1 ENS Live Breaking News

ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లు సరే.. సర్వీసు రూల్సు మాటేమిటి?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేయాల్సి అత్యవసర పనులు తప్పా.. అడగవని, ప్రస్తుతం అవసరం లేని అన్ని పనులూ చేస్తు న్నట్టు కనిపిస్తున్నది. గ్రామ వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ఈశాఖ ఉద్యోగులు సర్వీసు రూల్సు,ప్రమోషన్ ఛానల్, ఉద్యోగులకు అధికారాల బదాలయింపులు  పై నోరు మెదపకుండా ఇపుడు ఉద్యోగుల పనితీరు అంచనావేయడానికి ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్ అనే సరికొత్త కార్యక్రమానికి తెరలేపింది. సచివాలయాల్లో ప్రధాన భూమిక పోషించే గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో అధికారాలు బదలాయింపు చేసే జీఓను అమలు చేయలేదు. సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేయకపోతే ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టడానికి వీలుపడని పరిస్థితి ఇపుడు నెలకొంది. 20కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా కేటగిరీల్లోని ఉద్యోగులకు  ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. వీరికి పూర్తిస్థాయిలో సర్వీసు రూల్సు పొందుపరచకపోతే..వీరి సర్వీసు రిజస్టరులో ఉద్యోగ వివరాలు ఎక్కడ పనిచేశారో తెలియజేసే అంశాలు తప్పితే వీరికి ఐదేళ్లు, ఏడేళ్లు దాటిన తరువాత ఏ తరహా పదోన్నతులు వస్తాయనే విషయంలో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంలో ఏదైనా ఒకప్రభుత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేస్తే ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయానికే సర్వీసు రూల్సు, ఉద్యోగుల కేటగిరీ, ఉద్యోగుల తరగతి, ప్రమోషన్ ఛానల్, పొందుపరిచి దానికి ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా చట్టబద్దత తీసుకువస్తారు. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసేసిన తరువాత ఒక్కో కేటగిరికి చెందిన ఉద్యోగికి ఒక్కోలా సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుచేస్తుండటం విశేషం.

