1 ENS Live Breaking News

అఖండ పారాయ‌ణంతో పులకించిన తిరుమలగిరులు..

 ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం  జరిగిన సుందరకాండలోని అష్ట‌మ‌ సర్గ నుంచి ఏకాద‌శః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌లగిరులు పుల‌కించాయి.  ఈ సంద‌ర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌ మాట్లాడుతూ వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామ‌య‌ణంలోని సుంద‌ర‌కాండ‌లో నాయ‌కుడు హ‌నుమంతుడ‌ని తెలిపారు. హ‌నుమంతుడిని స్మ‌రించ‌డం వ‌ల‌న బుద్ధి, బ‌లం, దైర్యం, భ‌యం లేక పోవ‌డం, స‌ఖ‌ల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయ‌న్నారు. టిటిడి సుంద‌ర‌కాండ పారాయ‌ణాన్నిఅద్భుతంగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తు‌న్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హం వ‌ల‌న త్వ‌ర‌లో క‌రోనా వైర‌స్ న‌శించి ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌న్నారు.  

Tirumala

2020-08-27 15:59:57

ఆ ఐఏఎస్ డాక్టర్ కావడంమే గిరపుత్రుల అద్రుష్టం..

విశాఖ మన్యంలో గిరిజనులకు పూర్తిస్థాయి ప్రభుత్వ వైద్యం కార్పోరేట్ స్థాయిలో అందాలి...ఎపడమిక్ సీజన్ లో సైతం వైద్యసేవల్లో ఇబ్బందులు రాకూడదు...వైద్యంపై గిరిపుత్రులకు నమ్మకం పెంచాలి...ఇవన్నీ జరగాలంటే ఏజెన్సీలోని ఆసుపత్రులన్నింటికి వసతులు, వైద్య పరికరాలు కావాలి...అవన్నీ వుంటే గిరిజనులకు మంచి వైద్యం అందించవచ్చు అని ఆలోచించిన పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల కార్పోరేట్ రెస్పాన్సిబిలిటీ నిధుల సేకరణ ప్రారంభించారు.  అలా వచ్చిన నిధులతో వైద్యపరికరాలు సమకూర్చడానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మన్యంలోని ప్రధాన ఆసుపత్రులన్నీ ఒక్కొక్కటిగీ కార్పోరేట్ ఆసుపత్రి రూపంలోకి వస్తున్నాయి. ఏకంగా రూ.10లక్షలతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నారు. స్వతహాగా పీఓ ఎంబీబీఎస్ డాక్టర్ కావడంతో వైద్యసేవలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో మన్యంలో ఆసుపత్రుల స్వరూపం మారుతోంది...

Paderu

2020-08-26 18:22:54

సెప్టెంబరు నెలలో తిరుమలలో పర్వదినాలు

తిరుమలలో సెప్టెంబరు మాసంలో శ్రీవారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1వ తేదిన మొదలుకొని ఈ పర్వదినాలు సెప్టెంబరు 28వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు టిటిడి పేర్కొంది. స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు వరుసగా... సెప్టెంబరు 1న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, 17న మహాలయ అమావాస్య., 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 23న శ్రీవారి గరుడసేవ,  24న శ్రీవారి స్వర్ణరథోత్సవం, 2 7న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి, 28న  శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జరగనున్నాయి. స్వామివారికి నిర్వహించే పవిత్ర కార్యక్రమాలకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది.

Tirumala

2020-08-26 17:33:20

శిరోముండనం కేసులో ఎవరినీ వదిలిపెట్టొద్దు...సీఎం జగన్

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలికి చెందిన ఇండుగిమిల్లి వరప్రసాద్‌ శిరోముండనం కేసు వ్యవహారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్ టైమ్ చాలాఘాటుగా స్పందించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులపై దాడులను, అనైతిక చర్యలపై నిశితంగా చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ గా ఇచ్చిన వార్నింగ్ ఒకింత అధికారులను సైగతం ఆలోచనకుగురిచేసింది. పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్న విషయాన్ని జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులమీద దాడులు సహా, ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. కానీ గత ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది జగన్ చెప్పుకొచ్చారు.

