శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవితో మురళి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్థభం వరకు స్వామివారిని చిన్న శేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, శేఖర్రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్రవ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. సచివాలయం లో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయపం పరీక్షవిజయవంతంగాగా జరిగిందని, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్త అయ్యాయన్నారు. అభ్యర్ధులు నిర్ధేశించిన సమాయానికవ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్ధల కోసం మంచినీరు, మందులు, పారామెడికల్ సిబ్బంది సేవలు అన్నీ అంబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో పల్స్ ఆక్సీ మీటరు ద్వారా టెంపరేచర్ పరీక్షలు చేసిన తరువాతే అభ్యర్ధులను లోనికి అనుమతిస్తామని చెప్పిన ఆయన ఆలస్యానికి అభ్యర్ధులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు.
గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కొరకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతల నుండి కొన్నింటిని తొలగించినట్లు ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏదై నా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు గుర్తించిన 4 సంవత్సరాల బిఎస్సి(హార్టికల్చర్), లేదా వైఎస్సార్ ఉద్యా న యూనివర్సిటీ నుండి 2 సంవత్సరాల డిప్లొమో(హార్టికల్చర్) పూర్తిచేసినవారు మాత్రమే అర్హులని,ఇవి గాక మరే అర్హతలున్నా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోమని ఆయన వివరించారు. నియామకంలో భాగంగా ఈ నెల 25 న నిర్వహించనున్న పరీక్షలకు మిగతా అర్హతలున్నవారు ఒక వేళ హాజరై పరీక్ష రాసినా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోమని, అభ్యర్థులందరూ ఈ విషయం గమనించాలని కమిషనర్ చిరంజీవి చౌదరి కోరారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. గోవిందాచార్యులు కంకణభట్టర్గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్తమరుత్తులను(దేవతాపురుషులు), రుషిగణాన్ని, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాళ్వార్ ధ్వజస్తంభాన్ని అధిరోహిస్తారని ప్రాశస్త్యం. విశ్వమంతా గరుడుడు వ్యాపించి ఉంటారు. ఆయన్ను శ్రీనివాసుడు వాహనంగా చేసుకోవడంతో సర్వాంతర్యామిగా స్వామివారు కీర్తించబడుతున్నారు. కాగా, ధ్వజపటంపై గరుడునితోపాటు సూర్యచంద్రులకు కూడా స్థానం కల్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పెసరపప్పు అన్నం(ముద్గర) ప్రసాద వినియోగం జరిగింది. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంపదలు సమకూరుతాయని విశ్వాసం. అదేవిధంగా, ధ్వజస్తంభానికి కట్టిన దర్భ అమృతత్వానికి ప్రతీక. పంచభూతాలు, సప్తమరుత్తులు కలిపి 12 మంది దీనికి అధిష్టాన దేవతలు. ఇది సకలదోషాలను హరిస్తుంది. దర్భను కోసేటప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేటపుడు ధన్వంతరి మంత్ర పారాయణం చేస్తారు. ధ్వజారోహణం అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు.
ధ్వజారోహణ ఘట్టానికి ముందుకు సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, కుమారగురు, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా రోజూ వచ్చే వేలాది మంది భక్తులను డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ప్రశ్నించారు. మీడియా అడిగిన మేరకు మాత్రమే మాట్లాడుతున్నానని చైర్మన్ చెప్పారు. సోనియా గాంధీ, దివంగత సిఎం డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మాత్రమే నేను చెప్పానని స్పష్టం చేశారు.. అందువల్ల ముఖ్యమంత్రి వైఎస్.జగ న్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. టిటిడి చట్టంలోని రూల్ : 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. స్వామివారి దర్శనం చేసుకోదలచిన ఇతర మతస్తులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతకు తాము డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ : 137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే (ఉదాహరణకు ఏసయ్య, అహ్మద్, సర్దార్ సింగ్ ఇలాంటి ఇతరత్రా పేర్లు లేదా వారి శరీరం మీద ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్నాకే తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారని గుర్తుచేశారు. పాదయాత్ర ముగిశాక తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారన్న చైర్మన్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు.. సీఎం వైఎస్ జగన్ కు శ్రీవేంకటేశ్వరస్వామివారి మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదని సబ్బారెడ్డి స్పష్టం చేశారు.
