1 ENS Live Breaking News

గ‌జ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం..

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు గ‌జ వాహ‌నంపై క‌టాక్షించారు.  రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. వాహన సేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

         కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన బుధ‌వారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌న‌మిస్తారు.

Tirumala

2021-10-12 15:22:57

సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌నివాసుడు..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగ‌ళ‌వారం  సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు. ఈ వాహ‌న‌సేవ‌లో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, విజివో  బాలిరెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌మ‌బాబు, ఒఎస్డీ  పాల శేషాద్రి పాల్గొన్నారు.

Tirumala

2021-10-12 12:18:08

శబరిమలలో రోజుకి 25 వేల మందికి ప్రవేశం..

శబరిమలలో మండల మకరవిలక్కు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిరోజూ 25 వెలమందిని  అనుమతించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం అధ్యక్షతన నేడు  జరిగిన సమీక్ష  సమావేశంలోనిర్ణయించారు.  ఒకవేళ ఈ సంఖ్యను పెంచే విషయం  ఉంటే,  తరువాత చర్చించి నిర్ణయించడం జరుగుతుందని సమావేశం తీర్మానించింది.  ఇంకా కోవిడ్ నిబంధనలు మేరకు  అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. "వర్చువల్ క్యూ" సిస్టమ్ కొనసాగుతుంది. 10 సంవత్సరాల లోపు మరియు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులు కూడా ప్రవేశానికి అనుమతించబడతారు.  అయితే శబరిమల వచ్చే అయ్యప్పలు రెండు మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్ లేదా ఆర్టిపిసిఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ వచ్చిన వారికి ప్రవేశం అనుమతించాలని నిర్ణయించారు. అభిషేకం చేసిన నెయ్యిని అందరికి అందేలా  దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేయాలని సిఎం  పినరయి విజయన్ ఈ సమావేశంలో చెప్పారు. అయ్యప్పలను దర్శనం అనంతరం  సన్నిధానంలో ఉండడానికి అనుమతించరు.  ఈ విషయంలో గత సంవత్సరం పరిస్తితి కొనసాగుతుంది. యాత్రీకులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలోగానీ,  పుల్మేడు మీదుగా సన్నిధానానికి గాని  సాంప్రదాయ మార్గంలో అనుమతించరు. పంబా నదిలో స్నానం చేయడానికి అనుమతి ఇస్తారు.  యాత్రీకులు వచ్చే వారి వారి వాహనాలు నీలక్కల్ లో పార్క్ చేయడానికి మాత్రమే అనుమతిస్తారు. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ బస్ లను  మాత్రం   పంబా వరకు అనుమతిస్తారు. దీనికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు. 

రవాణా సంస్థ  బస్ స్టాప్‌లలో తగిన మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం శానిటేషన్ కార్మికుల జీతాలు కూడా ఈ సమయంలో పెంపు చేస్తారు. అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు లేని భవనాలలో స్మోక్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలి. కోవిడ్‌ మొదలగు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాతే సందర్శనకు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవస్వం (దేవాదాయ) మంత్రి రాధాకృష్ణన్, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్, రవాణాశాఖ మంత్రి ఆంటోనీ రాజు, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ మరియు చీఫ్ విప్ డాక్టర్ ఎన్. జయరాజ్, డిప్యూటీ స్పీకర్ చిట్టాయం గోపకుమార్, ఎమ్మెల్యేలు సెబాస్టియన్ కులతుంగల్ మరియు ప్రమోద్ నారాయణ్, ప్రధాన కార్యదర్శి డా. విపి జాయ్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ అనిల్ కాంత్ మరియు దేవస్వం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఆర్. జ్యోతిలాల్, వివిధ శాఖల కార్యదర్శులు మరియు డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్లు మరియు దేవస్వం బోర్డు చైర్మన్ ఎన్. వాసు, రైల్వే,బీఎస్ ఎన్ ఎల్  అధికారులు, సంబంధిత మున్సిపాలిటీ-విలేజ్-బ్లాక్ పంచాయితీ అధికారులు, అయ్యప్ప సేవా సంఘం మరియు పందలం రాజకొత్తారం మేనేజ్‌మెంట్ టీమ్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Sabarimala

2021-10-12 10:55:51

సహజ వ్యవసాయ సాయపద్దతులపై ఎంఓయూ..

