవిడ్ మరణాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 430 (38%) మరణాలు సంభవించగా, కర్నాటకలో 86 మరణాలు, తమిళనాడులో 85 మరణాలు నమోదై ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి..