1 ENS Live Breaking News

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త

తెలంగాణలోని ఆర్టీసీ  ప్రయాణికులకు అక్కడి యాజమాన్యం గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణీకులు ముందస్తు రిజర్వేషన్లపై రాయితీలు ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ పై 5% రాయితీ, 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులకు ఈ రాయితీ వర్తించనుంది. ఈ మేరకు ఓపీఆర్ఎస్ సాఫ్ట్ వేర్ ను టీఎస్ ఆర్టీసీ అప్ డేట్ చేసింది. ఈ అవకాశాన్ని దూర ప్రయాణాలు చేసుకునేవారు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని టిఎస్ ఆర్టీసీ కోరుతోంది..!

Hyderabad

2023-02-02 06:19:49

సచివాలయ ఉద్యోగుల నుంచే రూ.20.80 కోట్ల పన్నలు

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ శ్లాబుల విధానంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏడాదిరి వారు తీసుకునే జీతంపై రూ.1500 నుంచి 1600 వరకూ ఆదాయపు పన్ను చెల్లించాల్సి వుంటుంది. తద్వారా సుమారు రూ.20.80 కోట్ల వరకూ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రానుంది. కేంద్రం ఆదాయపు పన్ను శ్లాబు వలన రూ.3లక్షలు నుంచి రూ.6లక్షల వరకూ 5% పన్ను, రూ.6లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10%, రూ.9 నుంచి రూ.12లక్షల వరకూ 15%, రూ.12నుంచి 15లక్షల వరకూ 20%, రూ. 15 లక్షల నుంచి ఆపైన ఆదాయం ఉన్నవారు రూ.30% ఆదాయపు పన్ను చెల్లించాల్సి వుంటుంది. మరోవైపు ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్యవధిని 20-24 రోజుల నుంచి 15 రోజులకే తగ్గించేశారు. దీనితో ఒకే సారి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, అటు దేశ వ్యాప్తంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే సర్వర్ పై తీవ్ర ప్రభావం చూసే అవకాశాలున్నాయి.

Tadepalli

2023-02-01 08:53:15

ఏపీలో వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు కొత్త జాబ్ చార్ట్

ఆంధ్రప్రదేశ్ లో భూములు రీసర్వే జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు  రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ 
చార్ట్ అమలు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు, సచివాలయాల్లో పనిచేసే వార్డు రెవెన్యూ కార్యదర్శులకు కంబైన్డ్ జాబ్ చార్ట్, గ్రేడ్-1, 2, 3 గ్రామ 
సర్వేయర్లకు జాబ్ చార్టపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రెండు వేర్వేర్లు ఉత్తర్వులు జారీచేశారు. వీఆర్వోల జాబ్ చార్ట్..తుపాన్లు, వరదలు, 
ప్రమాదాలు లాంటి విపత్తు నిర్వ హణ విధులు, ఓటర్ల జాబితా అప్డేషన్, ప్రభుత్వం నిర్దేశించే ఇతర ఎన్నికల విధులు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ పనులు, భూముల 
సర్వే కార్యకలా పాలు, నివాస, నేటివిటీ లాంటి సర్టిఫికెట్ల జారీ విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధిం
చిన అన్ని వినతులను పరిశీలించి తీసుకున్నచర్యలపై ఆయా శాఖలకు నివేదికలు పంపడం  లాంటి పనుల్ని నిర్దేశించారు.

పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ, ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ,రోడ్లు, వీధులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా  కాపాడటం, రెవెన్యూ సెస్, పన్నులు వసూలు చేయాలి. హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తహశీల్దార్కు నివేదించడం
తోపాటు తహశీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఎ, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించాలని జాబ్ చార్ట్లో పేర్కొన్నారు.  ఒకే సమయంలో
ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రాధా న్యతకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. గ్రామ సర్వేయర్ల జాబ్ చార్ట్ వ్యక్తులు, ప్రభుత్వ  సంస్థలతోపాటు అనుమతిం చిన లేఅవుట్లకు సంబంధించి ఎఫ్లైన్ పిటిషన్లు (సరిహద్దు వివాదాలు, హద్దులు-విస్తీర్ణంలో తేడాలు లాంటి వాటిపై అందే దరఖాస్తులు)స్వీకరించి పరిష్కరించాలి.

