1 ENS Live Breaking News

టిటిడికి రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ విరాళం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ ను శనివారం టిటిడికి విరాళంగా అందజేసిం ది.  ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఛైర్మన్  దినేష్ కుమార్ ఖార అంబులెన్స్ తాళాలను టిటిడి ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. స్విమ్స్ ఆసు పత్రిలో ఈ అంబులెన్స్ ను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో  నరసింహ కిషోర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, డిఐ జానకిరామిరెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2023-01-07 11:28:42

జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. ఈ మేరకు మీడియాకి టిటిడి ప్రకటన విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్ధం స్వామివారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. సంబంధిత గుర్తింపు పత్రాలు, వివరాలు జోడించి ప్రత్యేక దర్శన టిక్కట్లును కొనుగోలుచేసుకోవచ్చునని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని మీడియాకివిడుదల చేసిన ప్రకటనలో కోరింది.

Tirumala

2023-01-06 16:28:29

యాగానికి హర్యానా సీఎంకు శారదాపీఠం ఆహ్వానం

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి శుక్రవారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసారు. ఢిల్లీ శివారు గుర్గావ్ లో పీడబ్ల్యూడీ బంగ్లాకు వెళ్ళి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగంనిర్వహిస్తు న్నామని తెలిపారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో లక్ష సార్లు ఆవాహనం జరుగుతుందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని అన్నారు. అలాగే హర్యానాలో కురుక్షేత్ర వద్ద గుంతిధామ్ లో ఫిబ్రవరి 11 నుండి 16 రోజులపాటు లక్ష చండీ యాగం నిర్వహిస్తున్నట్లు వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో సాగే యాగంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, యాగ నిర్వహణకు సహకరించాలని హర్యానా సీఎం ఖట్టర్ ను కోరారు.

Haryana

2023-01-06 09:22:19

ఏపీకి అప్పుఇస్తే ఇకఅంతే సంగతులు తిరిగి రావు

ఆంధ్రప్రదేశ్ కి అప్పు ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీలో అప్పులు భారీగా పెరిగిపోయాయని. రాష్ట్రం చెల్లించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. నాబార్డ్, విదేశీ రుణాలు, ఎస్పీవీ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు రూ.9.03 లక్షల కోట్లకు చేరిందని, ఇది జీడీపీలో 75శాతమని అన్నారు. పరిమితిమి మించి అప్పులు చేసినందున, వాటిని సర్దుబాటు చేసేవరకు కొత్త అప్పులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వం చేసిన మొత్తం అంతా అభివృద్ధికి కాకుండా నగదు బదిలీలకే వినియోగిస్తుందన్నారు.భారీగా అప్పులున్న రాష్ట్రాలకు అప్పులు ఇవ్వకూడదని పేర్కొన్నారు.

New Delhi

2023-01-06 02:38:51

వారణాసి రైల్వే స్టేషన్ FSSAI5-స్టార్ రేటింగ్

వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ FSSAI ద్వారా 5-స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్‌తో పాటు ‘ఈట్ రైట్ స్టేషన్’ గుర్తింపు పొందింది. ప్రయాణీకులకు సురక్షితమైన ,ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో బెంచ్‌మార్క్‌లను సెట్ చేసే రైల్వే స్టేషన్‌లకు 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్ అందించారు. కాగా ఇప్పటి వరకూ స్టార్ సర్టిఫికేషన్ ఉన్న ఇతర రైల్వే స్టేషన్లలో ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ (ఢిల్లీ), ఛత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై), ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, (ముంబై), వడోదర రైల్వే స్టేషన్, చండీగఢ్ రైల్వే స్టేషన్, భోపాల్ రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ఇపుడు వాటి సరసన వారణాసి రైల్వే స్టేషన్ కూడా చేరింది.