కేన్సర్ వ్యాధికి చికిత్సను రూపొందించే లక్ష్యంతో ఆయుర్వేదంలో పరిశోధనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. స్వతంత్ర ప్రతిపత్తిగల ఆయుర్వేద శాస్త్ర కేంద్ర పరిశోధన మండలి (సి.సి.ఆర్.ఎస్.)ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయుర్వేద ఆరోగ్య రక్షణ సేవల్లో పరిశోధన చేయడాానికి ఈ మండలికి పూర్తిస్థాయి అధికారాలను కూడా ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన సూచనలు ఆధారంగా పరిధోనలు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. అవి వరుసగా..కేన్సర్ రోగుల జీవిత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆయుష్ క్యుఒఎల్ 2సి ని రూపొందించడం, గర్భాశయ కేన్సర్ కు స్వతస్సిద్ధమైన చికిత్సగా కార్క్ టోల్ ను రూపొందించడం, ఆయుర్వేదం ద్వారా కేన్సర్ చికిత్సా పద్ధతులతో వ్యవస్థీకృతంగా సమగ్రమైన విధానాన్ని రూపొందించడం, కేన్సర్ నిర్ముూలకాలుగా ఔషధ మొక్కలు ఎలా పనిచేస్తాయన్నదానిపై పరీక్షలు జరపడం. అంతేకాకుండా ఆయుర్వేద చికిత్స పద్ధతులు ద్వారా వ్యవస్థీకృత సమీక్ష, గణాంక విశ్లేషణ; చికిత్సా విధానాన్ని పాటిస్తున్న వైద్యుల, సంస్థలనుంచి సమాచారాన్ని ప్రమాణ పత్రాలతో నమోదు చేయడంతోపాటు కేన్సర్ పై ఆయుర్వేద పరిశోధనలో భాగంగా కేన్సర్ అధ్యయనంపై సమగ్ర కేంద్రం (సి.ఐ.ఒ.) ఏర్పాటు చేశారు. అఖిల భారత ఆయుర్వేద శాస్త్ర అధ్యయన సంస్థ (ఎ.ఐ.ఐ.ఎ.), జాతీయ కేన్సర్ నిరోధక, పరిశోధన సంస్థ (ఎన్.ఐ.సి.పి.ఆర్.-ఐ.సి.ఎం.ఆర్.)ల ఉమ్మడి సంస్థగా సి.ఐ.ఒ.స్థాపన జరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ లోక్ సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలియజేశారు.
రాష్ట్రంలో కొందరు రాజకీయ పార్టీల ముసుగులో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మచ్చ తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో కమిషనర్ పి. అర్జునరావు అధ్యక్షతన దేవదాయ శాఖ అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మట్లాడుతూ, ఇటీవల హిందూ దేవాలయాలపై జరుగుతున్న కుట్రలను చేధిద్దామని మంత్రి పిలుపు నిచ్చారు. అందరం కలిసి పనిచేద్దాం మన దేవాలయాలను అభివృద్ది చేద్దాం అనిపిలుపిచ్చారు. కావాలనే కొందరు పనిగట్టుకుని దేవాలయాలపై రాజకీయం చేయాలని కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అన్ని జిల్లాల్లో పనిచేసే అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటి కమిషనర్, రిజనల్ జాయింట్ కమిషనర్ లు తరుచుగా తమ పరిధిలోని గ్రామలు పర్యటించి ఆయా గ్రామ కమిటీలతోను,స్థానికులను సమావేశ పరచి వారి అభిప్రాయలను సూచనలను పాటిస్తూ దేవాలయాల అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఇందులో అందరు భాగస్వాములు కావాలన్నారు. అదేవిదంగా దేవాలయాలు, ప్రాంగణం, మరియు రధాల భద్రత విషయంలో ఏర్పాటు చేసే సీసీ కెమెరా నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్నారు. దేవాలయాల భద్రత విషయంలో స్థానికులు, పోలీసుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. భద్రత విషయంలో ఎటువంటి అలసత్వం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దేవాలయల కు అనుబంధంగా ఉన్న అతిధి గృహాలను పర్యవేక్షించాలన్నారు. శుభత్రను పాటించాలన్నారు. మీడియా సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జున రావు, అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమెహన్, ఎస్.ఈ శ్రీనివాసరావు తో పాటు 13 జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, 4గురు డిప్యూటి కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గోన్నారు.