1 ENS Live Breaking News

ఎం పిల్లడో ఎల్దామొస్తవా అంటున్న వంగపండు గీతం..

ఏం పిల్లడో ఎల్దామొస్తవా అంటూ ప్రముఖ జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు పాడిన గీతాలు ఎందరినో ఆలోచింప జేస్తాయి. విశాఖలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంగపండు పాడిన చైతన్య గీతాలు ఎందరినో ఆలోచింపజేశాయి.

Visakhapatnam

2020-08-05 23:15:23

మన్యంలో అర్హులైన ప్రతీ గిరి రైతుకీ అటవీహక్కు పత్రాలు..

అర్హులైన గిరిజన రైతులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయా లని ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ఆయన పర్యటనలో భాగంగా బుధవారం జి.కె.వీధి పంచాయతీ గుమ్మల్లగొంది కాఫీ తోటలు పరిశీలించారు. కాఫీ రైతులు పొత్తూరి రాజారావు, కకూరి వెంకటరమణ కాఫీ తోటల్లో పర్యటించారు. కా ఫీ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు?ఏడాదికి కాఫీ, మిరియాలు సాగుపై వస్తున్న ఆదాయం ఐటీడీఏ ,గిరిజన సంక్షేమశాఖ అందిస్తు న్న ప్రోత్సాహకాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం చాపగెడ్డ ఎపి ఎఫ్ డి సి కాఫీ ఎస్టేట్ పరిశీలించారు. కాఫీ వీడింగ్ సస్యరక్షణ పనులు,కాఫీ దిగుబడి , అడిగి తెలుసుకొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగో పాల రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల ఏపిఎఫ్ డిసి అధికారు లు ,అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-05 22:10:38

జానపద కళారంగానికి వంగపండు తీరనిలోటు..గంట్ల

ఉత్తరాంధ్ర ఒక ఉత్తమ వాగ్గేయ కారుని కోల్పోయిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వంగపండు ప్రశాదరావు హఠాత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన  ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధించారు. ఈ సందర్భంగా శీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, వంగపండు ఎన్నో ఉద్యోమాలకు తన గొంతును పెకిలించారని అన్నారు. ఉత్తరాంధ్రా సమస్యలపై వంగపండు చేసిన గానం చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. అలాంటి మంచి మనిషి లేరనే విషయాన్ని కళారంగం కూడా జీర్ణించుకోలే కపోతుందని అన్నారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరులూదిన గొంతు మూగబోవడం చాలా విచారించదగ్గ విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రా కళారంగానికి ఆయన పేరుతో మంచి కార్యక్రమం చేపట్టి ఆయన బావజాలాన్ని అజరామరం చేయాలని శ్రీనుబాబు కోరారు.

Visakhapatnam

2020-08-04 17:47:02

కళారంగానికి వంగపండు తీరనిలోటు..పోలాకిశ్రీనివాసరావు

ఉత్తరాంధ్ర ఒక ఉత్తమ వాగ్గేయ కారుని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వంగపండు ప్రశాదరావు హఠాత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధించారు. ఈ సందర్భంగా విశాఖలో పోలాకి మీడియాతో మాట్లాడుతూ, వంగపండు ఎన్నో ఉద్యోమాలకు తన గొంతును పెకిలించారని అన్నారు. ఉత్తరాంధ్రా సమస్యలపై వంగపండు చేసిన గానం చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. అలాంటి మంచి మనిషి లేరనే విషయాన్ని కళారంగం కూడా జీర్ణించుకోలే కపోతుందని అన్నారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరులూదిన గొంతు మూగబోవడం చాలా విచారించదగ్గ విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రా కళారంగానికి ఆయన పేరుతో మంచి కార్యక్రమం చేపట్టి ఆయన బావజాలాన్ని అజరామరం చేయాలని పోలాకి శ్రీనివాస్ కోరారు.

