1 ENS Live Breaking News

ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ టు రూల్ లో సెల్ ఫోన్లు..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఒత్తిడి పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ఏప్రిల్1 నుంచి వర్క్ టు రూల్ ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుతున్నది. వర్క్ టు రూల్ అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకే విధులు నిర్వహిస్తారు. కానీ ఈసారి ఇకపై ఉద్యోగుల సెల్ ఫోన్లు కూడా వర్క్ టు రూల్ పాటించనున్నాయట. అంటే విధి నిర్వహణ సమయంలో తప్పా, మిగిలిన సమయంలో స్వి చ్చాఫ్ లో  ఉంటాయి. అదేజరిగితే రాష్ట్రంలోని పరిపాలన మొత్తం స్థంబించిపోతుంది. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఇదొక్కటే మార్గమని నిర్ణయించుకొని, అంతా కలిసికట్టుగా ఏకతాటిపైకి రావాలని యోచిస్తున్నట్టు సమాచారం. దానికోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రతినిత్యం కనిపిస్తన్న పోస్టింగ్ లే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అదేజరిగితే వారంలో జరగాల్సిన పనులు నెలరోజులైనా పూర్తికావు..!?

Amaravathi

2023-03-23 02:49:30

గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్ ఎక్కడ

భారత దేశం మొత్తం తొంగిచూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీచేసిం ది. అపుడు అన్ని రాష్ట్రాలు ఔరా అన్నాయి. అవే రాష్ట్రాలు ఇపుడు ఏపీ ప్రభుత్వ తీరును చూసి అడ్డెడ్డే అంటున్నాయి. 19ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయి సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా ఇపుడు వారి ప్రభు త్వ శాఖకు చట్టబద్దత కల్పించడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీసు రూల్సు సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తున్నామన్న ప్రభుత్వం ప్రమోషనల్ ఛానల్ విషయంలో కొన్నిశాఖల సిబ్బందికే ఫ్రేమ్ చేసి మిగిలిన వారిని గాల్లోపెట్టింది.  2022 జూలైలో సర్వీసులు క్రమబద్దీకరణ జరిగిన ఉద్యోగులందరికీ ఏడేళ్లు లేదా తొమ్మిదేళ్ల తరువాత పదోన్నతులు ఏనిబంధన ఆధారంగా చేపడతారో క్లారిటీ ఇవ్వలేదు. 

Amaravati

2023-03-19 03:07:39

విశాఖ నుంచి పరిపాలనంటే ఎమ్మెల్సీ పోయిందే..!?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి గెలుపుకంటే ఇపుడు టిడిపి, జనసేన, పీడిఎఫ్ పార్టీలలో మరో ఆశక్తి కరమైన అంశా న్ని ట్రోల్ చేస్తున్నారు. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేస్తామని ప్రకటించిన నెలలోనే ఒక ఎమ్మెల్సీ సీటు కోల్పోవాల్సి వచ్చిం దని..ని జంగా పరిపాలన ప్రారంభిస్తే ఇంకెన్ని కోల్పోవాల్సి వస్తుందో నంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అందులోనూ సీఎం గోబ్యాక్ అనే పోస్టర్లు విశాఖలో ఎమ్మెల్సీ కౌంటింగ్ సమయంలోనే వెలయడం, పట్టభద్రులంతా వార్ వన్ సైడ్ చేసేయడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత అధికారులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని క్రిష్టల్ క్లియర్ గా తేలిపోయింది. అయితే మానసికంగా గెలుపు తమదేనని..కాకపోతే డా.వేపాడ చిరంజీవిరావుకి మామూలుగానే యువతలోనూ మంచి ఫాలోయింగ్ ఉండటం వలన గెలిచారని..ఇది టిడిపి విజయం కాదని వైఎస్సార్సీపీ నాయకులు, కేడర్ అదే సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వడం విశేషం..!

