కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నవంబరు 3వ తేదీ మంగళవారం 6వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతుంది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకునే, ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసినట్టుగా కూడా టిటిడి పేర్కొంది. తిరుమలలో నిర్వహించే ఈ పారాయణంకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థలో రెండు విభాగాల్లో పోస్టులు ఆది నుంచి భర్తీకాకుండా అలా మిగిలిపోతున్నాయి. రెండోవసారి సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉద్యోగ ప్రవేశ పరీక్షలో కూడా సెరీకల్చర్, యానిమల్ హజ్బంజడరీ సహాయకుల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిసోస్తోంది. దానికి కారణం ఆ విద్య చదివిన వారు తక్కువ గా ఉండటమే. తొలుత తీసిన ఉద్యోగాలు అత్యంత తక్కువగా మార్కులు వచ్చినప్పటికీ ఆ ఉద్యోగాలను భర్తీచేసిన ప్రభుత్వం ఈ సారి భర్తీచేయకపోవచ్చునని చెబుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు కూడా రాకపోవడం విశేషం. వాస్తవానికి గ్రామస్థాయిలో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు భర్తీచేయడం వలన చాలా ఉపయోగాలు, సేవలు ప్రజలకు అందుతాయి. కానీ ఆ చదువు చదివిన వారు తక్కువగా ఉండం వలన ఆపోస్టులు భర్తీకావడం లేదు. కొన్ని ఫిషరీష్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ కాకపోవడం విశేషం. ఈ సారి గ్రామసచివాలయాల ఉద్యోగాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ర్యాంకింగ్ విధానం ప్రవేశ పెట్టడంతో ఎంత మంది ఉద్యోగాలొస్తాయో తెలియని పరిస్తితి నెలకొంది. అదే జరిగితే ర్యాకుంలో మార్కులు తక్కువ వచ్చిన వారికి వేలల్లో వస్తాయి...అనుకున్నట్టుగా ఆ శాఖల సిబ్బంది భర్తీ కాకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు..
విశాఖలోని గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వానికి చెందిన 43.50 ఎకరాల భూమిని అక్రమంగా ఖబ్జాచేసి అందులో కొంతభాగంలో మెడికల్ కాలేజీ, ఆసుప త్రులు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించిన విషయం ఇపుడు నేషనల్ మెడికల్ కమిషన్ ద్రుష్టికి వెళ్లినట్టు సమాచారం. వాస్తవంగా దేశవ్యాప్తంగా నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజీలు, మెడికల్ యూనివర్శిటీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అనుమతులు, సీట్ల కేటాయింపు చేస్తుంటుంది. అలాంటి గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీతోపాటు మెడికల్ కాలేజీ భూములన్నీ సక్రమం కాదు, అక్రమమని తెలిస్తే మెడికల్ కాలేజి గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నేరుగా రాష్ట్రప్రభుత్వమే కొలతలు వేసి, నోటీసులు కూడా ఇచ్చి ఈ ప్రభుత్వ భూమి గీతం ఆక్రమించిందని నోటిఫై చేసిన తరువాత ఈ విషయం మరింత ముదిరి పాకాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గీతం విషయంలో సిబిఐకి ఫిర్యాలు వెళ్లడం, కోర్టు నుంచి ఉత్తర్వులు తేవడం వంటి విషయాలు గీతంను చక్రబంధం చేసేటట్టు కనిపిస్తున్నాయి. అక్రమాల గీతంలో భూ ఆక్రమణల విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుతున్న తరుణంలో గీతం మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. అదీ ప్రభుత్వంలోని పెద్దలు ఈ ఫిర్యాదులు చేసివుంటే...ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ విచారణ చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా గీతంపై ఎన్ఎంసీ విచారణ చేస్తే...గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ విషయంలోనే సదుపాయాలు, వసతి సక్రమంగా లేవని సీట్లలో కోత విధించిన ఎన్ఎంసీ, ఇపుడు ఏకంగా గీతం పూర్తి అక్రమ భూ కబ్జా మెడికల్ కాలేజీ అని తేలితే ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా వుంటాయని తెలుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి..
గ్రామసచివాలయాల్లో కొలువుల కోసం వేచిస్తున్నవారికి శుభవార్త. ఇటీవల నిర్వహించిన గ్రామసచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రజలకు ఇంటి వద్దే సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మిగిలిన 16208 ఉద్యోగాలను నేటి ఫలితాలతో భర్తీచేయనున్నామని అన్నారు. అభ్యర్ధుల ఫలితాలు, వచ్చిన మార్కులు ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తరువాత అపాయింట్ ప్రక్రియ మొదలవుతుందని అంతా కలిపి రెండు నెలల్లో ఈ ప్రక్రియ ముగించి వచ్చే జనవరి నాటికి పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సిబ్బందిని భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్ టీమ్) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు అభ్యర్ధుల హాల్ టిక్కెట్ల ఆధారంగా వారికి వచ్చిన మార్కులను సరిచూసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ రెండవ దశ విజ్రుంభించే ప్రమాదం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా వున్న జర్నలిస్టులు వచ్చే రెండు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చేసిన హెచ్చరికల నేపథ్యంలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలుతు 45 రోజుల్లో కరోనా వైరస్ నీరసిస్తుందని భావించినా దాని ప్రభావం ఇపుడే అధికంగా కనిపిస్తుందని ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. వైద్యులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్న తరుణంలో జర్నలిస్టులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విధినిర్వహణలో బయటకు వెళ్లే ప్రతీ జర్నలిస్టూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ 5.0 నిబంధనలు సులభరతరం చేసినా, వార్తా సేకరణలో మాత్రం జర్నలిస్టులు మరో నెల రోజులు ముఖ్యమైన వాటికి మాత్రమే బయటకు రావాలన్నారు. మీమీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని గంట్ల శ్రీనుబాబు గుర్తు చేశారు.
