క్రిష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్ వేను పదిరోజుల్లో రాకపోకలు జరపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. శుక్రవారం గన్నవరంలోని విమానాశ్రయంలోని కొత్తగా నిర్మించిన రన్ వేని ఎయిర్ పోర్టు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ రూ.470 కోట్లతో ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, మరో రూ.27 కోట్ల తో ఆప్రాన్ లింక్ టాక్సీ వే పూర్తయినట్టు కలెక్టర్ వివరించారు. అంతేకాకుండా త్వరలోనే బోయింగ్ 777, 747 అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభించడానికి ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయితే అన్ని దేశాలకు కనెక్టవిటీ బాగా పెరుతుందని విమాన ప్రయాణీకులు భావిస్తున్నారు. కొత్తగా చేపట్టిన పనులన్నీ పూర్తికావడంతో గన్నవరం ఎయిర్ పోర్టు నూతన శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, అధికారులతోపాటు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుంచి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈమేర కు సెప్టెంబరు 12న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. సెప్టెంబరు 13వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 14న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 15న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు
కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది. 45 రోజులు తరువాత శుక్రవారం కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు లభించింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా ఇందుకు సీల్ అప్రూవల్ ఇవ్వడంతో మొత్తం రూ.13,572 కోట్ల డీల్ ను కుదుర్చుకున్నట్టైంది. కృష్ణ పట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) సంస్థకు 75శాతం వాటాను కేటాయించింది ప్రభుత్వం. కృష్ణపట్నం పోర్టు బాధ్యతలు అదానీ గ్రూప్ కే ఇకపై సంబంధం అని ప్రభుత్వం తరపున ఎన్.ఓ.సి. ఇచ్చామని ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రాభివ్రుద్ధిని కాంక్షిస్తూ చేపట్టే కార్యక్రమాలు వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో ఈ సీల్ అప్రూవల్ ఇచ్చినట్టు చెప్పిన మంత్రి ఇకపై క్రిష్ణపట్నం పోర్టు శరవేగంగా అభివ్రుద్ధి చెందడానికి పూర్తిస్థాయిలో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాభివ్రుద్ధిలో ఈ డీల్ కూడా కీలకం కాబోతుందన్నారు.
ఆ ఆలయాన్నికీ..శ..1850లో నిర్మించారు. ఇక్కడున్న రాజగోపాస్వామి(వేణుగోపాల స్వామి)కి మొక్కితే పెళ్లికాని వారికి పెళ్లి, స్వామివారికి సేవలు చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అంతే కాదండోయ్ ఆర్ధిక బాధలు, కుటుంబ కలహాలు కూడా మటుమాయం అయిపోతాయ్.. ఏంటి కంప్యూటర్ కాలంలోనూ ఈ కధలు అనుకుంటున్నారా..ఈ ఆలయం మహత్యం అలాంటిది మరి..అది నిజమో కాదో తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...ఈ ఆలయ చరిత్ర తెలుసుకుంటే... విశాఖపట్నం జిల్లా, కోటవురట్ల మండలం, కైలాపట్నం గ్రామంలో ఉందీ శ్రీశ్రీశ్రీ రాజగోపా స్వామి దేవస్థానం. ఈ ఆలయంలోనే ఆండాళమ్మ అమ్మవారు కూడా కొలువుదీరి వున్నారు. ఈ ప్రముఖ దేవస్థానం చరిత్రలోకి వెళితే...విజయనగర మహరాజుల ఆహ్వానం మేరకు శ్రీమాన్ ప్రతివాద భయంకర మంత్ర రత్న, శ్రీనివాసాచార్య అయ్యవార్లు ఈ ఆలయంలోని స్వామివారిని పూరీ నుంచి తీసుకు వచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. అప్పట్లో ఈ రాజగోపాలస్వామి ఆలయం ఎంతో పేరు, ప్రతిష్టలు, 500 ఎకరాల మాన్యం కలిగిన దేవస్థానం. అయితే కాలక్రమంలో మాన్యం ప్రభుత్వం రైతుల వసం చేయగా కేవలం ఆలయం మాత్రమే మిగిలింది. ఈ ఆలయంలో జాతి పిత మహాత్మాగాంధీ 1929లో కూర్చొని 1008 మార్లు శ్రీరామ నమ జపం చేసినట్టు చరిత్ర చెబుతోంది.