 సర్వే సబ్ డివిజన్, సంబంధిత మార్పులు చేసే బాధ్యత వారిదే.గ్రామ కంఠాలు, పూర్తిస్థాయి స్ట్రీట్/టౌన్ సర్వే, కొత్త సబ్ డివిజన్, పాత సబ్ డివిజన్లను కలపడంపై 
అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామ రికార్డుల్లో చేర్చాలి. సచివాలయాల పరిధిలో అదే అన్ని వినతులతోపాటు వివిధ శాఖల అధికారులు
ఫర్ చేసే అంశాలపై నివేదికలు ఇవ్వాలి. మిస్ అయిన, దెబ్బతిన్న, తొలగించిన సర్వే పాయింట్లు మార్క్లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు సర్వే, సరిహద్దు చట్టం ప్రకారం 
ముసాయిదా నోటీసు ఇచ్చి రెన్యువల్ చేయాలి. తన పరిధిలోని 10 శాతం సర్వే పాయింట్లు, మార్క్ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ప్రతి నెలా తనిఖీ చేయాలి. 
కాంపిటెంట్ అథారిటీ అధికారుల ఆదేశాల ప్రకారం రికార్డుల్లో తప్పులను సరిచేయాలి. పై అధికారులకు సమాచారమిచ్చి అన్నితనిఖీలకు గ్రామ సర్వేయర్లు హాజరు 
కావాలి. సర్వే పరికరాలు, ఇతర వస్తువులను సర్వీస్ చేచేయించి నిర్వహణ చేపట్టాలి. నెలవారీ టూర్ డైరీలు, ప్రోగ్రెస్ స్టేట్మెంట్లు ఇతర నిర్దేశిత సమాచారాన్ని సర్వే 
సెటిల్మెంట్ కమిషనరు పంపాలి. సర్వే కార్యకలాపాలను ఈటీఎస్,డీజీపీఎస్, కార్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలతోనే నిర్వహించాలి. వీఆర్వోలకు
సహకరించాలి. ఈ జాబ్ చార్ట్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్తగా జాబ్ చార్టు వీఆర్వోలకు అమల్లోకి వచ్చింది..!

Tadepalli

2023-02-01 03:14:43

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని బుధవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 21 గదులు, హరిహర సదన్ ఏసీ 6,  హరి హర సదన్ నాన్ ఏసీ 6,  హరి హర సదన్ సింగిల్ 0, న్యూ సెంటినరీ 8, ఓల్డ్ సెంటినరీ 5, విఐపీ ఎస్జీహెచ్ 8, సీతారామ చౌల్ట్రీ 23, సత్య నికేతన్ లో25 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-02-01 02:49:18

యూనిఫాం వేసుకురాని ఉద్యోగులను ఇంటికి పంపండి..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనిఫారం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయ ఉద్యోగులు విధులకు యూనిఫారం ధరించి రాకపోతే అలాంటి వారిని ఇంటికి పంపనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను మొదటిసారిగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అమలుచేస్తున్నారు. మత్స్యశాఖలోని గ్రామీణ మత్స్య సహాయకులు విధులకు యూనిఫారం ధరించి రాకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ప్రభుత్వం ఉద్యోగుల గుర్తింపుకోసం ఖచ్చితంగా ధరించేలా ఇచ్చిన యూనిఫారం వేసుకోని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు అందుకుకున్నవారు సహేతుకమైన కారణాలు చెప్పాలని అందులో పొందుపరిచారు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీచేసినా సచివాలయ సిబ్బందిలో మార్పు రాలేదని..ఇకపై ప్రభుత్వం స్వయంగా పంపిణీచేసిన యూనిఫారం సక్రమంగా ధరించాలని, లేనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు.

జిల్లాకలెక్టర్ ఏర్పాటుచేసిన సమీక్షాసమావేశానికి ప్రభుత్వం ఇచ్చినఫారంలో షర్టు ఒకటి, ఫ్యాంటు మరొకటి, మరికొందరు ఏకంగా యూనిఫారం లేకుండా వచ్చారు. దీనిపై కన్నెర్ర చేసిన కలెక్టర్ సమావేశంలోనే గట్టిగాహెచ్చరించారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం ధరించడానికి ఎందుకు చిన్నతనంగా ఫీలవుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రజలు, అర్జీదారులు ఉద్యోగులను గుర్తుపట్టాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన యూనిఫారం ధరించకుండా ప్రభుత్వాన్నే అవహేళన చేస్తున్నారని ఇది పద్దతి కాదని, ఇకపై అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించాలని జిల్లా మత్స్యశాఖ ఉపసంచాలకులను ఆదేశించారు. గుర్తించిన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.