Varanasi

2023-01-05 14:58:11

దేశవ్యాప్తంగా 188 కోవిడ్-19 కేసులు నమోదు

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాను ఇప్పటివరకూ మొత్తం 220.12 కోట్ల డోసులు ( 95.13 కోట్ల రెండో డోసులు + 22.42 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) పంపిణీ చేశారు. గత 24 గంటల్లో 61,828 డోసులు అందించగా.., దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,554 నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01% మాత్రమే. ప్రస్తుత రికవరీ రేటు 98.80%గా ఉంది. గత 24 గంటల్లో 201 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,46,055 కు పెరిగింది. 188 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.10%నా మోదు అవుతోంది. గత 24 గంటల్లో చేసిన 1,93,051 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.15 కోట్ల పరీక్షలు చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులిటిన్ ద్వారా ప్రకటించింది.   

Delhi

2023-01-05 13:55:57

వై 20 సభలపై థీమ్ లోగో, వైబ్ సైట్ ఆవిష్కరణ

భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న వై20 సమ్మిట్ ఇండియా శిఖరాగ్ర సమావేశాల కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆవిష్కరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం, మెరుగైన రేపటి కోసం ఆలోచనలు చర్చించడం, కార్యాచరణ కోసం ప్రణాళిక రూపొందించే అంశంపై ప్రధానంగా భారత్ దృష్టి సారించనుంది. అంతేకాకుండారాబోయే 8 నెలల పాటు  భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వివిధ అంశాలపై  చర్చలు, సెమినార్ల నిర్వహించనుంది.

New Delhi

2023-01-05 13:42:20

భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీఅయిన సత్యానాదేళ్ల

భారత ప్రధాని నరేంద్రమోదీ మైక్రోసాఫ్ట్  కార్పొరేశన్  చైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ళ తో గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగాభారత్ లో సాంకేతిక విజ్ఞానం నాయకత్వ వృద్ధిలో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు మైక్కోసాఫ్ట్ వంటి టెక్నాలజీ సంస్థల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. కాగా వీరిద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అదే సమయంలో సత్యానాదెళ్లతో భేటీ కావడం ఆనందంగా వుందంటూ ప్రధాని ఆయనకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ లో పెట్టుబడులు మైక్రోసాఫ్ట్ పెట్టనుందనే నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశం అవుతోంది.

New Delhi

2023-01-05 13:15:30

జాతీయపార్టీ గుర్తింపు దిశగా వైఎస్సా్ర్సీపీ కీలక అడుగులు

వైఎస్సార్సీపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సుమారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్ధులను నిలబెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కి ఆనుకొని ఉన్నరాష్ట్రాలే కావడం విశేషం. దానికోసం అధికారంలో వున్న పార్టీకి వచ్చే రాజ్యసభ సీట్లన్నీ అయా రాష్ట్రాల్లోని పలుకుబడి ఉన్న రాజకీయ నేతలకు కట్టబెట్టి, పార్టీ తరపున అభ్యర్ధులను బరిలో నిలబెట్టడం కోసి ఇప్పటికే ఆయారాష్ట్రాల్లోని ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఒక కాగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం(ఈ నిబంధనను కాలానుగుణంగా మారుస్తున్నారు)  చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. 

ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను 
గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం నాలుగు  రాష్ట్రాల్లో వైఎస్సార్సీపీ బలమైన అభ్యర్ధులను నిలబెట్టాల్సి వుంది..!



New Delhi

2023-01-05 07:26:06

ఇక ఆధార్ కార్డు నవీకరణ మరింత సులువు

ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం చేసింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు  భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ ఆధార్ అడ్రస్ అప్ డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ తమపేరు మీద ధ్రువీకరణపత్రం సమర్పించేవారు. కాగా ఆధార్ లో అడ్రస్ మార్చుకునేందుకు కుటుంబ పెద్ద పేరుతో ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ఒకవేళ అది సరైంది కాకుంటే ఉడాయ్ సూచించిన పద్ధతిలో కుటుంబ పెద్ద స్వీయ ధ్రువీకరణ సమర్పించాలి. ఆధార్ అప్డేటేషన్ లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నూతన మార్పులను చేపట్టింది.

