దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని సందర్భంగా బుధవారం కడప జిల్లాలోని ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తన తండ్రి సమాధి వద్ద సుమారు 15 నిమిషాల పాటు వైఎస్ జగన్ అలాగే మౌనంగా ఉండిపో యారు. అనంతరం కుటుంబ సభ్యులుతో కలిసి కాసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అధికంగా ఉన్న సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చే జర్నలిస్టులకు, సిబ్బందికి మంగళవారమే కోవిడ్ పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చిన అధికారులను, పోలీసులను, జర్నలిస్టులను మాత్రమే కవరేజికి అనుమతించారు. వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయ వద్ద భారీ బందో బస్తును కడపజిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ నడుస్తున్న వెల్ నెస్ కేంద్రాల్లో 24 వైద్య సహాయం అందించడం ద్వారా నిరుపేదలు ప్రైవేటు ఆసుప త్రులకు వెళ్లే భారంత తప్పుతుందని బిజెపీ సీనియర్ నేత కొప్పల రామ్ కుమార్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల(వెల్ నెస్)లో అన్ని విభాగాల్లో ఇద్దరు చొప్పున నియమించిన ప్రభుత్వం ప్రధానంగా వ్యాధి నిర్ధారణ చేసే పారామెడిల్ సిబ్బంది(ల్యాబ్ టెక్నీషియన్) మాత్రం ఒక్కరినే నియమించడం ద్వారా అత్యవసర సమయంలో వ్యాధి నిర్దారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇద్దరు వైద్యులు, ముగ్గురు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు ఫార్మాసిస్టులు, మరో ఇద్దరు ఎంఎన్ఓ లను నియమించడం ద్వారా 24 ప్రాధమిక వైద్య కేంద్రాల్లో వైద్యం అందించడానికి వీలు పడుతుందన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్టులకే అధికంగా పేద ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అత్యవసర సమయాల్లో వ్యాధి నిర్ధారణ కాకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వం పారామెడికల్ సిబ్బందిని కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరిద్దరు చొప్పున నియమించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని కూడా రామ్ కుమార్ గుర్తుచేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్యాన్ని తెలుసుకునే మేల్(మగ) ఆరోగ్య కార్యకర్తలను కూడా నియమించాలన్నారు. తద్వారా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసినట్టు అవుతుందన్నారు. అదే సమయంలో పూర్తిస్థాయిలో నాణ్యమైన మందులు, కనీసం 100 రకాల మెడికల్ టెస్టులు చేసే విధంగా యంత్ర సామాగ్రి కూడా పీహెచ్సీలకు కేటాయించడం ద్వారా ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని రామ్ కుమార్ సూచించారు.
పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వాలని మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుకు మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్డీపీవో) నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై నోటీసు అందిన వారం రోజుల లోపు, తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చంద్రబా బుకు పంపిన నోటీసు పంపిన మదనపల్లి సబ్ డివిజనల్ అధికారి ఆదేశించారు. సీఆర్పీసీ 91 ప్రకారం నోటీసు ఇచ్చిన అధికారలు ఓం ప్రతాప్ మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా ఇదే విషయమై ఆగస్ట్ 27 న దినపత్రికల్లో కథనాన్ని నోటీసులో ప్రస్తావించిన పోలీసు మీ దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాధారాలను అందజేయాలని పేర్కొన్నారు. మదనపల్లి ఎస్డీపీవో నుంచి చంద్రబాబుకు నోటీసులు వెళ్లిన విషయం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాసిన పత్రికలకు కూడా నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతోంది. గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే కఠిన చర్యలు మీడియాపై కూడా తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు నేరుగా మీడియా సంస్థలకు, మాజీ సీఎం చంద్రబాబుకి నోటీసులు పంపింది.
విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది... భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతినేపథ్యంలో వారం రోజుల తర్వాత ఫ్లైఓవర్ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ముందుగా ఈ నెల 4వ తేదీన ఫ్లైఓవర్ను ప్రారంభించాలని భావించారు. అయితే, ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఏడు రోజుల పాటు సంతాపదినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంతో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు అధికారులు. అయి తే, ఈ నెల 7 లేదా 8వ తేదీన ఫ్లైఓవర్ను ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. కాగా, ఈ మధ్యే నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభా నికి సిద్ధమైంది.. ట్రయల్ రన్ కొనసాగుతుండగా.. ఓ వైపు కృష్ణమ్మ, మరోవైపు విజయవాడ, మధ్యలో దుర్గగుడి ఫ్లైఓవర్కు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఈ మధ్యే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.. మొదట డేటైంలో తీసిన డ్రోన్ వీడియో.. ఆ తర్వాత రాత్రి సమయంలో చిత్రీకరించి మరో వీడియో ఎంతగానో ప్రజలను ఆకట్టుకుంది.
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్ అందరికీ సోకుతోంది. తాజాగా... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనను ఈ మధ్యలో కలిసిన కార్యకర్తలు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ ను ఎవరూ తక్కువగా చూడొద్దని, ఖచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకుండా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చి, మిగిలిన సమయం అంతా ఇంటికే పరిమితం కావాలని చూచిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు అధికంగా కరోనా వైరస్ సోకుతున్న తరుణంలో, మంత్రులు వెంట తిరిగే నాయకులు, కార్యకర్తలు జాగ్రత్త వహించాలని కూడా పెద్దిరెడ్డి కోరారు. వైద్యం పూర్తయ్యేంత వరకూ ఎవరూ చూడటానికి రావొద్దని, ఏదైనా ముఖ్య సమాచారం వుంటే ఫోను, సెల్ ఫోనులో సంప్రదించాలని మంత్రి నాయకులను కోరారు.
విశాఖలోని ఎనస్తీయ డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ పేర్కొంది. ఈమేరకు మంగళవారం సిబిఐ హైకోర్టుకి తెలియజేసింది. కుట్ర కోణం గురించి లోతుగా దర్యాప్తు చేయటానికి మరికొంత సమయం కావాలని కోర్టుని కోరింది. దీంతో రెండు నెలలు సమయం ఇచ్చిన హైకోర్టు..నవంబర్ 11 నాటికి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 16 కు వాయిదా వేసింది. కాగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్ గావిధులు నిర్వహిస్తున్న సుధాకర్ ప్రభుత్వం కోసం విధినిర్వహణలో ఉండగానే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తరువాత ఆయనను విశాఖలో పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో పెద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తరువాత సుధాకర్ ను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖలోని చినవాల్తేరు మానసి వైద్యాలయంలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే ఆయన తనను చంపేయాలని చూస్తున్నారని ఫోలీసులకు ఫిర్యాదు చేసి, ఆపై కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే..తాజాగా ఈ విషయంపై విచారణ చేసిన హైకోర్టుకి సిబిఐ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగివుందని చెప్పడం సంచలం కలిగిస్తోంది...
స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందనే భరోసా కలిగేలా పాఠ్యప్రణాళిక తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీల కోసం ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి మేకపాటి గౌతం రెడ్డితో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. సీఎం మాట్లాడుతూ, ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్దిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషించేలా ఉండాలన్నారు. దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ చేస్తున్నామని అధికారులు సీఎంకి వివరించారు. కోర్సులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధంచేశామని, ఫినిషింగ్ స్కిల్కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు.. ఇలా రెండు రకాలుగా స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు సీఎంకి వివరించారు. 162కి పైగా కోర్సుల ద్వారా ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పిన అధికారులు ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయని చెప్పారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాల ఉండేలా మొత్తం రాష్ట్రంలో 30 కశాశాలల నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పాఠ్యప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామని, సింగపూర్ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్ హాల్ లారెన్స్టెన్ (యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్), డిపార్ట్ మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భాగస్వామ్యాన్ని తీసుకున్నామని తెలిపారు. అలాగే మరో 23 ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం, వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని, మరో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయని అధికారులు వివరించారు. ల్యాబ్ ఏర్పాట్లు, పాఠ్యప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నామని, ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్పీ, టీసీఎస్, ఐబీఎం, బియోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు.