ఒక్క విజయనగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అసలు సచివాలయ గ్రేడ్1 నుంచి గ్రేడ్-5 కార్యదర్శిల వరకూ ఎవరూ యూనిఫారం వేసుకొని రాకపోవడంతో, దానిని అలుసుగా తీసుకుంటున్న సిబ్బంది కూడా సివిల్ డ్రెస్సుల్లో వస్తున్నారు. ఈ విషయం ఎంపీడీఓలు గుర్తించినా వారు కూడా లైట్ తీసుకుం టున్నారు. ఒక్కోసారి డిఎల్పీఓ, డీపీఓ, ఇతర జిల్లాశాఖల ఉన్నతాధికారులు సచివాలయానికి వచ్చిన సమయంలోకూడా సిబ్బంది ధరించని యూనిఫారంపై ప్రశ్నించడం లేదు. షర్టు ఒకటి, ఫ్యాంటు మరొకటి వేసుకొనివచ్చినా ఎక్కడా ప్రశ్నించడం లేదు. ఆ మాటకొస్తే..ప్రభుత్వం ఎంతో నమ్మకం పెట్టుకున్న సచివాలయ ఉద్యోగులే ప్రభుత్వ ఆశయాన్ని, లక్ష్యానికి గాలితీసేస్తున్నారనే విషయం వీరుధరించే యూనిఫారమే తేటతెల్లం చేస్తున్నది. మరికొందరు ఒక అడుగు ముందుకేసి యూనిఫాం బ్యాండుమేళం బ్యాచ్చిలా ఉందని..అందుకనే వేసుకో బుద్ది కావడం లేదని..ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాకలెక్టర్లు కూడా ఈవిషయాన్ని పట్టించుకోకపోవడంతో వీరి యూనిఫారం ధారణ విషయంలో ప్రశ్నించే వారే కరువవుతున్నారు.

ప్రభుత్వ ఆదేశం ప్రకారం సచివాలయ ఉద్యోగులు సరైన, సక్రమమైన(ఫ్యాంటు ఓ రంగు, షర్టు ఓ రంగు కాదు) యూనిఫారం ధరించి మాత్రమే ధరించి విధులకు హాజరుకావాలి. అలా హాజరుకాని ఉద్యోగులకు జిల్లాశాఖల అధికారులు షోకాజు నోటీసులు ఇవ్వాలి. లేదంటే సదరు జిల్లాఅధికారులకు కలెక్టర్లు షోకాజ్ 
నోటీసులు జారీచేస్తారు..జిల్లా కలెక్టర్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోతే వారిపై గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్ 
లతోపాటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిల నుంచి షోకాజ్ నోటీసులొస్తాయి. ఈవిధంగా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసింది. దానితో రాష్ట్రంలోని  26జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనిఫాం విషయంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విజయనగరం జిల్లా కలెక్టర్ ముందు వరసులో నిలబడి ప్రభుత్వ లక్ష్యాన్ని అమలుచేస్తున్నారు. ఇదే ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చూడాలి విజయనగరం జిల్లాకలెక్టర్ ను ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాల కలెక్టర్లు, 20శాఖల జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో యూనిఫారం వేసుకొచ్చేలా చేయగలగుతారా..లేదంటే లైట్ తీసుకుంటారో..అనేది..!

Tadepalli

2023-01-31 03:04:36

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని మంగళవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 45 గదులు, హరిహర సదన్ ఏసీ 77,  హరి హర సదన్ నాన్ ఏసీ 42,  హరి హర సదన్ సింగిల్ 27, న్యూ సెంటినరీ 6, ఓల్డ్ సెంటినరీ 6, విఐపీ ఎస్జీహెచ్ 22, సీతారామ చౌల్ట్రీ 39, సత్య నికేతన్ లో39 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-31 02:51:17

చైను పోగొట్టుకున్నవారు తక్షణమే సంప్రదించాలి

అన్నవరం శ్రీ వీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, శ్రీ స్వామి వారి సన్నిధిలో సోమవారం భక్తుడు బంగారు చైన్ జారవిడుచుకున్నారని ఆలయ వర్గాలు మీడియా ద్వారా ప్రకటించాయి.  సదరు ప్రదేశము నందు డ్యూటీలో వున్న సెక్యూరిటీ గార్డు తీసుకొని వచ్చి శ్రీస్వామి వారి కళావేదిక వద్ద  ప్రకటన చేసినా  సదరు వ్యక్తులు రాలేదని, మూడు రోజుల్లోగా సదరు చైను పోగొట్టుకున్నవ్యక్తి ఆధారాలతో వస్తువును తీసుకొని వెళ్లాలని ఆలయ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల తరువాత సెక్యూరిటీ సమక్షంలో ఆ వస్తువును స్వామివారి హుండీలో వేస్తామని ప్రకటించాయి. మరిన్ని వివరాలకు ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నాయి.    

