1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంగల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం అర్ధ రాత్రి వరకూ 59,695 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.06 కోట్లు వచ్చింది. ఇంకా 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-01-28 02:49:24

తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ మొబైల్‌ యాప్‌ ప్రారంభం


భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి అన్నమయ్య భవన్ లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చని చెప్పారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చని తెలిపారు.

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జియో సంస్థ సహకారంతో  టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని  పొందుపరుస్తామని చెప్పారు.


భక్తులకు డిజిటల్‌ గేట్‌ వే : టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి
భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటిపి ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చెప్పారు. కంప్యూటర్‌ వాడడం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో  వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహకిషోర్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌  అనీష్‌ షా, ఐటి సలహాదారు  అమర్‌, ఐటి జిఎం  సందీప్‌, యాప్‌ను రూపొందించిన బృందం పాల్గొన్నారు.

Tirumala

2023-01-27 08:41:08

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 58,379 మంది

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని గురువారం అర్ధ రాత్రి వరకూ 58,379 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.73 కోట్లు వచ్చింది. ఇంకా రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-01-27 03:03:10

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కు ఎన్నికైన ఏడీజి అతుల్ సింగ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేసే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కు ఏపీ పోలీసు శాఖ నుంచి అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న అతుల్ సింగ్ ఎంపికయ్యారు. 1995 ఐపీఎస్  బ్యాచ్ కి చెందిన ఈయన విశాఖపట్నం గ్రేహౌండ్స్ ఎస్పీగానూ, ఐజీపీ నార్త్ జోన్ ఇన్చార్జ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లోనూ, విశాఖలో ఇన్చార్జి  పోలిస్ కమిషనర్, ఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ లో జాయింట్ సెక్రటరీగానూ, హైదబారాబాద్, సైబరాబాద్ సిటీ పోలీస్ గానూ పనిచేశారు. ఈయన ఎంపిక పట్ల పలువురు పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Tadepalli

2023-01-25 08:23:20

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 69,221మంది

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధ రాత్రి వరకూ 69,221 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా  రూ.5.45 కోట్లు వచ్చింది. ఇంకా రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-01-25 02:18:05

నావల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు యోచన

చిన్నపాటి మైక్రో డ్రోన్‌లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌(ఎన్‌ఎడిఎస్‌)ను తిరుమలలో ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈఓ మాట్లాడుతూ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కొనుగోలుపై భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)తో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. భక్తులు డిపాజిట్‌ చేసిన లగేజిని సురక్షితంగా భద్రపరిచి తిరిగి అప్పగించేందుకు విమానాశ్రయాల తరహాలో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. ఇందుకోసం ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగులు వినియోగిస్తామని, ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి ఈవ్యవస్థ అమల్లోకి రానుందన్నారు.

దేశవ్యాప్తంగా 396 టిటిడి కల్యాణ మండపాలు ఉన్నాయని, భక్తుల కోరిక మేరకు వీటిలో 12 కల్యాణ మండపాలను రూ.2.8కోట్లతో పూర్తిగా పునరుద్ధరించి, ఏసీ, ఫర్నీచర్‌ వసతులు కల్పించామని, తదనుగుణంగా మాత్రమే అద్దె పెంచామని ఈఓ వివరించారు. మిగిలిన 384 కల్యాణ మండపాల అద్దె పెంచలేదన్నారు. టాటా సంస్థ అందించిన రూ.150 కోట్ల విరాళంతో తిరుమలలో ప్రపంచ స్థాయి మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని, డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

టిటిడి చరిత్రలో మొదటిసారిగా, సుమారు 7,126 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 960 ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసామన్నారు. అదేవిధంగా, 2019లో రూ.13,025 కోట్లుగా ఉన్న టిటిడి బ్యాంకు డిపాజిట్లు ఇప్పుడు రూ.15,938 కోట్లు అని, బంగారం డిపాజిట్లు 7,339 కిలోల నుంచి 10,258 కిలోలకు పెరిగాయని వెల్లడించారు. తద్వారా టిటిడి పాలనలోని పారదర్శకతను, అంకితభావాన్ని తెలుసుకోవచ్చన్నారు. టిటిడి పలు సామాజిక, సంక్షేమ చర్యలు చేపడుతోందని, పలు పాఠశాలలు, కళాశాలలతో పాటు చెవిటి, మూగ పాఠశాలలు, దివ్యాంగుల పాలిటెక్నిక్‌, పూర్‌హోమ్‌, వృద్ధాశ్రమం, అనాథ బాలబాలికల కోసం బాలమందిరం తదితర ప్రత్యేక సంస్థలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్విమ్స్‌, బర్డ్‌, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి లాంటి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు పేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు. స్విమ్స్‌లో డిసెంబరు నాటికి ప్రపంచ స్థాయి క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు కానుందని తెలిపారు. అదేవిధంగా, రూ.50 కోట్లతో హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిని అభివృద్ధి చేస్తున్నామని, రూ.23 కోట్లతో నూతన పరకామణి భవనం నిర్మించామని తెలియజేశారు. మీడియా సమావేశంలో టిటిడి జెఈవో  వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహకిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో  షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌  నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tirumala

