1 ENS Live Breaking News

IASల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం

భారతదేశంలో ప్రజలకు సత్వర పరిపాలన..ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే పరిపాలనా వ్యవస్థలో సీనియర్ ఐఏఎస్ ల పాత్ర చాలా కీలకం.  దానిని గుర్తించిన బీజేపీ ప్రభుత్వం ఇపుడు సరికొత్తగా ఆలోచన చేసింది. అదే సమయంలో ఐఏఎస్ ల కొరతను కూడా అధిగ మించడానికి కార్యాచరణ మొదలు పెట్టింది. దానికోసం కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్ లకు పదోన్నతి అడిషనల్ జాయింట్ సెక్రటరీ గా ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా దేశంలోని అన్ని కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనూ సెక్రటరీతోపాటు, అడిషనల్ జాయింట్ సెక్రటరీ పోస్టు కూడా వచ్చి చేరబోతుంది. ఈ విధంగా ఐఏఎస్ లకు పదోన్నతి కల్పించడం ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, కేంద్ర లక్ష్యాన్ని అనుకున్న సమయానికి పూర్తిచేయాలనే సంకల్పం కూడా వుంది. కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ స్థాయి పదవులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను ఎంపిక చేసే విధానంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. 2 సంవత్సరాలు డైరెక్టర్ లేదా డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి మాత్రమే జాయింట్ సెక్రటరీగా ఉండేలా ప్రభుత్వం తన ఎంప్యానెల్‌మెంట్ విధానాన్ని సవరించింది.


దేశంలో ఐఏఎస్ ల కొరత చాలా తీవ్రం..
భారతదేశంలో ప్రస్తుతం మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789 మంది. కానీ ప్రస్తుతం వున్న ఐఏఎస్ అధికారులు 5317 మంది అంటే ఇంకా కావాల్సిన ఐఏఎస్ అధికారులు 1472 మంది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉండగా, 26 చోట్ల ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీసు(ఐఏఎస్)ల కొరత తీవ్రంగా వుంది. అదే సమయంలో కేంద్రంలోనూ ఐఏఎస్ ల కొరత వుంది. ప్రస్తుతం ఏటా కేంద్రప్రభుత్వం 2012 నుంచి 180 మంది ఐఏఎస్ అధికారులను డైరెక్టుగా నియమిస్తోంది. అయినప్పటికీ ఖాళీల కొరత తీవ్రంగా వుంది. 1455 మందిని స్టేట్ సివిల్ సర్వీస్ ద్వారా పదోన్నతులు కల్పించినా..ఖళీలు మాత్రం మిగిలిపోతూనే ఉన్నాయి. తద్వారా దేశ వ్యాప్తంగా పరిపాలన,సేవల్లో జాప్యం ఏర్పడుతుంది. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని పనులు పూర్తికావాలన్నా, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఖాళీగా ఉండిపోయిన 1472 ఐఏఎస్ పోస్టులు భర్తీకావాల్సి వుంది.

పదోన్నతినితో పరిపాలన సులువు..
సీనియర్ ఐఏఎస్ లకు అడిషనల్ జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతి కల్పించడం ద్వారా పరిపాలన గాడిలోపడుతుంది. సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు కావడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఎంతమందిని అడిషనల్ జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పిస్తే..అంతే మొత్తంలో నూతన ఐఏఎస్ ల నియామకం, స్టేట్ సివిల్ సర్వీస్ నుంచి పదోన్నతులు కల్పించి ఖాళీలను భర్తీ చేయడానికి ఆస్కారం వుంటుంది. ఇంతకుముందు, అధికారులు తమ రాష్ట్ర కేడర్ నుండి నేరుగా వచ్చి కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీలుగా పనిచేసే వారు. కానీ కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఎంప్యానెల్‌మెంట్ కోసం సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్ స్థాయిలో 2 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉండకూడదని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 2007 బ్యాచ్ ఐఏఎస్ లకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వర్తించనుంది.  కానీ ఐఏఎస్ అధికారుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వస్తోంది.