ఏ ప్రభుత్వశాఖకైనా సదరుశాఖ ముఖ్యకార్యదర్శి, ఒక కమిషనర్, ఒక డైరెక్టర్, జిల్లాశాఖల అధికారులు ఉంటారు. కానీ సచివాలయశాఖలో 20శాఖల ఉద్యోగులు  పనిచేయడంతో కలగూరగంపలా ఉన్న ఈశాఖ నిర్వహణ చేపట్టేందుకు ఒకసారి ముఖ్యకార్యదర్శి, మరోసారి డైరెక్టర్ లు తెరపైకి వస్తున్నారు. ఇంతమంది వచ్చి పరిపాలనను సాగిస్తున్నా..ఉద్యోగుల సంక్షేమం, వారి భవిష్యత్తును నిర్ణయించి సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్, జాబ్ చార్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేసే 
విషయంలో మాత్రం నిర్ధిష్ట ఉత్తర్వులు మాత్రం జారీ చేయడం లేదు. ఉద్యోగులను 1996 ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్సు ప్రకారం ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తు్న్నామని చెబుతున్న ప్రభుత్వం వీరికి పదోన్నతులు ఏవిధంగా చేపడుతుందనేది మాత్రం తేల్చడం లేదు. ఇప్పటికే ఉద్యోగులంతా సర్వీసులోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నది. ఈశాఖకు, ఉద్యోగాలకు నేటికీ చట్టబద్దత లేదు, వచ్చే ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలు ఉంటాయో..మరేదైనా శాఖలో విలీనం చేస్తారో తెలియని పరిస్థితి ఉద్యోగుల్లో నెలకొంది. ఇపుడు అదే విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చనడుస్తున్నది కూడా. మరికొందరు ఎదుగూ బొదుగూ లేని ఈ ఉద్యోగాలు కాదని వేరే ఉద్యోగాలు వెళ్లిపోతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల పనితీరును గుర్తించేందుకు ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం..నేటికీ ఉద్యోగుల  పనితీరును పూర్తిస్థాయిలో గాడిలో పెట్టే అధికారాలు కనీసం ఎంపీడీఓలకు కూడా ఇవ్వలేదు. ఒకరకంగా చెప్పాలంటే సచివాలయాల్లో గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు పనిలేదు.. అధికారాలూలేవు.. వీరిని అసలు ఏ తరహా విధులకు వినియోగిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వీరేం చేస్తున్నారో కనీసం జిల్లాల కలెక్టర్లు కూడా దృష్టి సారించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టి ఫెర్మార్మెన్స్ ఇండికేటర్ల వలన ఉపయోగం ఏముంటుందో ప్రభుత్వానికే తెలియాలి. ఆది నుంచి ప్రభుత్వం ఇచ్చిన జాబ్ చార్టు ప్రకారం ఉద్యోగులతో పనిచేయిస్తే నేడు ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లు తీసుకొచ్చే పనిలేకుండా ఉండేది. ఆ పనిచేయకుండా సచివాలయ ఉద్యోగుల విషయంలో రోజు కొత్త విధానాలను తెరపైకి తీసుకు వస్తున్న ప్రభుత్వం..వారి ఉద్యోగాలు, సర్వీసు రూల్సు, పదోన్నతుల విషయంలో.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. అటు ప్రతీసారి ప్రభుత్వం దగ్గరకి వినతి పత్రాలు పట్టుకొని తిరుగుతూ..అవకాశం వచ్చినపుడల్లా మీడియాలో పబ్లిసిటీ చేయించుకునే ఉద్యోగ సంఘాల నాయకులు సైతం ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్, గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాల బదలాయింపులు చేయని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఈ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లను ఆదిలోనే తీసుకొచ్చి ఉంటే ఈపాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడి ప్రజలకు మరింతగా సేవలు అందేవనే వాదన కూడా బలంగా వినపడుతోంది. ఏదిఏమైనా ప్రభుత్వం కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసినపుడు.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఈ శాఖలో కూడా విధానపరమైన అంశాలన్నీ అమలు చేసి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు. చూడాలి ఇకపైనా అన్ని చర్యల తోపాటు సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్, ఈ శాఖకు చట్టబద్దత, ఈ శాఖ ద్వారా ఆదాయాన్ని మెరుగుపరిచే విధానాలను అమలుచేస్తుందా లేదా అనేది..!

Tadepalli

2023-01-29 04:10:43

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 16 గదులు, హరిహర సదన్ ఏసీ 27,  హరి హర సదన్ నాన్ ఏసీ 18,  హరి హర సదన్ సింగిల్ 2, న్యూ సెంటినరీ 14, ఓల్డ్ సెంటినరీ 5, విఐపీ ఎస్జీహెచ్ 10, సీతారామ చౌల్ట్రీ 22, సత్య నికేతన్ లో29 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-29 02:38:05

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం


 ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన  వై.రాఘవేంద్ర రూ.10 లక్షలు  
విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమలలోని కార్యాలయంలో ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సంస్థ ఇదివరకే టిటిడికి రూ.20 లక్షలు 
విరాళంగా అందజేసింది. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు టిటిడి సిబ్బంది స్వామవారి ప్రసాదాలను అందజేశారు.

Tirumala

2023-01-28 12:03:00

హమ్మయ్య ఉద్యోగుల విరమణ వయస్సుపై క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచిదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ప్రత్యేక జీఓ కూడా హల్ 
చల్ చేస్తోంది. అయిదే దానిపై రాష్ట్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ జీవో అని, వయస్సు పెంచలేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ వైరల్ వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఏపీ ఆర్దిక శాఖ అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వున్న 62 ఏళ్ల వయస్సు మాత్రం మరో ఏడాది 63కి పెంచే ప్రతిపాదన విషయంలో ఆలోచిస్తున్నట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు.