Annavaram

2023-01-30 12:11:08

ఏజెన్సీలో భయం చీకటిని ఛేదించిన ఘటన @ 30ఏళ్లు

పసుపులేటి బాలరాజు ఈపేరు వింటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన తండాల్లోని ఒక యువ గిరిజన స్పూర్తి.. దైర్యం..తెగువ..నాయకత్వం.. గిరిజన రాజకీయాల్లో ఆరితేరిన యోధుడిగా అతి చిన్న వయసులోనే కీర్తి.. అంతేకాదు 25 ఏళ్ళకే శాసన సభకు ఎన్నికైన నాటి కాంగ్రెస్ గిరిజననాయకుడు. ఇదంతా సరిగ్గా 30 ఏళ్ళ కిందటి విశాఖమన్యం సంగతి. చింతపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన 3వ సంవత్సరంలోనే పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌ బాలరాజును కొయ్యూరు మండలంలో కిడ్నాప్ చేసిన రోజులవి..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నక్సల్స్ చెరలోనే 23 రోజులు.. ఓ పక్క మన్యం మొత్తం రెడ్ అలెర్ట్..కటుంబ సభ్యుల్లోనూ, ప్రభుత్వంలోనూ ఒకటే టెన్షన్.. రోజు గడిస్తే ఏం జరుగుతుందో..ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని..అలాంటి నక్సల్స్ చీకటి భయాన్ని చేధించుకొని చెక్కుచెదర కుండాతిరిగి మన్యంలోకి అడుగుపెట్టిన దైర్యం, తెగింపు పసుపులేటి బాలరాజుది. ఆ చీకటి భయం సంఘటన 1993 జనవరి 30న జరిగి నేటికి సరిగ్గా30ఏళ్లు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net అందిస్తున్న ప్రత్యేక కథనం..!

విశాఖ మన్యం ప్రాంతాలంటే అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఒకటే భయం అక్కడ పీపుల్స్ వార్ నక్సల్స్ ఉంటారని. అందులోనూ అప్పటికే చింత పల్లి, కొ య్యూరు మండలాలు పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా ఉన్న పసుపులేటి బాలరాజు రూ.30 లక్షల వ్యయంతో గిరిజన గ్రామాల్లో నిర్మించే చెక్‌డామ్‌ల పరిశీలన కోసం 1993 జనవరి 30వ తేదీన కొయ్యూరు మండలం బూదరాళ్ళ శివారు గుడ్లపల్లి గ్రామానికి వెళ్లారు. ఆయన వెంట దాదాపు 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దాసరి శ్రీనివాసులు కూడా బాలరాజు వెంటే ఉన్నారు. వీరి రాకను ముందుగానే తెలుసుకున్న పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌ మాటువేసి మొత్తం 40 మందిని బందీలుగా చేసి అత్యధిక సంఖ్యలో ఉన్న నక్సలైట్లు ఒకేసారి అటవీ ప్రాంతంలో  కిడ్నాప్ చేశారు. అప్పట్లో ఈవార్త బిబిసి లాంటి అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ, ఆలిండియా రేడియో, దూరదర్శన్ టివీ ఛానళ్లలో ప్రసారం కూడా అయ్యింది. ఒక్కసారిగా ప్రభుత్వం మన్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొయ్యూరు మండలంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో కిడ్నాప్ అయిన ఎమ్మల్యే బాలరాజు, ఇతర అధికారుల కోసం ప్రత్యేక పోలీసు బలగాలు వెతికే వేట ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న నక్సక్సల్స్ ఎమ్మెల్యే బాలరాజు, ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులుతో సహా 13 మందిని తమ దగ్గరే బందీలుగా వుంచుకొని మిగిలిన వారిని విడిచి పెట్టారు. 

ఇక అపుడే అసలు భయం మొదలైంది. అంతా ఆ 13 మందిని నక్సల్స్ చంపేసి ఉంటారనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ సంఘటన పెను సవాలుగా మారింది. అయిలే బాలరాజు నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చేశారో..ఆయనతోపాటు కిడ్నాప్ చేసిన కొంత మందిని ఎందుకు వదిలిపెట్టారో ప్రభుత్వంలోగానీ, పోలీసులకు గానీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. రోజులు గడుస్తున్నాయి. ఒక దశలో ఎమ్మెల్యే బాలరాజుని నక్సల్స్ చంపేసి ఉంటారనే వార్త  దావాలనంగా దేశమంతా వ్యాపించింది. ఆసమయంలో నక్సల్స్ ప్రభుత్వానికి ఒక పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చారు.  అప్పటికే వరంగల్‌ జైలులో వున్న పీపుల్స్‌వార్‌ నాయకుడు క్రాంతి రణదేవ్‌ను విడిచి పెడతేనే బాలరాజును విడుదల చేస్తామనేది దాని సారాంశం. అయితే దీనికి ప్రభుత్వం సూచన ప్రాయంగా అంగీకరించింది. 