Delhi

2023-01-04 04:22:48

బీఆర్ఎస్ కి జాతీయ హోదా కోసం విశ్వప్రయత్నాలు

భారతీయ రాష్ట్ర సమితి 2024 నాటికే జాతీయపార్టీ హోదా తెచ్చుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వే స్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో తమపార్టీని విస్త్రుతం చేసేందుకు రాష్ట్రాధ్యక్షుడిని నిలబెట్టడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను కూడా బరిలోకి దించే ప్రయత్నాలు ఇప్పటి నుంచే  ప్రారంభించింది. సాధ్యమైనంత త్వరతగా బీఆర్ఎస్ కి జాతీయ పార్టీ హోదావస్తే బీజేపీని ఢీకొట్టాలన్నది బీఆర్ఎస్ ఎత్తుగడగా కనిపిస్తుంది. కాగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం(ఈ నిబంధనను కాలానుగుణంగా మారుస్తున్నారు)  

చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం ఐదు నుంచి ఆరు రాష్ట్రాల్లో భీఆర్ ఎస్ ను బలంగా నిలబెట్టాల్సి వుంది..!

Delhi

2023-01-03 03:53:14

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు 4% పెరిగిన డీఏ

తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం 34% ఉన్న డీఏను ప్రభుత్వం 38%కి పెంచుతున్నట్టు తెలియజేశారు. దీనితో ఉద్యోగ, పెన్షనర్లలో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ పెంపుతో ప్రభుత్వంపై దాదాపు 
రూ.2359 కోట్ల అదనపు భారం పడుతుందన్న సీఎం ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 16 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షను దారులు ఉండగా నిలవాలని కోరారు. 

Chennai

2023-01-03 02:13:04

భారత్ లో 48,624 ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియాలో భారీగా అకౌంట్లను సస్పెండ్ చేసింది. చాలా ఖాతాలు న్యూడిటీ(అస్లీలత), పిల్లల లైంగిక దోపిడీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయంటూ 48,624 ట్విట్టర్ ఖాతాలపై యాజమాన్యం వేటు వేసింది. ఈ అకౌంట్లు అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య కాలంలో ట్విట్టర్ నియమాలను ఉల్లంఘించినట్లుగా వివరణ ఇచ్చింది. వినియోగదారుల నుంచి సదరు ఖాతాలతపై 755 ఫిర్యాదులు అందాయని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అంతేకాకుండా ప్రజామోదం లేని ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

New Delhi

2023-01-02 09:17:27

నోట్ల రద్దు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నరేంద్రమోడీ ప్రభుత్వం 2016లో నోట్లు రద్దు విషయంలో దాఖలైన 58 పిటీషన్లపై సుప్రీంకోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 26(2) ప్రకారం నోట్లను రద్దు చేసే అధికారం ఉందని, దానిని కోర్టు సమర్ధిస్తున్నదని పేర్కొంది. దీనితో నోట్ల రద్దు వ్యతిరేకం గా దాఖలైన  పిటీషన్లకు సుదీర్ఘ కాలం తరువాత ఉపయోగం లేకుండా పోయింది. గతంలో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరగడం తోపాటు, ప్రభుత్వంపైనా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నేడు సుప్రీకోర్టు తీర్పుతో నోట్లు రద్దు మళ్లీ జరగవచ్చుననే చర్చకు ఊతమొచ్చింది.

New Delhi

2023-01-02 06:14:46

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్ల మెల్లగా పుంజుకుంటున్నాయి. ఆదివారం 2,748 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 7 పాజిటివ్ కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనించింది.. ఇవాళ 9 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 99.50 శాతంగా ఉంది. ఈరోజు మళ్లీ హైదరాబాద్ లో 6, మేడ్చల్ జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బులిటిన్ ద్వారా తెలియజేయజేసింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.

Hyderabad

2023-01-01 16:43:05