Visakhapatnam

2023-03-17 16:47:06

ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవ ర్గానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 37 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, అందులో 34 మంది అభ్యర్ధుల డిపాజి ట్లు గల్లంతయ్యాయి. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కూడా డిపాజిట్ దక్కించుకోలేక పోయారు. మొత్తం చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వచ్చిన అభ్యర్థికే డిపాజిట్లు వచ్చినట్టవుతుంది. అంటే సుమారు 33 వేల ఓట్లు వచ్చిన వారికి మాత్రమే డిపాజిట్లు లభిస్తాయి. అయితే, పోటీలో ఉన్న పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభ, టిడిపి అభ్యర్థి చిరంజీవి, వైసీపీ అభ్యర్థి సుధాకర్ లకు మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. మిగిలిన 34 మంది డిపాజిట్లు కోల్పో యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని ప్రకటించిన బీజేపి డిపాజిట్లు కోల్పోవడం ప్రాధాన్యత సంతరించు కుంది. అయితే బిజెపీ అభ్యర్ధి మాదవ్ కి డిపాజిట్లు కూడా దక్కకపోవడానికి కారణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఎల్ఐసీ తో సహ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలన ప్రైవేటు పరంచేస్తామన్న కేంద్రప్రభుత్వ ప్రకటనే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Visakhapatnam

2023-03-17 12:58:46

ఎమ్మెల్సీ ఫలితాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారిచేసింది. ఓట్లు లెక్కించినా తుది తీర్పునకు లోబడి ఫలితం ఉంటుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు  హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు అభ్యర్థి, న్యాయవాది శ్రీనివాసరావు. అం తేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చారన్న పిటిషనర్ ఎన్నికలు జరగని చోట హైకోర్టుకు సెలవులు ఇచ్చారని కోర్టుకి తెలియజేశారు.  ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదని తెలియజేయడంతో పిటిషన్‌ను అనుమతించి విచా రణ చేపట్టింది హైకోర్టు ధర్మాసనం. పిటిషనర్ తరపున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. సెలవులు లేకపోవడంతో అభ్యర్థికి లాయర్లు, ఉద్యోగులు ఓటు వేయలేకపోయారని కోర్టుకి తెలియజేశారు. చాలా మంది న్యాయవాధులు ఓటు హక్కు అవకాశాన్ని కోల్పోయారని కోర్టుకి తెలియజేశారు. దీనితో ఓట్లు లెక్కించినా తుది తీర్పునకు లోబడే ఉండాలంది హైకోర్టు.

Amaravati

2023-03-15 15:56:23

1998డిఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 క్వాలిఫైడ్ డిఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాబితాలో  రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది క్వాలి ఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో వీరి నియామకం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ఈ ఉత్తర్వుల ద్వారావీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమీషనర్ కు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు డిఎస్సీ అభ్య ర్ధులకు పోస్టింగులు ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇస్తుండటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Tadepalli

2023-03-15 14:14:16

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపుపై భారీ అంచనాలు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ గెలుపుపై ఆ నలుగురుపై ఎవరికి వారు భారీ అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికలబరిలో37 మంది నిలబడి నా, ప్రధా నంగా పోటీ మాత్రం 4గురు అభ్యర్ధుల మధ్యే నెలకొంది.  మొత్తం ఓట్లు 2లక్షల 89వేల214 కాగా మూడు జిల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో జిల్లాలో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయి.2వస్థానంలో శ్రీకాకుళం, మూడవ స్థానంలో విశాఖపట్నం జిల్లాలు నిలిచాయి. అయితే గెలుపుపై అధికారపార్టీతోపాటు, మిగి లిన మూడు పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ అయిన తరువాత ఓటర్లు ఏ అభ్యర్ధికి ఓటు వేశారో ఈసారి బహిరంగంగా చెప్పడంతో గెలుపుపై ఎవరి అంచనా ల్లో వారు నిమగ్నమయ్యారు. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించడం, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు భా రీగా ఓటింగ్ లో పాల్గొనడంతో గెలుపుపై భిన్నకధనాలు వినిపిస్తున్నాయి. చూడాలి విజయం ఎవరిదో..!?