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్ర ముఖ్య మంత్రి   వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి  ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా టిటిడి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను గో సంర‌క్ష‌ణ‌కు టిటిడి ఏ విధంగా కృషి చేస్తోంది, ప‌ల‌మ‌నేరు వ‌ద్ద 400 ఎక‌రాల‌లో గో శాల అభివృద్ధిని గురించి తెలియ‌జేశారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి గో ఆధారిత నైవేధ్యం, గుడికో గోమాత‌, అగ‌ర‌బ‌త్తుల త‌యారీ, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, గో ఆధారిత వ్య‌వ‌సాయం త‌దిత‌ర వాటిపై ముఖ్యమంత్రికి వివ‌రించారు. వివ‌రించారు.  డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో టిటిడిలోని వివిధ ఆలయాల్లో ఉప‌యోగించిన పూల‌తో స్వామి, అమ్మ‌వార్ల ఫోటోలు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్  వెయిట్లు తదితరాలు త‌యారీ విధానాన్నిఈవో వివ‌రించారు. అనంత‌రం ఎస్వీబిసిలో ప్ర‌సారం అవుతున్న ఆధ్యాత్మిక, భ‌క్తి కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబిసి ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి టిటిడిని అభినందించారు.   స‌హ‌జ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌పై ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మ‌న్  విజ‌య్‌కుమార్‌, టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డిలు ఎంఓయు  ప‌త్రాల‌ను మార్చుకున్నారు.

        ఈ కార్య‌క్ర‌మానంత‌రం అన్న‌మ‌య్య భ‌వ‌నం అవ‌ర‌ణంలో నిత్య పుష్ప కైంక‌ర్య సేవ‌లో త‌రించిన పుష్పాల‌తో త‌యారు చేసిన దేవ‌తా క‌ళా కృతుల‌ను ముఖ్య‌మంత్రి ప‌రిశీలించి, ఈ క‌ళాకృతుల‌ను త‌యారుచేసిన మ‌హిళ‌ల‌ను అభినంధించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, టిటిడి చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు  మిథున్ రెడ్డి,  గురుమూర్తి,  మంత్రులు  పి. రామచంద్రారెడ్డి,  వి.శ్రీనివాసరావు, ప్ర‌భుత్వ విప్  శ్రీ‌కాంత్ రెడ్డి, క‌లెక్ట‌ర్  ఎం.హ‌రినారాయ‌ణ‌, ఎమ్మెల్యేలు  కరుణాకర్ రెడ్డి,  కాట‌సాని రాంభూపాల్ రెడ్డి,  మ‌ధుసూధ‌న్ రెడ్డి,  ఆదిమూలం, బోర్డు స‌భ్యులు  ఆశోక్ కుమార్‌, జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డా.జాన‌కిరామ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-12 07:54:48

ఎస్వీబీసీ కి రూ 12లక్షల కెమెరాలు విరాళం..

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ టిఎ శరవణ మంగళవారం  రూ.12 లక్షల విలువ చేసే రెండు వీడియో కెమెరాలను విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి కెమెరాలను అందజేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం కన్నడ ఛానల్ కు ఉపయోగించేందుకు దాత ఈ కెమెరాలను అందజేశారు. టీటీడీ చేస్తున్న ధార్మిక, సంప్రదాయ కార్యక్రమాలను ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారని చైర్మన్  వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ కు కెమెరాల విరాళం స్వీకరించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. టీటీడీ అమలు చేస్తున్న గో ఆధారిత ఉత్పత్తులతో స్వామివారి ప్రసాదాల తయారీని సిఎం మెచ్చుకున్నారని చెప్పారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో అగరబత్తుల తయారీ బాగుందని, వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించేలా ఒక బ్రాన్డింగ్ తయారు చేయాలని చెప్పారన్నారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో చిత్ర పటాలు తయారు చేయడాన్ని అభినందించారని, కొన్ని సూచనలు కూడా చేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  కన్నడ భక్తుల కోసం కన్నడ ఛానల్, ఉత్తరాది భక్తుల కోసం హింది ఛానల్ ప్రసారాలు ఈ రోజు నుంచి ప్రారంభమ య్యాయని చైర్మన్ తెలిపారు. కన్నడ కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెబుతూ ఒక అజ్ఞాత భక్తుడు రూ 10 లక్షల విరాళం అందించడానికి ముందుకొచ్చారని ఆయన తెలిపారు.
            కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఎంపి  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాలక మండలి సభ్యురాలు  వేమిరెడ్డి ప్రశాంతి, అదనపు ఈవో  ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్వీబీసీ సిఈవో  సురేష్ కుమార్ పాల్గొన్నారు.

