1 ENS Live Breaking News

సెప్టెంబ‌రు 19నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.  బ్ర‌హ్మోత్స‌వాల్లో విశేష‌మైన రోజుల వివ‌రాలిలా ఉన్నాయి.  సెప్టెంబ‌రు 19న - ధ్వ‌జారోహ‌ణం సెప్టెంబ‌రు 23న - గ‌రుడ‌సేవ‌ సెప్టెంబ‌రు 24న - స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం సెప్టెంబ‌రు 26న - ర‌థోత్స‌వం సెప్టెంబ‌రు 27న - చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం. ఉంటాయి. కరోనా నేపథ్యంలో స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అతి తక్కువ మందితోనే నిర్వహించేందుకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది...

Tirumala

2020-08-17 15:47:43

బిర బిరా క్రిష్ణమ్మ పరుగులెడుతుంటేను...

కృష్ణా బ్యారేజ్ వద్ద వరద నీటితో క్రిష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజిలోని 70 గేట్లును ఒక అడుగుమేర లేపి నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు అధికారులు. ఎగువున కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి అత్యధిక మొత్తంలో వరదనీరు వచ్చిచేరుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు ఆ ప్రాంతాలన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు. 

Vijayawada

2020-08-16 16:15:30

భద్రాధ్రిలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ...ఇక కష్టమే

తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో బూర్గంపహాడ్ మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తక్షణమే వెళ్లిపోవాలని అధికారులు మైకు ద్వారా ప్రచారం చేపట్టారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గోదారి ఉగ్ర రూపం రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నది. గోదావరి గట్టు వెంబడి ఉన్నవారిని, నదీపరీవాహక ప్రాంతాల వారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా లంక ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు తరలించారు. ఈ ప్రాంతాన్ని చూడటానికి వెళ్లకుండా గోదావరి కట్ట ప్రాంతంలో ఆంక్షలు అమలు చేశారు. గోదారి పూర్తిగా నిండుగా ప్రవహించడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు...

Badradri

2020-08-16 16:03:02

తిరుపతిలో 9 ప్రాంతాల్లో కరోనా పరీక్షా కేంద్రాలు..

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే సమాచారాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయాలని కమిషనర్ గిరీష సూచించారు. ప్రజల సౌకర్యార్ధం తొమ్మిది ప్రాంతాల్లో కోవిడ్ 19 పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలాన్నరు. పరీక్షా కేంద్రాలు వరుసగా.. 1. అర్బన్ హెల్త్ సెంటర్ బైరాగి పట్టెడ, మీసేవ వద్ద 2. అర్బన్ హెల్త్ సెంటర్ స్కాన్జర్స్ కాలనీ, చాపల మార్కెట్ ఎదురుగా. 3. అర్బన్ హెల్త్ సెంటర్ సిమ్స్ హాస్పిటల్ సర్కిల్, నెహ్రూ నగర్. 4. అర్బన్ హెల్త్ సెంటర్ పోస్టల్ కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, రేణిగుంట రోడ్డు. 5. అర్బన్ హెల్త్ సెంటర్ ఆటోనగర్, రేణిగుంట రోడ్డు. 6. అర్బన్ హెల్త్ సెంటర్ శివ జ్యోతి నగర్, అంబేద్కర్ విగ్రహం దగ్గర జీవకోన. 7. హార్ట్ హెల్త్ సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ప్రకాశం రోడ్డు. 8. మున్సిపల్ హెల్త్ సెంటర్, ప్రకాశం రోడ్డు. 9. అర్బన్ హెల్త్ సెంటర్ ఎర్ర మిట్ట, లీలామహల్ రోడ్డు, తిరుపతి. నగర ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే నే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని, కోవిడ్ లక్షణాలు లేకపోతే రాకూడదని తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో సాయంత్రం 5 గంటల పైన దుకాణాలు తెరిచిన చోనగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0877-2256766 కి తెలియజేయవలెను.

Tirupati

2020-08-16 15:04:06

తిరుపతిలో 31 వరకూ కోవిడ్ లాక్ డౌన్ అమలు..