నక్సల్స్ తో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తూనే..ఎమ్మెల్యే బాలరాజును ఎలాగైనా ప్రాణాలతో రక్షించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టింది. బాలరాజుకు అండగా ద్రోణంరాజు సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ మొదలైన నాయకులు నర్సీపట్నంలోనే మకాం వేసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే బాలరాజు భార్య కూడా తన భర్తను విడిపించాలంటూ ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నతరు ణంలో ప్రభుత్వం క్రాంతి రణదేవ్ ను విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో గిరిజన ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న బాలరాజును చంపితే నక్సల్స్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని నక్సల్స్ కూడా ముందుచూపుతో ఆలోచించి సానుకూలంగానే వ్యవహరించారు.  మరొపక్క అప్పటి సీఎం కోట్లవిజయభా స్కరరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి బాలరాజు విడుదలకు మార్గం సుగమం చేశారు. క్రాంతి రణదేవ్‌ను నక్సల్స్ కి అప్పగించడానికి వరంగల్‌ నుంచి విశాఖ జైలుకు ఆఘ మేఘాల మీద తరలించారు. 

విషయం తెలుసుకున్న నక్సల్స్ ఈలోగానే ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసుల్ని విడుదల చేశారు. ఇపుడు ఇంకా ఉత్కంఠ అసలు బాలరాజు ప్రాణాలతో బతికేఉన్నారా లేదంటే క్రాంతి రణదేవ్ ని విడుదల చేసిన తరువాత చంపేస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తూనే ఏం జరిగినా బాలరాజుని బయటకు క్షేమంగా తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. 23రోజులు గడిచిన తరువాత బాలరాజుని ఏమీ చేయకుండా నక్సల్స్ విడిచిపెట్టారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. భయం చీకటిని చీల్చుకొని చెక్కు చెదరకుండా వచ్చిన సూరీడు మా బాలరాజు అంటూ చింతపల్లిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, హారతులు పట్టి కార్యకర్తులు, కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నారు. పసుపులేటి బాలరాజు రాజకీయ ప్రయాణంలో ఒదొక కీలకఘట్టం.  ఈ ఘటన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో  కూడా ఒక చరిత్రలో కూడా నిలిచిపోయింది. 

ఆ తరువాత నక్సల్స్ చెర నుంచి బయటకు వచ్చిన బాలరాజు ఆ 23 రోజులు తనను నక్సల్స్ బాగానే చూసుకున్నారని మీడియాకి తెలియజేశారు. నక్సల్స్ బాలరాజుని కిడ్నాప్ చేసింది మొదలు..మళ్లీ విడుదల చేసేవరకూ పత్రికలూ, జాతీయ మీడియా అంతా ఫోకస్ చింతపల్లి, కొయ్యూ మండలాలపైనే పెట్టింది.  అయితే కుటుంబానికి, ప్రజలకు దూరంగా ఉండిపోయానని..ఒక దశలో తాను కూడా చనిపోతాననే భయం వెంటాడినా.. వారితో అన్నిరోజులు అడవిలో గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు బాలరాజు. నాటి నుంచి నేటి వరకూ బాలరాజు తిరుగులేని గిరిజన రాజకీయ నాయకుడిగానే ఉన్నారు. రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. చాలా మంది నేటి యువతకు తెలియని ఈ 30ఏళ్ల సంఘటన మరోసారి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి క మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ప్రజలు, పాఠకుల ముందుకి తీసుకు వచ్చింది..!