Visakhapatnam

2023-03-15 02:56:45

ప్రెస్ & మీడియా అక్రిడిటేషన్ సవరణకు ఓకే కానీ..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రెస్ అండ్ మీడియా విషయంలో అక్రిడిటేషన్ మంజూరుకి సంబంధించిన నిబంధనల సవరణకు తొలిసారిగా..అంటే మూడున్నరేళ్లు పూర్తయిన తరువాత అంగీకారం తెలిపింది. గతంలో దినపత్రికలకు జిఎస్టీ తీసేయాలని, పత్రిక ప్రింటింగ్ లో సడలింపులు ఇవ్వాలని, చిన్న-మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని యూనియన్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదు. కానీ ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ప్రభుత్వం ప్రెస్ అండ్ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 142 జీఓ సవరణకు ఆమోదం తెలిపినా స్వల్ప మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది తప్పా చిన్న, మధ్యతరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీ లకు ప్రభుత్వ ప్రకటనల విషయంలో మార్పు ఉండకపోవచ్చునని చెబుతున్నారు సీనియర్ జర్నలిస్టులు. అంతేకాకుండా మార్చి 31 వరకూ పాత అక్రిడిటేషన్లు ఎక్సటెన్ష న్ ఇచ్చన ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్లు ఇస్తుందా.. వాటికే గడువు పెంచుతుందా తేల్చలేదు..!

Amaravati

2023-03-14 16:24:23

ఉత్తరాంధ్ర MLCపై ఉపాధ్యాయుల, ఉద్యోగుల ప్రభావం

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపుపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రభావం గట్టిగా పడేటట్టు కనిపిస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా 3జిల్లా ల్లో అత్య ధికంగా ఉపాధ్యాయులు పనిగట్టుకొనిమరీ ఈసారి ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్లు చేయించారు. అదేసమయంలో ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు కూడా ఫలప్ర దం కాలే దు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతోనే నిరసన తెలియజేస్తున్నారు. దీనితో ఎమ్మెల్సీ ఎన్నికపై వీరిఓటు ప్రభావం గట్టిగానే చూపిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. అంతేకాకుండా సామాజిక మాద్యమాల్లో కూడా ఇదేవిషయమై పెద్దస్థాయిలో చర్చకూడా నడుస్తున్నది. మనఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మార్పుతేవాలని అనేని నాదాన్ని బలంగా ఓటర్లలోకి చాపక్రిందనీరులా తీసుకెళ్లారని తెలుస్తుంది. ఉద్యోగులేకాకుండా, ఉపాధ్యాయులు, వారి పిల్లలు, బంధువులు, వారికి తెలిసిన వారితోకూడా పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపి క్రాస్ ఓటింగ్ జరిగేలా పక్కాపథక రచనచేశారని చెబుతున్నారు. చూడాలి ఏంజరుగుతుందో..! 

Visakhapatnam

2023-03-13 09:22:08

MLC పీఠం దక్కాలంటే అందులో సగం ఓట్లుపడాలి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో ఏ అభ్యర్ధి గెలవాలన్నా ప్రస్తుతం రిజిస్టర్ అయిన 2,89,214 ఓట్లలో సగానికిపైగా ఒక అభ్యర్ధికి పడాలి. ప్రస్తుతం ఎన్నికల బరిలో 37 మంది నిలబడినా..ప్రధాన పోటీ మాత్రం నలుగురు అభ్యర్ధుల మధ్యే ఉన్నది. ఎన్నికల 13వ తేది ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 331 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుంది. ఎమ్మెల్సీ పీటంపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు పీడిఎఫ్, బీజేపీ అభ్యర్ధులు కూడా ఎవరి ధీమాలో వారున్నారు. ఎన్నడూలేనివిధంగా సార్వత్రిక ఎన్నికలను తలిపించే విధంగా ఈసారి ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తీరు అన్నివర్గాల ప్రజలను ఆలోచింపజేస్తున్నది. ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్ధులు గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ మిగతా అభ్యర్ధుల వలన ఈసారి ఓట్లు చీలిపోతాయనే భయం అందరినీ వెంటాడుతోంది. మొదటి ప్రాధాన్యత అత్యధిక ఓట్లు ఎవరికి వస్తాయోననే ఉత్కంఠ మొదలైంది..!

vizag

2023-03-12 06:17:51

జనసేన సహకారంతోనే ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ గెలుస్తాం

బిజేపీ-జనసేన పొత్తుతోనే ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపితో జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. ఈ విషయం పదే పదే చెప్పాల్సిన పనిలేదని, జనసేన సహకారం బిజెపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా ఉందన్న ఆయన ఈసారి బిజీపీ లక్షకు పైగా ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్ చేయించిందన్నారు. బిజేపీ అభ్యర్ధి మాదవ్ పై పట్టభద్రులు, నిరుద్యోగులకు నమ్మకం ఉందన్న సోము 2024 ఎన్నికల్లో ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుందన్నారు. హామీలిచ్చి మడమతిప్పేసిన సీఎంను ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు బీజేపి తెలియజేసిందన్నారు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతుందో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఈసా ఎమ్మెల్సీ గెలిచేది బీజేపీనే అని నొక్కిచెప్పారు.