అంతేకాదు. ఈ ఆలయంలోనే విప్లవ వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు, మహర్షి ఎక్కిరాల రామస్వామి కూడా జపం చేసిన చరిత్రగలది శ్రీశ్రీశ్రీ రాజగోపాలస్వామి దేవస్థానం. ఈఆలయానికి వివిధ బాధలతో వచ్చి వారి మనసులోకి కోర్కెలను స్వామివారితో విన్నవించుకుంటారు. ఇక్కడి స్వామివారు భక్తులు మొక్కులు తరువాత తీరిన కోర్కెల ఆధారంగా మొక్కలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. క్రీ.శ.1869లో ఈ ఆలయంలో పీతాంబరం అప్పమ్మగారి తల్లి నున్న సుబ్బ కళ్యాణ మండపం కట్టించారు. క్రీ.శ.1899-1900 ఏట నండూరి సీతారామాచార్యులు ఆండాళ్లమ్మ తల్లికి ఇక్కడే దేవాలయం కట్టి ప్రతిష్టించారు. ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించినదే. అప్పట్లో తవ్విన ఊటబావినుంచే తీసిన నీటిని అనునిత్యం స్వామికి తీర్ధంగా సమర్పిస్తారు. కీ.శ. 1964లో ఆలయం తిరిగి పునరుద్దరించారు. ఇంతటి చరిత్ర గలిగిన స్వామివారి దేవస్థానం నేటికి అభివ్రుద్ధికి నోచుకోకపోయినా, చరిత్రమాత్రం ఖండతరాలు దాటింది. దీర్ఘకాలికంగా పెళ్లికాని, ఉద్యోగం రానివారు ఇక్కడి స్వామివారిని మొక్కుకుంటే ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఇక్కడ చాలా అధికంగా ఉన్నాయి. దీంతో చాలా మంది ఇక్కడి రాజగోల స్వామివారికి పెళ్లికోసం, ఉద్యోగం కోసం మొక్కలు మొక్కుకుంటారు.
అవి తీరగానే అనుకున్న కానుకలు హుండీలో వేస్తారు. స్వామివారి ఆలయాని తమవంతు సహాయంగా అభివ్రుద్ధి చేయాలని, భక్తుల సహకారంతో స్వామివారికి తిరిగి పూర్వ వైభవం తీసుకు రావాలని ఈఎన్ఎస్ లైవ్ యాప్ సంకల్పించింది. ఈ ఆలయంలో ఏ భక్తుడి కోరికైనా తీరితే ఆలయం అభివ్రుద్ధికి తమ వంతు సహాయం చేయాలని, ఆ నిధులతో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ భక్తులను కోరుతోంది. అంతేకాదు స్వామి వారి ఆలయంలో విద్యుత్ వ్యవస్థను త్వరలోనే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తరపున పునరుద్దరించనున్నట్టు ఈఎన్ఎస్ మీడియా హౌస్ అధినేత పి.బాలభాను(బాలు) ప్రకటించారు. స్వామివారికి చేసిన సహాయం మనందరికీ తిరిగి పదింతలు స్వామి కరుణ, కటాక్షాల రూపంలో వస్తుందని భావించే వారంతా మీవంతు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలునిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎంతో పూర్వ చరిత్ర ఉన్న ఈ రాజగోపాలస్వామివారిని దర్శించి పునీతులు కండి. మీ మొక్కులు తీరితే స్వామివారి కోసం చిన్న సహాయంతో, మీ పేరుతో ఒక అభివ్రుద్ధి కార్యక్రమం చేపట్టండి. లోకా సమస్తా సుఖినోభవంతు...!
రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్(ఆయుర్వేదం,యునాని, సిద్ద, హోమియోపతి,నేచురోపతి) డిస్పెన్సరీలను బలోపేతం చేయాలని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్రమోడి మానస పుత్రిక అయిన ఆయుష్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఒక్క విశాఖజిల్లాలలోనే చాలా డిస్పెన్సిరీల్లో వైద్యుల కొరతతోపాటు, పారామెడికల్ సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు అన్ని రకాల రోగాలకు ఆయుష్ వైద్య విధానాలను ప్రముఖంగా ఆచిరిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీటిని పక్కన పెట్టిందన్నారు. దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి వైద్య విధానాల్లో మంచి మందులు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వీటి నిర్వహణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వెచ్చిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. గతంలో పీహెచ్సీలకు అనుబంధంగా ఆయుష్ డిస్పెన్సరీలు ఉండేవని వాటిలో ఇపుడు చాలావాటిని తొలగించారన్నారు. అంతేకాకుండా చాలా డిస్పెన్సిరీల్లో మందులు కూడా లభ్యం కావడం లేదున్నారు. ప్రభుత్వం ఆయుష్ డిస్పెన్సరీల్లో ఖాళీగా వున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించి ప్రధాని మోదీ ఆశయ సాధనకు క్రుషిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము కూగా ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుని ద్రుష్టికి తీసుకు వెళతామమన్నారు కొప్పల రామ్ కుమార్.
