1 ENS Live Breaking News

24 గంట్లో ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడ‌చిన 24 గంటల్లో  కొత్తగా 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. 92 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. మొత్తం 61,300 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 94,209గా ఉంది. ఇప్పటివరకు 2,95,248మంది కరోనా నుంచి కోలుకోగా.. 3,633 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి రిపోర్టులను వ్యక్తుల యొక్క చరవాణిలకి పంపిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీఒక్కరూ భాగస్వామ్యం కావాలని పేర్కొంది. సామాజిక దూరం పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించింది. చేతులను పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ కి దూరంగా వుండొచ్చని తెలియజేస్తోంది...

Amaravati

2020-08-27 19:16:28

వాల్తేరు సీనియర్ డిసిఎంగా అఖిలేష్ కుమార్ త్రిపాఠి..

ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌గా అఖిలేష్ కుమార్ త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2011 ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టిఎస్) అధికారి. రైల్వేలో ఏరియా మేనేజర్ / వైజాగ్ స్టీల్ ప్లాంట్‌గా తన వృత్తిని ప్రారంభించి, అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. వాల్తేరు డివిజన్‌లో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వివిధ విభాగాలతోపాటు ట్రాఫిక్ కమర్షియల్, ఆపరేషన్స్ లో పనిచేశారు. డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా మరియు ఖుర్దా రోడ్ డివిజన్‌లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌గా ట్రాఫిక్ కార్యకలాపాలను మెరుగుపరచడంలో విశేష క్రుషి చేశారు.  గతంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు ఈయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. 

Visakhapatnam

2020-08-27 19:00:52

నవంబర్14 లోగా చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 14వ తేదీ లోగా 100 పడకల చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బర్డ్ ఆసుపత్రి భవనాల్లో ప్రారంభిస్తామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆలోపు సిఎం  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తో ఆసుపత్రి సొంత భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేయించి, అదే రోజు నుంచి వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. బర్ద్ ఆసుపత్రి లో గురువారం టీటీడీ మెడికల్ కమిటీ సమావేశంలో ఈ మేరకు పలు అంశాలను చర్చించారు.  ముఖ్యమంత్రి ఆదేశం మేరకు చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. బర్డ్ పాత బ్లాక్ భవనంలో ఆసుపత్రి ప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. ఆ తరువాత రెండు నుంచి రెండున్నరేళ్లలో  కొత్త భవనాల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న‌పిల్ల‌ల ఆసుపత్రిలో గుండె, బోన్ మారో సర్జరీలు  చేస్తామన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలకు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదనే ముందు చూపుతో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కంచి ట్రస్ట్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య నిపుణుల సేవలు, సలహాలు తీసుకుంటున్నామని సుబ్బారెడ్డి వివరించారు. 

Tirupati

2020-08-27 18:45:13

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..

దేశంలో వివిధ ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఉండిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉండి కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం జాబ్ చేస్తున్నవారికి కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తరించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి మేకతోటి గౌతం రెడ్డి చెప్పారు. ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలు కావాలనుకునే వారు https://broadband.apit.ap.gov.in/ లింకు ద్వారా సంప్రదించవచ్చునన్నారు. అలా వివరాలు పంపిన వారికి సంస్థ నుంచి సిబ్బంది కాల్ చేసి ఎక్కడైతే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారో ఆ ప్రాంతంలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తారని చెప్పారు. ఉద్యోగులకే కాకుండా విదేశాల్లో ఉండి భారతదేశానికి వచ్చిన సంస్థలకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో వుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇంటర్నెట్ కోసం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు...