2023-01-23 10:01:56

ఒకే విద్యార్ధి..ఒక ఉపాధ్యాయుడు..ఒక పాఠశాల

ఒక విద్యార్ధి..ఒక ఉపాధ్యాయుడు..ఒక పాఠశాల ఏంటి కేప్షన్ బాగుంది అనుకుంటున్నారా..అవునండి ఇది ముమ్మాటికీ నిజం..మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాలో ఓ 
ప్రభుత్వ పాఠశాల ఒక్క విద్యార్థి కోసమే అక్కడి ప్రభుత్వం నడుపుతోంది. 150 మంది వరకూ నివసిస్తున్న గణేశ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి 
వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్‌లో కార్తిక్‌ షెగ్‌కర్‌ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. అతని కోసం మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు 
కల్పిస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కిశోర్‌ అనే టీచర్‌ రోజూ 12 కి.మీ దూరం ప్రయాణించి బాలుడికి పాఠాలు నేర్పిస్తున్నాడు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో 
రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను అనుసంధానిస్తున్న తరుణంలో ఒక విద్యార్ధికోసం ఏకంగా పాఠశాలను నడిపిస్తున్న అంశం ఇపుడు ఇపుడు దేశవ్యాప్తంగా 
చర్చనీయాంశం అవుతుంది. అంతే కాదు ఏపీలోనూ ఈ విషయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వం అనుకుంటే ఒక్క విద్యార్ధికైనా 
చదువు చెప్పడానికి ఉపాధ్యాయుడిని నియమించి పాఠాలు చెప్పిస్తుందనడానికి మహారాష్ట్రలోని గణేష్ పూర్ ప్రభుత్వపాఠశాల నిదర్శనం. 

Ganeshpuri

2023-01-23 04:40:03

ఏపీలో సీనియర్ ఐఏఎస్ లకు త్వరలోనే బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ లను బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవలే తెలంగాణ నుంచి సోమేష్ కుమార్ ఏపీకి కేటాయింపు జరగడం, 
ఆయను ప్రభుత్వశాఖను కట్టబెట్టడంతోపాటు, సుదీర్ఘకాలంగా వివిధ శాఖల్లో ఉన్న ఐఏఎస్ లను కూడా స్థానచలనం కల్పించడం, మరికొందరికి పదోన్నతులు 
కల్పించాలని చూస్తున్నారట. ఉమ్మడి జిల్లాల్లోని కొందరు కలెక్టర్లకు కూడా స్థాన చలనం కలిగే అవకాశం వుందని చెబుతున్నారు. అదే సమయంలో వివిధ 
ప్రభుత్వశాఖల్లో కమిషనర్లుగా ఉన్న వారికి కూడా శాఖలను మార్పు చేయడం ద్వారా పరిపాలనను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం సమాలోచనలు 
చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వానికి విధేయులుగా వున్నవారికి ఈసారి బదిలీల్లో కూడా ముఖ్యమైన శాఖలు దక్కే అవకాశాలే అధికంగా ఉన్నట్టు తాజా 
పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Tadepalli

2023-01-22 16:29:05

టిటిడి ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళం

తెలంగాణకు చెందిన నితిన్ సాయి ఇండియా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళంగా అందించింది. సంస్థ అధినేత, మాజీ ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ తరపున ఆయన కుమారుడు నితిన్ సాయి తిరుమలలో డోనార్ సెల్ ఇన్ఛార్జి డెప్యూటీ ఈఓ  సెల్వంకు విరాళం డీడీలను అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, బర్డ్, సర్వశ్రేయ, పురాతన ఆలయాల పరిరక్షణ ట్రస్టు‌, కాటేజీ నిర్మాణం కోసం రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, ప్రచారం చేసేందుకు టీటీడీ చేస్తున్న కృషిని దాత కొనియాడారు.

