1 ENS Live Breaking News

ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి  బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం చెప్పారు.  బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన,  సమీక్ష జరిపారు.  అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడారు.  మార్చి 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి   వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు,  స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

నెలరోజుల ముందు నుంచే టీటీడీ  ఈ పనులను ప్రారంభించిందని  వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా  నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి రెండు వారాల్లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

 టీటీడీ చీఫ్ ఇంజనీర్  నాగేశ్వరరావు విద్యుత్ విభాగం ఎస్ఈ   వెంకటేశ్వర్లు,  ఆలయ డిప్యూటీ ఈవో  నటేష్ బాబు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి,  సుబ్రహ్మణ్యం, ఈ ఈ సుమతి,  అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, డిఎఫ్ఓ  శ్రీనివాస్, గార్డెన్ సూపరింటెండెంట్  శ్రీనివాస్,  ఎలక్ట్రికల్ డిఈ  చంద్రశేఖర్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి  రామరాజు పాల్గొన్నారు.   అంతకు ముందు జేఈవో  వీరబ్రహ్మం రాజంపేట లోని 108 అడుగుల శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య విగ్రహం ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

Ontimitta

2023-02-08 17:33:15

అన్నవరం సత్యదేవుని పెళ్లి మండపాల అద్దె ధరలివే

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్ధానంలో పెళ్లిళ్లకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. సుమారు 18 రకాల పెళ్లి మండపాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎవరికీ ఒక్క పైసాకూడా అధికంగా 
చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా సీఆర్వఓ కార్యాలయాన్ని సంప్రదించి వివాహ శుభకార్యాలకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. అద్దె మండపాలు వాటికి నిర్ణయించిన ధరలు ఒక్కసారి తెలుసుకుంటే..1)శ్రీ సీతారామ చౌల్ట్రీ హాల్(2) ఒక రోజుకి అద్దె ధర రూ.5వేలు, 2)శ్రీ సీతారామ స్టేజి (1) రూ.5వేలు, 3)ప్రకాస్ సదన్ కేంటీన్ హాల్(1) రూ.15వేలు, 4)ప్రకాష్ సదన్ సౌత్ రోడ్డు(1) రూ.25వేలు, 5) ప్రకాష్ సదర్ నార్త్ రోడ్డు(1) రూ.15వేలు, 6)వాయువ్య వ్రత మండపం(1) రూ.50వేలు,  7)నైరుతి వ్రత మండపం(1) రూ.50వేలు, 8)విష్ణు సదన్ హాలు పెద్దవి(12) రూ.5వేలు, 9)విష్ణు సదన్ హాలు చిన్నవి(26) రూ.3వేలు, 10) విష్ణు సదన్ హాలు సెల్లార్(1) రూ.4వేలు, 11)ఓల్డ్ సిసి స్టేజ్(2)రూ.5వేలు, 12) న్యూ సిసి స్టేజి(1) రూ.10వేలు, 13)ఓల్డ్ కళ్యాణ మండపం 1, 2(రూ.35వేలు), 14) హరిహర సదన్ పార్కింగ్ ప్లేస్ రూ.25వేలు, 15)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు)(7)రూ.3వేలు, 16)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 1,2,3,6)రూ.వెయ్యి, 17)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 4, 5)రూ.700, 18) సత్యనికేతన్ చౌల్ట్రీ బ్యాక్ సైడ్(1)రూ.1500

Annavaram

2023-02-07 02:29:28

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని శనివారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200)94 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400)64, న్యూసెంటినరీ(రూ.500)32, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)12, సత్యనికేతన్(రూ.200)62, శ్రీసత్యదేవ(రూ.400)60, ప్రకాష్ సదన్(రూ.650)41, ప్రకాశసదన్ ఏసి(రూ.1050)44, ప్రకాశ్ సదన్ డబుల్ రూమ్(రూ.1600)1, హరిహరసదర్(రూ.600)51, హరిహర సదన్ సింగిల్(రూ.400)5, హరిహర సదన్ ఏసి(రూ.950)84గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-07 02:27:54

విశాఖ స్టీల్ ప్లాంట్ మూడేళ్లలో మెుత్తం ఖాళీ..!

విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఒకవైపు..వచ్చే మూడేళ్లలో భారీస్థాయిలో ఉద్యోగుల ఉద్యోగ విరమణలు మరోవైపు స్టీల్ ప్లాంట్ మనుగడను ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం 14,880 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా..  గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. ఇక మరో మూడేళ్లలో భారీ ఎత్తున అంటే.. 1,170 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, 2,039 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సహా 3,209 మంది ఉద్యోగులు ఆర్ఐఎన్ఎల్ (RINL) రికార్డుల ప్రకారం పదవీ విరమణ చేయనున్నారట. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి  ఫగ్గన్ సింగ్ కులస్తే పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించారు. అంటే మరో ఐదేళ్లలో స్టీలుప్లాంట్ లోని అన్నివిభాగాల్లో ఇంకెంత మంది ఉద్యోగ విరమణలు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. విశాఖ స్టీలు ప్లాంట్ లో ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణలు చేస్తున్నప్పటికీ వాటికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీ మాత్రం జరగడం లేదు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున పదవీ విరమణ జరుగుతున్నా ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న మానవ వనరుల పరిస్థితిని దారుణంగా ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.