అలాగే వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో కూర్చుని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలని సూచించారు. హై ఎండ్స్కిల్స్తోపాటు ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైన యువతకు శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు దిశ చట్టంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు, కోర్టులు జిల్లాల్లో ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. సైబర్ నేరాలపై అవ గాహన కల్పించేందుకు ఆగస్టు నెల మొత్తం ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఐడీ ఎంతో చక్కగా నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని సాధారణ విద్యార్థినుల నుంచి మహిళా సెలబ్రిటీలు అక్కినేని సమంత తదితరులతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వా ర్టర్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ చేపట్టిన కార్యక్రమాలను వారెంతో మెచ్చుకోవడంతోపాటు, వారు ఏర్ప రుచుకున్న అవగాహనను వివరించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలపై కల్పించేందుకు సీఐడీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్న డీజీపి సీఐడీ అధికారులు రాధిక, సరిత నెల రోజులపాటు శ్రమించి 10 లక్షల మందికి అవగాహన కల్పించంలో సఫలీ క్రుతులైనందుకు వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఆన్లైన్ తరగతుల వల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వచ్చిందని, వారికీ కూడా ఆ సమయంలో ఫోన్లు ఏవిధంగా వాడాలనే విషయమై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్ ద్వారా 2.29 లక్షల మంది నుంచి అనుభవాలు, సూచనలు చేశారని డిజిపి గౌతం సవాంగ్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బిసి ,ఎస్ .సి, ఎస్ .టి ,మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం కన్వీనర్ కట్టామల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు విశాఖలో ఆయన సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెందు ర్తిలో సుజాతనగర్ లో దళిత యువకునిపై దౌర్జన్యం చేసి, దారుణంగా కొట్టి దుర్భాషలాడి శిరోమండనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వలనే ఇలాంటి దాడులు పునరావ్రుతం అవుతున్నాయని, దళితులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. శిరోముండనం లాంటి విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆశన్నమైందని లేదనంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా రాష్ట్ర బిసి ,ఎస్ .సి, ఎస్ .టి ,మైనారిటీ సంక్షేమ సంఘం బాధితులకు బాసటగా నిలవాలని ఈ సందర్భంగా తీర్మాణించినట్టు మల్లేశ్వరరావు వివరించారు. ఈ సమావేశంలో పి .చిట్టిమాష్టారు, కె. గాయత్రి కె. రాంబాబు, లక్ష్మీ, రవి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని శాసన మండలికి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన షరీఫ్ హైదరాబా దులో ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో సామా న్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోక గా...తాజాగా మండలి చైర్మన్ షరీఫ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ప్రజాప్రతినిధులను కలవర పెడుతోంది. ఇప్పటికే పలు వురు ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత కోలుకొని ప్రజా సేవకు సిద్ధమయ్యారు. మరికొంత మంది జాగ్రత్తలు పాటిస్తూ తిరుగుతున్నారు. మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఏదో రూపంలో అందరినీ వెంటాడుతూనే వుంది. మాస్కు లు ధరించినా, శానిటైజర్లు రాసుకుంటున్నా, సామాజిక దూరం పాటించినా కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. కాగా మండలి షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, ఆకాంక్షించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగానైనా వృద్ధాప్య పెన్షన్లు పెంచి రూ.2,500లుగా అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్లు రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారని అయితే అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ను ప్రతీ ఏటా రూ.250 మాత్రమే పెంచుతామనే కండిషన్ పెట్టి, మొదటి సంవత్సరం రూ.2,250 చేశారని విమర్శిం చారు. జులై నుండి పెంచి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ ఏడాది వృద్ధాప్య పెన్షన్లు పెంచలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటతప్పమని ప్రచా రం చేసుకునే ముఖ్యమంత్రి పించను విషయంలో ఎందుకు మాట తప్పారని వ్రశ్నించారు. 90శాతం హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎందు కు పెన్షన్ విషయంలో అమలు చేయలేకపోయారో ప్రజలకు చెప్పాల్సిన భాద్యత వుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో ఎందరో పేదలకు ఆసరా దొరుకు తుందని తక్షణమే పించనను రే, 2500కి పెంచాలన్నారు.