Visakhapatnam

2023-03-09 10:58:58

తొలిరోజు జిఐఎస్ సమ్మిట్ లో రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో తొలిరోజు రూ.రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పేర్కొ న్నారు. జిఐఎస్ వేదిగా ఈ విషయాన్ని సీఎం ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా 92 ఎంఓయూలును  కుదుర్చుకోనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయన్న సిఎం మిగిలిన 248 ఎంఓయూలు రేపు కార్యరూపం దాల్చనున్నాయన్నారు. ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు కాగా. వీటిద్వారా దాదాపు 2లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు రానున్నాయి. రిలయెన్స్‌, అదాని, ఆదిత్య బిర్లా, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. 

Visakhapatnam

2023-03-03 14:28:58

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ జీతాలు పడలేదు

మొన్న పాఠశాల ఉపాధ్యాయులు, నిన్న జిల్లా శాఖల అధికారులు, నేడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. కారెవరూ జీతాలు 1వ తేదినా టికి పడటానికి అనర్హులు. ఒక ప్రభుత్వశాఖతో మొదలై ఆలస్యం క్రమేపీ అన్ని ప్రభుత్వశాఖలకూ వర్తింపజేస్తోంది ప్రభుత్వం.  ఏ ప్రభుత్వ శా ఖ అధికారులకు జీతాలు పడకపోయినా సచివాలయ ఉద్యోగులకు జీతాలు 1వ తేదినాటికి టంచనుగా పడేవని చెప్పిన వారు మీ పరిస్థితే మా కూ వచ్చిందంటూ ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అందులోనూ సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ ప్రస్తుతం పనిచే యడం లేదనే వార్త కూడా రాష్ట్రవ్యాప్తంగా దావానంలా వైరల్ అవుతుంది. సాధారణ జీతాలతోపాటు, ఇతర ఏ రకమైన బిల్లులు పెట్టడానికి వీ లుపడని పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.  మొదట పదిరోజులు ఆలస్యంగా పడిన జీతాలు, ఆపై 15 రోజులయ్యే పరిస్థితి వస్తే బ్యాంకు ఈఎంఐలు, హౌసింగ్ లోన్లకు పెనాల్టీలు కట్టక తప్పదంటున్నారు ఉద్యోగులు.

Visakhapatnam

2023-03-02 09:43:18

రుషికొండను ఏమార్చడానికే GVMC కమిషనర్ మార్పు

విశాఖలో రుషికొండను నామరూపాలు లేకుండా చేసి ఏమాచర్చడానికి, అడ్డదారిలో అనుమతులు తేవడం కోసమే ఆఘమేఘాలపై జివిఎంసీ కమిషనర్ ను మార్చినట్టు ప్రణాళిక మార్పుతో తేటతెల్లమైంది. నిర్మాణాలు ప్రారంభానికి ముందు ఏపనులకైనా అనుమతి ఇచ్చే జివిఎంసీ 61 ఎకరాల్లో దాదాపు నిర్మాణాలు పూర్తయిన తరువాత రుషికొండ వద్ద చేసేస్తున్న పనులకు అనుమతి ఇవ్వడాన్ని బట్టి ఏస్థాయిలో అడుగులు వే స్తున్నరో తెలుసుకోవచ్చు. తొలిప్లాన్ లో 2.88 ఎకరాలకే అనుమతి ఇచ్చినట్టు కోర్టుకి నివేదించింది ప్రభుత్వం. ఏపీ టూరిజం ఎస్ఈ కె.రమ ణ జివిఎంసికి పంపిన మొదటి ప్లానులో 12.46 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో కేసు వేయడంతో 2.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఏకంగా కొత్త ప్లాన్ లో 61. 03 ఎకరాల్లో నిర్మాణాలకు జివిఎంసీ అనుమతులు ఇచ్చేయడం చర్చనీయాంశం అవుతోంది..!

Visakhapatnam

2023-03-01 04:30:08