ఖాళీగా ఐఏఎస్ ల భర్తీకి ప్రత్యేక చర్యలు
దేశంలో ఖాళీగా వున్న ఐఏఎస్ అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి  యూపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల సివిల్ సర్వీస్ ద్వారా పదోన్నతులు కల్పించి ఉన్నఖాళీలను నింపాలని కేంద్రం నిర్ణయించింది. దానికోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని స్టేట్ సివిల్స్ ద్వారా కొంత మందిని భర్తీచేసింది. మిగిలిన వాటిని డైరెక్టగా తీసుకోవాలని భావిస్తుంది ఇప్పటి వరకూ ఏడాదికి 180 ఐఏఎస్ అధికారును నింపుతున్న కేంద్రం ఇపుడు ఆ సంఖ్య 200 నుంచి 225కి పెంచాలని కూడా యోచిస్తున్నది. అదే జరిగితే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి కూడా మంచి రోజులు వస్తాయనే చెప్పవచ్చు. ఏది ఏమైనా కేంద్రం అడిషల్ జాయింట్ సెక్రటరీ పదోన్నతి కల్పించడానికి మొదలు పెట్టిన కార్యాచరణ ద్వారా అనేక లాభాలు వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ

2022-08-05 07:21:57

గవర్నర్ ను కలిసిన నాకటక అకాడమీ మెంబర్

కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలు  సోమవారం విజయవాడ రాజ్ భవన్ లో  ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు. ఎస్పీ భారతి వాసవి కన్యకాపరమేశ్వరి చరితను దేశ నలుమూలల ప్రదర్శిస్తున్న నాట్య గురువు డాక్టర్ ఎస్పీ భారతి తాజాగా కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ  సందర్భంగా సోమవారం ఆంధ్ర ప్రదేశ్  గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు.  ఈ సందర్భంగా ఆమె రాసిన పలు పుస్తకాలను గవర్నర్ బిస్వ భూషణ్ కు బహుకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సమీపంలోని ఆచంట, తల్లిదండ్రులు శనగవరపు వెంకట సూర్యనారాయణ, వెంకటసుబ్బలక్ష్మి, తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి సుమారు12 ఏళ్ల పాటు చింతారామమూర్తి వద్ద కూచిపూడి నృత్యాన్ని  అభ్యసించారు.  90 నిమిషాల నిడివి కలిగిన వాసవి నృత్య రూపకాన్ని పలు వేదికలపై ప్రదర్శిస్తూ కూచిపూడిలో ఎంఏతో పాటు ఎంపిల్, పీహెచీ పట్టా పొందారు.  కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. సుమారు 20 అంతర్జాతీయ సెమినార్లకు హాజరవడంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత, నృత్య కళాశాలకు చీఫ్ ఎగ్జామినర్ గానూ  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల ప్రదర్శనలిచ్చారు. వందల సంఖ్యలో అవార్డులు, సత్కారాలు పొందారు. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా ఉగాది పురస్కారంతో పాటు  2014లో తెలుగు అకాడమీ ద్వారా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. "లేపాక్షి పెయింటింగ్స్ యాస్ ఏ సోర్సు ఆఫ్టూరిజం ఎట్రాక్షన్ ఇన్ ఏపీ" అనే ఆంగ్ల పుస్తకాన్ని, 'జ్యోతిర్మయం-ప్రణయ కావ్యం" అనే తెలుగు పుస్తకాన్ని రచించారు. కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలిగా నియమితులు కావడంతో పలు సాంస్కృతిక సంస్థల  ఆధ్వర్యంలో ఇటీవల  సత్కారాలు  అందుకున్నారు.

Vijayawada

2022-08-01 14:49:56

ఆ సమయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు

తిరుమల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఈఓ ఏవీ.ధర్మారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో కేవలం స‌ర్వ‌దర్శనం మాత్రమే ఉంటుందని, రూ.300/- దర్శన టికెట్ల‌తోపాటు శ్రీవాణి ట్ర‌స్టు దాత‌ల‌కు, ఇత‌ర ట్ర‌స్టుల దాతలకు ద‌ర్శ‌న‌ టికెట్లు రద్దు చేశామ‌ని, ఆర్జిత సేవలు కూడా రద్దు చేశామ‌ని వివ‌రించారు. స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంద‌న్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటామ‌న్నారు. భ‌ద్ర‌త ప‌రంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల స‌మ‌న్వ‌యంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్ర‌ణ ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని ఈవో వెల్ల‌డించారు. రెండు రోజుల క్రితం టిటిడి సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, తిరుప‌తి ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి సంయుక్తంగా మాడ వీధుల్లో త‌నిఖీలు నిర్వ‌హించి చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై చ‌ర్చించార‌ని చెప్పారు. భ‌ద్ర‌త అవ‌స‌రాల కోసం పోలీసు అధికారులు అడిగిన మేర‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌న్నారు. 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామ‌ని, అన్ని ముఖ్య‌మైన ప్రాంతాల్లో సిసి కెమెరాల నిఘా ఉంటుంద‌ని చెప్పారు.