తిరుమలలోని నాదనీరాజనం వేదిక పై గురువారం సాయంత్రం గీతా పారాయణం రెండో విడత ట్రయల్ రన్ జరిగింది. వేదపారాయణందార్ కాశీపతి భగవద్గీత పారాయణం చేయగా, వేదపండితుడు కుప్పా విశ్వనాథం వ్యాఖ్యానం చెప్పారు. తిరుమలలో నేరుగా పాల్గొనే భక్తులతోపాటు ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సాధారణ భక్తులు సులువుగా పారాయణం చేసేలా శ్లోక పారాయణంలో తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తోపాటు పలువురు పండితులు సూచనలు చేశారు. ఇస్కాన్ ప్రతినిధి లీలా పారాయణ దాస్ మాట్లాడుతూ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మానవాళి సంక్షేమం కోసం భగవద్గీత పారాయణం చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని అభినందించారు. అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు శ్రీకృష్ణునిపై ప్రముఖ సంస్కృత కృతి అయిన మధురాష్టకాన్ని ప్రదర్శించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, డెప్యూటి ఈఓ విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు శుభవార్త...ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ, ఉత్తర్వులు జారీచేసింది. ఇందులోభాగంగా క్వార్టర్ బాటిల్ ధర 120 రూపాయ లకు మించని బ్రాండ్లకు 30 రూపాయలు,ఫుల్ బాటిల్ కి 120 రూపాయల వరకూ తగ్గించిన ప్రభుత్వం..క్వార్టర్ బాటిల్ ధర 120 నుంచి 150 రూపాయల వరకూ ధర ఉన్న బ్రాండ్లకు క్వార్టర్ కి 70రూ నుంచి ఫుల్ బాటిల్ కి 280రూ వరకూ తగ్గించింది. ఆపై క్వార్టర్ బాటిల్ ధర 150 నుంచి 190 రూపాయల మధ్య ఉన్న బ్రాండ్లకు ఎలాంటి ధర మార్పులు చేయని ప్రభుత్వం..క్వార్టర్ బాటిల్ ధర 190 రూపాయల నుంచి 210 రూపాయల వరకూ ధర ఉన్న బ్రాండ్లకు క్వార్టర్ కి 70 నుంచి ఫుల్ బాటిల్ 280 రూపాయల వరకూ ధర పెంపుని కూడా ప్రకటించింది. ఇది కాకుండా అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపాయల మేర ధర తగ్గించిన ప్రభుత్వం రెడీ టూ డ్రింక్ మద్యం పై 30 రూపాయల మేర తగ్గింపుని ప్రకటించింది. ధరలన్నీ ఈరోజు నుంచే అమలవుతాయని కూడా ప్రకటించింది. తగ్గించిన మద్యం ధరలతో మందు బాబులు మరింత ఖుషీ అవడమే కాదు ప్రభుత్వ ఖజానాని కూడా నింపుతారనడంలో సందేహం. ఇప్పటి వరకూ మద్యం రేట్టు అధికంగా వున్న సమయంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఇపుడు తగ్గించడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి...
