1 ENS Live Breaking News

భారతదేశం గర్వించేలా ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ

వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని, ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి దేశం గర్వించదగ్గ బృహత్తర  కార్యక్రమం 'ఫ్యామిలీ ఫిజీషియన్' కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖా, జిల్లా ఇంచార్జి మంత్రి  విడదల రజని పేర్కొన్నారు. సోమవారం  విశాఖ విఎమ్ఆర్డీఎ ఎరీనా లో రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి.కష్ణబాబు తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ ఆరు జిల్లాల (విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, విజయనగరం, శ్రీకాకుళం,మన్యం ) అధికారులతో ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఫ్యామిలీ 
ఫిజీషియన్ కాన్సెప్ట్ , విలేజ్ హెల్త్ క్లినిక్స్ , అర్బన్ హెల్త్ క్లినిక్స్, వెక్టర్ కంట్రోల్ హైజీన్ మెజర్స్, ఎపిడమిక్ డిసిజ్ సర్వేలన్స్, ఎన్సీడి సర్వే, ముఖ హాజరు విధానం, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ట్రాన్స్ పోర్టెషన్, డ్ర్రగ్స్, సర్జీకల్ బడ్జెట్ కేటాయింపు, ఎన్ యు హెచ్ ఎం,  ఆర్ సి హెచ్ నమెదు, ప్రసవాలు , జేఎస్వై చెల్లింపులు, రక్త 
హీనత  తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష చేసారు.

 ఈ సమీక్ష లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే వైద్య పరీక్షలు, మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో 'ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్' ఉద్దేశ్యమని చెప్పారు. రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య ఆరోగ్య శాఖ లోఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం 
చేపట్టిందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు అమలు లో సమస్యలు తెలుసుకునేందుకు ఈ ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో వైద్య శాఖలో వంద శాతం వైద్య సిబ్బందిని నియామకాలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని 
అన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో నలబై ఏడు వేల మంది సిబ్బందిని భర్తీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా మందుల కొరత లేదని, పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల ద్వారా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు విస్తతంగా, సంతప్త స్థాయిలో అందుతున్నాయన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ప్రక్రియను ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యాధికారులు, సంబంధిత సిబ్బంది ప్రణాళికాబద్ధంగా, భాధ్యతాయుతంగా చేపట్టి ప్రజారోగ్య ప్రతిష్టతకు పాటుపడాలన్నారు. పీహెచ్సీ స్థాయిలో మౌలిక సదుపాయాల పెంచినందున గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు అక్కడే  జరిగేందుకు వైద్యుల కృషి చేయాలని కోరారు.

కేజీహెచ్ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లా కలెక్టర్ కు  మంత్రి అభినందనలు తెలిపారు. వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి.కృష్ణబాబు  మాట్లాడుతూ ఏ ఒక్క నిరుపేద ప్రాణానికి వైద్యం కొరత రాకూడదన్న సహృద్బావంతో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య , ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు ప్రతి వైద్యుడు కృషి చేయాలని కోరారు. విద్య, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలపడం ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ ఆధారిత హాజరు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఎం ఎల్ హెచ్ పి ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంపుకు శిక్షణ చేసినట్లు తెలిపారు.

గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ చేయాలని అన్నారు .డయాబెటిస్ , బీపి , థైరోయిడ్ వంటి రోగాలను గుర్తించి వారు మందులు విలేజ్ క్లినిక్ ద్వారా గాని లేదా ప్రైవేట్ గా గాని వాడేటట్లు చేసి ప్రతి నెల రికార్డు చేయాలన్నారు . క్యాన్సర్ వ్యాధులకు కారకాలైన పొగాకు , గుట్కా ,ఆల్కహాల్ వంటి వ్యసనాల పట్ల అవగాహన కల్పించాలన్నారు . విశాఖ కేజీహెచ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లికార్జున ను అభినందించారు. జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున మాట్లాడుతూ  కేజీహెచ్ మరియు ఇతర ఆసుపత్రు లలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి గాను పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు . 3.3 కోట్ల సిఎస్ఆర్ నిధులను వెచ్చించి వివిధ పనులను నిర్వహించామన్నారు.