Tirumala

2022-07-28 10:43:20

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,557 మంది వైరస్ బారిన పడగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవు తున్నాయి. అటు అమెరికా, జపాన్​లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.  జపాన్​లో కొత్తగా 1.80 లక్షల మందికి కరోనా సోకగా.. అమెరికాలో 1.14 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 20,557 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కొవిడ్​ నుంచి 19,216 మంది కోలుకున్నారు. దీనితో  రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది. ఇక  ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి.  కొత్తగా 8,79,504 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,939 మంది ప్రాణాలు కోల్పోయారు.  మొత్తం కేసుల సంఖ్య 57,81,82,232కు చేరింది.  ఇప్పటివరకు వైరస్​తో 64,10,337 మంది మరణించారు.  ఒక్కరోజే 9,82,341 మంది కోలుకున్నారు.  దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,82,79,714కు చేరింది.

New Delhi

2022-07-28 10:31:04

భారతదేశంలో తీవ్రంగా ఐఏఎస్ ల కొరత

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇపుడు మసగబారుతోంది. కేంద్రప్రభుత్వం ఏమీ పట్టనట్టు ఉండటంతో దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. యూపీఎస్సీ ద్వారా సమయానికి దేశవ్యాప్తంగా సరిపడా ఐఏఎస్ అధికారుల నియామకం చేపట్టకపోవడంతో రాష్ట్రాల్లోనూ.. కేంద్రంలోనూ విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ.. పరిపాలనలోనూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దేశం మొత్తం 28 రాష్ట్రాలు ఉండగా అందులో 26 చోట్ల ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌(ఐఏఎస్‌)ల కొరత నెలకొని ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మంజూరైన ఐఏఎస్‌ పోస్టులు 6,789 కాగా ఉన్నది 5,317 మంఅంటే ఇంకా 1,472 మంది ఐఏఎస్‌లు కావాలి. ప్రజా సేవకులకు (సివిల్‌ సర్వెంట్లకు) శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా మన దేశం ఒక యూనిక్‌ మోడల్‌ని ఇటీవలే ప్రారంభించింది.

‘‘నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌”(ఎన్‌ఎస్‌సీఎస్‌టీ) పేరిట సరికొత్త నమూనాను ప్రవేశపెట్టి ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఇండియాలో ఐఏఎస్‌ల కొరత నెలకొనటం ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతుంది.. 6,789 మందిలో 4,712 మందిని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ద్వారా ప్రత్యక్షంగా నియమించుకోవాల్సి వుంది. అలా నియామకాలుపూర్తిచేసిన తరువాతర.. మిగిలినవాళ్లను స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ నుంచి ప్రమోషన్లు ఇచ్చి తీసుకోవాలి. దేశంలో ఐఏఎస్‌ ఆఫీసర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతోంది. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలూ మందగిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి ఐఏఎస్‌ ఆఫీసర్‌ కనీసం రెండు, మూడు శాఖల బాధ్యతలను అదనంగా చూడాల్సి వస్తోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో సమగ్ర సమీక్షలు జరపకుండానే ఫైల్స్‌ని క్లియర్‌ చేయాల్సి వస్తోందని చీఫ్‌ సెక్రెటరీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు.