Koyyuru

2023-01-30 01:57:30

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని సోమవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 67 గదులు, హరిహర సదన్ ఏసీ 82,  హరి హర సదన్ నాన్ ఏసీ 48,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 22, ఓల్డ్ సెంటినరీ 7, విఐపీ ఎస్జీహెచ్ 29, సీతారామ చౌల్ట్రీ 55, సత్య నికేతన్ లో35 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-30 01:47:36

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. దానిని పార్టీ ఎంపీలంతా భహిష్కరించాలని 
తీర్మానించారు. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిన తరువాత కేసిఆర్ దూకుడు అంతా జాతీయ స్థాయిలోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Hyderabad

2023-01-29 13:44:07

ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లు సరే.. సర్వీసు రూల్సు మాటేమిటి?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేయాల్సి అత్యవసర పనులు తప్పా.. అడగవని, ప్రస్తుతం అవసరం లేని అన్ని పనులూ చేస్తు న్నట్టు కనిపిస్తున్నది. గ్రామ వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ఈశాఖ ఉద్యోగులు సర్వీసు రూల్సు,ప్రమోషన్ ఛానల్, ఉద్యోగులకు అధికారాల బదాలయింపులు  పై నోరు మెదపకుండా ఇపుడు ఉద్యోగుల పనితీరు అంచనావేయడానికి ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్ అనే సరికొత్త కార్యక్రమానికి తెరలేపింది. సచివాలయాల్లో ప్రధాన భూమిక పోషించే గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో అధికారాలు బదలాయింపు చేసే జీఓను అమలు చేయలేదు. సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేయకపోతే ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టడానికి వీలుపడని పరిస్థితి ఇపుడు నెలకొంది. 20కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా కేటగిరీల్లోని ఉద్యోగులకు  ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. వీరికి పూర్తిస్థాయిలో సర్వీసు రూల్సు పొందుపరచకపోతే..వీరి సర్వీసు రిజస్టరులో ఉద్యోగ వివరాలు ఎక్కడ పనిచేశారో తెలియజేసే అంశాలు తప్పితే వీరికి ఐదేళ్లు, ఏడేళ్లు దాటిన తరువాత ఏ తరహా పదోన్నతులు వస్తాయనే విషయంలో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంలో ఏదైనా ఒకప్రభుత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేస్తే ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయానికే సర్వీసు రూల్సు, ఉద్యోగుల కేటగిరీ, ఉద్యోగుల తరగతి, ప్రమోషన్ ఛానల్, పొందుపరిచి దానికి ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా చట్టబద్దత తీసుకువస్తారు. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసేసిన తరువాత ఒక్కో కేటగిరికి చెందిన ఉద్యోగికి ఒక్కోలా సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుచేస్తుండటం విశేషం.

ఏ ప్రభుత్వశాఖకైనా సదరుశాఖ ముఖ్యకార్యదర్శి, ఒక కమిషనర్, ఒక డైరెక్టర్, జిల్లాశాఖల అధికారులు ఉంటారు. కానీ సచివాలయశాఖలో 20శాఖల ఉద్యోగులు  పనిచేయడంతో కలగూరగంపలా ఉన్న ఈశాఖ నిర్వహణ చేపట్టేందుకు ఒకసారి ముఖ్యకార్యదర్శి, మరోసారి డైరెక్టర్ లు తెరపైకి వస్తున్నారు. ఇంతమంది వచ్చి పరిపాలనను సాగిస్తున్నా..ఉద్యోగుల సంక్షేమం, వారి భవిష్యత్తును నిర్ణయించి సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్, జాబ్ చార్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేసే 
విషయంలో మాత్రం నిర్ధిష్ట ఉత్తర్వులు మాత్రం జారీ చేయడం లేదు. ఉద్యోగులను 1996 ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్సు ప్రకారం ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తు్న్నామని చెబుతున్న ప్రభుత్వం వీరికి పదోన్నతులు ఏవిధంగా చేపడుతుందనేది మాత్రం తేల్చడం లేదు. ఇప్పటికే ఉద్యోగులంతా సర్వీసులోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నది. ఈశాఖకు, ఉద్యోగాలకు నేటికీ చట్టబద్దత లేదు, వచ్చే ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలు ఉంటాయో..మరేదైనా శాఖలో విలీనం చేస్తారో తెలియని పరిస్థితి ఉద్యోగుల్లో నెలకొంది. ఇపుడు అదే విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చనడుస్తున్నది కూడా. మరికొందరు ఎదుగూ బొదుగూ లేని ఈ ఉద్యోగాలు కాదని వేరే ఉద్యోగాలు వెళ్లిపోతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల పనితీరును గుర్తించేందుకు ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం..నేటికీ ఉద్యోగుల  పనితీరును పూర్తిస్థాయిలో గాడిలో పెట్టే అధికారాలు కనీసం ఎంపీడీఓలకు కూడా ఇవ్వలేదు. ఒకరకంగా చెప్పాలంటే సచివాలయాల్లో గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు పనిలేదు.. అధికారాలూలేవు.. వీరిని అసలు ఏ తరహా విధులకు వినియోగిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వీరేం చేస్తున్నారో కనీసం జిల్లాల కలెక్టర్లు కూడా దృష్టి సారించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టి ఫెర్మార్మెన్స్ ఇండికేటర్ల వలన ఉపయోగం ఏముంటుందో ప్రభుత్వానికే తెలియాలి. ఆది నుంచి ప్రభుత్వం ఇచ్చిన జాబ్ చార్టు ప్రకారం ఉద్యోగులతో పనిచేయిస్తే నేడు ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లు తీసుకొచ్చే పనిలేకుండా ఉండేది. ఆ పనిచేయకుండా సచివాలయ ఉద్యోగుల విషయంలో రోజు కొత్త విధానాలను తెరపైకి తీసుకు వస్తున్న ప్రభుత్వం..వారి ఉద్యోగాలు, సర్వీసు రూల్సు, పదోన్నతుల విషయంలో.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. అటు ప్రతీసారి ప్రభుత్వం దగ్గరకి వినతి పత్రాలు పట్టుకొని తిరుగుతూ..అవకాశం వచ్చినపుడల్లా మీడియాలో పబ్లిసిటీ చేయించుకునే ఉద్యోగ సంఘాల నాయకులు సైతం ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్, గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాల బదలాయింపులు చేయని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఈ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లను ఆదిలోనే తీసుకొచ్చి ఉంటే ఈపాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడి ప్రజలకు మరింతగా సేవలు అందేవనే వాదన కూడా బలంగా వినపడుతోంది. ఏదిఏమైనా ప్రభుత్వం కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసినపుడు.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఈ శాఖలో కూడా విధానపరమైన అంశాలన్నీ అమలు చేసి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు. చూడాలి ఇకపైనా అన్ని చర్యల తోపాటు సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్, ఈ శాఖకు చట్టబద్దత, ఈ శాఖ ద్వారా ఆదాయాన్ని మెరుగుపరిచే విధానాలను అమలుచేస్తుందా లేదా అనేది..!