తిరుపతి నగరంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టేందుకు నగరపాలక సంస్థ పరిధిలోని లాక్ డౌన్ పొడిగించే ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈనెలఖరు వరకు కరోనా లాడ్ డౌన్  ఆంక్షలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నగరంలో లో అన్ని వ్యాపార లావాదేవీలకు అనుమతులు ఉంటాయి అన్నారు, నగరంలో ప్రతి ఒక్కరు సాయంత్రం  5:00 గంటల నుండి  అత్యవసరమైతే తప్ప బయట ఎవరు తిరగకూడదని తెలియజేశారు. ప్రజారోగ్యం ద్రుష్ట్యా ఈ చర్యలు తీసుకున్నామన్న ఆయన ఎవరైనా నిభంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారస్తుల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. లాక్ డౌన్ తీరును ప్రత్యేక బ్రుందాలు తనిఖీ చేస్తాయనే విషయాన్ని వ్యాపార సంస్థలు గుర్తుంచుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

Tirupati

2020-08-16 15:00:50

కరోనా మ్రుతదేహాలను మంచి మనసుతో దహనంచేయండి

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని కరకంబాడి రోడ్డు నందు గోవింద దామం వద్ద కోవిడ్ 19 కరోనా వైరస్ పాజిటివ్ తో చనిపోయిన వారికి ఆదివారం ఉదయం తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష మరియు నగరపాలక సంస్థ అధికారులతో గోవింద దామం లో కరోనా తో మృతి చెందిన ఓ మహిళ మృతదేహానికి దహన క్రియలు నిర్వహించారు, మహిళా మృతదేహానికి దహన క్రియలు నిర్వహించే ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రంలో పంపి మృతదేహానికి దహన క్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ తో చనిపోయిన వారు దహన క్రియలు కుటుంబ సభ్యులు రాకపోవడం చాలా బాధించిందని ప్రభుత్వం వారు, వైద్య నిపుణులు ఆత్మస్థైర్యం నింపుట కోసం  నేడు కమిషనర్ వారితో పాటు కరోనా వైరస్ తో చనిపోయిన మహిళకు దహన సంస్కారాలు చేయడం జరిగిందని, గత ఆరు, ఏడు నెలల క్రితం సోకిన నటువంటి వైరసు ప్రపంచ దేశంలో వ్యాపించి కోట్ల మందిని ఈ జబ్బు సోకిన చాలా మంది మరణించడం జరిగింది అని, చనిపోయిన మనుషులు వైరస్ బతికి ఉండదని, భయాన్ని పోగొట్టడం కోసం చనిపోయిన మహిళకు దహన సంస్కారాలు చేయడం వాళ్ళ ఆత్మలు సంతృప్తి చెందుతుందని, వారు ఎక్కడున్నా సంతోషంగా పడతారని, చనిపోయిన వారి బంధువులు, కుటుంబ సభ్యులు, ప్రజలు భయాన్ని వీడాలని, చనిపోయిన కుటుంబ సభ్యులు వారికి కావలసిన బంధువులు పాల్గొనవచ్చని కరోనా సోకిన వ్యక్తి  మరణించగానే, వారి శరీరంలోని వైరస్ కూడా చనిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అని తెలియజేశారు. అనంతరం కమిషనర్ గిరీష మాట్లాడుతూ ఎమ్మెల్యే గారితో పాటు అధికారులు మరియు వైద్యులతో మాట్లాడి ఒక వారం నుండి ప్రతి ఒక్కరికి సందేశం నిర్వహించడం జరిగిందని మరియు అవగాహన నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం వారు, వైద్యులు మార్గదర్శకాలు చేస్తున్నారని, కరోనాతో చనిపోయిన వారి మృతదేహాన్ని లీక్ ఫ్రూప్ ప్లాస్టిక్ బాడీ బ్యాగ్ లో ఉంచడం జరుగుతుందని, బ్యాగ్ వెలుపలి భాగాన్ని హైపోక్లోరైట్ తో శుభ్రపరచడం జరుగుతుందని, మృతదేహాన్ని తరలించే సిబ్బంది పిపిఈ కిట్లు వాడతారని, మృతదేహాన్ని రవాణా చేసే వాహనాలను హైపోక్లోరైట్ ద్రావణంతో క్రిమిసంహారం చేయడం జరుగుతుందని, అంత్యక్రియలు మృతదేహాన్ని తాకకుండా మతపరమైన ఆచారాలను ద్వారా చేసుకోవచ్చని, అంత్యక్రియలలో పూర్తయ్యాక చేతులు శుభ్రం చేసుకుంటే చాలని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి వారితోపాటు కమిషనర్ గిరీష, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, గోవింద ధామం గౌరవ అధ్యక్షుడు టెంకాయల దామోదరం, కార్యదర్శి ఆదం సుధాకర్ రెడ్డి, శానిటరీ మేస్త్రి రాజా, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2020-08-16 15:00:06