Amaravathi

2020-08-25 21:28:30

పొక్సో కేసుల విచారణ కోసం 8 ప్రత్యేక కోర్టులు...

ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నియంత్రించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడుల నుంచి పిల్లల్ని రక్షించడంతోపాటు, నింధితులను శిక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 స్పెషల్ కోర్టులు మంజూరు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  పొక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయన్న ప్రభుత్వం చిన్న పిల్లల లైంగిక నేరాల కేసుల విచారణకు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి,మచిలీపట్నం లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్టున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తద్వారా చిన్నారుల జీవితాలకు కూడా రక్షణ ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కినట్టు అయ్యింది. గత ప్రభుత్వంలోనే ఈ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఈ ప్రత్యేక కోర్టులకు కార్యరూపం వచ్చింది...

Amaravathi

2020-08-25 19:57:59

పొక్సో కేసుల విచారణ కోసం 8 ప్రత్యేక కోర్టులు...

ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నియంత్రించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడుల నుంచి పిల్లల్ని రక్షించడంతోపాటు, నింధితులను శిక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 స్పెషల్ కోర్టులు మంజూరు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  పొక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయన్న ప్రభుత్వం చిన్న పిల్లల లైంగిక నేరాల కేసుల విచారణకు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి,మచిలీపట్నం లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్టున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తద్వారా చిన్నారుల జీవితాలకు కూడా రక్షణ ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కినట్టు అయ్యింది. గత ప్రభుత్వంలోనే ఈ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఈ ప్రత్యేక కోర్టులకు కార్యరూపం వచ్చింది...

Amaravathi

2020-08-25 19:57:45

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల సౌక‌ర్యార్థం 100 బ్రేక్ దర్శనం టిక్కెట్లు..

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల సౌక‌ర్యార్థం 2020 సెప్టెంబ‌రు నెలలో ప్ర‌తి రోజు వంద (100) ఆన్‌లైన్ బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను టిటిడి అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా దాత‌లు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రూ.10 వేలు ఆన్‌లైన్‌లో‌ లేదా తిరుమ‌ల‌లోని అద‌న‌పు ఈవో కార్యా‌ల‌యంలో క‌రెంటు బుకింగ్ ద్వారా చెల్లించి ఉద‌యం బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొంద‌వ‌చ్చు. ప్ర‌పంచ ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న‌ నేప‌థ్యంలో దాత‌ల విజ్ఞ‌ప్తి మేర‌కు జూలై 30 నుండి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన దాత‌ల ద‌ర్శ‌న కాలాన్ని ప్ర‌స్తుతం ఉన్న 6 నెల‌ల కాల ప‌రిమితిని సంవ‌త్స‌రా‌నికి టిటిడి పెంచిన విష‌యం విదిత‌మే. కాగా సెప్టెంబ‌రు 19న శ్రీ‌వారి న‌వాహ్నిక వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలకు ధ్వ‌జారోహ‌ణం మ‌రియు సెప్టెంబ‌రు 23న గ‌రుడ‌సేవ ఉన్న కార‌ణంగా ఈ రెండు రోజుల పాటు టికెట్ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

Tirumala

2020-08-25 18:39:22

మీడియా సలహాదారు రామచంద్రమూర్తి రాజీనామా వెనుక...

