1 ENS Live Breaking News

ఒకేసారి రూ.75 రుణం..మంత్రి సీదిరి అప్పలరాజు

వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో విడతల వారీగా ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఒకేసారి అందే ఆర్థిక సాయంతో  మహిళలు ఆర్థిక సుస్థిర సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. సచివాలయంలో నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో మహిళల కష్టాలను చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిననాటి నుంచే వారి ఆర్థికాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా వైఎస్సార్ చేయూత పథకం, వైఎస్సార్ ఆసరా పథకం మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ రెండు పథకాల వల్ల అందే ఆర్థిక సాయంతో మహిళలు స్వయం ఉపాధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ఇందులో భాగంగా తమ శాఖ ద్వారా పలు యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి అప్పలరాజు తెలిపారు. 

Amaravati

2020-08-20 19:19:56

కెజిహెచ్ లో కోవిడ్19 క్లినికల్ ట్రయల్స్ ప్రభుత్వ అనుమతి

విశాఖపట్నం లోని ఆంధ్ర మెడికల్ కాలేజీ / కింగ్ జార్జ్ హాస్పిటల్ లో రెండు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం తెలిపిందని ఏఎంసి ప్రిన్సిపాల్ డా.పివి సుధాకర్ తెలియజేశారు. ఈమేరకు గురువారం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ, విశాఖలోని కెజిహెచ్ లో నిర్వహించే క్లినికల్ ట్రైల్స్ కి డిఆర్డీఓ మద్దతు కూడా తెలియజేసిందన్నారు. ఇక్కడ క్లినికల్ ట్రైల్స్ చేయడం ద్వారా ఫలితాలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వీలుంటుందని, వాక్సిన్ పనితీరు ఏ స్థాయిలో పనిచేస్తుందో కూడా తెలుస్తుందని చెప్పారు. నావిటాస్ లైఫ్ సైన్సెస్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు సంస్థల ద్వారా ట్రైల్స్ జరుగుతున్నాయన్న ఆయన కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ బి. దేవి మాధవిని ఇన్వెస్టిగేటర్ గా నియమించిందన్నారు. విశాఖ కెజిహెచ్ లో క్లినికల్ ట్రైల్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించి కరోనా వైరస్ నియత్రంతణ విశాఖ నుంచే ఆరంభం కావాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆకాంక్షించినట్టు ప్రిన్సిపల్ వివరించారు.

King George Hospital

2020-08-20 19:11:20

స్వచ్ఛ సర్వేక్షణ్2020 లో విశాఖకు 9వ ర్యాంకు.. జీవిఎంసీ కమిషనర్ డా.స్రిజన

భారతదేశం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వఛ్చ భారత్ ప్రగతిలో  స్వఛ్చ సర్వేక్షణ్ 2020 లో  4242 నగరాల మధ్య జరిగిన పోటీలో విశాఖ నగరానికి 9 వ స్థానం లభించిందని జి.వి.య.సి. కమీషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ విజయం విశాఖ ప్రజలదేనని, గతేడాది ర్యాంకు కంటే జి.వి.యం.సి. ఇప్పుడు మెరుగైన స్థానం సాదించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలో 2014 నుండి స్వఛ్చ భారత్ మిషన్ క్రింద జాతీయ స్థాయిలో నగరాల మధ్య పోటీ జరుగుతుందని, స్వఛ్చ సర్వేక్షణ్ 2020 యొక్క ఫలితాలను కేంద్ర గృహ, పట్టణాభివ్రుద్ది శాఖా మంత్రి హరదీప్ సింగ్ పురి గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసారని కమీషనర్ తెలిపారు.  ఈ ఫలితాలలో విశాఖపట్నానికి 9 వ ర్యాంకు లభించిందని, ఈ సర్వేలో గల అన్ని ప్రామాణికాలలో 600 మార్కులకు గాను విశాఖపట్నానికి 4918.44 మార్కులు లభించగా అందులో డాక్యుమెంటేషన్ కేటగిరీలో 1188.88 మార్కులు, సర్టిఫికేషన్ కేటగిరీలో 1100 మార్కులు, డైరెక్ట్ అబ్జర్వేషన్ కేటగిరీలో 1468.85 మార్కులు,  ప్రజల అభిప్రాయ సేకరణ కేటగిరీలో 1160.71 మార్కులు సాధించడమైనదని కమీషనర్ తెలిపారు.  స్వఛ్చ సర్వేక్షణ్ 2020 కావలసిన అన్ని ప్రామాణికాలు పొందుపరచడంలో జి.వి.యం.సి. యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేసిందన్నారు.  ప్రత్యక్ష పరిశీలన, చెత్త రహిత నగరాల రేటింగు, వ్యర్ధాలను వేరు చేయడం – ప్రాసెస్ చేయడం, పౌరుల అభిప్రాయం ఓటింగ్ గల అంశాలపై  జి.వి.య.సి. మెరుగుపడిందన్నారు.  స్వఛ్చ సర్వేక్షణ్ ఒకటవ లీగ్ (ఏప్రిల్ నుండి జూన్ 2019) నందు పొందుపరచవలసిన డాక్యుమెంటేషన్, స్వఛ్చతా యాప్ డౌన్లోడ్ ప్రక్రియలో 300 పాయింట్లు కోల్పోయామని, వీటిని సంపాదించినట్లయితే, తప్పకుండా విశాఖపట్నం టాప్ – 5 ర్యాంకులో ఉండేదని కమీషనర్ వ్యక్తం చేసారు.  , చెత్త రహిత నగరంగా జి.వి.య.సి. 3 స్టార్ రేటింగును ఈ సంవత్సరం సాధించిందని కమీషనర్ వ్యక్తం చేశారు. 