పార్లమెంటులో మంత్రి మాటలు ప్రైవేటీకరణకు ఊతం..!
పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు విశాఖ ఉక్కు ఉద్యోగాల్లో భారీ ఎత్తున జరుగుతున్న ఉద్యోగ విరమణలపై ప్రశ్నలేవనెత్తగా, అవసరం అయిన ఉద్యో గాలను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటామనే మాట..స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు ఊతమిచ్చినట్టు అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఉద్యోగులు రిటైర్ అవుతున్నా స్టీల్ ప్లాంట్ మాత్రం ఉద్యోగాల భర్తీ జరగడం లేదు. ఇదే విషయమై ప్రశ్నించిన ఎంపీ రాబోయే రోజుల్లో స్టీలు ప్లాంటు పెద్ద ఎత్తున మానవ వనరుల కొరతను ఎదుర్కొంటుందని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త నియామకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూనే, గత మూడేళ్లలో 106 మంది కొత్త ఉద్యోగులను నియమించామని మంత్రి సమాధానం ఇవ్వడం ఇపుడు ప్రైవేటీకరణ నిప్పుపై నూనెపోసిసట్టు అయ్యింది. అంతగా ప్రాధాన్యత లేని కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడం ద్వారా, ప్రధాన కార్యకలాపాల్లో సిబ్బందిని పునర్ వ్యవస్థీకరణ ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చుతున్నామని కేంద్ర మంత్రి పేర్కొనడం ఇక్కడ విశేషం. అంటే ఎంత త్వరగా ఉద్యోగాలు ఖాళీ అయిపోతే అంతగా తదుపరి కార్యాచారణ ముందుకి సాగుతుందని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.


స్టీలుప్లాంటును ఖాళీచేసి ప్రైవేటీకరణ చేపడతారా..?
లాభాల్లో ఉన్న విశాఖస్టీలు ప్లాంటును ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వారంతా ఉద్యోగవిరమణ చేసిన తరువాత ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించే ప్రయత్నం జరగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్లాంటులో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారంతా ఉద్యోగ విరమణ చేయాలంటే ఐదునుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. ఈలోగా ప్రాధాన్యత క్రమంలోని ఉద్యోగాల్లోని వారంతా ఉద్యోగ విరమణచేస్తారు. దీనితో ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం సులవుతుంది. దానికోసమే కొత్తగా ఉద్యోగాల భర్తీచేపట్టడం లేదనే వాదనకు ఈరోజు పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల్లో వచ్చిన సమాధానాలు ఊతమిస్తున్నాయి. ఆ కారణంగానే బడ్జెట్ లో కూడా స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయితే దీనిపై రాష్ట్రం నుంచి ఒక్కఎంపీ కూడా పార్లమెంటులో ప్రశ్నించిన దాఖలాలు ఒకటి అరా తప్పా పెద్దగా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేరుకుపోయిన ఆర్ కార్డు దారుల సమస్యలు, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి నేటి వరకూ కేంద్రం ఎలాంటి నష్టపరిహారంగానీ, ఉద్యోగాలను కానీ భర్తీచేయలేదు. దీనితో స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ఖాళీ చేసిన తరువాత అయితే ప్రైవేటకరణ కు ఎలాంటి ఆటంకాలూ ఉండవని కేంద్రం భావిస్తు్నట్టుగా సమాచారం అందుతున్నది. కేంద్రం అనుకున్నట్టుగా ఖాయిలా పడ్డ పరిశ్రమగా మార్చాలంటే కొత్త సిబ్బంది నియామకాలు చేపకట్టకుండా ఉండటం, ఉత్పాదకతను సిబ్బంది లేమితో  తగ్గించేయడం తదితర అంశాలన్నీ తెరపైకి తీసుకురావాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది

ఉద్యమాలు ఫలితాలనిస్తాయా..ఉసూరు మనిపిస్తాయా 
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదంటూ జరుగుతున్న ఉద్యమాలు ఫలితాలనిచ్చేలా అయితే కనిపించడం లేదు. ఉక్కు విషయంలో కేంద్రం అనుకున్నట్టుగా ఒక్కో అవకాశాన్ని ఉద్యోగులకు చిక్కకుండా చేస్తుందనే విషయం తేటతెల్లం అవుతుంది. భారీ ఎత్తున ఉద్యోగుల రిటైర్ మెంట్లు, కొత్త ఉద్యగాల భర్తీ లేకపోవడం, అన్ని పనులూ ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడం, ప్రధాన్యత కలిగిన పోస్టులను కుదించేయడం, ఆర్ కార్డుదారులకు న్యాయం చేయకపోవడం, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం, తదిర అంశాలన్నీ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ఉసూరు మనిపిస్తాయనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇది కాకుండా త్వరలోనే వీఆర్ఎస్ స్కీము ద్వారా మరింత మంది ఉద్యోగులను ఇంటికి పంపే కార్యక్రమానికి కూడా యాజమాన్యం కేంద్రం ఆధ్వర్యంలో తెరలేపుతుందనే ప్రచారం కూడా జరుగుతంది. అదే జరిగితే మూడేళ్లలో కాకుండా అంతకంటే ముందుగానే స్టీలు ప్లాంటు ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎంతో మంది ప్రాణాలు బలితీసుకొని సాధించుకున విశాఖ ఉక్కు...పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థిని నెలకొంది. ఇటు రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై తీసుకువచ్చే ఒత్తిడి, ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాలు ఫలితం ఎలా ఉండబోతుందో ప్రశ్నార్ధకంగా మారింది..!