Tadepalli

2023-01-28 07:48:15

సమాచారశాఖ మొత్తం ఖాళీ.. తర్వాత ఏంటి పరిస్థితి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో  పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ గడువు పూర్తవుతున్న తరుణంలో ప్రప్రధమంగా సమాచార, పౌర సంబంధాలశాఖ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కోనుంది. రాష్ట్రవ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల సమయంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయిపోయారు. ఇపుడు 13 జిల్లాలు, 26 అయిన తరువాత ఉన్నవారినే కొత్త జిల్లాలకు సర్ధుబాటు చేశారు. ఇపుడు అసలైన గడ్డు పరిస్థితి రానే వచ్చింది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, డివిజనల్ పీఆర్వోలు, డీపీఆర్వోలు, ఏపీఆర్వోలు ఒకే సారి పెద్ద మొత్తంలో ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాత ఉమ్మడి జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పద్దతిన 13 మంది ఏపీఆర్వోలను మాత్రమే నియమించింది. గతంలో ఉన్న కొందరు జూనియర్ అసిస్టెంట్లకు తాజాగా ఏపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలుగా పదోన్నతులు కల్పించింది. అయినా ఈ శాఖలో తీవ్రంగా సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఫోటో గ్రాఫర్లు లేకపోవడంతో సినిమా ఆపరేటర్లు ఫోటగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. చాలా చోట్ల వీడియో గ్రాఫర్లుకూడా లేరు. ఉన్న సాంకేతిక సిబ్బందినే ఆ అవసరాలకు వినియోగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వార్తా రచనపై అవగాహన ఉన్నవారికి వారిని సమాచారశాఖ ఏపీఆర్వోలుగా వినియోగించుకుంటున్నది.

కొత్తగా 4 డీపీఆర్వోలు, మరికొన్ని ఏపీఆర్వో పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు ఏర్పాటు చేసినా వాటికి ఇంకా అతీగతీ లేదు. మార్చి, ఏప్రిల్ తరువాత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల కాలపరిమితి దగ్గర పడుతుంది. ఈ లోగా ఔట్ సోర్సింగ్ పద్దతిలోనైనా సమాచారశాఖలో సిబ్బంది ప్రభుత్వం నియమించాల్సి వుంటుంది. లేదంటే ఉన్నవారంతా ఉద్యోగవిరమణ పొంది ఈశాఖ మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కొత్త జిల్లా్ల్లో నియమించిన డీపీఆర్వోలకు సహాయకులుగా ఎవరినీ నియమించకపోవడంతో భారం మొత్తం డిపీఆర్వోలపైనే పడుతున్నది. ఫోటోలు, వీడియోలు, ప్రెస్ నోట్ ప్రిపరేషన్, దానిని మీడియా సంస్థలకు పంపే బాధ్యతలన్నీ ఒక్క డీపీఆర్వోలే చేసుకోవాల్సి వస్తున్నది. తమ ఇబ్బందులను, సాంకేతిక సమస్యలను రాష్ట్ర కమిషనరేట్ కి విన్నవించినా వినే నాధుడే కరువయ్యాడు. ఏదో కష్టపడి ఉన్న అరకొర సిబ్బందితోనే కొత్త జిల్లాల్లోని డీపీఆర్వోలు మీడియా మేనేజ్ మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. వీరికి ప్రభుత్వం పెంచిన రెండేళ్ల ఉద్యోగ విరమణ పరిమితి పూర్తయితే మాత్రం సమాచారశాఖ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఒక్కో జిల్లాకు ఒక డీపీఆర్వో, ఒక ఏపీఆర్వో, ఒక ఫోటో గ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక టెక్నిల్ అసిస్టెంట్లను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాలు సకాలంలో మీడియాకి అందించే ఏర్పాటు జరగదు. అలాంటిది అన్ని పనులు ఒక్క డీపీఆర్వోనే చేసుకోవడం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు..

ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయస్సు మరో ఏడాది పెంచాలని యోచిస్తున్నతరుణంలో సమాచారశాఖ ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన మొదలైం ది. ఇప్పటి కే వయస్సు మీదపడి, సిబ్బంది లేక అన్నీ పనులు ఒక్కరొక్కరే చేసుకోవాల్సి వుస్తున్నదని, ప్రస్తుతం జరుగుతున్న 63 ఏళ్ల పెంపు నిజమైతే మాత్రం పని ఒత్తిడితోనే సర్వీసులో ఉండగానే చాలా మంది తనువు చాలించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు అధికారులు, సిబ్బంది ఈఎన్ఎస్ ముందు వాపోయారు. తమకు అదనపు సిబ్బంది కావాలని అడిగినా చూద్దాం, చేద్దం అంటున్నారే తప్పా కార్యాచరణ మాత్రం జరగలేదని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం నియమించిన ఆ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా లేకపోతే తమ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరి అయిపోయి ఉండేదని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు..వయస్సు పెంచినా, పెంచపోయినా 62 ఏళ్ల తరువాత స్వచ్చందంగా నైనా రాజీనామాలు చేస్తామని చెప్పడం విశేషం. ఒక జిల్లాశాఖ కార్యాలయంలో నలుగురు సిబ్బంది చేసే పనిని ఒక్క డిపీఆర్వో చేయడం అంటే ఆ నరకం మామూలుగా ఉండదు. ఉద్యోగుల విరమణకు సమయం దగ్గర పడుతున్నవేళ సమాచార పౌర సంబంధాల శాఖ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని సిబ్బందిని భర్తీ చేస్తుందనేది అంతుచిక్కకుండా ఉన్నది..చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalligudem

2023-01-28 04:31:23

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 14 గదులు, హరిహర సదన్ ఏసీ 14,  హరి హర సదన్ నాన్ ఏసీ 19,  హరి హర సదన్ సింగిల్ 0, న్యూ సెంటినరీ 4, ఓల్డ్ సెంటినరీ 2, విఐపీ ఎస్జీహెచ్ 14, సీతారామ చౌల్ట్రీ 35, సత్య నికేతన్ లో29 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-28 03:31:09

తిరుమలలో రథసప్తమి పర్వదినానికి ఏర్పాట్లుపూర్తి

తిరుమలలో శనివారం జరుగనున్న రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని  తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయన్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

మాడ వీధుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సివిఎస్వో, ఎస్పీ
రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భద్రతా ఏర్పాట్లను టిటిడి సివిఎస్వో నరసింహకిషోర్‌, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన మండపం, మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీ కోసం చేపట్టిన ప్రవేశమార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-01-27 12:14:29

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 21 గదులు, హరిహర సదన్ ఏసీ 18,  హరి హర సదన్ నాన్ ఏసీ 6,  హరి హర సదన్ సింగిల్ 0, న్యూ సెంటినరీ 6, ఓల్డ్ సెంటినరీ 14, విఐపీ ఎస్జీహెచ్ 11, సీతారామ చౌల్ట్రీ 26, సత్య నికేతన్ లో 30 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-27 02:56:57

టిడిపి అధినేత చంద్రబాబుని కలుస్తున్న IAS, IPS లు..!?