ఘోషా  ఆసుపత్రిలో 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 20 బెడ్ల  వార్డు ఏర్పాటు చేశామని, పేషంట్ల బంధువులకు కూడా రూములను ఏర్పాటు చేశామన్నారు. కేజీహెచ్ లో వివిధ విభాగాల హెచ్వోడీలకు వివిధ ఖర్చుల నిమిత్తము ఒక లక్ష రూపాయలను చొప్పున 26 లక్షలు కేటాయింపు చేయడం జరిగిందని , 2వ రౌండ్ కేటాయింపు త్వరలో చేస్తామన్నారు . ఆయా విభాగాలలో వైద్య సేవలతో పాటు పలు ఇతర అంశాలైన అటెండెన్స్ , ఆహార నాణ్యత , శానిటేషన్ తదితర అంశాలకు హెచ్వోడీలను  బాధ్యులను చేసామన్నారు . కే జి హెచ్ లో పలు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు . హెచ్వోడీలు చేసిన పలు సూచనలు అమలు గావించామన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందిని భర్తీ చేయాలన్నారు . రూ. 40 లక్షల సిఎస్ఆర్ నిధులతో పాడేరు ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు . తద్వారా ఏజెన్సీలో గతంలో ఎన్నడు లేని విధంగా 600 సర్జరీలు పూర్తి చేసినట్లు  తెలిపారు.   

కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ జె. నివాస్ మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని అన్నారు.  డిఎం&హెచ్ఒ, డిసిహెచ్ఎస్ ఇద్దరు సంయుక్తంగా కలిసి పనిచేయాలని తెలిపారు. గర్భిణీ లను మొదటి త్రైమాసికంలో తప్పక ఆశా వర్కర్స్ రిజిస్టర్ చేయాలని , దానివలన హై రిస్క్ కేసులను సులభంగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. పట్టణాలలో డ్రై డే ఫ్రైడే తప్పక అమలు చేయాలని కోరారు . మురళీధర్ రెడ్డి ఎండి, ఏపీఎంఐడిసి మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మందులు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డి ఎం & హెచ్ ఒ లు ఇండెంట్ తో బాటు అదనంగా మందులు నిల్వ ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన మందులను ఎప్పటకప్పుడు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిఎస్ నవీన్ కుమార్ , సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ , ఆరోగ్య శ్రీ ముఖ్య నిర్వహణ అధికారి హరీంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ , ఏపీ వివిపి & డి ఎమ్ ఈ , ఆరు జిల్లాల నుండి వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , డి సి హెచ్ ఎస్ లు , అర్ & బి , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
    

విశాఖపట్నం

2023-01-09 15:38:57

APPSC గ్రూప్-1 పరీక్షా విధానంలో భారీమార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘ కాలం తరువాత నిర్వహించిన Appsc Group-1 పరీక్ష విధానంలో సమూల మార్పులకి శ్రీకారం చుట్టింది.. ఎప్పుడూ లేనివిధంగా 2019 నుంచి ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల విధానంలో భారీ మార్పులు తీసుకు వచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగాలకు గ్రూప్-2 స్థాయి, గ్రూప్-2 ఉద్యోగాలకు గ్రూప్-1 స్థాయి..ఇపుడు గ్రూప్-1 ఉద్యోగాలకు సివిల్ సర్వీస్ స్థాయిలో పోటీ పరిక్షల ప్రశ్నా పత్రాలను ఇవ్వడం ప్రారంభించింది. అందులోనూ అత్యధికంగా జతచేయడం అనే విధానంలో ప్రశ్నలు ఇవ్వడంతో అభ్యర్ధులు చాలా దారుణంగా తడబడ్డారు. ఇకపై ప్రశ్నలు ఈ విధంగానే ఉంటాయనే విధంగా ఏపీపీఏస్సీ తీసుకొచ్చిన మార్పులు అభ్యర్ధులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒకరకంగా చెప్పాలంటే గ్రూప్-1 పరీక్షా విధానం చూసిన తరువాత అభ్యర్ధులు ఏవిధంగా పోటీపరీక్షలకు సిద్దం కావాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈసారి గ్రూప్-1 ప్రలిమ్స్ అత్యల్పంగా మాత్రమే క్వాలిఫై అవుతారని చెప్పకతప్పదు.