Visakhapatnam

2023-02-07 02:19:42

ఫిబ్రవరి7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11 నుండి  19వ  తేదీ  వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు  నిర్వహించనున్నారు . ఈ సందర్బంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో  భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.  ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

వాహనసేవల వివరాలు :
11-02-2023 -  ధ్వజారోహణం - పెద్దశేష వాహనం
12-02-2023 - చిన్నశేష వాహనం - హంస వాహనం
13-02-2023 - సింహ వాహనం - ముత్యపుపందిరి వాహనం
14-02-2023 - కల్పవృక్ష వాహనం - సర్వభూపాల వాహనం
15-02-2023 - పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) - గరుడ వాహనం
16-02-2023 -  హనుమంత వాహనం - వసంతోత్సవం, స్వర్ణరథం, గజ వాహనం
17-02-2023 - సూర్యప్రభ వాహనం - చంద్రప్రభ వాహనం
18-02-2023 - రథోత్సవం -     అశ్వవాహనం
19-02-2023 - చక్రస్నానం - ధ్వజావరోహణం చేస్తారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆలయ మాడ వీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

Srinivasa Mangapuram

2023-02-06 11:31:26

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని శనివారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200)94 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400)64, న్యూసెంటినరీ(రూ.500)32, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)12, సత్యనికేతన్(రూ.200)62, శ్రీసత్యదేవ(రూ.400)60, ప్రకాష్ సదన్(రూ.650)41, ప్రకాశసదన్ ఏసి(రూ.1050)44, ప్రకాశ్ సదన్ డబుల్ రూమ్(రూ.1600)1, హరిహరసదర్(రూ.600)51, హరిహర సదన్ సింగిల్(రూ.400)5, హరిహర సదన్ ఏసి(రూ.950)84గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-06 08:43:47

అన్నవరం సత్యదేవుని పెళ్లి మండపాల అద్దె ధరలివే

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్ధానంలో పెళ్లిళ్లకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. సుమారు 18 రకాల పెళ్లి మండపాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎవరికీ ఒక్క పైసాకూడా అధికంగా 
చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా సీఆర్వఓ కార్యాలయాన్ని సంప్రదించి వివాహ శుభకార్యాలకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. అద్దె మండపాలు వాటికి నిర్ణయించిన ధరలు ఒక్కసారి తెలుసుకుంటే..1)శ్రీ సీతారామ చౌల్ట్రీ హాల్(2) ఒక రోజుకి అద్దె ధర రూ.5వేలు, 2)శ్రీ సీతారామ స్టేజి (1) రూ.5వేలు, 3)ప్రకాస్ సదన్ కేంటీన్ హాల్(1) రూ.15వేలు, 4)ప్రకాష్ సదన్ సౌత్ రోడ్డు(1) రూ.25వేలు, 5) ప్రకాష్ సదర్ నార్త్ రోడ్డు(1) రూ.15వేలు, 6)వాయువ్య వ్రత మండపం(1) రూ.50వేలు,  7)నైరుతి వ్రత మండపం(1) రూ.50వేలు, 8)విష్ణు సదన్ హాలు పెద్దవి(12) రూ.5వేలు, 9)విష్ణు సదన్ హాలు చిన్నవి(26) రూ.3వేలు, 10) విష్ణు సదన్ హాలు సెల్లార్(1) రూ.4వేలు, 11)ఓల్డ్ సిసి స్టేజ్(2)రూ.5వేలు, 12) న్యూ సిసి స్టేజి(1) రూ.10వేలు, 13)ఓల్డ్ కళ్యాణ మండపం 1, 2(రూ.35వేలు), 14) హరిహర సదన్ పార్కింగ్ ప్లేస్ రూ.25వేలు, 15)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు)(7)రూ.3వేలు, 16)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 1,2,3,6)రూ.వెయ్యి, 17)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 4, 5)రూ.700, 18) సత్యనికేతన్ చౌల్ట్రీ బ్యాక్ సైడ్(1)రూ.1500