Tadepalli

2023-01-29 04:10:43

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 16 గదులు, హరిహర సదన్ ఏసీ 27,  హరి హర సదన్ నాన్ ఏసీ 18,  హరి హర సదన్ సింగిల్ 2, న్యూ సెంటినరీ 14, ఓల్డ్ సెంటినరీ 5, విఐపీ ఎస్జీహెచ్ 10, సీతారామ చౌల్ట్రీ 22, సత్య నికేతన్ లో29 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-29 02:38:05

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం


 ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన  వై.రాఘవేంద్ర రూ.10 లక్షలు  
విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమలలోని కార్యాలయంలో ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సంస్థ ఇదివరకే టిటిడికి రూ.20 లక్షలు 
విరాళంగా అందజేసింది. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు టిటిడి సిబ్బంది స్వామవారి ప్రసాదాలను అందజేశారు.

Tirumala

2023-01-28 12:03:00

హమ్మయ్య ఉద్యోగుల విరమణ వయస్సుపై క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచిదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ప్రత్యేక జీఓ కూడా హల్ 
చల్ చేస్తోంది. అయిదే దానిపై రాష్ట్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ జీవో అని, వయస్సు పెంచలేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ వైరల్ వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఏపీ ఆర్దిక శాఖ అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వున్న 62 ఏళ్ల వయస్సు మాత్రం మరో ఏడాది 63కి పెంచే ప్రతిపాదన విషయంలో ఆలోచిస్తున్నట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు.

Tadepalli

2023-01-28 07:48:15

సమాచారశాఖ మొత్తం ఖాళీ.. తర్వాత ఏంటి పరిస్థితి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో  పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ గడువు పూర్తవుతున్న తరుణంలో ప్రప్రధమంగా సమాచార, పౌర సంబంధాలశాఖ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కోనుంది. రాష్ట్రవ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల సమయంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయిపోయారు. ఇపుడు 13 జిల్లాలు, 26 అయిన తరువాత ఉన్నవారినే కొత్త జిల్లాలకు సర్ధుబాటు చేశారు. ఇపుడు అసలైన గడ్డు పరిస్థితి రానే వచ్చింది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, డివిజనల్ పీఆర్వోలు, డీపీఆర్వోలు, ఏపీఆర్వోలు ఒకే సారి పెద్ద మొత్తంలో ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాత ఉమ్మడి జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పద్దతిన 13 మంది ఏపీఆర్వోలను మాత్రమే నియమించింది. గతంలో ఉన్న కొందరు జూనియర్ అసిస్టెంట్లకు తాజాగా ఏపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలుగా పదోన్నతులు కల్పించింది. అయినా ఈ శాఖలో తీవ్రంగా సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఫోటో గ్రాఫర్లు లేకపోవడంతో సినిమా ఆపరేటర్లు ఫోటగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. చాలా చోట్ల వీడియో గ్రాఫర్లుకూడా లేరు. ఉన్న సాంకేతిక సిబ్బందినే ఆ అవసరాలకు వినియోగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వార్తా రచనపై అవగాహన ఉన్నవారికి వారిని సమాచారశాఖ ఏపీఆర్వోలుగా వినియోగించుకుంటున్నది.