Visakhapatnam

2020-08-04 17:22:31

కరోనావైరస్ పై మీడియా ద్వారా మరింత ప్రచారం చేయాలి..

కరోనాపై పోరులో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత మైన ప్రచారం కల్పించాలని సమాచార శాఖ కమిషనర్ టీ విజయ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల సమాచార శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూకరోనా పట్ల ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకో వాలి, కోవిడ్ బారినపడిన వారు తీసుకోవలసిన జాగ్రత్త లను పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలన్నారు. వార్తలను రాసేటప్పుడు మీడియా సమన్వయం పాటించే విధంగా సమాచా రాన్ని అందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదిస్తూ ప్రతిరోజు covid 19 సమాచా రాన్ని టీవీ పత్రిక విలేకరులకు అందించాలన్నారు. covid 19 అనుమానిత లక్షణాలున్న విలేకరులకు వైద్య పరీక్షలు చేయిం చడం, క్వారంటైన్, ఐసోలేషన్ ఆసుపత్రులలో లేదా హోమ్ క్వారంటైన్ లలో వైద్యం అందేలా సహాయం అందించాలన్నారు. అవసరమైన వారికి కోవిడ్ పరీక్షలు జరిపించాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న కోవిడ్ వైద్య పరీక్షలు, వైద్య సేవల పట్ల విలేకరులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నుండి జాయింట్ డైరెక్టర్ కస్తూరిబాయి, ఈ ఆర్ ఐ కృష్ణ రావు పాల్గొనగా, విశాఖపట్నం నుండి సమాచార శాఖ ఉపసంచాలకులు వి మణిరామ్, పి ఆర్ ఓ వెంకట రాజు గౌడ్, డివైఈ ఇంద్రావతి, డివిజినల్ పిఆర్ఓ సాయిబాబా, ఏపీ ఆర్ ఓ రాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-03 23:08:07

కరోనావైరస్ సమాచారానికి ప్రత్యేక వాట్సప్ నెంబర్లు...

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన వారం రోజులు గా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవు తున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పలు జిల్లాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటి స్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ పేషెంట్లకు అరగం టలో బెడ్ కేటాయించాలని చెప్పడమే కాకుండా.. ఎవరైనా నిరా కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది. కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది. వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి. *జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు ఇలా ఉన్నాయి. *శ్రీకాకుళం - 7995225220, విజయనగరం - 9491012012, విశాఖపట్టణం - 9000782783, తూర్పు గోదావరి - 9849903862, పశ్చిమ గోదావరి 9966553424, కృష్ణ - 9100997444, గుంటూరు - 9121008008, ప్రకాశం - 9063455577, నెల్లూరు - 9704501001, చిత్తూరు - 9491077099, అనంతపురం - 9493188891, కడప - 9849900960, కర్నూలు - 9849902412.* *నోడెల్ అధికారుల నెంబర్లు ఇవే..* *AMC, విశాఖపట్నం - 92466 16864* *SMC, విజయవాడ - 98484 36653* *SVIMS, తిరుపతి - 94935 47709* *GMC, అనంతపురం - 98494 99761* *GMC (RIMS), కడప - 92478 99544* *ఇట్లు* *పి.సాయికుమార్* *అసిస్టెంట్ డైరెక్టర్* *సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్.* *8008566613.* *చైర్మన్* *అభ్యుదయ ఎంప్లాయీస్* *అసోసియేషన్.* *ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ* *8008566613.*

Amaravati

2020-08-03 14:50:54

చారిత్ర‌క హజరత్ ద‌ర్గాల‌ను అభివ్రుద్ధి చేయాలి..

విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచిన నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ షా ఖాద్రి హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రి దర్గాలు అభివృద్ధి చేయాలని  మూస్లిమ్ పెర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్ష్యులు మహమ్మద్ అల్తాఫ్ ఆలీ రజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఒక లేఖలో కోరారు.  నేటి ఉదయం విడుదల చేసిన ఆ లేఖలో. విజయవాడ దుర్గా ఫ్లైఓవర్ కింద ఉన్న ఈ రెండు దర్గాలు గత ప్రభుత్వం నిర్దాక్షిణంగా చీకట్లో తొలగించి  ఘోరమైన తప్పు చేసి  ముస్లింల మనోభావాలని తీవ్రముగా గాయపరచిందన్నారు. ముస్లింలు  అనేక ఆందోళన కార్యక్రమాలు చేయటం తోపాటు  న్యాయస్థానం దాకా కూడా వెళ్లటంతో చివరకి దర్గాలను మాత్రం వదిలి చుట్టుపక్కల ఉన్న స్థలం మొత్తం తీసుకుని ఎటువంటి పరిష్కారం చేయకుండా కుట్రపూరితంగా ముస్లిం మనోభావాలను నాటి ప్రభుత్వం దెబ్బతీసినట్లు  ఆరోపించారు.    చివరకి  ఆనాడు ప్రజలు ఆగ్రహించడంతో 68 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు  తీసుకున్న స్థలానికి   నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్‌  చేయటం జరిగిందని రజా పేర్కొన్నారు.    విజయవాడ నగరంలో ఈ దర్గా అర్ధరాత్రి పూట తొలగించాలని గత ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా దర్గాపై నుండి ఫ్లైవర్ నిర్మాణం చేపట్టం జరిగింది ,ఈ దర్గా పలువురు హిందూ ముస్లింలకు సెంటిమెంట్ గా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దర్గా అని,నిరంకుశంగా దేవాలయాలు దర్గాలు  తొలగించిన గత ప్రభుత్వం ఆనాటి  నుండే పతనం మొదలైందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నారు.   గతంలో విజయవాడ నగరంలో జలదీక్ష చేసినప్పుడు ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ దర్గాను సందర్శించి పూజలందుకోవడం ఆనాటి నుంచి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నోసార్లు ఆ దర్గా వేదికగా తమరొస్తే పూర్తిగా న్యాయం జరుగుతుందని విశ్వాసంతో ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహించడం జరిగిందని, కనుక ఈ దర్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని  బలమైన నమ్మకంతో తమ దృష్టికి తెస్తున్నామని,  బాబా గారి ఆశీస్సులు మీకు ప్రభుత్వానికి మీ కుటుంబ సభ్యులకు కలగాలని ప్రార్థిస్తున్నాం అని పేర్కొన్నారు.     ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ ట్రిబ్యునల్  లేకపోవటంతో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆక్రమణదారులు యథేచ్ఛగా భారీ నిర్మాణాలు అక్రమ కట్టడాలు చేయటం జరుగుతుందని,కనుక వెంటనే   వక్ఫ్ ట్రిబునల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ ఆస్తులు  పూర్తిగా సర్వే చేయించి వక్ఫ్ గజిట్ ప్రకారంగా రెవెన్యూ, పంచాయతీ అన్ని శాఖల సంబంధించిన కార్యాలయాల్లో పూర్తి వివరాలు గ్రామాలలో ఏ గ్రామాలలో ఏ సర్వే నెంబర్ లో ఎన్ని వక్ఫ్ ఆస్తులు  ఉన్నాయో పూర్తి సమాచారం గ్రామ సచివాలయాల్లో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని అందుకు ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వక్ఫ్ బోర్డు  ఆస్తుల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని రజా వివరించారు.    