1 ENS Live Breaking News

మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌ దర్శనం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలు మంగ‌ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జ‌రిగింది. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్నిగుర్తుంచుకోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ  వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు  శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు  శేషగిరి,  మధుసుదన్, ఏవిఎస్వో  వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tiruchanur

2021-12-04 08:09:14

తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకి రూ.కోటి విరాళం..

తిరుమలలోని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకి భల్లారికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్.సూర్యనారాయణ రెడ్డి ఒక కోటి రూపాయాలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని దేవస్థానం అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టు నుంచి నిత్యం కొన్ని వేల మందికి అన్నప్రసాదం అందుతోందని, అలాంటి ట్రస్టుకి విరాళం ఇవ్వడం శ్రీవారి సేవగా భావిస్తున్నట్టు చెప్పారు. స్వామివారి అన్నప్రసాదం మరింత మందికి అందాలనే లక్ష్యంతో తమవంతుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-12-04 03:34:19

ఎంపీ విజయ సాయిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ వంశీ..

రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి  వి. విజయసాయిరెడ్డిని ఎమ్మెల్సీ, వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీవీఎంసీ పరిధిలోని పలు అంశాలపై రాజ్యసభ సభ్యులతో చర్చించారు. అంతేకాకుండా మొదటి నుంచి పార్టీ కి అహర్నిశలు కృషి చేస్తున్న పలువురికి నామినేటడ్ పదవులలో అవకాశాలు కల్పించాలని వంశీ విజయసాయిరెడ్డిని కోరారు.  పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వంశీ  ప్రస్తావించారు. ఎమ్మెల్సీ గా తనకు అవకాశం కల్పించిందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో విశాఖలో పర్యటన లో ప్రజాదర్బార్, జీవీఎంసీ పరిధిలోని పలు కీలక  అంశాలపై త్వరలో  తెలియజేస్తామని ఆయనకు తెలియజేశారు.

New Delhi

2021-12-02 15:30:13

ఉప రాష్ట్రపతికి విశాఖలో ఘన స్వాగతం..

విశాఖజిల్లాలో4 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సాయంత్రం విశాఖ విచ్చేసిన భారత ఉప రాష్ట్ర పతి ఎమ్. వెంకయ్య నాయుడు కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.  రాష్ట్ర   పర్యాటక శాఖ  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివానరావు,  జెడ్ పి ఛైర్‌పర్సన్  జిల్లి పల్లి సుబద్ర,  రియర్ అడ్మిరల్ సంజయ్ సాదు,  జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున, విశాఖ సిటీ పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా,   జిల్లా ఎస్.పి బి.కృష్ణారావు తదితరులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. కాగా ఆయన అక్కడి నుంచి నేరుగా పోర్టు అతిథి గ్రుహానికి పయనమయ్యారు.

Visakhapatnam

2021-11-21 12:33:23

న‌వంబ‌రు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం..

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 23వ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా జరగనుంది. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల ముందు వ‌చ్చే మంగ‌ళ‌వారం ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Tiruchanur

2021-11-17 11:06:35

న‌వంబ‌రు 18న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం..

తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 18వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జ‌రుగ‌నుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయం, ఉప ఆల‌యాల్లో దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2021-11-17 11:04:16

ఆన్ లైన్ లో లక్షకుంకుమార్చన టిక్కెట్లు..

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 29వ తేదీన వ‌ర్చువ‌ల్‌ విధానంలో జ‌రుగ‌నున్న ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే.  ఈ సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1,116/-గా టిటిడి నిర్ణ‌యించింది. ఈ టికెట్ బుక్ చేసుకున్న గృహ‌స్తులు 90 రోజుల్లోపు రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ‌ద‌ర్శ‌న క్యూలైన్‌లో ఉచితంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శన‌ స‌మ‌యంలో గృహ‌స్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు అందిస్తారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

Tiruchanur

2021-11-17 11:01:56

2021-11-16 05:05:15

అన్నదానం ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం..

తిరుమలోని టిటిడి అన్న ప్రసాదం ట్రస్ట్ కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన   సోమశేఖర్ గౌడ్, శ్రీ గణేష్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ తరపున  రూ 10 లక్షల వెయ్యి 16 విరాళంగా అందించారు. ఈ మేరకు సోమవారం ఆయన తిరుమల లో టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి కి చెక్కు ను అందించారు. ఈ సందర్బంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇవ్వడం స్వామివారి సేవగానే భావిస్తున్నామన్నారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-11-15 16:02:24

16న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం..


కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రుగ‌నుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంట‌ల లోపు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుండి 7 గంట‌ల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్ర‌కారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వా దశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణు వును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొల్ప‌డం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.

           కైశికద్వాదశి పౌరాణిక నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీనంబదువాన్‌ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగివచ్చి క్షుద్బాధ‌ను తీరుస్తానని నంబదువాన్‌ ప్రమాణం చేశాడు. అన్నమాట‌ ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారట‌. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే పేరు వ‌చ్చింది.

Tirumala

2021-11-12 08:21:26

శ్రీవారి పుష్పయాగంతో పులకించిన తిరుమల..

పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.

పుష్పాధిదేవుడు ''పుల్లుడు'' ఆవాహన :
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు.  శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధరించి నిర్వహిస్తున్నారు. పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి 3 టన్నులు, కర్ణాటక రాష్ట్రం నుంచి 4 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి ఒక‌ టన్ను పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఇటీవ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మైన పుష్పాల‌ కోసం  తిరుమల బాట గంగమ్మ ఆల‌యం స‌మీపంలో అభివృద్ధి చేసిన శ్రీ‌వారి పుష్ప ఉద్యాన‌వ‌నం నుండి 150 కేజీల పుష్పాలు ఈ మహోత్సవంలో వినియోగించారు. 

ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం :
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులును శ్రీవారి ఆలయ అధికారులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, విజివో  బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-11-11 16:38:37

2021-11-07 04:56:37

13, 14, 15తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..

తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఈ మేరకు టిటిడి ప్రకటన విడుదల చేసింది. నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అందులో పేర్కొంది. అదేవిధంగా, నవంబరు 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని తెలియజేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

Tirumala

2021-11-06 12:37:27

సీఎంను నేవీడేకి ఆహ్వానించిన నేవీ వైస్ అడ్మిరల్..

విశాఖలో వచ్చేనెలో4వ తేదీన జరగనున్న నేవీడీ రావాలంటూ తూర్పునావికాదళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ సీఎం.వైఎస్.జగన్మోహనరెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ అడ్మిరల్ మాట్లాడుతూ, సీఎంని నేవి దినోత్సవానికి రావాల్సిందిగా కోరామన్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అంతకు మందు సీఎంకి వైఎస్ అడ్మిరల్ తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. సీఎం వైఎస్ అడ్మిరల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2021-11-05 09:58:56

తిరుమ‌లలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం..

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా  'దీపావళి ఆస్థానాన్ని' టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించిట్లు వివ‌రించారు.   శ్రీవారి ఆశీస్సులతో కరోనాను అంతం చేసి, ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. అంత‌కుముందు ఆల‌యంలో నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. ఈ ఆస్థానంలో  శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీర్ స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, విజివో  బాలిరెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-11-04 09:31:24