Amaravati

2020-08-27 18:27:51

ఎస్వీబీసీకి విజయవాడ భక్తుడు రూ.10 లక్షల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ట్రస్టుకి విజయవాడకి చెందిన బొమ్మదేవర వెంకట సుబ్బారావు రూ.లక్షల విరాళాన్ని ఇచ్చారు. గురువారం ఈ మేరకు తిరుమలలోని టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డిని కలసి ఈ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి కార్యక్రమాలు భక్తులకు ఎంతో పవిత్రంగా తెలియజేసే ఎస్వీబీసీ ఛానల్ అభివ్రుద్ధికి వినియోగించాలని ఆయన కోరారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ స్వామివారి దైనందిన కార్యక్రమాలన్నీ భక్తులకు విశేషంగా అందించే ఎస్వీబీసీ మరింతగా అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించిన ఆయన దేశంలోని ప్రముఖ దేవస్థానాల సమాచారాన్ని కూడా అందించాలని అధికారులను కోరారు. ఈ విషయాన్ని ఎస్వీబీసీముఖ్య నిర్వాహకులకు తెలియజేస్తామని టిటిడి అధికారులు దాతలకు వివరించారు.

Tirumala

2020-08-27 17:54:06

అఖండ పారాయ‌ణంతో పులకించిన తిరుమలగిరులు..

 ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం  జరిగిన సుందరకాండలోని అష్ట‌మ‌ సర్గ నుంచి ఏకాద‌శః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌లగిరులు పుల‌కించాయి.  ఈ సంద‌ర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌ మాట్లాడుతూ వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామ‌య‌ణంలోని సుంద‌ర‌కాండ‌లో నాయ‌కుడు హ‌నుమంతుడ‌ని తెలిపారు. హ‌నుమంతుడిని స్మ‌రించ‌డం వ‌ల‌న బుద్ధి, బ‌లం, దైర్యం, భ‌యం లేక పోవ‌డం, స‌ఖ‌ల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయ‌న్నారు. టిటిడి సుంద‌ర‌కాండ పారాయ‌ణాన్నిఅద్భుతంగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తు‌న్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హం వ‌ల‌న త్వ‌ర‌లో క‌రోనా వైర‌స్ న‌శించి ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌న్నారు.  

Tirumala

2020-08-27 15:59:57

ఆ ఐఏఎస్ డాక్టర్ కావడంమే గిరపుత్రుల అద్రుష్టం..

విశాఖ మన్యంలో గిరిజనులకు పూర్తిస్థాయి ప్రభుత్వ వైద్యం కార్పోరేట్ స్థాయిలో అందాలి...ఎపడమిక్ సీజన్ లో సైతం వైద్యసేవల్లో ఇబ్బందులు రాకూడదు...వైద్యంపై గిరిపుత్రులకు నమ్మకం పెంచాలి...ఇవన్నీ జరగాలంటే ఏజెన్సీలోని ఆసుపత్రులన్నింటికి వసతులు, వైద్య పరికరాలు కావాలి...అవన్నీ వుంటే గిరిజనులకు మంచి వైద్యం అందించవచ్చు అని ఆలోచించిన పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల కార్పోరేట్ రెస్పాన్సిబిలిటీ నిధుల సేకరణ ప్రారంభించారు.  అలా వచ్చిన నిధులతో వైద్యపరికరాలు సమకూర్చడానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మన్యంలోని ప్రధాన ఆసుపత్రులన్నీ ఒక్కొక్కటిగీ కార్పోరేట్ ఆసుపత్రి రూపంలోకి వస్తున్నాయి. ఏకంగా రూ.10లక్షలతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నారు. స్వతహాగా పీఓ ఎంబీబీఎస్ డాక్టర్ కావడంతో వైద్యసేవలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో మన్యంలో ఆసుపత్రుల స్వరూపం మారుతోంది...

Paderu

2020-08-26 18:22:54

సెప్టెంబరు నెలలో తిరుమలలో పర్వదినాలు

తిరుమలలో సెప్టెంబరు మాసంలో శ్రీవారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1వ తేదిన మొదలుకొని ఈ పర్వదినాలు సెప్టెంబరు 28వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు టిటిడి పేర్కొంది. స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు వరుసగా... సెప్టెంబరు 1న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, 17న మహాలయ అమావాస్య., 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 23న శ్రీవారి గరుడసేవ,  24న శ్రీవారి స్వర్ణరథోత్సవం, 2 7న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి, 28న  శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జరగనున్నాయి. స్వామివారికి నిర్వహించే పవిత్ర కార్యక్రమాలకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది.