గ్రామసచివాలయ ఉద్యోగుల ప్రసవ సెలవులపై క్లారిటీ ఏది

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే మెటర్నటీ లీవులు అమలు కావడం లేదు. ఈ సెవులపై సచివాలయ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకూ సరైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పటి వరకూ కాన్పుకోసం కోసం సెలవులు పెట్టుకున్నవారికి, ప్రత్యేక సెలవుకి సంబంధించి జీతాలు కూడా వారి ఖాతాలకు జమ కాలేదు. అసలు మెటర్నటీ సెలవులు ఎవరు ఏశాఖ అధికారి మంజూరు చేస్తారు, ఎవరికి సదరు సెలవుకోసం దరఖాస్తుచేయాలి, సేలరీతో కూడిన సెలవులు ఇస్తారా, లేదంటే తరువాత సెలవుల బిల్లు మంజూరు చేస్తారా  కూడా తెలియని పరిస్థితుల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాస్తవానికి మహిళలకు ఇచ్చే మెటర్నటీ లీవుకి సంబంధించి సెలువులు పెట్టే సమయంలోనే ప్రభుత్వం నిర్ధేశించిన జీఓఎంస్ నెంబరు 152 ప్రకారం, సదరు జీఓ కాపీలను జతచేసి లీవు నెల రోజులు ముందుగా దరఖాస్తు చేస్తే, సంబంధిత ఉద్యోగికి జీతంతో కూడిన 6 నెలలు సెలవు మంజూరు కావాలి. జిఓఎంఎస్ నెంబరు 132 ప్రకారం మరో 60 రోజులు ప్రత్యేక చంటిబిడ్డ సంరక్షణ సెలవులు మంజూరు కావాలి. లేదంటే సెలవులు పూర్తి అయిన తరువాత కూడా ప్రత్యేకంగా లీవుకి సంబంధించి సాలరీ బిల్ పెడితే అది మంజూరు కావాలి.  ఏపీలో మిగిలిన ప్రభుత్వ శాఖల్లో మెటర్నటీ లీవు సక్రమంగానే అమలు జరుగుతున్నా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి క్లారిటీ లేకపోవడంతో వారు తమ సెలవులకి సంబంధించి జీతాలు వస్తాయోరావో తెలియని పరిస్థితిలో కొట్టిమిట్లాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో  సుమారు 250 మంది వరకూ మెటర్నటి సెలవులకు సంబంధించి సాలరీ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన తరువా సుమారు 14శాఖలకు సంబంధించిన అధికారుల నుంచి ఈ సెలవులపై క్లారిటీ రావాల్సి వుంది. మరోవైపు తమ ఉద్యోగాలు సర్వీస్ రెగ్యులర్ కానందునే ఇలా జరుగుతున్నాయనే ఆందోళన కూడా సచివాలయ మహిళా ఉద్యోగుల్లో ఉంది. ముఖ్య సమస్య ఏంటంటే సచివాలయ ఉద్యోగులకు ఆయాశాఖల జిల్లా అధికారుల నుంచి విధులు, విధి విధానాలు, సెలవులు, ఇతరత్రా వాటిపై ఎలాంటి ఉత్తుర్వులు గానీ, సూచనలు లేకపోవడమే దీనికారణంగా కనిపిస్తుంది. ఈ విషయంలో రాష్ట్రస్థాయి అధికారులే చర్యలు తీసుకోవాల్సి వుంది...