Visakhapatnam

2020-08-20 18:54:09

గ్రామ, వార్డు వాలంటీర్లు తోక జాడిస్తే ఇక వేటు తప్పదు..

గ్రామవాలంటీర్లు తోక జాడిస్తే వేటు వేయడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. వరుసగా 3రోజులు విధులకి హాజరు కాకపోతే వెంటనే 6వరోజు తొలగించి ఆ స్థానాన్ని7వ తేదీన ఖాళీగా ప్రకటిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీ ఏర్పడ్డ వాలంటరీ పోస్టులను 14 రోజుల్లో భర్తీచేస్తారు. వలంటీర్లు,వారం లోసోమ,బుధ,శుక్రవారాల్లోతప్పసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. హాజరునుఎప్పటికప్పుడు గ్రామ,వార్డు సచివాలయ అధికారులు,పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం జిల్లాలో ఖాళీల భర్తీకి సచివాలయ జెసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కమిషనర్లు, ఎంపీడీఓలు భర్తీకి చర్యలు తీసుకుంటారు. పోస్టుల భర్తీకి,స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. చాలా చోట్ల గ్రామవాలంటీర్లు విధులకు హాజరు కాకపోవడం, సక్రమంగా సేవలు అందించకపోవడంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులతో చెప్పించుకొని మరీ వీరు విధులకు హాజరు కావడంలేదు. 

Amaravathi

2020-08-20 14:28:45

వర్షంలోనే వరదగోదావరిలో వేలేరుపాడు చేరుకొని..

గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఇన్చార్జి మంత్రి పేర్ని నానిలు అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో వరద బాధితులతో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి మాట్లాడారు. అనంతరం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరికీ రూ.2వేలు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తామని వివరించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి రుద్రమకోటలో వర బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద బాధితులకు సహాయక శిబిరాల్లో ఎక్కడ లోపం రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పిన మంత్రులు వసతి శిబిరాల్లో నాణ్యమైన ఆహారం.. పిల్లలకు బిస్కెట్ పాకెట్స్, పాలు, రొట్టెలు ప్రభుత్వం తరపున అందిస్తున్నామన్నారు. ఇక్కడ పనిచేసే అధికారులు మానవతా ద్రుక్పదంతో పనిచేసి బాధితులకు సేవలు చేయాలని అన్నారు. ఎలాంటి అవసరం ఏర్పడినా తక్షణమే స్పందించాలని జిల్లా  కలెక్టర్ ని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ, అధికార యంత్రాంగ మంతా వరద బాధిత పనుల్లోనే నిమగ్నమై వుంటుందని వివరించారు.

Veerullapadu

2020-08-20 13:05:51

విశాఖ అభివ్రుద్ధి వైఎస్సార్ ది కాదని నిరూపిస్తే.. రాజీనామా

విశాఖతోపాటు ఉత్తరాంధ్రా అభివ్రుద్ధిని కావాలనే టిడిని అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని అనకాపల్లి ఎమ్మల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్ నాధ్ మండి పడ్డారు. విశాఖలో గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో అభివ్రుద్ధి వైఎస్సార్ తరువాత, సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలోనే జరిగిందని కాదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అమర్ సవాల్ విసిరారు. విశాఖపై కావాలనే విషయం చిమ్ముతూ, అభివ్రుద్ధికి అడ్డం పడుతున్నారని అన్నారు. ఎక్కడో తెలంగాణలోని హైదరాబాదులో కూర్చొని జూమ్ యాప్ ద్వారా రాజకీయం చేసే చంద్రబాబు విశాఖ అభివ్రుద్ధికి మోకాలు అడ్డుపెట్టడం మానుకోవాలన్నారు. దేశంలోనే కరోనా నియంత్రణ విషయం సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదర్శంగా నిలిస్తే దానిని తట్టుకోలేని చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ రఘురామక్రిష్ణరాజు లాంటి తేడా రాజకీయ నాయకులతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆధారాలు లేకుండా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయనడం 40ఏళ్ల పొలిటిక్ ఇండస్ట్రీకి సిగ్గుచేటన్నారు. విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయని విశాఖ వాసులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, ప్రభుత్వ అభివ్రుద్ధిపైనా నిరుద్యోగ నిర్మూళనపైనా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని అమర్ ప్రశ్నించారు...