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనలో చీలికలు వస్తున్నాయా.. సివిల్ సర్వీస్ అధికారులు రెండు వర్గాలు చీలిపోతున్నారా.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు ఎంత మంది సివిల్ సర్వీస్ అధికారులకు నచ్చుతున్నాయి.. మరెంత మందికి నచ్చడం లేదు.. ఈ కారణంతోనే కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులు టిటిపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలుస్తున్నారా..? ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్..! ఏపీలో మునుపెన్నడూ లేని ఆర్ధిక సంక్షోభం రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో అటెండర్ల జీతాల నుంచి ఐఏఎస్ ల సౌకర్యాల వరకూ ప్రతీదీ తడుముకునే పరిస్థితి వస్తోందని..ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆ భారం ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులపైనా పడుతుందని సివిల్ సర్వీస్ అధికారులు భావిస్తున్నారట. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరిట నగదు బదిలీకి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం.. ఆ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం వారంత ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల అధికారులకు ఉద్యోగులు వచ్చి మొరపెట్టుకోవడం గత కొద్ది రోజులుగా జరుగుతూ వస్తోంది. అయితే ఈ విధానం నచ్చని కొందరు సివిల్ సర్వీస్ అధికారులు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు, వారిని అనుసరించే మరికొందరు చంద్రబాబుతో రహస్యంగ భేటి అయినట్టు చెబుతున్నారు.ప్రభుత్వంలోని ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నుంచి పెరుగుతున్న నిరసన..త్వరలో జరగబోయే ఉద్యోగ విరమణలు, వారందరికీ చెల్లించాల్సిన సదుపాయాల ఆర్ధిక భారం ప్రభుత్వంపై చాలా గట్టిగా పడుతుందని..ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుందనే విషయాన్ని చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారట. అయితే అధికార ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షపార్టీగా వున్న మాజీ ముఖ్యమంత్రి వద్దకు బ్యూరోక్రాట్లు ఎందుకు వెళుతున్నారనే విషయం, ప్రచారం ఇపుడు ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సివిల్ సర్వీస్ అధికారులు చాలా మంది ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అయితే అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన వారంతా  మంచి శాఖల్లో ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లుగా ఉండగా ప్రాధాన్యత లేని, ప్రజలతో అంతగా సంబంధంలేని శాఖలకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన బ్యూరోక్రాట్లను బదిలీచేశారనే ఆవేదనను చంద్రబాబు ముందు 
ఉంచినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వారికి కాస్త సన్నిహితంగా వున్న మరికొందరు సివిల్ సర్వీస్ అధికారులు కూడా ప్రభుత్వంలోని తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వంలో ఆర్ధిక సంక్షోభం, ఉద్యోగులు, అధికారులను కాదని కేవలం ప్రజల సంక్షేమం పేరిట నగదు బదిలీల చేస్తున్న విధానాలను కొందరు బ్యూరోక్రాట్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం టిడిపి అధికారంలో లేదు..చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అయినా బ్యూరోక్రాట్లు ఎందుకు వెళ్లి కలుస్తున్నారనే విషయంలో విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా బయటకు వచ్చింది ఒకే సమాజిక వర్గానికి చెందిన వారు, బంధుగణంలో ఉన్న బ్యూరోక్రాట్లు కలిసినపుడు ఈ విషయం బయటకు వచ్చిందా..లేదంటే నిజంగానే ప్రభుత్వ పరిపాలన గాడితప్పుతున్నదనే విషయాన్ని నేరుగా వాస్తవ పరిస్థితిని తెలియజేయడానికి చంద్రబాబు వద్దకు వెళుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రాధాన్యత లేని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బ్యూరోక్రాట్లు కొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నామనే విషయాన్ని చెప్పడానికి కూడా వెళుతున్నట్టుగా సమాచారం అందుతున్నది. ఇప్పటికే కొందరు బ్యూరోక్రాట్లు కేంద్ర సర్వీసులకు దరఖాస్తులు చేసుకోగా మరికొందరు అదేబాటలో ఉన్నారనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వాన్ని మంచి సూచనలు, సలహాలతో నడిపించేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సివిల్ సర్వీసు అధికారులే. అయితే వారి అంచనాలకు సైతం అందకుండా ఆర్ధిక భారాన్ని అప్పుల రూపంలోనూ, సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం మీదకు తీసుకువచ్చే క్రమంలో వాటిని ముందుండి నడిపించాల్సిన బ్యూరోక్రాట్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నందుకు మరికొందరు ఐఏఎస్ లు కోర్టు మెట్లు ఎక్కి శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. దీనితో ఈ తరహా విషయాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా బ్యూరోక్రాట్లు ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతున్నారనే సంకేతాలను ఇస్తున్నారా అనే అనుమానాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా పడిపోయి సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఆలస్యం కావడం, ప్రభుత్వ పథకాలకే అత్యధిక మొత్తం అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, వాటి విషయంలో పలు ప్రభుత్వశాఖలకు చెందిన ఐఏఎస్ లు మధ్యలో ఉండటం,ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకపోవడం, 2023లో పీఆర్సీ ఇస్తారో ఇవ్వని పరిస్థితి నెలకొనడం, సీపీఎస్ రద్దు చేయకపోవడం, వాటి స్థానంలో జీపిఎస్ ప్రవేశపెట్టడం, తాజాగా ఉద్యోగుల విరమణ వయస్సు మరో ఏడాది అంటే 63ఏళ్లకు పెంచాలని యోచించడం, ఉద్యోగుల హెచ్ఆర్ఏ, డిఏ లు కుదించడం, ఎన్నికల హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవ డం, వాటిపై ప్రభుత్వశాఖలకు భారీస్థాయిలో వినతులు రావడం, సోషల్ మీడియాలో బ్యూరోక్రాట్లపై తేడాగా ప్రచారం జరగడం, ఆదాయం వచ్చే మార్గాలను వదిలిపెట్టి.. ఆ భారాన్ని ప్రజలపై అధిక పన్నుల రూపంలో వసూలు చేయడం..కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడం, పదోన్నతులు కల్పించకపోవడం, బదిలీ లు చేపట్టకపోవడం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి నిత్యం బ్యూరోక్రాట్లకు వస్తున్న ఒత్తిడి, వారి మనసులో ఉద్యోగుల కోసం పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధి కారులుగా అమ్మనా బూతులు తిడుతున్న విషయాన్ని నేరుగా అధికాలు విని తీవ్రంగా మదన పడటం తదితర అంశాలను చంద్రబాబు ద్రష్టికి తీసుకెళితే రాజకీయంగా ఎదుర్కోవడానికి అవకాశం వుంటుందనే కోణంలో కూడా బ్యూరోక్రాట్లు కలుస్తున్నట్టు సమాచారం అందుతున్నది. నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న సివిల్ సర్వీస్ అధికారులు ఒక వర్గంగా విడిపోతున్నారా అనే  ప్రచారం మాత్రం రోజు రోజుకూ తీవ్రమైన చర్చకు దారితీస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ, నిఘా వర్గాల సమాచారం పక్కాగా అందుతున్న సమయంలో ఈ తరహా ప్రచారాలను ప్రజలు కూడా ఆశక్తిగానే స్వీకరిస్తున్నారనేది తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి...!

