1 ENS Live Breaking News

కేన్సర్ వ్యాధి చికిత్స పరిశోధనకోసం సిసిఆర్ఎస్..

కేన్సర్ వ్యాధికి చికిత్సను రూపొందించే లక్ష్యంతో ఆయుర్వేదంలో పరిశోధనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. స్వతంత్ర ప్రతిపత్తిగల  ఆయుర్వేద శాస్త్ర కేంద్ర పరిశోధన మండలి (సి.సి.ఆర్.ఎస్.)ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయుర్వేద ఆరోగ్య రక్షణ సేవల్లో పరిశోధన చేయడాానికి ఈ మండలికి పూర్తిస్థాయి అధికారాలను కూడా ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన సూచనలు ఆధారంగా పరిధోనలు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి.  అవి వరుసగా..కేన్సర్ రోగుల జీవిత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆయుష్ క్యుఒఎల్ 2సి ని రూపొందించడం, గర్భాశయ కేన్సర్ కు స్వతస్సిద్ధమైన చికిత్సగా కార్క్ టోల్ ను రూపొందించడం, ఆయుర్వేదం ద్వారా కేన్సర్ చికిత్సా పద్ధతులతో వ్యవస్థీకృతంగా సమగ్రమైన విధానాన్ని రూపొందించడం, కేన్సర్ నిర్ముూలకాలుగా ఔషధ మొక్కలు  ఎలా పనిచేస్తాయన్నదానిపై పరీక్షలు జరపడం. అంతేకాకుండా ఆయుర్వేద చికిత్స పద్ధతులు ద్వారా వ్యవస్థీకృత సమీక్ష, గణాంక విశ్లేషణ; చికిత్సా విధానాన్ని పాటిస్తున్న వైద్యుల, సంస్థలనుంచి సమాచారాన్ని ప్రమాణ పత్రాలతో నమోదు చేయడంతోపాటు  కేన్సర్ పై ఆయుర్వేద పరిశోధనలో భాగంగా కేన్సర్ అధ్యయనంపై సమగ్ర కేంద్రం (సి.ఐ.ఒ.) ఏర్పాటు చేశారు. అఖిల భారత ఆయుర్వేద శాస్త్ర అధ్యయన సంస్థ (ఎ.ఐ.ఐ.ఎ.), జాతీయ కేన్సర్ నిరోధక, పరిశోధన సంస్థ (ఎన్.ఐ.సి.పి.ఆర్.-ఐ.సి.ఎం.ఆర్.)ల ఉమ్మడి సంస్థగా సి.ఐ.ఒ.స్థాపన జరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ లోక్ సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలియజేశారు.

Rajya sabha

2020-09-19 11:33:49

ఆలయాల విషయంలో రాజకీయ కుట్ర దాగివుంది..

రాష్ట్రంలో కొంద‌రు రాజ‌కీయ పార్టీల ముసుగులో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వానికి మ‌చ్చ తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని దేవ‌దాయ శాఖ మంత్రి  వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్ పి. అర్జున‌రావు అధ్య‌క్ష‌త‌న‌ దేవ‌దాయ శాఖ అధికారుల‌తో  జరిగిన వీడియో సమావేశంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు మట్లాడుతూ, ఇటీవ‌ల హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న కుట్ర‌ల‌ను చేధిద్దామని మంత్రి పిలుపు నిచ్చారు. అంద‌రం క‌లిసి పనిచేద్దాం మ‌న దేవాల‌యాలను అభివృద్ది చేద్దాం అనిపిలుపిచ్చారు. కావాల‌నే కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని దేవాల‌యాల‌పై రాజ‌కీయం చేయాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు. అన్ని జిల్లాల్లో పనిచేసే అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్‌, రిజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ లు త‌రుచుగా త‌మ ప‌రిధిలోని గ్రామ‌లు  ప‌ర్య‌టించి ఆయా గ్రామ కమిటీల‌తోను,స్థానికుల‌ను స‌మావేశ పరచి వారి అభిప్రాయ‌ల‌ను సూచ‌న‌ల‌ను పాటిస్తూ దేవాల‌యాల అభివృద్దికి కృషి చేయాల‌న్నారు. ఇందులో అంద‌రు  భాగ‌స్వాములు కావాల‌న్నారు. అదేవిదంగా  దేవాల‌యాలు, ప్రాంగ‌ణం, మ‌రియు ర‌ధాల భ‌ద్ర‌త‌ విష‌యంలో ఏర్పాటు చేసే సీసీ కెమెరా  నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌వ‌ద్ద‌న్నారు. దేవాల‌యాల భ‌ద్ర‌త విష‌యంలో స్థానికులు, పోలీసుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటించాల‌న్నారు. భ‌ద్ర‌త విషయంలో ఎటువంటి అల‌స‌త్వం వ‌హించిన క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుందని హెచ్చరించారు. దేవాల‌యల కు అనుబంధంగా ఉన్న అతిధి గృహాలను ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. శుభ‌త్ర‌ను పాటించాల‌న్నారు.  మీడియా స‌మావేశంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున రావు, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కె.రామ‌చంద్ర‌మెహ‌న్‌, ఎస్‌.ఈ శ్రీ‌నివాస‌రావు తో పాటు 13 జిల్లాల అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు, 4గురు డిప్యూటి క‌మిష‌న‌ర్లు, ఇతర అధికారులు పాల్గోన్నారు.