Tadepalli

2023-01-09 03:20:56

వసతులకు అనుగుణంగానే గదుల అద్దెనిర్ణయం

తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్, నారాయణగిరి విశ్రాంతి గృహాలను భక్తుల కోరిక మేరకు ఆధునీకరించి, అక్కడి వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయించినట్టు టిటిడి పేర్కొంది. అయితే, కొన్ని పత్రికల్లో పేర్కొన్న ట్టు గదుల అద్దె భారీగా పెంచేశారనడం వాస్తవం దూరం. ఈ విశ్రాంతి గృహాల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా గదుల అద్దెను నిర్ణయించి అదే అద్దెను వసూలు చేస్తున్నారు. అయితే, పలువురు భక్తులు  ఏసీతోపాటు అధునాతన  సౌకర్యాలు కల్పించాలని సలహాలు, సూచనలు అందించిన మేరకు టిటిడి ఈ విశ్రాంతి గృహాల్లోని గదులను ఆధునీకరించింది. భక్తుల అభిమతానుసారం నూతన ఫర్నీచర్, ఏసి, వేడి నీటి కోసం గీజర్లు తదితర వసతులు కల్పించింది.  అయితే, సదరు మీడియాలో పేర్కొన్నట్లు గదుల అద్దెను భారీగా టిటిడి పెంచిందనడం వాస్తవం కాదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.

Tirumala

2023-01-07 11:25:48

అలాంటి తేడా సిబ్బందికి, అధికారులకు ఇక రంగుపడుద్ది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేడా ఉద్యోగులు, సిబ్బంది విషయంలో దూకుడు పెంచింది. ఉదయం బయె మెట్రిక్ వేసే సమయానికి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి, ఏదో తెగ కష్టపడిపోతున్నట్టుగా అధికారిక వాట్సప్ గ్రూపుల్లో ఫోటోలు పెట్టేసి.. కార్యాలయంలోని సిబ్బంది పనిమొత్తం తానొక్కడినే చేసేస్తున్నట్టు తెగ ఫీలై పోయి.. ఆపై సొంతపనులపై వెళ్లి మళ్లీ సాయంత్రం సమయానికి అటెండెన్సులు వేసే తేడా సిబ్బంది ఆట కట్టించడానికి ప్రత్యేక సంచార ఆకస్మిక తనిఖీ బృందాలను(ఫ్లైయింగ్ చెకింగ్ స్క్వాడ్) ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు వారు పలువురు అధికారులతో స్క్వాడ్ బృందాలను కూడా నియమించింది. వీరంతా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. తనిఖీ వచ్చిన సమయానికి కార్యాలయాల్లో సిబ్బందిలేకపోయి నా..మూమెంట్ లో సరైన కారణం లేకపోయిని జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్చార్జి పోస్టులు, డిప్యూటేషన్లు చేసేవారని ఈ బృందాలు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. చూడాలి ఈ ప్రత్యేక బృందాలను తేడా సిబ్బందిని ఎంత మేరక పట్టుకుంటాయో..కార్యాలయంలోనే ఉంచి పనులు చేయిస్తాయో..!

Tadepalli

2023-01-07 10:56:18

ఏపీ కొత్తజిల్లాల్లో సర్ధుబాటుకోసమే గ్రూప్-1, 2పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో భర్తీచేయబోయే గ్రూప్-2 ఉద్యోగాలన్నీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 13 కొత్తజిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వశాఖల కార్యాలయాల్లోని సర్ధుబాటుకోసమేనని తెలుస్తుంది. ఇటీవల గ్రూప్-1 లో ఇచ్చిన పోస్టులు కూడా అత్యధికంగా కొత్త జిల్లాల్లో తక్కువగా డిఎస్పీలను 
భర్తీచేయడానికి, ఇతర ప్రభుత్వ శాఖలకు సర్ధుబాటు చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇపుడు గ్రూప్-2 పోస్టులు కూడా ఆ విధంగా క్రిందిస్థాయి కేడర్ పోస్టులను భర్తీచేయడానికే ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. త్వరలోనే గ్రూప్-1 ప్రక్రియ మొత్తం పూర్తిచేయడానికి అన్ని ఏర్పాట్లు 
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఎన్ని పోస్టులకు అనుమతిస్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 1500 గ్రూప్-2 పోస్టులు అవసరం అవుతాయని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. 