Visakhapatnam

2020-08-20 12:11:09

ఇక ఆర్టీసీ కార్మికుల‌కు రూ.50 ల‌క్ష‌ల కోవిడ్ బీమా

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది... ఆర్టీసీ కార్మికులకు కోవిడ్ బీమా వర్తింపజేయాలని నిర్ణ‌యించింది. ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల చొప్పున కోవిడ్ బీమా వర్తింప జేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  కార్మిక పరిషత్ సహా కార్మికుల వినతిపై స్పందించి ఆర్టీసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే విష‌యంపై ఆర్టీసీ ఎండీ కృష్ణబాబునుని కలసి నిన్న వినతి పత్రం అందించారు కార్మిక పరిషత్ నేతలు. ఈ క్ర‌మంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింప జేస్తున్న‌ట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీలో కరోనాతో ఇప్పటి వరకు 36 మంది మరణించిన నేప‌థ్యంలో..వారంద‌రికీ బీమా వర్తింపజేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. మృతుల వివరాలు సహా తగిన డాక్యుమెంట్స్‌ పంపాలని అన్ని జిల్లాల రీజ‌న‌ల్ మేనేజ‌ర్స్‌కు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 లోపు అన్ని డాక్యుమెంట్స్‌ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎండీ ఆదేశించారు.

Amaravathi

2020-08-19 21:07:17

వాలంటీర్లుకు చప్పట్లో అభినందనలు...

అక్టోబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఏడాదిలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అనేక మార్పులు తెచ్చామన్న ఆయన ప్రజలకు గ్రామస్థాయిలోనే పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలన్నీ అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చంద్రబాబు మాపై ఎన్ని విమర్శలు చేసినా అనుకున్నది చేసి చూపించమన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష 26వేల మందికి శాస్వత ఉద్యోగాలు కల్పించిన ఘనతకూడా సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ఈ ఉద్యోగాల పరంపర రాష్ట్రంలో నిరాటంకంగా కొనసాగుతుందన్నారు.

Amaravathi

2020-08-18 20:55:05

ముంపు బాధితులకు రూ.2వేలు నష్టపరిహారం..సీఎం

‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కనుక మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉండండి... నేను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు ఆ విషషయం చెప్పడానికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నానని’ సీఎం జగన్‌ తెలిపారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ సమీక్షకు కాకినాడ నుంచి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బిసి సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఇతర అధికారులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు. ‘‘వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయండి. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వారు ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టండి. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించండి. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్‌ 10 రోజుల్లోగా చేయాలి. విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Kakinada

2020-08-18 15:27:26

శాంతిస్తున్న వరదగోదావరి..ముంపులోనే పల్లె గ్రామాలు..

భద్రాద్రిలో గోదారమ్మ వరద ఉద్రుతి నుంచి శాంతిస్తోంది...క్రమేనా నీటి ప్రవాహం కూడా తగ్గుతూ వస్తోంది. ఈ రాత్రికి ఎగున వర్షాలు పడకపోతే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్న గోదావరి రాజమహేంద్రవరం దవళేశ్వర వద్ద తమ ఉద్రుతిని చూపిస్తుంది. ఇదే సమయంలో గోదవారీ నదీ పాయల నుంచి వచ్చే వరద నీరు ఏకం కావడతో బ్యారేజికి వరదనీటి తాకిడి అధికమవుతుంది. ఈరోజు ఉదయం వర్షాలు సక్రమంగా పడకపోవడంతో ఇక్కడ కూడా వరదనీటి ఉద్రుతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్న అధికారులు వరద ప్రవాహం తగ్గితే తప్పా గేట్టు పూర్తిగా మూసే పరిస్థితి లేదని చెబుతున్నారు. కానీ లోతట్టు ప్రాంతాల వారికి మాత్రం ముప్పు మాత్రం పొంచే వుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రంపచోడవరం డివిజిన్ లో చాలా గ్రామాలు జలమయం అయ్యాయి.

Rajahmundry

2020-08-18 13:28:37

ఆన్ లైన్ క్లాసులో సెక్స్ వీడియోల కలకలం..