Amaravathi

2020-08-16 13:31:07

విశాఖలో మనిషి తలను నిప్పులపై కాల్చుకొని తింటూ...

విశాఖ రెల్లివీధిలో మనిషి తల కలకలం రేపింది.. పాడుబడ్డ ఇంట్లో మనిషి తలను కాల్చుకుని  తింటున్న ఓవ్యక్తిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అతడిని గమనిస్తున్నారని తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిపై ఒంటరిగా ఉంటూ రావేలపూడి రాజు(20) అనే వ్యక్తి సైకోగా మారాడని స్థానికులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే నిందితుడిపై సస్పెక్ట్ షీట్‌ ఉందని పోలీసులు చెప్పారు. సైకో తీసుకొచ్చిన తల ఎవరిది? ఎక్కడైనా హత్య చేసి తలను తీసుకొచ్చాడా? లేక ఏదైనా స్మశానంలో శవం తల దొరికితే తీసుకొచ్చి తినేందుకు ప్రయత్నించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..అసలే కరోనా సమయంలో ఏ వ్యక్తి తలను తీసుకొచ్చాడోనని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలను ఎవరినీ బయటకు రానీయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడటం కనిపించింది...

Relliveedhi

2020-08-16 13:06:46

జనసేన కార్యకర్తకు సీఎంవైస్ జగన్ సహాయం రూ.10లక్షలు

తూర్పుగోదావరి జిల్లా పిఠపురానికి చెందిన జనసేన కార్యకర్త తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధితో భాదపడుతున్నాడు.ఆయనకు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ చేయించాలి.ఇప్పటికి చాలా ఖర్చే అయ్యింది. ఇక వైద్యం చేయించడానికి ఆ కుటుంభ స్తోమత సరిపోదు సరికరా ఎవరు సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు..ఈ విషయాన్ని ఒక స్వచ్ఛంద సంస్ద పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు దృష్టికి తీసెకెళ్లడంతో దానిని ఆయన ట్విట్టర్ లోపెట్టారు. అది కాస్త సీఎం వైఎస్ జగన్ వరకూ వెళ్లింది. వెంటనే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.10లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి  మంజూరు చేశారు. ఆపద సమయంలో వ్యక్తి ఎవరైనా జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో చేసిన ఈ సహాయం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్రాణం నిలబెట్టడానికి సీఎం స్పందించిన తీరుపై పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   

Pithapuram

2020-08-16 12:22:36

కోస్తాంధ్రాకి మూడు రోజులు భారీ వర్ష సూచన...

ఉత్తర కోస్తా ఒడిశా దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, గాంగేటిక్‌ పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తాలోని ఉభయగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని పేర్కొన్న వాతవారణ శాఖ ఇవాళ, రేపు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు రేపూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడంతోపాటు రెవిన్యు యంత్రాన్ని సన్నద్ధం చేసింది ప్రభుత్వం. ఎప్పుడు ఎలాంటి సంఘటన జరిగినా తక్షణమే స్పందించే విధంగా తహశీల్దార్ లను సమాయత్తం చేసింది.

Amaravathi

2020-08-16 11:28:08

కృష్ణమ్మకు భారీగా వరదనీటి ఉద్రుతి...

భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనితో మొత్తం 70 గేట్లు అడుగు మేర ఎత్తి వరద నీరు సముద్రం లోనికి విడుదల చేస్తున్నారు అధికారులు. వరద నీటితో బ్యారేజ్ కి ఇన్ ఫ్లో లక్షా పదివేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 91 వేల కుసెక్కులు గా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం వుందని వివరిస్తున్నారు. భారీగా వస్తున్న వరదనీటి ప్రవాహం కారరణంగా దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. క్రిష్ణాజిల్లా కలెక్టరేట్ లోప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ క్షణంలోనైనా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవిన్యూ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Krishna River

2020-08-16 11:14:57

మహా విశాఖలో ఒకేఒక్కడు..ఈ పాముల రక్షకుడు..!