అందులోనూ 2024 తరువాత అత్యధికంగా ఉద్యోగ విరమణలు ఉండటం కూడా ప్రస్తుత నోటిఫికేషన్ కు ఊతం వచ్చింది. అయితే ప్రభుత్వం సుమారు 500 నుంచి 700 వరకూ పోస్టులకు అనుమతి ఇస్తుందని అధికారులు కూడా భావిస్తున్నారు. అంత మొత్తంలో పోస్టులు భర్తీచేయకపోతే పరిపాలన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కొన్నిప్రభుత్వశాఖల్లో పదోన్నతల ద్వారా కూడా గ్రూప్-2, గ్రూప్-1 పోస్టుల్లోకి చేరికలు ఉంటాయని తెలిసింది. అలా మొత్తం ఏర్పాట్లు పూర్తయిన తరువాతనే కొత్తగా తీస్తున్న పోస్టుల భర్తీ, ప్రభుత్వ శాఖల కేటాయింపు జరుగుతుందని సమాచారం. చూడాలి ప్రభుత్వం ఏ తరహా విధానం అవలంభిస్తుందనేది..!

Amaravati

2023-01-07 05:19:54

సచివాలయ ఆదాయానికి గండి పెట్టేవారిపై మూడోకన్ను

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల ఆదాయానికి గండి కొట్టే పంచాయతీ, రెవిన్యూ సిబ్బందిపై ప్రభు త్వం మూడోకన్ను వేసి పర్యవేక్షణ చేపడుతున్నట్టు సమాచారం. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం గా 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఏడాది నుంచి రెవిన్యూ, ఇతర దృవీకరణ పత్రాలు సచివాలయాల్లోనే ఇవ్వడం ప్రారంభించింది. అయితే నాటి నుంచి నేటి వరకూ సచివాల యాలున్న వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా మీ-సేవ సర్వీలకు ఎక్కడా డిమాండ్ తగ్గకపోగా పెరుగుతంది. దీనితో ఇదంతా ఇంటి దొంగల పనేనని భావించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ సచివాలయ సేవలు, మీ-సేవల ద్వారా పొందిన సేవలను లెక్కగట్టింది. దీనితో చాలా చోట్ల సచివాలయాల కంటే మీ-సేవాల్లోనే రెవిన్యూశాఖ, పంచాయతీలకు పలు రకాల దృవీకరణలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఏఏ జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కాకుండా మీ-సేవల్లో ఎక్కడ, ఏ మండలం, డివిజన్ నుంచి అర్జీలు అధికంగా వెళుతున్నాయనే సమాచారాన్ని బయటకు తీసేపనికి తెరలేపింది ప్రభుత్వం. ఒక పక్క ప్రభుత్వా నికి ఆదాయంలేక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతుంటే..మరోపక్క సిబ్బందే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించే వైనంపై సీరియస్ గా వుంది.

అదనపు ఆదాయం కోసమే మీ-సేవాలకు ఫైళ్ల బదిలీ
గ్రామ, వార్డు సచివాలయాల్లో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా 572 రకాల దృవీకరణలు తక్కువ ధరలకే ప్రభుత్వం అందిస్తోంది. అందునా..మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిర్ణీత సమయానికే వీటిని అందజేస్తుంది. ఈనేపథ్యంలో వివిధ శాఖల సిబ్బందికి అడ్డడారిలో వచ్చే ఆదాయం పడిపోతున్నది. దీనితో సచివాలయాలకు కాకుండా మీ-సేవ కేంద్రాలకు పలు రకాల దృవీకరణ పత్రాలను దారిమళ్లిస్తున్నారు. కొంత మంది మీ-సేవ ప్రతినిధులతో కుమ్మక్కై రేటు మాట్లాడుకుంటూ..అడిగిన మొత్తం రాగానే సదరు దృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు. అలా ఆదాయాలు పెంచుకోవడానికి తేడా సిబ్బందికి మీ-సేవాలు కేరాఫ్ అడ్రస్ గా మారాయని ప్రభుత్వం గుర్తించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న మీ-సేవా కేంద్రాల జాబితాతో పాటు. ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలోని మీ-సేవా కేంద్రాల్లో ప్రభుత్వ దృవీకరణ పత్రాలు అధికంగా చేస్తున్నారనే సంఖ్యను ప్రభుత్వం లెక్కలు వేస్తున్నది. అక్రమార్జన కోసం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిని గుర్తించే పనిని వేగవంతం చేసింది. ప్రభుత్వ రికార్డుల్లోనూ సచివాలయ సేవల కంటే..రాష్ట్రవ్యాప్తంగా మీసేవ రికార్డులే అధికంగా ఉండటం ప్రభుత్వ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