కరోనా టైమ్ లో ఆన్ క్లాసులు మాట ఎలా ఉన్నా..పాఠశాల విద్యార్ధినిలు మాత్రం సెక్స్ వీడియోలు చూడాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలోఆన్‌లైన్ క్లాసెస్ కోసం ఏర్పాటు చేసిన విద్యార్థినుల గ్రూప్‌లో సెక్స్ వీడియో కలకలం రేపింది. జిల్లాలోని పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూల్ పాఠశాల విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కోసం తరగతికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో ఎనిమిదో తరగతి విద్యార్థినుల గ్రూప్‌లో గుర్తు తెలియని వ్యక్తి సెక్స్ వీడియో పోస్ట్ చేశారు. వీడియో గ్రూప్‌లో పోస్ట్ చేసి రెండురోజులైనా కనీసం డిలీట్ చేయలేదు. ఆ తరగతి ఉపాధ్యాయులు కూడా పట్టించుకోకపోవడంతో విషయం సీరియస్ అయింది. విద్యార్థినుల గ్రూప్‌లో సెక్స్ వీడియో వ్యవహారం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు నేరుగా ఎంఈవో ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ క్లాసెస్ గ్రూప్‌లో అసభ్యకర వీడియో పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి...

Kurnool

2020-08-18 13:01:34

మళ్లీ భారీగా మిగిలిపోనున్న ఆ పోస్టులు...

గ్రామసచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా యానిమల్ హజ్బండరీ అసిస్టెంట్ పోస్టులు రెండోసారి నోటిఫికేషన్ లో కూడా భారీగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం ఈ పోస్టులకి సంబంధించి అర్హులైన వారు చాలా తక్కువ మంది ఉండటమే. గ్రామ, వార్డు సచివాలయంలో యానిమల్ హజ్బండరీ సహాయకుల పోస్టుకి డిప్లమా యానిమల్ హజ్బండరీ చేసి ఉండాలి. అలా కోర్సు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నా ప్రస్తుతం చాలా పోస్టులు మిగిలిపోయాయి. తొలుత ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నవారికి మార్కులు చాలా తక్కువగా వచ్చినప్పటికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. అయినా చాలా పోస్టులు మిగిలిపోయాయి. ఇపుడు యానిమల్ హజ్బండరీ కోర్సు చేసినవారు తక్కువగా ఉండటంటో దరఖాస్తులు తక్కువ, పోస్టులు ఎక్కువ అన్నట్టు అయిపోయాయి. వాస్తవానికి బీఎస్సీ కోర్సు చేసిన వారిని తొలుత ఈ పోస్టులకు అర్హులుగా చేయాలని ప్రభుత్వం భావించినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. కాగా చాలా చోట్ల ఈ కోర్సుకి సంబంధించి ఏడాది కోర్సులు చేసిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తుంది...

Amaravathi

2020-08-18 11:47:26

నటి మాధవీలతపై కేసునమోదు చేసిన సైబర్ క్రైమ్

నటి, రాజకీయ నాయకురాలు మాధవీలతపై సైబర్ క్రైమ్ లో  కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మాధవీలత.. తన ఫేస్‌బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ పెట్టడంతో, వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఆమెపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో గోపీకృష్ణ పిర్యాదు స్వీకరించిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం ఆమెపై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మాదవీలత హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన పోస్టులపై అటు నెటిజెన్లు కూడా తీవ్రంగా మండి పడుతున్నారు. చేసిన పోస్టులపై మాటల్లో చెప్పరాని విధంగా తిట్ల దండకాన్ని కూడా కామెంట్ల రూపంలో పోస్టు చేస్తున్నారు. ఇటీవల కాలంలో హిందులకు సంబంధించి కించపరిచే విధంగా చేస్తున్న పోస్టుల సంఖ్య సోషల్ మీడియాలో పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది..

Vanasthalipuram

2020-08-18 11:33:09

సెప్టెంబ‌రు 19నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.  బ్ర‌హ్మోత్స‌వాల్లో విశేష‌మైన రోజుల వివ‌రాలిలా ఉన్నాయి.  సెప్టెంబ‌రు 19న - ధ్వ‌జారోహ‌ణం సెప్టెంబ‌రు 23న - గ‌రుడ‌సేవ‌ సెప్టెంబ‌రు 24న - స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం సెప్టెంబ‌రు 26న - ర‌థోత్స‌వం సెప్టెంబ‌రు 27న - చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం. ఉంటాయి. కరోనా నేపథ్యంలో స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అతి తక్కువ మందితోనే నిర్వహించేందుకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది...

Tirumala

2020-08-17 15:47:43