Tadepalli

2023-01-27 01:20:38

ఈసారైనా గ్రేడ్-5కార్యదర్శిలకు అధికారాలొచ్చేనా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాల్లో చేరిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు నేటివరకూ ఎలాంటి అధికారాలూ లేకుండానే పనిచేస్తున్నారు. మూడున్నరేళ్ల నుంచి తమకు కనీస అధికారాలు ఇవ్వాలని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదీ చుట్టూ కాళ్లు అరిగెలా తిరినా ఫలితం కనిపించలేదు. కనీసం ఈశాఖకు కొత్తగా వచ్చిన ముఖ్యకార్యదర్శి  బుడితి రాజశేఖర్ ద్వారా నైనా తమకు అధికార బదలాయింపు జరుగుతుందా అనే ఆశమళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల్లో చిగురించింది. అసాధ్యాలను సైతం తన తెలివితేటలతో సుసాధ్యం చేసే అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖరకు మంచిపేరు ఉంది. గతంలో ఈశాఖ ముఖ్య కార్యదర్శిగా వున్న ద్వివేదీకి సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అవి బుట్టదాఖలే అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈయనకు బదిలీ జరగడంతో మళ్లీ సచివాలయ ఉద్యోగులకు ఆశలు చిగురించాయి, కొత్తగా ఆసీటులోకి వచ్చిన ఐఏఎస్ అధికారిపై ఉన్ననమ్మకంతో మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు ఆయనను కలిసి గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు కట్టబెట్టే విషయమై విన్నవించడానికి సిద్ద పడుతున్నారు.

ప్రస్తుతం మేజర్ పంచాయతీలు ఉన్నచోట 1 సచివాలయం మినహా, 2, 3 సచివాలయాల గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగా విధులు నిర్వహించాల్సి  వస్తున్నది. ఆఖరికి గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు సైతం పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-1)ను చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమకు కనీస అధికారాలు కల్పించాలని, తమకు జీఓనెంబరు 146 ద్వారా రావాల్సిన అధికారాలు బదలాయించాలని నెత్తీ నోరూ కొట్టుకున్నా వీరికి ప్రభుత్వం నుంచి అధికారాలు రాలేదు. అయితే ఇదే విషయమై సచివాలయ ఉద్యోగులు జిల్లా పంచాయతీ అధికారులకు, జిల్లా కలెక్టర్లు, ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి సైతం ఉద్యోగ 
సంఘాలు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో కొన్ని జిల్లా కలెక్టర్లకు గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వాలని, తద్వారా 
గ్రామాల్లో అభివృద్ధి, ప్రజలకు సహకారం పెరుగుతుందని భావించినా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో వాటిని 
అమలు చేయలేదు. తాజాగా ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిని బదిలీచేయడంతో మళ్లీ ఈశాఖలోని అధికారులకు, సిబ్బందికి ఊపిరి లేచొచ్చినట్టు అయ్యింది. 

కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగా పనులు చేయని పీఅండ్ ఆర్డీ ముఖ్యకార్యదర్శిని కలవడానికి కూడా ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. చాలాకాలం తరువాత ఈశాఖలో ముఖ్యకార్యదర్శి మార్పుతో అధికారులు, ఉద్యోగులతోపాటు, గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకనైనా పంచాయతీరాజ్ శాఖలో అన్ని పనులు చక చకా ముందుకిగి సాగుతాయనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ శాఖకు ముఖ్య కార్యదర్శిగా వచ్చిన బుడితి 
రాజశేఖర్ ద్వారా నైనా పనులు ముందుకు సాగుతాయా..లేదంటే మునుపటి ముఖ్యకార్యదర్శి మల్లే అన్ని దరఖాస్తులు చెత్త బుట్టలోనే కాపురం ఉంటాయా అనేది 
మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. అయితే ఉద్యోగులు, అధికారులు మాత్రం ఈయనపై గట్టినమ్మకంతోనే ఉన్నారు.

Tadepalli

2023-01-25 02:36:05

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 56 గదులు, హరిహర సదన్ ఏసీ 72,  హరి హర సదన్ నాన్ ఏసీ 42,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 15, ఓల్డ్ సెంటినరీ 34, విఐపీ ఎస్జీహెచ్ 26, సీతారామ చౌల్ట్రీ 68, సత్య నికేతన్ లో 34 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-25 02:24:52

ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాలు

దేశంలోనే  తొలిసారిగా ఏపీలో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు  నవరత్నాలు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రోడ్ల మరమ్మతులపై ఏపీ సీఎం ఎంఎస్ యాప్ ద్వారా ప్రజలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని..వచ్చిన ఫిర్యాదులను 60రోజుల్లో పరిష్కరించున్నట్టు ఆయన వివరించారు.

Tadepalli

2023-01-24 13:25:04

ఐదు ప్రభుత్వ శాఖలకు ఒకే ఒక్క ముఖ్యకార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐదు ప్రభుత్వశాఖలకు ఒకే ఒక్క ముఖ్యకార్యదర్శిగా చేసే అవకాశం సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలక్రిష్ణ ద్వివేదికి దక్కింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయనను వ్యవసాయశాఖకు బదిలీచేస్తూనే.. వాటితో పాటు సహకార, పశుసంవర్ధకం, డెయిరీ డెవలప్ మెంట్, మత్స్యశాఖ, మైనింగ్ శాఖలతోపాటు రైతు భరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్ గా కొనసాగుతారని ఉటంకిస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ శాఖకు బుడితి రాజశేఖర్ ను ప్రభుత్వం నియమించింది.

Tadepalli

2023-01-24 06:53:45

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 63 గదులు, హరిహర సదన్ ఏసీ 81,  హరి హర సదన్ నాన్ ఏసీ 33,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 11, ఓల్డ్ సెంటినరీ 12, విఐపీ ఎస్జీహెచ్ 22, సీతారామ చౌల్ట్రీ 68, సత్య నికేతన్ లో 31 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-24 03:31:53

ఆ..జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలమైనా అద్దిల్లులే శరణ్యం..!

భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కొత్తజిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓలు తొలిసారిగా అద్దెఇంట్లో ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగంలో జిల్లా కలెక్టర్ ఉద్యోగం, జిల్లా ఎస్పీ, డిఎఫ్ఓ ఉద్యోగాలు అత్యున్నతంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లు భావిస్తారు. సివిల్ సర్వీస్ కేడర్ ఉద్యోగం అంటే ఒక కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్, జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ వాటితో పాటు క్యాంపు ఆఫీసు, నివాస సముదాయం అన్ని ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం నూతనంగా ఏర్పడిన 13 జిల్లాల్లోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీశాఖ అధికారులకు మాత్రం అద్దె ఇల్లులే శరణ్యం అయ్యాయి. కొత్తగా జిల్లాల ఏర్పాటు చేయడంతో కొన్ని చోట్ల కలెక్టరేట్లు కూడా ప్రైవేటు సముదాయాల్లోనే నిర్వహిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లంతా బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించాల్సి వస్తున్నది. వీరికి హోదా గొప్ప..నివాస సముదాయం దిబ్బ అన్నట్టుగా తయారైంది.

అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ క్యాడర్ రాకపోయినా సీనియారిటీపై సివిల్ సర్వీస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇటీవల అమరవాతిలో కలిసిన వీరంతా తమ గోడును ఒకరికి ఒకరు చెప్పుకున్నారట. రాష్ట్రప్రభుత్వం నాడు-నేడు క్రింద ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇచ్చే ప్రాధాన్యత కనీసం సివిల్ సర్వీస్ అధికారుల మైన  నివాస సముదాయాలు, క్యాంపు కార్యాలయాలకు ఇవ్వడం లేదనే అసహనం కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలకి సైతం నూతన భవనాలు నిర్మాణం జరుగుతోందని మనకి మాత్రం అద్దిల్లులే శరణ్యం అవుతున్నాయని కాస్త చిన్నబుచ్చుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కొత్తగా ఇంటి గ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించాలిని భావించినా అవీ అతీ గతీలేకుండానే ఉన్నాయని, సాధారణ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగాప్రైవేటు అద్దె ఇళ్ల నుంచి కలెక్టరేట్లకు, జిల్లా పోలీస్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసులకు వెళ్లడం కాస్త చిన్నతనంగా ఉందని చెప్పుకున్నారట.

మరికొందరు ఒక్క అడుగు ముందుకి వేసి.. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసిన విషయం బయటకు పొక్కిందని చెబుతున్నారు. ఈ విషయం కొత్తగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓ లే కాకుండా, రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ లు కూడా ఈ విధంగానే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం తలచుకుంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు తక్షణమే నిర్మాణం చేపట్టలేకపోయినా.. కలెక్టర్లు, జెసిలు, ఎస్పీలు, డిఎఫ్ఓలకు నివాస సముదాయాలు, క్యాంపు ఆఫీసులు కట్టించగలదని..కానీ పోస్టింగులు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే పాత ఉమ్మడి 13 జిల్లాల్లో మాత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓ లకు నివాస సముదాయాలతోపాటు, క్యాంపు ఆఫీసులు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లోనే  కొన్ని చోట్ల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 

ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లు భార్యభర్తలుగా ఉన్నవారు మాత్రం పాత ఉమ్మడి జిల్లాల్లో ఉంటే మాత్రం ఏదో ఒక ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతంగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన వారంతా తమ మార్కు, నూతన జిల్లాలు తమతోనే ప్రారంభం అయ్యాయనే ఆనందంతో ఉన్నారట. అన్నీ ఉండీ అల్లుడినోట్లో శని అన్నట్టుగా పేరుకి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి హోదాలు ఉన్నా..తలదాచుకోవడానికి ప్రభుత్వ వసతి సముదాయమే లేదని విషయం ఇపుడుజిల్లాశాఖల అధికారుల్లోనూ గుప్పుమంటున్నది. కాగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళితే వచ్చే ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యతగా కొత్తజిల్లాల్లో అధికారుల నివాస సముదాయాలు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, క్యాంపు కార్యాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాట్లాడినట్టుగా తెలుస్తున్నది. చూడాలి..కొత్త జిల్లాల కలెక్టర్లు, జెసిలు ఎస్పీలు, డిఎఫ్ఓల మనోవేధన ఎప్పటికి నయం అవుతుందో..!

Tadepalli

2023-01-24 01:40:29