Annavaram

2023-02-06 08:39:30

ఈఎన్ఎస్ కధనాలపై ఏపీ ప్రభుత్వ విశేష స్పందన..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారిక మొబైల్ న్యూస్ యాప్, Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా అందించిన వరుస కధనాలపై విశేషంగా స్పందించింది. 75 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల ఖాళీలు, పెండింగ్ లో ఉన్న పదోన్నతులు, లెక్కగట్టని ఖాళీలు, ఇన్చార్జిలు, ఏఫ్ఏసీ అధికారుల నియామకం వలన పరిపాలన గాడితప్పుతున్న విధానాలపై ప్రత్యేక కథనాలు అందించింది. దీనితో వాస్తవాలను పసిగట్టడంతోపాటు, భారీ మార్పులకు శ్రీకారంచుట్టి ఆపై కీలక నిర్ణయిం తీసుకుంది.  వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఉన్న అన్నిస్థాయిల్లోనూ ఇన్చార్జి, ఎఫ్ఏసీ విధానాలను రద్దు చేయాలని,  అధికారులకు పదోన్నతులు కల్పించాలని, ఖాళీలను లెక్కించి ప్రభుత్వానికి నివేవిదించాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కార్యదర్శి రేవు ముత్యాలరాజు అన్ని ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలకు, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా పేర్కొన్నారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వశాఖల్లోని ఎఫ్ఏసీ, ఇన్చార్జి అధికారుల జాబితాలను కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు సిద్దం చేస్తున్నారు.

ఇన్చార్జిలు, ఎఫ్ఏసీల ఆశలపై రద్దు ఉత్తర్వుల నీళ్లు..
ఎన్నో ఆశలతో, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల రికమెండేషన్లతో ఇన్చార్జిలు, ఎఫ్ఏసీ పోస్టుల్లోకి వచ్చిన మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారుల ఆశలపై ప్రభుత్వం ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టు అయ్యింది. అయితే ప్రభుత్వం కొందరు అధికారులను ఇన్చార్జిలు, ఎఫ్ఏసీలుగా నియమించినా ప్రభుత్వ ప్రాధాన్యత  విధులు కాకుండా పైరవీలు, పైసావసూల్, సొంత తెలివితో క్రింది స్థాయి సిబ్బందిని, అధికారులను వేధించడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉన్న ఉద్యోగాన్ని పక్కనపెట్టి ఇన్చార్జిలుగా కొందరు అధికారులను నియమించడం వలన వారి అసలు ఉద్యోగం కూడా ఇన్చార్జిలతోనే చేయించాల్సి వస్తుందని తద్వారా పరిపాలన గాడితప్పుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనితో ఇన్చార్జిలు, ఎఫ్ఏసీలను తొలగించడం ద్వారా అసలు ప్రభుత్వశాఖల్లో ఎన్ని పోస్టులకు పదోన్నతులు కల్పించవచ్చు... తద్వారా ఎన్ని పోస్టులు ఖాళీలు ఏర్పడతాయి.. ఎన్ని పోస్టులను భర్తీచేయడానికి ప్రభుత్వానికి నివేదించవచ్చు అనే విషయాలను తెలుసుకోవడానికి అవకాశం వుంటుందని ఈ తొలగింపు కార్యక్రమానికి దిగినట్టుగా ఒక రాష్ట్రస్థాయి అధికారి ఈఎన్ఎస్ కి వివరించారు. 

పదోన్నతులు, కొత్త పోస్టులకు లైన్ క్లియర్
ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం వలన 75 ప్రభుత్వశాఖల్లో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అధికారులు, సిబ్బందికి పదోన్నతులు రావడంతోపాటు, కొత్తపోస్టులు మంజూరుకి లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది. సీఎం కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఇచ్చినఆదేశాలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అదే సమయంలో పదోన్నతుల కోసం వెయిట్ చేస్తున్నారందరికి ప్యానల్ వైజ్ ప్రమోషన్లు వచ్చే అవకాశంకూడా ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కువగా 
ఇన్చార్జిలు, ఏఎఫ్ఏసీలు ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే న్నాయి. ఈఓపీఆర్దీలుగా వున్న ఎంపీడీఓలుగానూ, ఎంపీడీఓలుగా పనిచేస్తున్నావారు జిల్లాశాఖల అధికారుల గానూ ఇన్చార్జి, ఎఫ్ఏఏసీల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాచేయడం వలన అన్ని ప్రభుత్వశాఖల్లోనూ, అధికారులు ఉన్నట్టుగానే ప్రభుత్వ లెక్కల్లో వుంటుంది. ఒక్కసారి మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న ఇన్చార్జిలు, ఎఫ్ఏసీలను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి పక్కాగా లెక్కవస్తుందని ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీచేసినట్టు చెబుతున్నారు.