Tirumala

2020-08-26 17:33:20

శిరోముండనం కేసులో ఎవరినీ వదిలిపెట్టొద్దు...సీఎం జగన్

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలికి చెందిన ఇండుగిమిల్లి వరప్రసాద్‌ శిరోముండనం కేసు వ్యవహారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్ టైమ్ చాలాఘాటుగా స్పందించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులపై దాడులను, అనైతిక చర్యలపై నిశితంగా చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ గా ఇచ్చిన వార్నింగ్ ఒకింత అధికారులను సైగతం ఆలోచనకుగురిచేసింది. పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్న విషయాన్ని జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులమీద దాడులు సహా, ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. కానీ గత ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది జగన్ చెప్పుకొచ్చారు.

Amaravathi

2020-08-25 21:28:30

పొక్సో కేసుల విచారణ కోసం 8 ప్రత్యేక కోర్టులు...

ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నియంత్రించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడుల నుంచి పిల్లల్ని రక్షించడంతోపాటు, నింధితులను శిక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 స్పెషల్ కోర్టులు మంజూరు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  పొక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయన్న ప్రభుత్వం చిన్న పిల్లల లైంగిక నేరాల కేసుల విచారణకు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి,మచిలీపట్నం లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్టున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తద్వారా చిన్నారుల జీవితాలకు కూడా రక్షణ ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కినట్టు అయ్యింది. గత ప్రభుత్వంలోనే ఈ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఈ ప్రత్యేక కోర్టులకు కార్యరూపం వచ్చింది...

Amaravathi

2020-08-25 19:57:59

పొక్సో కేసుల విచారణ కోసం 8 ప్రత్యేక కోర్టులు...

ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నియంత్రించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడుల నుంచి పిల్లల్ని రక్షించడంతోపాటు, నింధితులను శిక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 స్పెషల్ కోర్టులు మంజూరు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  పొక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయన్న ప్రభుత్వం చిన్న పిల్లల లైంగిక నేరాల కేసుల విచారణకు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి,మచిలీపట్నం లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్టున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తద్వారా చిన్నారుల జీవితాలకు కూడా రక్షణ ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కినట్టు అయ్యింది. గత ప్రభుత్వంలోనే ఈ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఈ ప్రత్యేక కోర్టులకు కార్యరూపం వచ్చింది...

Amaravathi

2020-08-25 19:57:45

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల సౌక‌ర్యార్థం 100 బ్రేక్ దర్శనం టిక్కెట్లు..

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల సౌక‌ర్యార్థం 2020 సెప్టెంబ‌రు నెలలో ప్ర‌తి రోజు వంద (100) ఆన్‌లైన్ బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను టిటిడి అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా దాత‌లు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రూ.10 వేలు ఆన్‌లైన్‌లో‌ లేదా తిరుమ‌ల‌లోని అద‌న‌పు ఈవో కార్యా‌ల‌యంలో క‌రెంటు బుకింగ్ ద్వారా చెల్లించి ఉద‌యం బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొంద‌వ‌చ్చు. ప్ర‌పంచ ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న‌ నేప‌థ్యంలో దాత‌ల విజ్ఞ‌ప్తి మేర‌కు జూలై 30 నుండి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన దాత‌ల ద‌ర్శ‌న కాలాన్ని ప్ర‌స్తుతం ఉన్న 6 నెల‌ల కాల ప‌రిమితిని సంవ‌త్స‌రా‌నికి టిటిడి పెంచిన విష‌యం విదిత‌మే. కాగా సెప్టెంబ‌రు 19న శ్రీ‌వారి న‌వాహ్నిక వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలకు ధ్వ‌జారోహ‌ణం మ‌రియు సెప్టెంబ‌రు 23న గ‌రుడ‌సేవ ఉన్న కార‌ణంగా ఈ రెండు రోజుల పాటు టికెట్ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

Tirumala

2020-08-25 18:39:22

మీడియా సలహాదారు రామచంద్రమూర్తి రాజీనామా వెనుక...