Vijayawada

2020-09-18 20:54:41

2020-09-18 20:01:10

2020-09-18 19:59:37

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ..

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కన్యా మాసం హస్త నక్షత్రంలో శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తరువాతే.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. అంకురార్పణ క్రమం.. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.   అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.          ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.          ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-09-18 19:54:35

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 ల‌క్ష‌లు విరాళం..

హైద‌రాబాద్‌కు చెందిన రసున్ ఎక్స్‌‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్ర‌వారం ఉద‌యం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమ లలోని ఛైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డికి  సంస్థ ఎండి  కె.ర‌వీంద్రా‌రెడ్డి, కుమారుడు కె.సిద్ధార్ధ‌రెడ్డిలు విరాళం డిడిని అంద‌జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారికి సేవచేయాలనుకుని ఈ విరాళాన్ని అందించినట్టు పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్న దాతలు,  ఎస్వీ ప్రాణదాన ట్రస్టు సేవాలు భక్తులకు మరింతగా దగ్గర చేయాలని కోరారు. దాతల సూచనలు స్వీకరించి భక్తులకు పూర్తిస్థాయిలో సేవలు చేయడంతో ట్రస్టు ముందుంటుందని వారికి తెలియజేశారు.

Tirumala

2020-09-18 19:41:19

ఏయూకు ప్రతిష్టాత్మక ఐపిఆర్‌ ‌చెయిర్‌ ‌మంజూరు..

ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన మేధోహక్కుల పరిరక్షణ చెయిర్‌(ఐపిఆర్‌ ‌చెయిర్‌) ‌మంజూరయినట్లు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలి పారు. శుక్రవారం ఆయన ఏయూలో మీడియాతో మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, అతర్జాతీయ వాణిజ్య (డిపిఐఐటి) మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను ఏయూకు పంపింది. ఏడేళ్ల కాల పరిమితితో ఇది ఏయూలో ఏర్పాటు అవుతోంది. ఇప్పటి వరకు ఐపిఆర్‌ ‌చెయిర్‌ను జాతీయ సాంకేతిక విద్యా సంస్థలు(ఐఐటి), ఐఐఎంలు కలిగి ఉన్నాయి. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం ఏయూకు మంజూరైంది. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వ శాఖ హోలిస్టిక్‌ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ అకడమియా(ఎస్‌పిఆర్‌ఐహెచ్‌ఏ) ‌పథకంలో భాగంగా ఏయూకు ఐపిఆర్‌ ‌చెయిర్‌ను మంజూరు చేసింది. దీనికి అవసరమైన నిధులను సైతం కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ అందిస్తుంది. ఈ కేంద్రంలో ఒక ఆచార్యునితో పాటు ఇద్దరు రీసెర్చ్ అసిస్టెంట్లు, ఒక రీసెర్చ్ ‌స్కాలర్‌ను నియమించుకునే అవకాశం కలుగుతుంది. మేధోహక్కుల పరిరక్షణ, ఆవిష్కరణలు, పేటెంట్‌లు పొందడం వంటి అంశాలపై ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐపిఆర్‌ ‌చెయిర్‌ ‌మంజూరు కావడం పట్ల వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌, ఎం‌పీ వి.విజయ సాయి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక కేంద్రాలను ఏయూలో ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామన్నారు. జాతీయ స్థాయిలో నిపుణులతో కూడిన ముగ్గురు సభ్యుల బృదం త్వరలో ఐపిఆర్‌ ‌చెయిర్‌కు సంబంధించిన నియామకాలు జరుపుతుందన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఏయూవెబ్‌సైట్‌లో పొందు పరచడం జరుగుతోందన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-09-18 19:28:26

సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి 100 రోజులు..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లను కోవిడ్ బారి నుండి కాపాడి మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వహిస్తున్న సుంద‌ర‌కాండ పారాయణం శుక్ర‌వారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంది.  విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుంచి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. టిటిడి ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం  68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో  సుంద‌ర‌కాండ పారాయ‌ణం 100వ రోజు 15వ స‌ర్గ పూర్తి చేసుకుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ప‌ర్యా‌యాలు టిటిడి అఖండ పారాయ‌ణం నిర్వ‌హించింది. ఇందులో ప్ర‌థ‌మ స‌ర్గ నుండి 14వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 716 శ్లోకాల‌ను ప్ర‌ముఖ వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. ఇందులోని శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ‌ తాత్ప‌ర్యాల‌తో పాటు ఆ శ్లోక ఉచ్చా‌‌ర‌ణ వ‌ల‌న క‌లిగే ఫ‌లితం, నేటి ఆధునిక స‌మాజంలోని మాన‌వాళికి ఏవిధ‌‌మైన సందేశం ఇస్తుందో వివ‌రిస్తూ నిరంత‌రాయంగా పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు.           మొదటగా "యోగ‌వాశిస్టం - శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం" పారాయ‌ణాన్ని ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభమైన విష‌యం విదిత‌మే. ఎస్వీబీసీలో ఉద‌యం 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇళ్లలో పారాయ‌ణం చేస్తున్నారు.

Tirumala

2020-09-18 18:43:57

2020-09-18 13:27:22

శ్రీవారిని దర్శించుకున్న త‌మిళ‌నాడు గవర్నర్..

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితుల‌లో టిటిడి యాజ‌మాన్యం కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు చేసిన ద‌ర్శ‌న ఏర్పాట్ల‌ను త‌మిళ‌నాడు గవర్నర్‌ బన్వారిలాల్ పురోహిత్‌ కొనియాడారు. తిరుమల శ్రీవారిని శుక్ర‌‌వారం ఉద‌యం బ్రేక్ ద‌ర్శ‌నంలో త‌మిళ‌నాడు గవర్నర్‌ దర్శించుకున్నారు.  అనంత‌రం అద్ధాల‌ మండపంలో  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అద‌న‌పు ఈవో తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్ర‌తి మ‌నిషికి జీవితంలో మ‌హ‌త్త‌రమైన రోజు ఉంటుంద‌ని, ఈ రోజు త‌న జీవితంలో మ‌ర‌పురాని రోజ‌న్నారు. తాను దేశ వ్యా‌ప్తంగా అనేక ఆల‌యాల‌ను సందర్శించానని, అయితే ప్రతిరోజూ వేలాది మంది భ‌క్తులు తిరుమలను సందర్శించినప్పటికీ  ఇక్క‌డ అనుసరిస్తున్న పరిశుభ్రత,  పర్యావరణం చక్కగా ఉన్నాయని ఇందుకోసం కృషి చేస్తున్న టిటిడి అధికారులు, సిబ్బంది నిబద్ధత మరియు అంకితభావాన్ని కొనియాడారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు "భ‌క్తులకు భౌతిక దూరం మరియు ఇతర నిబంధనలతో దర్శనం, నిర్వహణ  చాలా బాగా అమలు చేయబడుతుంది" అని ఆయన అభినందించారు. నాద‌నీరాజ‌నం వేధిక‌పై సుందరకాండ పఠనంలో పాల్గొన్న ఆయన త‌న అనుభూతిని తెలుపుతూ  "నేను హనుమంతుని భక్తుడ‌ను, ప్రతిరోజూ హనుమాన్ చలీసాను పఠిస్తాము, సుందరకాండను కూడా చాలా సందర్భాలలో పఠించిన‌ట్లు తెలిపారు. మన హిందూ సనాతన ధర్మం, భార‌త‌దేశ సంస్కృతిని అద్భుతంగా భ‌క్తుల‌కు చేర‌వేస్తున్న సుంద‌ర‌కాండ పఠ‌నం 100వ‌ రోజు పాల్గొనడం ఒక విశేషంగా భావిస్తున్నామన్నారు. కోవిడ్ సంక్షోభ‌ సమయంలో లోక క‌ల్యాణార్థం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను చేపట్టి, నిర్వ‌హిస్తున్న‌టిటిడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను"అని ఆయ‌న అన్నారు.‌  ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవోబాలాజి పాల్గొన్నారు.

Tirumala

2020-09-18 13:26:23

సీఎం వైఎస్ జగన్ కు టిటిడి బ్రహ్మోత్సవ ఆహ్వానం

తిరుమలలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజ‌రు కావాల‌ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం సాయంత్రం తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో వీరు ముఖ్య‌మంత్రిని క‌లిశారు. ప్రతీఏటా స్వామివారికి జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పి స్తారు. అదేవిధంగా ఆనవాయితీగా ముఖ్యమంత్రిని టిటిడి ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. అందులోభాగంగనే టిటిడి చైర్మన్ తోపాటు, ఈఓ, అదనపు ఈఓలు సీఎంని వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఆరోజు సీఎం రాకకోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా టిటిడి చేపట్టింది. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tadepalle

2020-09-17 21:16:48