మన దేశంలో బాస్వాన్‌ కమిటీ సిఫార్స్‌ల మేరకు 2012 నుంచి ఏటా 180 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లను డైరెక్టుగా నియమించుకుంటున్నామని కేంద్రం చెబుతున్నా.. అయినా ఖాళీలు ఉండటం గమనార్హం. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ ద్వారా 2016 నుంచి 2020 వరకు 898 మంది ఐఏఎస్‌లను నియమించుకున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం ఈ నెల 21న రాజ్యసభకు రాతపూర్వకంగా తెలియజేసింది. కానీ..మిగిలిన ఖాళీలను ఎప్పుడు ఏ విధంగా భర్తీ చేస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రాల్లోనూ సీనియర్ ఐఏఎస్ అధికారులు రెండు మూడుశాఖలను చూస్తుంటే..ఇదే విధానం కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోనూ కొనసాగుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 5317 మంది సివిల్‌ సర్వెంట్స్‌లో 3862 మందిని యూపీఎస్సీ ద్వారానే రిక్రూట్‌ చేసింది కేంద్రం. మిగిలిన 1455 మందిని స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ నుంచి పదోన్నతుల ద్వారా నియమించింది. విశేషం ఏంటంటే దేశం మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఐఏఎస్‌ల కొరత లేకపోవటం విశేషం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో టాప్‌లో ఉంటున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. అయితే రాష్ట్రాల పరిస్థితిని, కేంద్ర ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నా.. ఆయా మంత్రిత్వ శాఖల్లోని పనులు సత్వరమే పూర్తికావాలన్నా మిగిలివున్న 1472 మంది ఐఏఎస్ అధికారులను సత్వరమే భర్తీచేయాల్సిన అవసరం వుంది. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా యూపిఎస్సీ ద్వారా ఐఏఎస్ లను భర్తీచేస్తున్నా ఈ సారి కాస్త రెట్టింపు సంఖ్యలో పూరించాల్సి వుంది. లేదంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పరిపాలన గాడితప్పే ప్రమాదముంది.

New Delhi

2022-07-27 17:09:21

రిటైర్ అయిన రాష్ట్రపతికి ఇవే కేటాయిస్తారు

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ సందర్భంగా ఈ నెల 24న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ ఖాళీ చేయాల్సి ఉన్నా రెండ్రోజుల ముందే ఆయన తన ఇంటి సామాను 12 జన్‌పథ్ బంగ్లాకు తరలించాలని నిర్ణయించారు. ఇదే బంగ్లాలో రెండు దశాబ్దాలకు పైగా రామ్ విలాస్ పాశ్వాన్ ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఈ బంగ్లా ఖాళీగా ఉంది. ఇటీవలే రామ్‌నాధ్ కోవింద్ కుమార్తె స్వాతి కోవింద్ బంగ్లాలో తమకు అనుకూలంగా మార్పులు, చేర్పులు చేయించుకున్నారు. ఈ బంగ్లా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి పక్కనే ఉంటుంది. రిటైర్‌‌మెంట్ తర్వాత కోవింద్‌కు నెలకు లక్షన్నర పెన్షన్ ఇస్తారు. సిబ్బంది కోసం నెలకు 60 వేల రూపాయలు అదనంగా చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. నివాసం ఉండే బంగ్లాకు అద్దె చెల్లించే పని ఉండదు. కరెంట్, మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్, ఇంటర్‌నెట్, నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కారుతోపాటు డ్రైవర్‌ను కూడా పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి కేంద్రం కేటాయిస్తుంది. ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగాచే చేయించుకోవచ్చు. ఇక విమాన, రైలు ప్రయాణాలు ఉచితమే. రాష్ట్రపతితో పాటు మరొకరికి ప్రయాణం ఉచితం. ఐదుగురు సిబ్బందిని కేటాయిస్తారు. అన్ని వసతులున్న వాహనం కూడా అందుబాటులో ఉంచుతారు. ఇద్దరు సెక్రటరీలు అందుబాటులో ఉంటారు. ఢిల్లీ పోలీసులు ఆయనకు రక్షణ కల్పిస్తారు.

New Delhi

2022-07-19 15:49:52

వాహన మిత్ర ద్వారా రూ.261.51 కోట్లు జమ

భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వున్న డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా పథకాన్ని వారి అకౌంట్లకు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్.జగన్ మాట్లాడుతూ, వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం చెప్పారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.

Visakhapatnam

2022-07-15 07:02:43

టీ ఇస్తే.. షోకాజు నోటీసు జారీ చేశారు..