పవర్ ప్లాంట్ ,ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తదితర  కంపెనీల పేరుతో   వక్ఫ్ బోర్డు  భూములు ఎక్వెరు చేసి ఉన్నారు ,కానీ సంబంధింత ముతవల్లి ముజావర్లు ఉద్యోగ అవకాశాలు గానీ లబ్ధి గానీ జరగలేదు దీని వలన మసీదులు దర్గాలు పంజాల భూములు కోల్పోవటంతో చాలా పంజాలు దర్గాలు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ దీపం వెలిగించే పరిస్థితి కూడా లేదని, ఆనాడు ఎకరం రెండు వేలు నుండి అయిదు వేలకు సుమారు తీసుకోవటం తో  ఆంధ్రప్రదేశ్ లో కోట్లాది రూపాయల విలువ చేసే, వేలాది ఎకరాలు ఆయా కంపెనీల చేతిలో ఉన్నాయి. కనుక, నాయక దర్గా మసీదు పంజా బోర్డు భూములు తీసుకున్నటువంటి ప్రైవేట్ మరియు ప్రభుత్వరంగ సంస్థల దగ్గర నుండి ఉద్యోగ అవకాశాలు తోపాటు ఆ దర్గాలకు మసీదులకు లాభం చేసేవిధంగా ఆ సంస్థల ద్వారా లాభం చేకూర్చే విధంగా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో లీజు పద్ధతిగా అయినా మార్చాలని కోరుతున్నామన్నారు. అలాగే వక్ఫ్  బోర్డు సిబ్బంది చాలా తక్కువగా ఉండటం ఆస్తులు కాపాడే పరిస్థితి కనబడటం లేదు వక్ఫ్  బోర్డు సిబ్బందిని కూడా పెంచాలని జిల్లాకు నలుగురు ఇన్స్పెక్టర్లు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం రాష్ట్ర వక్ఫ్  బోర్డు కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని మరియు వక్ఫ్  అధికారులకు వారి ఆస్తులు కాపాడే విధంగా  పవర్స్  ఉండాలని,అలాగే ఇమాం మేుజనలకు ఇళ్ల స్థలాలు నెలవారి వేతనాలు త్వరగా చెల్లించాలని ,మదర్సా బోర్డు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ అరబీ తో పాటు అన్నీ నేర్చుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాము, హైదరాబాద్ మక్కా మసీదు లాంటి భారీ స్థాయిలో మసీదు హజ్ హౌస్ మూడు రాజధానిలో కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నము     కొండపల్లి లోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ లో ఉన్న హజరత్ సయ్యద్ షా బుఖారీ  దర్గా చాలా ప్రాముఖ్యత ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక మరియు మత సామరస్యానికి నిదర్శనమైన నాలుగు వందల యాభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దర్గా ,ఇక్కడ రోజూ నిత్యన్నదాన కార్యక్రమంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా   ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దర్గా ఆనాడు వీటీపీఎస్ వారు నామమాత్రపు బ్రిడ్జ్  ఏర్పాటు చేసి ఉన్నారు భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో బిడ్జి సరిపోవటం లేదు ఉర్సు మహోత్సవానికి సుమారు లక్ష మంది భక్తులు వస్తుంటారు ఆ సమయం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే చిన్న పిల్లలు ముసలి వాళ్లు దర్గా లో మొక్కులు చెల్లించడం కోసం కోసం గాని వంటా వార్పు చేసుకుండా గాని చాలా ఇబ్బంది కరంగా ఉంటున్నందున బిడ్జి వెడల్పు చేయడమే కాకుండా ఆటో రిక్షా కనీసం లోపలకు వెళ్లే విధంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నామని మహ్మద్ అల్తాఫ్ ఆలీ రజా కోరారు.