జిల్లాలో కలెక్టర్లు, మండలాల్లో తహశీల్దార్ లు అప్రమత్తం
ప్రభత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే వారిని గుర్తించే పనిని ప్రభుత్వం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో తహశీల్దార్లకు అప్పగించినట్టు సమాచారం అందుతుంది. ఎక్కువగా ఏఏ మీ-సేవా కేంద్రాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల కంటే అత్యధికంగా రెవిన్యూ, ఇతర ప్రభుత్వశాఖల ఆధారిత దృవీకరణలు చేపడుతున్నారో లెక్కగట్టే కార్యక్రమం చేపట్టినట్టు తెలిసింది. తద్వారా ఏఏ ప్రాంతాల్లో ఏఏ శాఖల సిబ్బంది సచివాలయాల్లో కాకుండా మీ-సేవ కేంద్రాల ద్వారా దృవీకరణలు చేయిస్తున్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం వుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండలాల డేష్ బోర్డుల నుంచి సమాచారాన్ని రాష్ట్ర అధికారులు సేకరించినట్టు చెబుతున్నారు. పక్కాగా ఆధారాలు లభించిన వెంటనే సదరు సిబ్బందిపై వేటు వేసి తద్వారా ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్టు పక్కగా సమాచారం అందింది.

ప్రధాన ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం
భారదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే అత్యధిక మొత్తంలో సంక్షేమ పథకాల పేరిట నగదు బదిలీ నేరుగా లబ్దిదారులకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజనాలో కాసులు ఐసుముక్క కరిగిపోయినట్టుగా ఆవిరైపోతున్నా యి. దీనితో ప్రభుత్వం నిత్యం ఆదాయం వచ్చే ప్రభుత్వశాఖలు, ఆదాయ మార్గాలను అన్వేషించడంతోపాటు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలకు ఎక్కడ గండి పడుతుందనే కోనంలో ప్రభుత్వంలోని 75 శాఖల్లోనూ నిఘా పెట్టింది. ప్రతీరోజూ సాయంత్రానికల్లా ప్రభుత్వ ఖజానాలోకి నిర్ణీత మొత్తం వస్తే తప్పా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పించన్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వ శాఖల్లోని అత్యంత వేగంగా ఆదాయం వచ్చే ప్రభుత్వ శాఖలను గుర్తించడంతోపాటు, ఆయా శాఖల్లో డిజిటల్ లావాదేవీలను ప్రవేశపెట్టాలని ఆయా ప్రభుత్వశాఖ ముఖ్యకార్యదర్శిలను కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విధంగా చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్నులు, ఇతర ఆదాయం ఎప్పటకప్పుడు ఖజానా డేష్ బోర్డు ద్వారా తెలుసుకునే వీలుంటుందని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. చూడాలి ఇంటి దొంగలను పట్టుకుంటుందా.. పోన్లే మన వాళ్లే కాస్త కాసులకు కక్కుర్తి పడుతున్నారని వదిలేస్తారో..!

Tadepalli

2023-01-07 04:01:59

అమ్మకానికి/విలీనానికి శ్రీ విజయ విశాఖ డెయిరీ?