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా వున్నకె.రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఈ మేరకు తన రాజీనామాను సీఎంఓలో అందజేశారు. ప్రభుత్వ సలహాదారులుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చాలా మందేవున్నారు. అందులో కొందరికి కేబినెట్ ర్యాంకులు కూడా వున్నాయి. హఠాత్తుగా రామచంద్రరావు రాజీనామా చేయడం వెనుక ఏదో బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన పలు దినపత్రికలు, టెలివిజన్ ఛానల్స్ లో ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం సాక్షిమీడియాలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు. ఈయన రాజీనామాపై పలు చర్చలు అపుడే మొదలు అయ్యాయి. జర్నలిజంలో విశేష అనుభవం వున్నవారిని ప్రభుత్వం మీడియా సలహాదారులుగా నియమించుకుంది. ఇతర రాష్ట్రాలకి చెందిన వ్యక్తులను కూడా మీడియాసలహాదారులుగా ప్రభుత్వం నియమించింది...

Amaravati

2020-08-25 16:57:09

జాతీయ స్థాయిలో ఏయూకి ప్రత్యేక గుర్తింపు..వీసి ప్రసాదరెడ్డి

జాతీయ స్థాయిలో ఆంధ్రా యూనివర్శిటీకి మంచి ర్యాంకులు వచ్చాయని వీసీ పివిజిడి ప్రసాదరెడ్డి చెప్పారు. సోమవారం సెనేట్ హాలు లో జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశాలను వివరించారు.  ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో 19వ స్థానం, నేచర్‌ ఇం‌డెక్స్‌లో 4వ స్థానం, ఇండియా టుడేలో 12వ స్థానాన్ని ఏయూ సాధించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి సూచించిన విధంగా ప్రతీ విద్యార్థికి ఉపాదిని అందించే దిశగా ఇంజనీరింగ్‌ ‌సిలబస్‌లో మార్పులు చేసారు. బిటెక్‌ ‌హాజన్స్, ‌బిటెక్‌ ‌మైనర్‌ ‌కోర్సులను ప్రారంభించడానికి సెనేట్‌ ఆమోదం తెలియజేసింది. ప్రతీ విద్యార్థికి పూర్తిస్థాయిలో నైపుణ్యాలు, అదనపు సామర్ధ్యాలు కల్పించే దిశగా ఈ 10 నెలలు ఇంటర్స్‌ఫిప్‌,5 ‌స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కోర్సులను దీనిలో అందించనున్నారు.  ఎంఆర్‌ ‌సంస్కృత కళాశాల నుంచి ఐదేళ్ల బిఏ ఓరియంటల్‌ ‌లాంగ్వేజ్‌ ‌కోర్సును ప్రారంభించడానికి సెనేట్‌ ఆనుమతి ఇచ్చింది.

Visakhapatnam

2020-08-24 20:46:04

ఆగస్టు 27 న సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ  తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆగస్టు 27వ తేదీ గురువారం  సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉద‌యం 7 గంటల నుంచి  సుందరకాండలోని 8వ సర్గ నుంచి 11వ  సర్గ వరకు ఉన్న 182  శ్లోకాలను అఖండ పారాయణం చేయనున్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠం,  వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద పారాయణ దారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొననున్నారు. టీటీడీ ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం  68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి.ఎస్వీబీసీ ప్రతిరోజూ ఇస్తున్న ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు  ఈ పారాయ‌ణం లో పాల్గొంటున్నారు.

Tirumala

2020-08-24 20:14:39