Vijayawada

2020-08-03 14:25:33

ఇక అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ అథారిటీ...

అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమ ల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండ బోదని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా పాలక కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా ఉండనున్నారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.

Amaravati

2020-08-02 17:51:20

షిపియార్డు మృతులకి రూ.50లక్షలు నష్టపరిహారం:మంత్రి

హిందుస్థాన్ షిప్ యార్డ్ లో శనివారం జరిగిన క్రేన్ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ 50 లక్షలు ఎక్స్ గ్రేషియా కంపెనీ చెల్లిస్తుందని పర్యాటక శాఖ మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాస రావు తెలిపారు. ఆయన ఆదివారం ఉదయం విజయవాడ నుండి హుటాహుటిన బయలుదేరి నేరుగా హిందు స్థాన్ షిప్ యార్డ్ చేరు కున్నారు. క్రేన్ ప్రమాదం గురించి ఆయనకు షిప్ యార్డ్ సి.ఎం.డి శరత్ బాబు సంఘటనా స్థలంలో వివరించారు. మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు ట్రేడ్ యూనియన్ నాయకులు అధికారు లను కూడా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనం తరం నిర్వహించిన సమావేశంలో అధికారులు ట్రేడ్ యూనియన్ నాయకులు బాధిత కుటుంబాల వారితో చర్చించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్మాగారం ప్రమాదాలు జరగకుండా ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. ఈ సంస్థలో పని చేస్తున్న కార్మికులందరి ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. ఇటువంటి ఆకస్మిక దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలన్నారు. దేశాభివృద్ధికి పారిశ్రామిక పురోగతి అవసరమే కానీ దాని కన్నా మనిషి ప్రాణం ఎంతో విలువైనది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన సహాయ చర్యలు, బాధిత కుటుంబాలు కోరిన విధంగా మరింత నష్టపరిహారాన్ని వారికి అందించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ సీఎం డి ఎల్.వి.శరత్ బాబు మాట్లాడుతూ సంస్థ తీవ్రమైన నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా మృతుల కుటుంబాలకు రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా ను కంపెనీ చెల్లిస్తుందని ప్రకటించారు. కంపెనీకి చెందిన శాశ్వత సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బందికి కంపెనీ పరంగా రావలసిన దానికి ఇది అదనంగా చెల్లిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు షిప్ యార్డ్ లో చిన్న ప్రమాద సంఘటన కూడా జరగలేదని తెలిపారు. కొత్తగా వచ్చిన క్రేన్ ను ట్రైల్స్ వేస్తుండగా ఆఖరి ట్రైల్ ముగుస్తుందనగా ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టమని, భద్రతా చర్యలు మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. కంపెనీ ప్రకటించిన ఎక్స్గ్రేషియా పట్ల అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాసరావు తక్షణం స్పందించి జిల్లా కలెక్టర్ అధికారులను పంపించారని అదేవిధంగా ఈరోజు ఉదయం నేరుగా ప్రమాద స్థలానికి వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని మంత్రిని కోరారు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్ కార్మికుల పట్ల మంత్రి చూపిన చొరవను కొనియాడారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ 3 ఆర్.గోవిందరావు, అడిషనల్ సీపీ సురేష్ బాబు, ఆ ర్డీవో కె. పెంచల కిషోర్, పరిశ్రమల శాఖ ఏడి రామలింగరాజు, షిప్ యార్డ్ అధికారులు, వైయస్సార్ టి యు సి చంటి బాబు, ఐ ఎన్ టి యు సి ఎం రాము, టీ.రాము, టిఎన్టియుసి జి నర్సింగరావు సీఐటీయూ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-02 17:33:53

కరోనా రోగులు సేవాభారతి సేవలు పొందవచ్చు...కొప్పల

కరోనా వైరస్ తో బాధపడే ప్రజలు సేవా భారతి కోవిడ్ ఆన్లైన్ హెల్ప్ లైన్ సర్వీసులు సద్వినియోగం చేసుకొని వైరస్ నుంచి బయటపడాలని విశాఖ సీనియర్ బిజెపి నాయకులు కొప్పల రామ్ కుమార్ తెలియజేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఈ కాల్సెంటర్ ద్వారా 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి కరోనా వైరస్ సంబంధించిన వైద్య సలహాలు, మందులు వాడే విధానం తెలియజేస్తారని అన్నారు. ప్రజల సౌకర్యార్థం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కాల్ సెంటర్ ను సద్వినియోగం చేసుకొని కరోనా వైరస్ నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రామ్ కుమార్ కోరారు. వైరస్ నుంచి విముక్తి పొందాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంస్థ ఆన్ లైన్ సేవలు ప్రతీ ఒక్కరికీ చేరే విధంగా పార్టీ కేడర్ కృషి చేయాలన్నారు.