 వాస్తవానికి ఇన్చార్జిలు, ఏఫ్ఏసీ అధికారుల విధులు ఎలా ఉన్నాయి.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏవిధమైన కలెక్షన్లు చేస్తు్న్నారు..  ఇటీవల కాలంలో వారికి బదిలీలు జరిగినా మళ్లీ ప్రజాప్రతినిధుల పైరవీలతో అనుకున్న ప్రదేశాలకు ఏవిధంగా తిరిగివచ్చారనే విషయాలను ఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు 
అధికారిక మొబైల్ న్యూస్ యాప్, Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా వరుస కథనాలను అందించింది. దీనితో స్పందించిన ప్రభుత్వం.. ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కూడా భావించడంతో ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఇన్చార్జి పోస్టులు ఉండకుండా చేస్తే అసలు విషయం వెలుగు చూస్తాయని దానికి తగ్గట్టుగానే ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు, వారి జిల్లాల్లోని శాఖల్లో పనిచేస్తున్న ఇన్చార్జి ఉద్యోగాలను, ఎఫ్ఏసీ ఉద్యోగాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర సచివాలయంలో కూడా ఎఫ్ఏసీలు, ఇన్చార్జిలుగా ఇచ్చిన జీఓలను రద్దు చేసే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది.  చూడాలి ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా జారీచేసిన ఈ ఉత్తర్వులు ఏ స్థాయిలో అమలవుతాయో..లేదంటే మళ్లీ  ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఎఫ్ఏసీలు, ఇన్చార్జి వ్యవస్థల కాలవ్యవధిని పెంచుతారో అనేది..!

తాడేపల్లి

2023-02-06 07:48:46

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని శనివారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200)94 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400)64, న్యూసెంటినరీ(రూ.500)32, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)12, సత్యనికేతన్(రూ.200)62, శ్రీసత్యదేవ(రూ.400)60, ప్రకాష్ సదన్(రూ.650)41, ప్రకాశసదన్ ఏసి(రూ.1050)44, ప్రకాశ్ సదన్ డబుల్ రూమ్(రూ.1600)1, హరిహరసదర్(రూ.600)51, హరిహర సదన్ సింగిల్(రూ.400)5, హరిహర సదన్ ఏసి(రూ.950)84 గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-04 04:28:47

గ్రామ, వార్డు సచివాలయ సేవలపై ఇకపై మూడో నేత్రం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన మూడున్నరేళ్ల తరువాత వాటి నుంచి పూర్తిస్థాయి ఫలితాలను ఆశించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయాలు ఏర్పాటు చేసినపుడు ఇచ్చిన జాబ్ చార్టును తాజాగా 20విభాగాల ఉద్యోగులకు మార్పు చేసింది. వాటి ద్వారానే సిబ్బంది ఖచ్చితంగా పనిచేయాల్సి వుంటుంది. అంతేకాకుండా వారు ఏవిధంగా పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు వారి శాఖలకు చెందిన జిల్లా, డివిజన్ అధికారులను పర్యవేక్షణకు ఆకస్మికంగా పంపిస్తున్నది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు..ప్రభుత్వం ఇచ్చిన రికార్డులు ఎలా నిర్వహిస్తున్నారు.. స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారా లేదా.. సర్వీసు రిక్వెస్టులు ఎన్నిరోజుల్లోగా క్లియర్ చేస్తున్నారు.. యూనిఫారం సక్రమంగా వేసుకొని వస్తున్నారా లేదా.. ఫేస్ బయోమెట్రిక్ ఏవిధంగా చేస్తున్నారు.. టూర్ డైరీలు ఎలా నిర్వహిస్తున్నారు.. మినిట్స్ బుక్ నిర్వహణ ఎలా చేపడుతున్నారు.. ఉద్యోగుల సెలవులు, ఓడీలు.. అసలు ఎన్నిరకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నది. దానికోసం ప్రతీ జిల్లా అధికారి నెలలోరెండు సార్లు సచివాలయాలను సందర్శించాల్సి వుంటుంది. ఆ సమయంలో గుర్తించిన అంశాలను జిల్లా కలెక్టర్ కు, సదరు ప్రభుత్వశాఖ ముఖ్యకార్యదర్శికి  నివేదించాల్సి వుంటుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సచివాలయాల్లో పంచాయతీరాజ్, పోలీస్, ఇంజనీరింగ్, వెల్ఫేర్, రెవిన్యూ, వ్యవసాయం, వాణిజ్యం, పట్టుపురుగులు, పశుసంరక్షణ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, విద్యుత్ ఇలా 20 ప్రభుత్వశాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరి జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శించాల్సి వుంటుంది. వారితోపాటు, ఎమ్మెల్యే, ఎంపీ, నగర మేయర్లు, నగర పంచాయతీ అధికారులు కూడా సచివాలయాలను సందర్శించాల్సి వుంటుంది. తద్వారా క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, సిబ్బంది సేవలను మెరుగు పరచడానికి కూడా అవకాశం వుంటుందనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు సచివాలయాల సందర్శన కూడా చేపడుతున్నారు. దీనితో సచివాలయ సిబ్బంది..మొన్నటి వరకూ ఆడుతూ పాడుతూ పనిచేసేవారు కాస్తా..దారిలోకి వచ్చి ఎప్పటి రికార్డులను అప్పుడు పూర్తిచేయడం ప్రారంభిస్తున్నారు. లేదంటే అప్పటి పరిస్థితిని బట్టీ సదరుశాఖ జిల్లా/డివిజన్ స్థాయి అధికారి రికార్డుల్లో ఎరుపురంగు పెన్నుతో సంతకాలు చేసి వెళతారు. అదే సమయంలో అప్పటికి సచివాలయంలో సేవలు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజల నుంచి కూడా వాంగ్మూలం తీసుకుని..ఆపై చర్యలకు ఉపక్రమిస్తారు.