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా వున్నకె.రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఈ మేరకు తన రాజీనామాను సీఎంఓలో అందజేశారు. ప్రభుత్వ సలహాదారులుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చాలా మందేవున్నారు. అందులో కొందరికి కేబినెట్ ర్యాంకులు కూడా వున్నాయి. హఠాత్తుగా రామచంద్రరావు రాజీనామా చేయడం వెనుక ఏదో బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన పలు దినపత్రికలు, టెలివిజన్ ఛానల్స్ లో ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం సాక్షిమీడియాలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు. ఈయన రాజీనామాపై పలు చర్చలు అపుడే మొదలు అయ్యాయి. జర్నలిజంలో విశేష అనుభవం వున్నవారిని ప్రభుత్వం మీడియా సలహాదారులుగా నియమించుకుంది. ఇతర రాష్ట్రాలకి చెందిన వ్యక్తులను కూడా మీడియాసలహాదారులుగా ప్రభుత్వం నియమించింది...

Amaravati

2020-08-25 16:57:09

జాతీయ స్థాయిలో ఏయూకి ప్రత్యేక గుర్తింపు..వీసి ప్రసాదరెడ్డి

జాతీయ స్థాయిలో ఆంధ్రా యూనివర్శిటీకి మంచి ర్యాంకులు వచ్చాయని వీసీ పివిజిడి ప్రసాదరెడ్డి చెప్పారు. సోమవారం సెనేట్ హాలు లో జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశాలను వివరించారు.  ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో 19వ స్థానం, నేచర్‌ ఇం‌డెక్స్‌లో 4వ స్థానం, ఇండియా టుడేలో 12వ స్థానాన్ని ఏయూ సాధించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి సూచించిన విధంగా ప్రతీ విద్యార్థికి ఉపాదిని అందించే దిశగా ఇంజనీరింగ్‌ ‌సిలబస్‌లో మార్పులు చేసారు. బిటెక్‌ ‌హాజన్స్, ‌బిటెక్‌ ‌మైనర్‌ ‌కోర్సులను ప్రారంభించడానికి సెనేట్‌ ఆమోదం తెలియజేసింది. ప్రతీ విద్యార్థికి పూర్తిస్థాయిలో నైపుణ్యాలు, అదనపు సామర్ధ్యాలు కల్పించే దిశగా ఈ 10 నెలలు ఇంటర్స్‌ఫిప్‌,5 ‌స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కోర్సులను దీనిలో అందించనున్నారు.  ఎంఆర్‌ ‌సంస్కృత కళాశాల నుంచి ఐదేళ్ల బిఏ ఓరియంటల్‌ ‌లాంగ్వేజ్‌ ‌కోర్సును ప్రారంభించడానికి సెనేట్‌ ఆనుమతి ఇచ్చింది.

Visakhapatnam

2020-08-24 20:46:04

ఆగస్టు 27 న సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ  తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆగస్టు 27వ తేదీ గురువారం  సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉద‌యం 7 గంటల నుంచి  సుందరకాండలోని 8వ సర్గ నుంచి 11వ  సర్గ వరకు ఉన్న 182  శ్లోకాలను అఖండ పారాయణం చేయనున్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠం,  వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద పారాయణ దారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొననున్నారు. టీటీడీ ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం  68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి.ఎస్వీబీసీ ప్రతిరోజూ ఇస్తున్న ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు  ఈ పారాయ‌ణం లో పాల్గొంటున్నారు.

Tirumala

2020-08-24 20:14:39

డిపార్ట్ మెంటల్ పరీక్షలు సెప్టెంబరు 1కి వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో  ఈనెల 25 నుంచి సెప్టెంబరు 1వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలు(డిపార్ట్ మెంటల్ టెస్ట్) వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ప్రకటించింది. కోరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాఖాపరమైన పరీక్షలకు 1.75లక్షల మంది దరఖాస్తు చేసుకోగా  అందులో అత్యధికంగా 1.30లక్షల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నారని ఆయన వివరించారు. కాగా సచివాలయ ఉద్యోగులు రిజిస్టర్ అయితే చేసుకున్నారు తప్పా ఈ పరీక్షలపై ఎవరికీ అవగాహన లేకపోవడం విశేషం. మరోవైపు డిపార్ట్ మెంటల్ పరీక్షలతో పాటు, ఏ ప్రభుత్వ ప్రకటనను సైతం గ్రామసచివాలయ వ్యవస్థలో భాగంగా వున్న 11 శాఖల జిల్లా అధికారులు కనీసం సచివాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించకపోవడం విశేషం. కొన్ని విభాగాల అధిపతుల నుంచి కనీసం స్పందన లేకపోవడం కొసమెరుపు.