తిరుమలలో మంగళవారం అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. సాధారణంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆల యం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేసి అభిషేకం అనంతరం చక్రస్నానం నిర్వహిస్తారు. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఒక గంగాళంలో పవిత్రజలాన్ని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రాన్ని ముంచి చక్రస్నానం చేశారు. ప్రతి సంవత్సరం బాధ్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంతపద్మనాభస్వామివ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మివ్రతం ఎలా చేస్తారో, పురుషులకు సిరిసంపదలకోసం అనంతపద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు. పాలసముద్రంలో శేషశయ్య మీద పవళించి ఉండే దివ్యమంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి 6వ తరగతి లో ప్రవేశము 7, 8 తరగతుల లో మిగిలిన సీట్ల భర్తీ కొరకు అడ్మిషన్ల షెడ్యూల్ ను విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తుర్భా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీలు) 2020 -21 విద్యా సంవత్సరమునకు గాను, 6 వ తరగతి లో ప్రవేశము మరియు 7, 8 తరగతుల లో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తులను స్వీకరించుట ఆగస్టు నెల 25 తో ముగిసినదన్నారు. ఎంపిక చేయబడిన విద్యార్ధినులు ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 4వ తేదీ వరకు వారి వారి మొబైల్ నెంబర్ కు పంపబడిన సమాచారము ప్రకారం సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లు కు రిపోర్ట్ చేయవలసిందిగా తెలియజేశారు. మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం అందించబడిన విద్యార్థినులు తమతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం మొదలగు వివరములను తీసుకుని వెళ్ళవలసి ఉందన్నారు. ఎంపిక చేయబడిన విద్యార్థినుల వివరములను వెబ్ సైట్ నందు మరియు పాఠశాల నోటీసు బోర్డు నందు ప్రదర్శించబడతాయి. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9441270099 , 9494383617 నెంబర్ లను సంప్రదించాలని కె.వెట్రిసెల్వి తెలిపారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు అని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ( వీజేఎఫ్ ) కార్యవర్గం పేర్కొంది . సోమవారం ఆయన ఆకస్మిక మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించింది . ఈ సందర్భంగా వీజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు , ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ, 5 దశాబ్దాల తన సుదీర్ఘ ప్రస్తానంలో ప్రణబ్ ముఖర్జీ అజాత శత్రువుగా నిలిచిపోయారని కొనియాడారు. తనరాజకీయ జీవితంలో అనేక పదవులను వహించిన ఆయన సామాన్యునిలానే జీవించారని కితాబునిచ్చారు. ప్రధానంగా జర్నలిస్టులు , మీడియాపట్ల ప్రణబ్ అంతులేని అభిమానం చూపేవారని అన్నారు . వీజేఎఫ్ కార్యవర్గంను రాష్ట్రపతి భవనకు 2017 వ సంవత్సరంలో సాదరంగా ఆహ్వానించి సుమారు గంటకు పైగా సమయం వెచ్చించి అనేక సమకాలీన అంశాలను ప్రస్తావించిన సంఘటనను ఈ సందర్భంగా వీజేఎఫ్ కార్యవర్గం గుర్తుచేసుకుంది . జర్నలిస్టులతోనే సమాజాభివృద్ధి సాధ్యమని చెబుతూనే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలని ప్రణబ్ సూచించినట్లుగా పేర్కొన్నారు . ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యలను , ఇక్కడి వెనుకబాటుతనంను వినతి పత్రం ద్వారా వీజేఫ్ కార్యవర్గం తెలియజేసినప్పుడు ఎంతగానో సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారని గుర్తు చేసుకున్నారు . ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల వీజేఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్ . నాగరాజ్ పట్నాయక్ , టి . నానాజీ సంయుక్త కార్యదర్శి దాడి రవికుమార్ , కోశాధికారి పి.ఎన్ మూర్తి ఇతర కార్యవర్గం సభ్యులూ తమ ప్రగాఢ సంతాన్ని తెలియజేశారు.