వైయస్ఆర్ రైతుభరోసా 2వ విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమవారతిలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,115 కోట్ల నగదును కంప్యూటర్ లో నొక్కి బదిలీ చేశారు. తొలిసారిగా ఖరీఫ్లో నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు ఖరీఫ్ లోనే ఇన్పుట్ సబ్సిడీ రూ. 135.7 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ లక్ష మంది గిరిజన రైతులకు రూ. 11,500 చొప్పున రూ.104 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. రబీ సీజన్కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ROFR) రైతులకూ రైతు భరోసా సాయం అందుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని, రైతులను సాయమందించడం గర్వంగా ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 90శాతం నెరవేర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్నితోపాటు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో నవంబరులో విశేష ఉత్సవాలు శ్రీవారికి జరపనున్నారు. వరుసగా నవంబరు 14 నుంచి 29వరకూ స్వామివారికి జరిపే ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి విశేష ఉత్సవాలు కోసం తెలుసుకుంటే.. నవంబరు 14న దీపావళి ఆస్థానం, నవంబరు 18న నాగుల చవితి, నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, నవంబరు 25న స్మార్త ఏకాదశి, - నవంబరు 26న మధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చక్రతీర్థ ముక్కోటి, నవంబరు 27న కైశిక ద్వాదశి ఆస్థానం, నవంబరు 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో కార్యక్రమానికి సంబంధించిన రోజువారీ షెడ్యూల్ ను ముందుగానే అధికారులు ప్రకటించారు. ఆయా తేదీల వారీగా స్వామివారికి విశేష ఉత్సవాలు జరపనున్నామని తిరుమల జెఈఓ వివరించారు.
డా.వైఎస్సార్ కడప జిల్లాలోని స్టీల్ప్లాంట్ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఏపీఐఐసి, పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులు, చైర్మన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్ప్లాంట్ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని.. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు. స్టీల్ప్లాంట్ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలిఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అనంతరం కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు సీఎంకి వివరించారు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. డిక్సన్తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పది రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కోవిడ్-19 నిబంధల కారణంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు. చివరి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ ఏకాంతంగా జరిగింది. కరోనా వైరస్ కేసులను ద్రుష్టిలో ఉంచుకొని పరిమిత సిబ్బంది, అధికారులు, పురోహితులతోనే అమ్మవారి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ రాజేష్ కన్నా, వాహనం ఇన్స్పెక్టర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ భూముల విషయంలో కోర్టు ఉత్తర్వును టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్ చెప్పారు. ఈ మేరకు విశాఖలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేయాలని చూస్తుందన్నారు. 70 రోజులు జైళ్లో ఉన్న అచ్చెన్నాయుడు కూడా గీతం భూములపై మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు. విశాఖలో ఆక్రమిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారని, ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతించడాన్ని టిడిపి జీర్ణించుకోలేకపోతుందన్నారు. అటు గీతం యాజమాన్యం కూడా కోర్టు ఆర్డర్ను కూడా వక్రీ కరించి ప్రచారం చేస్తోందన్న ఎమ్మెల్యే.. రిట్ పిటిషన్ గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలు మాత్రమే తొలగించవద్దు అని మాత్రమే కోర్టు సూచించన విషయాన్ని కోర్టు ఆర్డర్ చూసిన వారెవరికైనా తెలుస్తుందన్నారు. కానీ టీడీపీ కి చెందిన పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆగస్టు 3న గీతం యాజమాన్యం తమ ఆధీనంలోని 43 ఎకరాల ఆక్రమిత భూమిని క్రమబద్ధీకరించాలని కోరిందని అయితే ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు తీసుకుని ఇంకా భూమి కావాలని కోరడంతో దానిని ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. గీతం యాజమాన్యం తన సొంత భూమి రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఖాళీగా ఉంచుకుని ప్రభుత్వ భూమి విద్యాసంస్థలకు ఆక్రమిస్తామంటే ఎలా ప్రభుత్వం అంగీకరిస్తుందని ప్రశ్నించారు. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుంది కానీ ఇలా భూ దాహం వున్న వ్యక్తులకు ప్రభుత్వం ఇవ్వదని స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆఖరి క్యాబినెట్లో గీతం భూముల క్రమబద్దీకరణ అంశాన్ని అప్పటి క్యాబినెట్ వాయిదా వేసిందంటే పరిస్తితి ఎలా వుందో అదే పచ్చమీడియా అర్ధంచేసుకుంటే మంచిదన్నారు. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుందని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని విమర్శలు చేసే టీడీపీ నాయకులు రుజువు చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోందని దానికి... చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు' అంటూ ఎమ్మెల్యే అమరనాథ్ చంద్రబాబు కుటిల రాజకీయాన్ని ఎండగట్టారు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీలుగా టిటిటి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రేపు ఉదయం విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 27న మంగళవారం ఉదయం 11.00 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టిటిడి ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్టు టిటిడి అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా టైమ్ స్లాట్ దర్శనాలు కూడా ప్రారంభించనున్నట్టు చెప్పిన అధికారులు అత్యధిక మందికి శ్రీవారి దర్శనాలను దగ్గర చేయాలన్నదే టిటిడి లక్ష్యమని పేర్కంది. స్వామివారి దర్శనాల కోసం భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.