Tirumala

2021-10-12 07:41:08

బూందీ పోటును ప్రారంభించిన సీఎం జగన్..

తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్‌ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. 2008వ సంవ‌త్స‌రం వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని బూందీ పోటులో రోజుకు 45 వేల ల‌డ్డూలు త‌యారుచేయ‌డానికి అవ‌స‌ర‌మైన బూందీ త‌యారుచేసేవారు. అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు బూందీపోటును ఆల‌యం వెలుప‌ల‌కు త‌ర‌లించారు. 2008లో ఇండియా సిమెంట్స్ ఎండి, టిటిడి బోర్డు స‌భ్యుడు శ్రీ శ్రీ‌నివాస‌న్  రూ.10 కోట్ల విరాళంతో నిర్మించిన బూందీ పోటును అప్ప‌టి ముఖ్య‌మంత్రి  వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రారంభించారు. 40 ఎల్‌పిజి స్టౌలు ఏర్పాటుచేసి ల‌డ్డూల త‌యారీ సామ‌ర్థ్యాన్ని రోజుకు 3.75 లక్షలకు పెంచారు. ఎల్‌పిజి స్టౌల కార‌ణంగా వ‌చ్చే వేడి వ‌ల్ల పోటు సిబ్బంది ఇబ్బందులు ప‌డుతుండ‌డాన్ని గుర్తించిన టిటిడి యాజ‌మాన్యం నూత‌న బూందీ పోటు నిర్మించాల‌ని నిర్ణ‌యించింది. ఇండియా సిమెంట్స్ అధినేత, ప్ర‌స్తుత టిటిడి బోర్డు స‌భ్యుడు  శ్రీ‌నివాస‌న్ మ‌రోసారి రూ.12 కోట్ల విరాళంతో 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన పరికరాలతో నూత‌న బూందీ పోటును నిర్మించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 40 థర్మిక్‌ ఫ్లూయిడ్‌ స్టౌలు, గాలి వెలుతురు బాగా వచ్చే సదుపాయం క‌ల్పించారు. త‌ద్వారా లడ్డూల తయారీ సామర్థ్యం రోజుకు 6 లక్షలకు పెరిగింది. పోటు సిబ్బంది సౌకర్యవంతంగా బూందీ తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది.

        ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి, మంత్రులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  కన్నబాబు, ఎంపిలు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  మార్గాని భరత్,  గురుమూర్తి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎమ్మెల్యేలు  కరుణాకర్ రెడ్డి,  రోజా,  బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, తిప్పేస్వామి, దాత మరియు బోర్డు సభ్యులు  శ్రీ‌నివాస‌న్, ఇతర బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్,  మధుసూదన్ యాదవ్,  ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్  హరినారాయణన్, టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ  వెంకట అప్పలనాయుడు, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-12 07:16:07

హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా..

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగ‌ళ‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వేంక‌టాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.  వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి, విజివో  బాలిరెడ్డి, ఆలయ డెప్యూటి ఈవో  ర‌మేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు. 

        కాగా, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు. 

Tirumala

2021-10-12 07:00:07

ఎస్వీబిసి కన్నడ, హిందీ ఛానళ్లు ప్రారంభం..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం బ‌య‌ట ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎస్వీబిసి కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి సమక్షంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంతోపాటు హిందూ ధర్మ ప్రచారం కోసం అప్పటి ముఖ్యమంత్రి  డా. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గారి ఆదేశంతో టిటిడి ప్రతిష్టాత్మకంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. 2008, జులై 7వ తేదీన అప్పటి టిటిడి ఛైర్మ‌న్  భూమన కరుణాకర రెడ్డి గారి అధ్య‌క్ష‌త‌న‌, భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ గారి చేతులమీదుగా ఎస్వీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్య, పక్ష, మాస సేవలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఎన్నో కార్యక్రమాలను గత 13 సంవత్సరాలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తోంది. శ్రీవారి సేవలతోపాటు సనాతన హిందూ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని తెలియజేస్తూ ఎన్నో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ భక్తుల మన్ననలు పొందుతోంది.

          శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చే తమిళ భక్తుల కోరిక మేరకు 2017వ సంవత్సరంలో తమిళ ఉగాది రోజున ఎస్వీబీసీ తమిళ ఛానల్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా ఛానళ్లను ప్రారంభించి శ్రీవారి భక్తులు ఆ భాషల్లో కూడా స్వామివారి సేవలను వీక్షించే అవకాశం కల్పించడమైనది. దేశవిదేశాల్లో ఉన్న హిందీ మరియు కన్నడ భక్తులు శ్రీవారి సేవల ప్రసారాలు వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొంద‌గ‌ల‌రు.  ఎంపీలు  మిథున్ రెడ్డి,  ప్రభాకర్ రెడ్డి,  గురుమూర్తి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు పి. రామచంద్రారెడ్డి, వి.శ్రీనివాసరావు, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో మ‌రియు ఎస్వీబిసి ఎండి  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎమ్మెల్యే  కరుణాకర్ రెడ్డి, ఎస్వీబిసి ఛైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, సిఈవో  సురేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-12 06:57:23

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు..

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో  సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న స్వామివారిని, శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేశారు. అక్కడి నుండి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి,  సనత్ కుమార్, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
  కాగా రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షించనున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Tirumala

2021-10-11 06:10:16

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడిగా..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామివారు కాళీయమర్ధనుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.  వాహనసేవల‌లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి  కోన రఘుపతి, ఎపి హైకోర్టు న్యాయమూర్తి  శేషసాయి, టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి, పోకల అశోక్ కుమార్, ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవ‌తారం, రాత్రి 7 గంటలకు గ‌రుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Tirumala

2021-10-10 17:48:36

వేడుక‌గా శ్రీ‌వారికి స్న‌ప‌న తిరుమంజనం..

తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం ఆల‌యంలో పచ్చకర్పూరం, లవంగాలు, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తామర మరియు తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాల‌ల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌లు, కిరీటాల‌తో స్న‌ప‌న తిరుమంజ‌నం వైభవంగా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ వాసుదేవ భ‌ట్టాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న తిరుమంజ‌నంలో వివిధ‌ ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌ను అనుగ్రహించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చ‌క‌స్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.   తిరుపూర్ కు చెందిన దాత  రాజేందర్ స‌హ‌కారంతో స్వామి, అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక మాల‌లు, కిరీటాలు ఏర్పాటు చేశామని టిటిడి ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్  శ్రీ‌నివాసులు తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి దంపతులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. శోభాయమానంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

Tirumala

2021-10-10 11:28:32

క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజ‌మ‌న్నార్ గా..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజ‌మ‌న్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి క‌ల్ప‌వృక్ష‌‌ వాహనంపై దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.  వాహనసేవల‌లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి,  సనత్ కుమార్, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

  రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

తిరుమల

2021-10-10 09:04:07

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి..

తిరుమల శ్రీవారిని శనివారం రాత్రి సుప్రీం కోర్టు జడ్జి పిఎస్ నరసింహ దర్శించుకున్నారు. ఈ సందర్భంతా తిరుమలకు చేరుకున్న ఆయనకు అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. అనంతరం ఆయన అదనపు ఈఓ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2021-10-09 16:47:04

బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో శ్రీ‌ మలయప్ప..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బ‌కాసుర‌వ‌ధ‌  అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. వాహనసేవల‌లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న‌ర‌సింహ‌న్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  సనత్ కుమార్, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

        కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Tirumala

2021-10-09 15:50:45

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుగా..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుని అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.  ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి, సనత్ కుమార్, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.   రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

Tirumala

2021-10-09 08:36:03