ప్రభుత్వం వేసిన ముందడుగులో ఫలితాలు, చర్యలు కూడా ప్రారంభం అయ్యాయి. విధినిర్వహణలో అలసత్వం వహించేవారిని ఇంటికి పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యూనిఫారం వేసుకురాని సిబ్బందికి నేరుగా జిల్లా కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విషయం తెలిసినా ఎంపీడీఓలు పెద్దగా పట్టించుకోకపోవడం, సచివాలయ కార్యదర్శిలే యూనిఫాం వేసుకురాకపోయినా ఏమీ అనకపోవడం వంటి విషయాలను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఈవిషయంలో ఎవరికీ మినిహాయింపులు ఇవ్వలేదని ప్రకటించినా..చాలా మంది సిబ్బందిలో మార్పురాలేదు..కనీసం మండల అధికారులు పెట్టే సమావేశాలకు సైతం సచివాలయ సిబ్బంది యూనిఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో వెళుతున్నా ఎంపీడీఓలు పట్టించుకోవడం లేదు. ఇకపై అలాంటి అంశాలను కూడా ఆకస్మిక తనిఖీలకు వచ్చే అధికారులు గుర్తించి విషయాన్ని జిల్లాస్థాయిలో కలెక్టర్, జెసిలకు, రాష్ట్రస్థాయిలో వారి శాఖల ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకెళతారు. ఇప్పటివరకూ ఏదోలాగడిచిపోయిన సచివాలయ సిబ్బంది విధినిర్వహణ ఇకపై కష్టతరంగానే మారిందనడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రయోజనకర నిర్ణయాలే కారణంగా కనిపిస్తున్నాయి. తమపని తాము చేసుకుపోయే సిబ్బంది ప్రభుత్వ విధానాన్ని స్వీకరిస్తుంటే.. ఏవో సాకులు చెప్పి విధులకు డుమ్మాకొట్టి, వారికి నచ్చినట్టుగా పనిచేసే సిబ్బందికి మాత్రం ప్రభుత్వ చర్యలు యమపాశంలా కనిపిస్తున్నాయి. చూడాలి ప్రభుత్వ నిర్ణయం, కొత్త జాబ్ చార్టు అమలు ఏ తరహా ఫలితాలు ముందు ముందు తీసుకువస్తుందనేది..!

Tadepalli

2023-02-04 03:46:15

ఆప్కో నుంచి చేనేత సొసైటీలకు బిల్లులు ఇప్పించండి

ఆంధ్రప్రదేశ్ లో చేనేత సొసైటీల ద్వారా ఆప్కోకి బట్టలు సరఫరా చేసి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నవారి సమస్యలు పరిష్కరించాలని ఆప్కో నూతన చైర్మన్ గంజి చిరంజీవి దృష్టికి పద్మశాలీ సంఘం నేత కొప్పుల రామ్ కుమార్ తీసుకు వెళ్లారు. విజయవాడలో ఈరోజు విజయవాడ చేనేత భవన్ లో ఆప్కో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీలు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వినతిపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు.  అంతకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీ సంఘం సభ్యులు నూతన చైర్మన్ కుశుభాకాంక్షలు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో మార్కండేయ చేనేత సహకార సంఘం నాయకులు కె.రవి, చుక్కల చిన్నారావు, బి.శ్రీనివాసరావు ఎం.సూరిబాబు, గోపు.భీష్మసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Vijayawada

2023-02-03 10:53:00

శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 20.78 లక్షలు

తిరుమల  శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలు మందిగా నమోదు అయ్యారని టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలియజేశారు. డయల్ యువర్ ఈఓ అనంతరం ఆయన స్వామివారి జనవరి నెల వివరాలను తెలియజేశారు. హుండీ ద్వారా వచ్చిన కానుకలు రూ.123.07 కోట్లు, లడ్డూలు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.07 కోట్లు,  అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.51 లక్షల మందిగా నమోదు అయ్యారని పేర్కొన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సర్వదర్శనాలు కొనసాగుతున్నాయని ఈఓ వివరించారు.

Tirumala

2023-02-03 06:06:08

డిసెంబరులోగా ఆటోమేటిక్ లడ్డూయంత్రాల

తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.  ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు.  తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి , ఆతరువాత మీడియాతో మాట్లాడారు. ఆటోమేటిక్ మిషన్ల ద్వారా రోజుకు 6 లక్షల దాకా లడ్డూల తయారీకి అవకాశం వుంటుందన్నారు. 