ఆంధ్రప్రదేశ్ విశాఖ(గాజువాక)లో ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ విజయ విశాఖ పాల డెయిరీ కంపెనీ లిమిటెడ్ అమ్మకానికి/విలీనానికి రంగం సిద్ధమైనట్టు స్పష్ట మైన సంకేతాలు కనిపిస్తున్నాయి. డెయిరీకి చెందిన డైరెక్టర్లతో ఇటీవలే ఒకప్రైవేటు కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ప్రధాన షేర్ హోల్డర్లు, కంపెనీ ఉద్యోగులతోనూ మంతనాలు చేసినట్టు తెలిసింది. ప్రతిపాదించిన ప్రైవేటు కంపెనీలో విశాఖ డెయిరీలో విలీనం చేసినా, అమ్మకం చేసినా భారీ నజరానా ఇస్తామని కూడా ఆశచూపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ అంశం వైరల్ అవుతుంది.  విశాఖ డెయిరీ పాలు సేకరించే అన్ని ప్రాంతాల నుంచి ఒక ప్రైవేటు డెయిరీకి చెందిన ప్రతినిధులు గ్రామస్థాయిలోనూ, పాల సేకరణ కేంద్రాల సమాచారంతోపాటు మొత్తం విశాఖ డెయిరీకి వున్న పాల నెట్వర్క్ రైతులు, బల్క్ కూలింగ్ సెంటర్లు, గ్రామస్థాయిలో సచివాలయ పశుసంవర్ధకశాఖ సిబ్బంది, అధికారుల వివరాలు సేకరిస్తుండటం విశేషం..!

Tadepalli

2023-01-06 04:55:28

గీతం ఆక్రమణలు బంధోబస్తు మధ్య మరోసారి కూల్చివేత

గీతం యూనివర్శిటీలోని మెడికల్ కాలేజీ ప్రాంతం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని, వాటిని కూల్చేం దుకు విశాఖపట్నం రెవిన్యూ యంత్రాంగం మరోసారి సిద్ధమైంది. తెల్లవారు జామునుండి కూల్చివేత మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రహరీ గోడలు తొలగిస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించి మరీ ప్రభుత్వం ఈకూల్చివేతకు పూనుకుంది. కాగా కనీసం సమాచారం లేకుండా, కక్షపూరీతంగా కూల్చుతున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తుంది. యూనివర్సిటీ ఆక్రమణలు 45 ఎకరాలు మేర ఉన్నాయని.. ప్రభుత్వ భూములు ఆక్రమణ భారీగా జరిగిందంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలో తొలగింపు జరుగుతోంది.

Visakhapatnam

2023-01-06 02:56:00

గ్రామ సచివాలయాల్లో బదిలీలు ఎవరికి చేస్తారంటే..?

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంగీకరించిన నేపథ్యంలో ఉద్యోగులకు ఏ విధంగా బదిలీలు నిర్వహించాలనే విషయమై సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు, ఇతర ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్లు తర్జన బర్జనలు పడుతున్నారు. తొలుత రెండేళ్ళు సర్వీసు పూర్తిచేసుకొని, రెగ్యులర్ అయిన వారికి బదిలీలు జరిపి, తరువాత మిగిలిన వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. అంతేకాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీల విషయంలో ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా నిబంధనలు పాటించాలా.. లేదంటే సచివాలయశాఖకు ప్రత్యేకంగా కొత్త నిబంధనలు ఏర్పాటు చేసి జీఓ ఇవ్వాలా అనేవిషయంపై కూడా సమాచాలోచనలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

Tadepalli

2023-01-06 02:31:42

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్

తిరుమల శ్రీవారిని గురువారం రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.  ద‌ర్శ‌నానంత‌రం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో   గ‌వ‌ర్న‌ర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి  ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అందించారు.  ఈ కార్యక్రమంలోసివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్‌, డెప్యూటీ ఈవోలు ర‌మేష్‌బాబు, హరేంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-01-05 14:29:58

హుక్కా ప్రియులకు శుభవార్త..కేఫ్ లు తెరుకుంటాయ్

హైదరాబాదులోని హుక్కా ప్రియులకు శుభవార్త. హుక్కా పార్లర్‌ను నడపడానికి తెలంగాణ హైకోర్టు షరతుల తో కూడిన అనుమతిని మంజూరు చేసింది. హుక్కా పార్లర్ యజమానులను వేధించవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో హుక్కా పార్లర్‌ను తనిఖీ చేసేందుకు లోపలికి రావద్దని సమర్థ అధికారు లను ఆదేశించలేమని కోర్టు పేర్కొంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక లాంజ్ హుక్కా & కేఫ్ చాంద్రాయణగుట్ట యజమాని దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు పట్ల హుక్కా ప్రియులు, హుక్కాపార్లర్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana

2023-01-05 14:05:12

ENS న్యూస్ ఏజెన్సీకి జిల్లా రిపోర్టర్లు కావలెను

భారతదేశపు తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens LIve, న్యూస్ వెబ్ సైట్ www.enslive.netలో పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుంచి రిపోర్టర్లు, కెమెరా మేన్ లు, జిల్లా యాడ్ మేనేజర్లు కావలెను. స్థానికంగా ఉంటూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంచి నెట్వర్క్ కలిగి, కనీసం డిగ్రీ చదువుకొని, మొబైల్ లో తెలుగు చక్కగా న్యూస్ ఫార్మాట్ రూపంలో వార్తలు కంపోజింగ్, కదలకుండా వీడియోలు తీయడం వచ్చి ఉండాలి. గతంలో ఏదైనా మీడియా సంస్థల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును, ఆకర్షణీయమైన జీతం, ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించబడును. వివరాలకు  చీఫ్ రిపోర్టర్ ఈఎన్ఎస్ బాలు,  ఫోన్ నెంబర్లు 9490280270, 9390280270.

Visakhapatnam

2023-01-05 07:15:22

Ens Live చెప్పినట్టే.. సచివాలయాలే ఆదాయమార్గాలు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు కాబోతున్నాయి. కామన్ సర్వీస్ సెంటర్ కింద ప్రభుత్వం 572 సేవలను సచివాలయాలు అందిస్తున్నాయి. తొలుత పైలట్ ప్రాజె క్టుగా కొన్ని సచివాలయాలకే ఇచ్చారు. ఇపుడు రాష్ట్రంలోని 14వేల5 సచివాలయాల్లో వీటిని అమలు చేయ నున్నారు. అంతేకాకుండా ప్రతీశాఖ ఉద్యోగికి కంప్యూటర్ ఇచ్చి, సదరు ఉద్యోగి ప్రభుత్వశాఖల కు చెందిన సేవలను, దృవీకరణ పత్రాలను వారితోనే చేయిస్తారు. ఇలాచేస్తే ప్రభుత్వ ఖజానాకు నిత్యం కాసులేనని Ens Live ఏడాది క్రితమే తెలియజేసింది. సీఎం సమీక్షలో ఈవిషయాన్ని అధికారులు(SOP)గా చెప్పారు.

Tadepalli

2023-01-05 05:38:05

యలమంచిలి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్..

ఏపీ  సీఎం వైఎస్‌ జగన్‌ అనకాపల్లి జిల్లా యలమంచిలి పర్యటన నిమిత్తం కొద్ది నిమిషాల క్రింత విజయవాడ విమానాశ్రయం నుంచి విశాఖ బయలు దేరారు. నిన్న మృతిచెందిన విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 12.00 గంటలకు యలమంచిలిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అడారి ఆనంద్‌ నివాసానికి చేరుకుంటారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళర్పిస్తారు.  అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

2023-01-05 04:50:02

సిమ్ కార్డులు ఇవ్వకముందే మూలకి చేసిన మొబైల్స్

ఏపీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వింతపరిస్థితి చోటుచేసుకుంది. ఇక్కడ పనిచేసే సచివాలయ మహిళా పోలీసులుకు ప్రభుత్వం సెల్ ఫోన్లు ఇచ్చింది గానీ, అందులో వినియోగించడానికి సిమ్ కార్డు(ప్రభుత్వ నెట్వర్క్ కలిగిన)లు ఇవ్వలేదు. ఈఫోన్లు ఇచ్చి ఏడాది గడిచింది. అపుడే ఆఫోన్లు మూలకు చేరిపోతున్నాయి. కొన్ని ఫోన్లు బ్యాటరీలు పాడైపోయి చార్జింగ్ నిలబడటం లేదు. ప్రభుత్వం సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులే తమ సొంతఖర్చుతో ప్రైవేటు నెంబర్లు వేసుకొని ఆఫోన్లను వాడాల్సి వస్తుంది. ఈవిషయాన్ని పోలీసుశాఖ వద్ద ప్రస్తావిస్తే..త్వరలోనే సిమ్ కార్డులు ఇస్తాం అనిచెబుతూనే వస్తున్నారు ఏడాది నుంచి..!

తాడేపల్లి

2023-01-05 03:49:31