కొత్తగా 4 డీపీఆర్వోలు, మరికొన్ని ఏపీఆర్వో పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు ఏర్పాటు చేసినా వాటికి ఇంకా అతీగతీ లేదు. మార్చి, ఏప్రిల్ తరువాత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల కాలపరిమితి దగ్గర పడుతుంది. ఈ లోగా ఔట్ సోర్సింగ్ పద్దతిలోనైనా సమాచారశాఖలో సిబ్బంది ప్రభుత్వం నియమించాల్సి వుంటుంది. లేదంటే ఉన్నవారంతా ఉద్యోగవిరమణ పొంది ఈశాఖ మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కొత్త జిల్లా్ల్లో నియమించిన డీపీఆర్వోలకు సహాయకులుగా ఎవరినీ నియమించకపోవడంతో భారం మొత్తం డిపీఆర్వోలపైనే పడుతున్నది. ఫోటోలు, వీడియోలు, ప్రెస్ నోట్ ప్రిపరేషన్, దానిని మీడియా సంస్థలకు పంపే బాధ్యతలన్నీ ఒక్క డీపీఆర్వోలే చేసుకోవాల్సి వస్తున్నది. తమ ఇబ్బందులను, సాంకేతిక సమస్యలను రాష్ట్ర కమిషనరేట్ కి విన్నవించినా వినే నాధుడే కరువయ్యాడు. ఏదో కష్టపడి ఉన్న అరకొర సిబ్బందితోనే కొత్త జిల్లాల్లోని డీపీఆర్వోలు మీడియా మేనేజ్ మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. వీరికి ప్రభుత్వం పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ పరిమితి పూర్తయితే మాత్రం సమాచారశాఖ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఒక్కో జిల్లాకు ఒక డీపీఆర్వో, ఒక ఏపీఆర్వో, ఒక ఫోటో గ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక టెక్నిల్ అసిస్టెంట్లను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాలు సకాలంలో మీడియాకి అందించే ఏర్పాటు జరగదు. అలాంటిది అన్ని పనులు ఒక్క డీపీఆర్వోనే చేసుకోవడం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు..

ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయస్సు మరో ఏడాది పెంచాలని యోచిస్తున్నతరుణంలో సమాచారశాఖ ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన మొదలైం ది. ఇప్పటి కే వయస్సు మీదపడి, సిబ్బంది లేక అన్నీ పనులు ఒక్కరొక్కరే చేసుకోవాల్సి వుస్తున్నదని, ప్రస్తుతం జరుగుతున్న 63 ఏళ్ల పెంపు నిజమైతే మాత్రం పని ఒత్తిడితోనే సర్వీసులో ఉండగానే చాలా మంది తనువు చాలించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు అధికారులు, సిబ్బంది ఈఎన్ఎస్ ముందు వాపోయారు. తమకు అదనపు సిబ్బంది కావాలని అడిగినా చూద్దాం, చేద్దం అంటున్నారే తప్పా కార్యాచరణ మాత్రం జరగలేదని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం నియమించిన ఆ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా లేకపోతే తమ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరి అయిపోయి ఉండేదని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు..వయస్సు పెంచినా, పెంచపోయినా 62 ఏళ్ల తరువాత స్వచ్చందంగా నైనా రాజీనామాలు చేస్తామని చెప్పడం విశేషం. ఒక జిల్లాశాఖ కార్యాలయంలో నలుగురు సిబ్బంది చేసే పనిని ఒక్క డిపీఆర్వో చేయడం అంటే ఆ నరకం మామూలుగా ఉండదు. ఉద్యోగుల విరమణకు సమయం దగ్గర పడుతున్నవేళ సమాచార పౌర సంబంధాల శాఖ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని సిబ్బందిని భర్తీ చేస్తుందనేది అంతుచిక్కకుండా ఉన్నది..చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalligudem

2023-01-28 04:31:23