Tirumala

2023-02-03 05:59:46

ఉసూరుమంటున్న గ్రామ, వార్డు సచివాలయ వీఆర్వోలు

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏదోశాఖ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం కావాలని చేస్తున్నదో..లేదంటే కొంతమేరకైనా జీతాల భారం తగ్గించుకోవాలని చేస్తున్నదో తెలీదు కానీ.. అరకొర జీతాలతో వీఆర్ఏ నుంచి వీఆర్వోలుగా పదోన్నతులు పొంది జిల్లాకాని జిల్లా..ప్రాంతం కానీ ప్రాంతాలో బతుకు బండి ఈడ్చేలా చేస్తున్నది. రెండున్నరేళ్లు గడిచిపోతున్నా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 3572 మంది వీఆర్వోలు ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేల జీతంతోనే బ్రతుకుతున్నారు. గతంలో సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయమే ఇపుడు పదోన్నతి పొందిన వీఆర్ఏలను కూడా వెంటాడుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు రకాల టెస్టులు(కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్టు, సర్వే టెస్టు) పాసైతే తప్పా వీరి సర్వీసులు రెగ్యులర్ చేసేది లేదని మెలిక పెట్టింది. దీనితో వీఆర్వోలు అంతా కంప్యూటర్ ఎఫియన్సీ టెస్టులో పాసైయ్యారు. తీరా సర్వే టెస్టులో మాత్రం 1850 మంది పాసైతే 1722 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారికి ప్రభుత్వం మళ్లీ వెంటనే పరీక్ష పెట్టడం మానేసింది.

వీఆర్ఏ నుంచి విఆర్వోగా పదోన్నతలు ఇచ్చిందని ఆనందపడాలో లేదంటే వచ్చిన ఉద్యోగం ప్రభుత్వం పెట్టే టెస్టుల్లో పాస్ కానందుకు వారి సర్వీసులు రెగ్యులైజేషన్ కి నోచుకోలేదని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీరు కూడా సాధారణ వీఆర్వోలు మాదిరిగానే అన్నిపనులూ చేస్తున్నారు. విధుల్లోకి చేరిన తరువాత ఆరు నెలల్లో రెండు రకాల పరీక్షలు పెడతామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్ల వరకూ వీరికి పరీక్షలు పెట్టలేదు. దీనితో వీరంతా ఒక పరీక్షలో పాసై మరో పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మొత్తం పదోన్నతి పొందిన వీఆర్వోలందరికీ రెండు పరీక్షలు పాసైన తరువాతే సర్వీసులు రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. దీనితో వీరంతా తీవ్రఆందోళన చెందతున్నారు. ప్రభుత్వం తక్షణమే మరోసారి సర్వే  పరీక్ష నిర్వహించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేల జీతంతో కుటుంబాలను పోషించుకోవడానికి, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఉన్న కాస్తంత జీతంలోనే మండలకేంద్రాలకు తరచూ తిరగడం, శిక్షణలకు, ప్రత్యేక సమావేశాలకు  జిల్లా కేంద్రాలకు వెళ్లడంతోనే వచ్చిన జీతం మొత్తం ఆవిరైపోతుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమను విధుల్లోకి తీసుకున్నవెంటనే రెండేళ్లలోనే పరీక్షలు పెట్టివుంటే ఫెయిల్ అయినవారంతా మరోసారి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉండేదని వాపోతున్నారు.

ప్రభుత్వం తక్షణమే ఫెయిల్ అయినవారికి పరీక్ష పెట్టాలని లేనిపక్షంలో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేపేస్కేలు అయినా వర్తింపచేయాలని వీఆర్వోలంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా వీఆర్వోల జాబ్ చార్టు మార్చిన తరుణంలో విధినిర్వహణలోనే క్యాంపులకు ఎక్కువగా తిరగాల్సి వుంటుందని, ప్రభుత్వం ఇచ్చే జీతంతో కుటుంబాలనే పోషించుకుంటామా..లేదంటే ప్రభుత్వం అప్పగించిన పనులకు క్యాంపులకే తిరుగుతామా అని ప్రశ్నిస్తున్నారు.  
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3572 మంది వీఆర్వోలు ఇదే ఆర్ధిక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. తమ గోడు వినే నాధుడే ప్రభుత్వంలో కరువయ్యాడని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు నెలాఖరున జీతబత్యాలు ఒకటవ తేదీ నాటికి ఇవ్వడం లేదు. ఉన్న వీరిందరికీ సర్వీసులు రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై మరింత ఆర్ధిక భారం పడుతుందనే కారణంతోనే వీరికి పెట్టాల్సిన పరీక్షలు సకాలంలో నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పదోన్నతి పొందిన వీఆర్వోలకు డిపార్ట్ మెంట్ పరీక్ష నిర్వహించి వారి సర్వీసులు రెగ్యులర్ చేస్తే తప్పా ప్రభుత్వ ప్రాధాన్యత భూముల రీ-సర్వేలో వీరంతా పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం లేదు. చూడాలి ప్రభుత్వం ఈ వీఆర్వోల విషయంలో ఏం చేస్తుందనేది..!