ఎక్కడైనా టీ ఇస్తే తిరిగి తేంక్స్ చెబుతారు.. కానీ ఒక ఉద్యోగి టీ ఇచ్చినందుకు అధికారులు ఆయనకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలోని ఖజురహో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ పర్యటన జరుగుతోంది. ఆ పర్యటనలో చల్లని టీ ఇచ్చిన ఓ ఉద్యోగి ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాడు. పర్యటనలో సీఎంకు ఓ జూనియర్ సివిల్ సప్లైస్ అధికారి రాకేష్ కనౌహా 'టీ' అందించాడు. అది బాగోలేదని మంగళవారం అతడికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు అందజేశారు. సోమవారం ఛతర్‌పూర్ ఎయిర్‌పోర్టులో సీఎం ఆగిన సమయంలో ఇది జరిగింది. అయితే నోటీసులివ్వడంపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యమంత్రికి చల్లగా అయిపోయిన, రుచిలేని టీ ఇవ్వడం, ఆపై ఉద్యోగికి షోకాజ్ నోటీసులిచ్చిన ఘటన ఇపుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

Madhya pradesh

2022-07-12 09:59:41

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers, real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-07-06 07:32:58

Visakhapatnam

2022-07-01 13:29:49

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు

ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలో ఒకటైన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై క్లారిటీ తెలుగురాష్ట్రాలకు ఇచ్చింది. పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు వీలుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు పంపాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు న్యాయశాఖ సూచించింది. బిల్లు పాసైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయి. అదేవిధంగా తెలంగాణాలోని 119 అసెంబ్లీ స్థానాలు 153కి పెరుగుతాయి. వీటి పెరుగుదల ఆధారంగా పార్లమెంటు స్థానాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికే ఈ స్థానాలు పెంచి విభజన చట్టం హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో అసెంబ్లీకి వెళ్లాలనుకునే ఆశావాహ ఎమ్మెల్యే అభ్యర్ధులకు లైన్ క్లియర్ అవుతుంది. అటు రాజకీయపార్టీలకు కూడా బలం పెంచుకునేందుకు అవకాశం దొరుకుతుంది.

New Delhi

2022-06-28 13:53:24

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-06-01 02:21:52

డాక్టర్ కంపెనీ పేర్లతో మందులు రాయకూడదు

భారత దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఎంబీబీస్,  పీజీ వైద్యులు తాము హెల్త్ ప్రాక్టీస్ చేసే సమయంలోగానీ, ఆసుపత్రి విధి నిర్వహణలోగానీ  రోగులకు మందుల కంపెనీల పేరుతో రాయకుడదని కేవలం మందులో ఉండే డ్రగ్ కాంబినేషన్, ఎంత డోస్ తీసుకోవాలో మాత్రమే మందుల చీటిలో రాయాలని, అదీ కూడా జనరిక్ మందులనే రాయాలని నేషనల్ మెడికల్ కమిషన్ కు చెందిన ఎథిక్స్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు అధ్యక్షులు డా.అచల్ గులాటీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రోగి మందుల చీటిలో సంబంధిత రోగానికి చెందిన డ్రగ్ ను కూడా పెద్ద అక్షరాలతో అర్దమయ్యే విధంగా రాయాలని పేర్కొంది. పైగా రోగి యొక్క వ్యాధిని కుటుంబంలోని వారికి ఉన్నది ఉన్నట్టు తెలియజేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్యులు ఫార్మా కంపెనీలు ఎలాంటి బహుమతులు కూడా తీసుకోకూడదని కూడా హెచ్చరించింది. గతంలో ఒకసారి ఈ తరహా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఏ ఒక్క ఎంబీబీఎస్ వైద్యుడిలోనూ మార్పురాలేదు. ఈ విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో కేంద్రం మరోసారి ఈ విషయంలో గట్టిగా స్పందించింది మళ్లీ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు తమ ప్రాక్టీసు సమయంలో ఏ విధంగా ప్రాక్టీసు చేయాలి, టెలీమెడిసిన్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశాలపై సుదీర్ఘంగా సుమా 70 పేజీల్లో సూచనలు చేసింది. అలా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో  హెచ్చరించింది.

New Delhi

2022-05-25 07:03:10