Tirumala

2023-01-12 16:48:48

వందే భారత్ రైలు.. అసలు మామూలుగా లేదుగా

భారత రైల్వే కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అనేక ప్రత్యేకతలను కలిగివున్నాయి. సాధారణ రైలుప్రయాణం చేసిన వారికి ఈ రైలు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుంది. ఈ రైలు భోగీలను, కోచ్ లను దేశంలోని చెన్నై కోచ్ ఫ్యాక్టీరీలోనే తయారు చేస్తున్నారు. ఈ రైలుకి మొత్తం 16 బోగీలు ఉండగా, అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉంది. 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఈ రైలులో వుంది. అవసరాన్ని బట్టి కోచ్ లు పెంచే సౌలభ్యాన్ని భారత రైల్వే పరిశీలస్తున్నది.  కోచ్‌ పొడవు 23 మీటర్లు. ప్రత్యేకంగా స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. పుష్ బ్యాక్ సీట్ల వలన అదే సీటులో పడుకునే సౌకర్యం కూడా వుంది. జీపీఎస్‌ ఆధారిత ప్రయాణికుల సమాచారం, బయోవాక్యూమ్‌ మరుగుదొడ్లు ఉన్నాయి. మొత్తానికి ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణం ఖరీదు కాస్త ఎక్కువే అయినా నిత్యం విమానాల్లో ప్రయాణాలు చేసే ప్రయాణీకులు ఈ తరహా రైళ్లను అధికంగా ఇష్టపడటానికి అవకాశం వుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా 52 మంది కూర్చునే ఫస్ట్ క్లాస్ కోచ్‌లు మొత్తం రైలులో రెండింటిని ఏర్పాటు చేశారు. సాధారణ ఫస్ట్ క్లాస్ రైలుతో పోల్చుకుంటే వందేభారత్ రైలు అత్యాధునిక వసతులతో వీటిని తయారు చేయడంతో వీటిలో ప్రయాణానికి డిమాండ్ అధికంగా వుంటుందని కూడా రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

New Delhi

2023-01-12 12:12:32

జనవరి 13న టిటిడి డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

టిటిడి డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జనవరి 13వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకు భక్తులు  0877-2263261 సంప్రదించవలసి వుంటుంది. ఈ కార్యక్రమాన్ని టిటిడి ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తుంది. డయల్ యువర్ కార్యక్రమం ద్వారా దేవస్థాన అభివృద్ధికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిం దిగా ఈఓ కోరుతున్నారు.

Tirumala

2023-01-11 11:49:01

నేటికీ పీఐబీ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కి స్థానంలేదు

భారత ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా నిర్వహణ చేపట్టే పిఐబి(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెబ్ సైట్ లో నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చోటు లభించలేదు. కాదు కాదు అవకాశం ఉన్నా దానిని రాష్ట్రాన్ని చేర్చుకోలేకపో తున్నది. విజయవాడలో పీఐబీ కార్యాలయం ప్రారంభించినా..అధికారికంగా పీఐబీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం చేర్చలేదు. ఏపీని విభజన చేసినతరువాత, కేంద్ర ప్రభుత్వశాఖలకు చెందిన కార్యాలయాలను ఏపీలో కూడా పెట్టాల్సి వుంది. అయితే ఈ విషయంలో ఇటు రాష్ట్రప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో నేటికీ పీఐబీ వెబ్ సైట్ లో ఏపీకి చోటుదక్కలేదు. అంతేకాదు ఇటురాష్ట్రంలోనూ సమాచారశాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్(అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం మీడియాకు తెలియజేసే విధంగా..అంటే పీఐబీ తరహాలో)ను కూడా ఏర్పాటు చేయలేకపోయింది. అన్ని ప్రభుత్వ శాఖలపైనా దృష్టిసారించే రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రచారాలకోసం మాత్రం పూర్తిస్థాయి వెబ్ సైట్ నేటికీ నిర్మాణం చేపకట్టక పోవడం విశేషం..!

New Delhi

2023-01-10 12:10:59

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

జనవరి 28వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహ నం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహన సేవ నిర్వహిస్తారు.

 కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈసందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, సామవేద పుష్పాంజలి, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.జనవరి 24న  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 24వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

Tiruchanur

2023-01-10 11:28:21

10న వర్చువల్ సేవా టికెట్ల ద‌ర్శ‌న కోటావిడుద‌ల‌

తిరుమలలో జనవరి 12 నుంచి జరగనున్న కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్  వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు,సంబంధిత ద‌ర్శ‌న  కోటాను జనవరి 10వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నందని టిటిడి సోమవారం మీడియా ద్వారా తెలియజేసింది. కాగా శ్రీవారి ఆలయంలో బాలాలయం  దృష్ట్యా ఫిబ్రవరి 22 -28 వరకు ఆన్ లైన్ వర్చువల్ సేవ, అనుబంధ దర్శన టికెట్ల కోట అందుబాటులో ఉండదు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌న టికెట్లను బుక్ చేసుకోవాల‌ని కోర‌డమైన‌ది.

Tirumala

2023-01-09 13:00:09