Tadepalli

2023-02-03 02:55:59

వైఎస్సార్సీపీ టార్గెట్175లో అపుడే 2టిక్కెట్లు ఔట్

వైఎస్సార్సీపీలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి లక్ష్యంగా పెట్టుకుంటే అసమ్మతి అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇప్పటికే 2 టిక్కెట్లు చేజారిపోగా..అసెంబ్లీ ఎన్నికల నాటికి 175 స్థానాల్లో సీట్లు ప్రకటించినప్పటికి మరెన్నీ రాలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్నామని..కోట్లాది రూపాయాలు సంక్షేమ పథకాలపేరిట బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలకే పంపిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా..నేటికీ కార్యకర్త నుంచి నాయకుడి వరకూ వారి స్థాయిల్లో ఏ పనులూ జరగడం లేదు. ఆ విషయం అధిష్టానం వరకూ వెళ్లడం లేదనే ప్రచారం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నామినేటెడ్ పదవులు ఇంకా చాలాస్థాయిలో భర్తీ కాలేదనేది జగమెరిగిన సత్యం. ఈ తరుణంలో అసమ్మతి ఎమ్మెల్యేలు, సీటుచేజారిపోతుంద ని భావించే ఎమ్మెల్యేలు, సీటు కోసం ఆశించేవారు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు.

తాను ఒకటి తలిస్తే పార్టీ ఒకటి తలచినట్టుగా పార్టీ అధికారంలో లేనపుడు జెండాలు మోసిన కార్యకర్తలు, వారిని దగ్గరుండి నడిపించిన నాయకులకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం జరగలేదనేది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ విషయం తెలిసినా..చెప్పించే చేయాలని కొంత మంది నాయగణం కార్యకర్తలను కార్యకర్తలుగా మాదిరిగా ఉంచేస్తున్నారనే ఆవేదన కూడా ఎక్కువగా వుంది. అధికారంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు ఆశ, ఆలోచన ఉండటం సహజమేనని.. కానీ సొంత గ్రామంలో కనీసం చిన్న చిన్న పనులు కూడా ప్రజలకు, కార్యకర్తలకు చేయించలేని నాయకులు వచ్చేఎన్నికల్లో పార్టీకోసం పనిచేస్తారా అంటే కష్టమేననే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బెదిరించి పనిచేయించాలని..డబ్బుతో ఓటును కొనాలనుకునే రోజులు పోయాయనే విషయం 2019 ఎన్నికల్లోనే తేటతెల్లం అయ్యిందిని..ఇపుడు ప్రభుత్వం ప్రజలకు మంచిచేస్తే తప్పా వచ్చే ఎన్నికల్లో ఓటు పడే పరిస్థితి లేదనేది ప్రస్తుత వాస్తం. అయినా కొంత మంది ఎంపీలుగా వున్నవారు ఎమ్మెల్యేలుగా..ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంపీలుగా వెళ్లడానికి, నియోజకవర్గాలు మర్పుకి పార్టీ శ్రీకారం చుట్టిన తరుణంలో దిగువస్థాయి కేడర్, సీటు ఆశించిన వారంతా అలకపూనారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు జారిపోవడం కూడా ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది.

అటు ప్రతిపక్షపార్టీలు, వామపక్షపార్టీలు కూడా ఎక్కడా తగ్గడంలేదు వారి వారి బలాన్ని పెంచుకుంటూనే ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అన్నివర్గాలను చైతన్యం తీసుకు వస్తున్నారు. ఈసారి ఏదిఏమైనా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని నిర్వీర్యం చేసేదిశగా వ్యూహాత్మకంగా పావులు కదువుపుతున్నారని విశ్లేషకులు ఒక 
అంచనాకు వచ్చారు. ప్రభుత్వం 175కి 175గా లక్ష్యం పెట్టుకుందని అయితే 75 మాత్రమే అధికారపార్టీకి ఇచ్చి మిగిలిన 100 తాము సంపాదించే దిశగా ప్రజల్లోకి వెళుతున్నారనేది ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు..ప్రజలతో నమ్మకంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రతిపక్షాలను, వామపక్షాలను నమ్మే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ప్రభుత్వం నగదు బదిలీ పథకాల రూపంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నా.. ఇచ్చిన దానికంటే ఎంతరెట్టింపు ప్రజలపై పన్నులు, విద్యుత్, గ్యాస్, ఇతరత్రా భారాలను మోపుతుందనేది ప్రజలకు తెలియజేయడంలో ముందుంటున్నారు. అదే సమయంలో అధికారపార్టీలో అసమ్మతి సెగను కూడా చక్కగా వినియోగించుకుంటున్నారే ప్రచారం జరుగుతున్నది. ఈ తరుణంలో ప్రభుత్వ లక్ష్యం 175కి ఎన్నిసీట్లు వస్తాయనే విషయమై ఆశక్తకర రాజకీయ చర్చ ఆంధ్రప్రదేశ్ జరుగుతుండటం విశేషం..చూడాలి ఏం జరుగుతుంది..ఏవిధంగా జరగబోతుంది..ఫలితాలు ఎలా వస్తాయనేది..!

Tadepalli

2023-02-02 06:43:41