అమరావతి

2020-08-23 12:20:09

రేపు శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల

తిరుమల భక్తుల సౌకర్యార్థం 2020 సెప్టెంబ‌రు నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగ‌స్టు 24వ తేదీ ఉద‌యం 11.00 గంట‌ల‌కు‌ టిటిడి విడుదల చేయనుంది. టిటిడి ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.  ఇందులో సెప్టెంబ‌రు 15న శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజ‌నం, సెప్టెంబ‌రు 18 నుండి 27వ తేదీ వ‌ర‌కు శ్రీవారి న‌వాహ్నిక వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన‌ము టికెట్ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది. ఎప్పటి నుంచో ఈ టిక్కెట్లు కోసం ఎదురు చూస్తున్న భక్తులకు టిటిడి శ్రీవారి దర్శనం కోసం శుభవార్త చెప్పినట్టు అయ్యింది. టిటిడి టిక్కెట్ల కోటా ప్రకటించిన వెంటనే బుక్ చేసుకోవాలని భక్తులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

Tirumala

2020-08-23 12:09:04

చిరంజీవికి బర్త్ డే విషెస్‌ చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చిరంజీవిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ శనివారం ట్వీట్‌ చేశారు. సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ని కార్యకర్తలు, నాయకులు వారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని పంచుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇస్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో తమ అభిమాన నటుడి కోసం చేసిన సేవా కార్యక్రమాలను ప్రముఖంగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ చూసినా చిరంజీవి జన్మదిన వీడియోలు, ఫోటోలు మాత్రమే దర్శనమివ్వడం విశేషం...

Amaravati

2020-08-22 21:04:53

వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్న చందన రమేష్

తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి బలం కొద్ది కొద్దిగా వీగిపోతుంది. రాజమండ్రి రూరల్  మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ శనివారం సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీనితో రాజమండ్రి రూరల్ మొత్తం వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టడం ఖాయమని చెబుతున్నారు.  ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయంలో చేరిన ఆయన తనతోపాటు  కుమారుడు చందన నాగేశ్వర్ ను కూడా పార్టీలో చేర్చారు. ఈయనకి రూరల్ ప్రాంతంలోని యువతలో మంచి పట్టువుండటంతో టిడిపికి గట్టి దెబ్బే తగిలినట్టు అయ్యింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పరిపాలన, నిరుపేదలకు అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని పార్టీలోకి చేరడానికి ప్రేరేపించాయని అన్నారు. రాజమండ్రితోపాటు, రూరల్ ప్రాంతంలోని పార్టీ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేయడంతోపాటు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకి సాగుతామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు.

Amaravati

2020-08-22 19:33:02

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు సిజె..జెకె మహేశ్వరి

 ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జె కె మహేశ్వరి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం  ఈఓ సింఘాల్ ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా సిజె మాట్లాడుతూ, మంచిరోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ  హరీంద్ర నాథ్ పాల్గొన్నారు.  తరువాత  శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు అర్బన్ ఎస్పీ  రమేష్ రెడ్డి, ఆలయ డిప్యూటి ఈఓ  ఝాన్సి, అర్చకులు బాబు స్వామి ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం  అర్చకులు  జె కె మహేశ్వరికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఎస్పీ  రమేష్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తి కి స్వామివారి చిత్రపటం అందించి శాలువతో సత్కరించారు. జిల్లా జడ్జి  రవీంద్ర బాబు, న్యాయమూర్తులు పవన్,  ధనుంజయులు నాయుడు పాల్గొన్నారు.

Tirumala

2020-08-22 19:10:40