2020-08-01 19:05:50

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు సువర్ణ అధ్యాయం

విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ఒక సువర్ణ అధ్యాయమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రా అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ లో శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని కావడం తధ్యమని భావించిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు వేసి కార్యరూపంలోకి తీసుకు వచ్చారన్నారు. ఈ విషయంలో మూడు రాజధానులు బిల్లుకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నివర్గాలు రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలన్న అమర్ ఇచ్చిన మాటకు సీఎం వైఎస్ జగన్ ఎంత హుందాగా కట్టుబడి ఉంటారో మరోమారు రుజువైందని చెప్పారు.

2020-08-01 18:46:59

కరోనా వైరస్ తో మాజీ మంత్రి మాణిక్యాలరావు ముృతి..

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనా వైరస్ కి గురై ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో బీజేపీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా 2014 నుంచి 2018 వరకూ ఆయన పనిచేశారు. కరోనాతో మాజీ మంత్రి మృతిచెందటం పట్ల విశాఖలోని యువజన విభాగం నాయకులు కొప్పల రామ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వైరస్ తీవ్రతను ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు.

2020-08-01 18:01:24

విశాఖను పరిపాలనా రాజధాని చేయడంపట్ల గంట్ల హర్షం

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం పట్ల జాతీయ జర్నలి స్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీ నుబా బు హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధిని చేపట్టడం కోసం ప్రవేశపెట్టిన మూడు రాజధానులు బిల్లు గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేయడం శుభపరిణామమన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని గా మారడం పట్ల జర్నలిస్టుల భాద్యత కూడా మరింత పెరిగింద న్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధిని శరవేగంగా జరగడా నికి మూడు రాజధానులు బిల్లు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ క్రమంలో ప్రధాన సమస్యలపై మంచి మంచి కధనాలు అందించి రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టులు కూడా భాగస్వాములు కావాలని గంట్ల శ్రీనుబాబు కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరిం చాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జర్నలిస్టుల న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.

Visakhapatnam

2020-08-01 09:54:32

ఇక విశాఖ పరిపాలనా రాజధాని..గవర్నర్ ఆమోదముద్ర

వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రా జధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమో ద ముద్ర వేశారు. దీంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఆ మో దించారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటుకానుంది. శాశన రాజధానిగా అమరావతి, జ్యూడీ షియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి. జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో, మూడు వారాల కింద ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.

Visakhapatnam

2020-07-31 22:06:55

తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో శ్రావణ వరలక్ష్మీ పూజలు

తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ వరలక్ష్మి పూజా వ్రత కల్పం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచే అమ్మవారికి కావలసిన పూజ సామాగ్రి తో ఇళ్లల్లో ఆ వరలక్ష్మి దేవి పూజ విధానాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మరోవైపు టిటిడి కూడా ఈ పూజా విధానాన్ని ఏవిధంగా చేయాలో ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని అందించింది. భక్తులు పూజా విధానాన్ని చూస్తూ పెద్దఎత్తున పూజ జరుపుకున్నారు కుటుంబ సభ్యులు. పిల్లలు సతి సమేతంగా శ్రావణ వరలక్ష్మి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారికి తీర్ధ ప్రసాదాలు సమర్పించారు. అనంతరం ముత్తయిదవులను పిలిచి సామాజిక దూరం పాటిస్తూ వాయినాలు సమర్పించారు.. అటు తెల్లవారుజామున 5 గంటల నుంచే గ్రామాల్లో ఆలయాలన్ని భక్తులతో సందడిగా కనిపించాయి.

Anakapalle

2020-07-31 12:23:00