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని వేదవిద్యా బోధనలో భారతదేశంలోనే ఉత్తమ పాఠశాలగా తయారు చేయాలని టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి అధికా రులను ఆదేశించారు. ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ, మరో నెల రోజులలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో బయటి వ్యక్తులు ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. అటవీ ప్రాంతం కావడంతో టీటీడీ, ఉద్యానవన విభాగాలు కలిసి ఫెన్సింగ్ పనులను పూర్తి చేయడంతోపాటు మురుగునీరు నిల్వ ఉండకుండా మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. వీధి దీపాలన్నీ వెలిగేలా చూడాలన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వేద పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఈవో విజయసారథి దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, టిటిడి ఎస్ఇ-2 నాగేశ్వర రావు, ఈఈ జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఎంఎస్ ఈఈ మల్లికార్జున ప్రసాద్, డిఈ సరస్వతి, విజివో మనోహర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, డిఎఫ్ఓ చంద్రశేఖర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కారు ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయానికి ఆమోదం లభించింది. దీంతో రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలు ఆడుతూ ఎవరైనా పట్టుబడితే ఏడాది జైలు, రెండో సారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలని నిర్ణయించింది. కేంద్రం పబ్జీ గేమ్ తో సహా 118 చైనా గేమ్స్ పై నిషేధం విధించిన మరుసటి రోజే, చాలా మంది కుటుంబాలను ఆర్ధికంగా దెబ్బతీస్తున్న రమ్మీ గేమ్ ని నిషేధించడం సంచనలంగా మారింది. ఆన్ లైన్ జూదం ఆడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నవిషయమై నమోదవుతున్న సైబర్ నేరాలను ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. కాగా ఆన్ లైన్ రమ్మీ, పోకర్ గేమ్ లను చాలా మంది ఆడి కోట్ల రూపాయలు డబ్బులు పోగోట్టుకోవడంతో పాటు, కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆన్ లైన్ జూదంపై నిశేషదం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నిషేధిత మావోయిస్టులను ప్రభుత్వం రెండేళ్లుగా నియంత్రిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు తెలంగాణలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు జరుగుతుందంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం మావోయిస్టులపై ఏడాది పాటు నిషేధం విధించడం చర్చనీయాంశం అవుతుంది. ఏపీ మావోయిస్టులను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. కేబినిట్ నిర్ణయం తీసుకున్న తరువాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లకు జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున మరోసారి లేఖ సమర్పించనున్నట్లు సంఘం జాతీయ కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు స్పష్టం చేశారు. గురువారం విశాఖలో కోవిడ్ బారినపడి కోలుకున్న పలువురు వీడియో జర్నలిస్టులకు గురువారం డాబాగార్డెన్స్ కార్యాలయం లో తన సొంత నిధులు రూ.30 వేలు అందజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గతంలో తమ అసోసియేషన్ తరపున ప్రధాని,సీఎం లకు లేఖ రాసామని, తాజాగా మరోసారి లేఖ రాసినట్టు వివరించారు. కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు తాను సొంతంగా సుమారు ఏడు లక్షల రూపాయలతో జర్నలిస్ట్ లు, ఇతర సంస్థల కు దశల వారీగా నిత్యవసర వస్తువులు అందజేసినట్టు చెప్పారు. దీంతోపాటు కోవిడ్ బారినపడిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులకు మరో 2.60 లక్షలు తన సొంత నిదులు వెచ్చించినట్టు వివరించారు. కేవలం మానవతా దృక్పధం తోనే తాను ఈ సేవా కార్యక్రమాలు చేపడతున్నామన్నారు. నిశ్వార్ధంగా జర్నలిస్టులకు సేవచేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా విపత్తు లో జర్నలిస్ట్ లను ఆదుకోవాలనే లక్ష్యంతో తన సేవలను నిరంతరంగా కొనసాగిస్తున్నాని గంట్లశ్రీనుబాబు మీడియాకి వివరించారు.
రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్, అటవీ,శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలు ఎన్. ఎస్.పి.అతిథిగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి, ఉచిత విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకున్న కరెంట్ కు ప్రభుత్వమే విద్యుత్ చార్జీల చెల్లిస్తుందని వివరించారు. రైతులకు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను నగదు బదిలీ పథకం క్రింద రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రైతులు ఖాతా లోని నగదును విద్యుత్ డిస్క్ఎం కంపెనీలకు చెల్లిస్తామని చెప్పారు.. ప్రతిపక్షాలు అనవసరమయిన రాద్దాంతం చేస్తూ రైతులను పక్క దోవ పట్టిస్తున్నాయన్నారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న మంత్రి ప్రభుత్వం అన్ని వేళల రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిస్కమ్స్ కు రూ.1700కోట్ల కేటాయించామన్నారు. రాష్ట్రంలో పగటిపూట నిరంతరo9గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన అన్నారు. రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు.జిల్లాలో టుబాకో రైతులను ఆదుకోవడానికి 70కోట్ల రూపాయల ను విడుదల చేశామని మంత్రి తెలిపారు.