విశాఖలో ఎక్కడైనా పాముకనిపిస్తే అయ్యో పాము అనరు స్నేక్ సేవర్ కిరణ్ ఎక్కడ అంటారు...! వెంటనే మొబైల్ తీసుకొని 9849140500 కి ఫోన్ చేస్తే టక్కున ప్రత్యక్షమవుతాడు ఆ పాములోడు..పాములోడు అంటే పాములను ఆడించే వ్యక్తిని అనికాదు..పాములను రక్షించే ఇలలోక పరమశివుడు అనే అనుకోవాలి ఈ రొక్కం కిరన్ కుమార్ ని. మహా విశాఖలో ఈయన ఒకేఒక్కడిగా పాములను రక్షిస్తున్నాడు.. ఎక్కడ పాము చేరినా దానిని రక్షించి అడవిలో విడిచిపెడుతుంటాడు ఈ స్నేక్ కిరణ్. ఇప్పటి వరకూ ఎన్నివేల పాములను రక్షించాడో లెక్కమాత్రం తెలియనన్ని కాపాడారు. కొన్ని సమయాల్లో అరుదైన పాముజాతులను జూ అధికారులకు అందజేస్తాడీయన. ఈయన సేవలను గుర్తించిన యువజన సర్వీసుల శాఖ పంద్రాగస్టు రోజున ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు. స్నేక్ సేవర్ సొసైటీ నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు...

Visakhapatnam

2020-08-16 10:26:38

ప్రముఖ పుణ్య క్షేత్రంగా అరసవిల్లి.. మంత్రి వెల్లంపల్లి

రాష్ట్రంలోనే ప్రముక పుణ్యక్షేత్రంగా అరసవిల్లి శ్రీ సూర్యభగవానుడి దేవస్థానాన్ని తీర్చి దిద్దుతామని రాష్ట్ర దేవదా య శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని), రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు అన్నారు. శనివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శని వారం దర్శించుకున్నారు.  రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు చేపడతామన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయం ప్రముఖ్య పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నామని చెప్పారు. కరోనా త్వరితగతిన వలదలాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేపట్టుటకు ముఖ్య మంత్రి యోచిస్తున్నారని, ఆయనకు స్వామి వారి ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు.             రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) మాట్లాడుతూ ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి అన్నారు. కరోనా నుండి కాపాడాలని, త్వరితగతిన ముక్తి లభించాలని స్వామి వారని కోరుకున్నామని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి ప్రజల సంక్షేమాన్నిదృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేస్తూ రాజధాని, ఇళ్ళ పట్టాల పంపిణీ వంటి సమస్యలు త్వరలో పరిష్కారం కాగలవని తద్వారా ప్రజలకు మేలు కలగలాని ఆశిస్తున్నట్లు చెప్పారు.             రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రజల సంక్షేమం దృష్టితోనే కార్యక్రమాలు చేపడుతున్నారని, అవాంతరాలు త్వరితగతిన తొలగి ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు.  శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్ధానానికి చేరుకున్న మంత్రులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాష్, అర్చకులు వేదపఠనాలతో ఆహ్వానం పలికారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వచనాలను అందజేసారు.  ఈ కార్యక్రమంలో రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, ఆలయ కమిటి సభ్యులు మండవ రవి., దువ్వాడ శ్రీనివాస్, అంధవరపు సూరిబాబు, ప్రకాష్, మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-08-15 19:56:55

శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం..

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్ర‌వారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా కొద్ది మంది పురోహితులతోనే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు, శ్రీకృష్ణ‌స్వామివారిని ముఖ మండ‌పంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఉభ‌య‌దారులు ఉభ‌యాలు స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా స్వామివారు దివ్య మంగళ రూపంతో బక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  పార్వ‌తి, ఏఈవో  దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్  ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  ర‌మేష్ తదితరులు పాల్గొన్నారు. 

Tirupati

2020-08-14 19:06:13