1 ENS Live Breaking News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫర్ సేల్ అతి త్వరలో..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణం ఒక్కటే స్టీల్ ప్లాంట్ లోని 50శాతం షేర్లన్నీ కేంద్రం ఎప్పుడో అమ్మేసిందనే ప్రచారం జరగడమే. అంటే ఇపుడున్న 50శాతం షేర్లలో ఏ ఒక్క షేర్ అత్యధిక భాగం షేర్లు కొన్నవారు కొనుగోలు చేస్తే జాతికి అంకింతం చేసిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాస్తా...ప్రైవేటు పరం అయిపోతుంది. స్టీలు ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకుండా ఇప్పటి వరకూ తాత్సారం చేసిన కేంద్రం, ఇపుడు స్టీలు ప్లాంట్ తోపాటు అప్పట్లో ప్రజల నుంచి అప్పనంగా తీసుకున్న సుమారు 20వేల ఎకరాల భూమిని కూడా తీసుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఆ ఖాళీభూములపైనే కార్పోరేట్ కంపెనీల కన్నుపడింది. ప్రభుత్వానికి చెందిన ఆ భూములు కొనుగోలు చేయాలంటే కుదరదని తెలుసుకున్న కార్పోరేట్ కంపెనీలు తెలివిగా కేంద్రంలోని పెద్దలను ప్రశన్నం చేసుకొని స్టీల్ షేర్లు ఒక్కొక్కటిగా కొనుగోలు చేస్తూ సుమారు 50శాతం షేర్ల వరకూ కొనుగోలు చేసేశారని చెబుతున్నారు. అలా 50శాతం షేర్లు దాటిన సంస్థ ప్రైవేటు వ్యక్తులకు ఖాయిలా పడుతుందని ప్రజలు గుర్తిస్తారని కేంద్రం, స్టీలు ప్లాంట్ పై కన్నేసిన కార్పోరేట్ గెద్దలు భావిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఒక్ యాజమాన్య హక్కులు మాత్రమే కలిగివుందనే విషయం చాలా మందికి తెలియని విషయంగా వుంది. ఇపుడు నేరుగా కేంద్రం స్టీలు ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయడం ద్వారా దానికున్న భూములను కూడా దారాదత్తం చేసేస్తే.. అక్కడ కొత్తగా ఖర్మాగారాలు పెట్టుకోని జాతీయ నవరత్న హోదా కలిగిలిన జాతి సందను మొత్తం కార్పోరేట్ గెద్దలు తన్నుకు పోవడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ విషయంలో స్టీల్ కార్మిక సంఘాలు ఆది నుంచి నెత్తీ నోరు కొట్టుకుంటున్నా ఏ ఒక్కరు పెద్దగా పట్టించుకోలేదు. నష్టాల పేరుతో వీఆర్ఎస్ లు తీసుకోమని ఒత్తిడి తెచ్చినా గుర్తించలేదు. ఆదిలోనే షేర్ల అమ్మకాలు, ప్లాంటులో ప్రైవేటు కంపెనీల ఏర్పాటును నియంత్రించగలిగితే ఇపుడు స్టీలు ప్లాంట్ అమ్మకానికి వెళ్లేది కాదనేది వారి వాదన. అలా కాకుండా జరిగిన నష్టం అంతా జరిగిపోయిన తరువాత ప్రజా ఉద్యమం అంటూ గొంతెత్తినా దానిని కేంద్రం పెద్దగా పరిగణలోకి తీసుకోవడానికి వీలులేకుండా పోయింది. నాటి ఉద్యమ స్పూర్తితోనే నేడు ఉద్యమం చేయాలని భావిస్తున్నా.. కొన్ని కార్పోరేట్ దుష్టశక్తులు స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. అదంతా కేవలం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయించే కార్యక్రమంలో భాగంగానే జరుగుతోందని ప్రచారం జరగుతుంది. అలా కాకపోతే నాడు విశాఖ స్టీలు ప్లాంట్ కోసం నివరధికంగా జరిగిన ఆందోళనలు, ఉద్యమాలు ఇపుడు కంటి తుడుపు చర్యగానే ఎందుకు జరుగుతున్నాయనే వాదన కూడా తెరపైకి వస్తుంది. అదే సమయంలో అధికారంలోవున్న కేంద్రప్రభుత్వ పార్టీ బీజేపీ నేతలు మరో కొత్త వాదన తెరమీదకు తీసుకు వస్తున్నారు. ఆర్ కార్డు దారులకు తమ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ స్టీల్ ప్లాంట్ నే కార్పోరేట్ కంపెనీలకు దారాదత్తం చేయాలని భావిస్తున్న కేంద్రం...ఆర్ కార్డు నిర్వాసితులకు ఎలా న్యాయం చేస్తుందో చెప్పాలనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది. విశాఖ వేదికగా ఎన్ని ఉద్యమాలు జరిగినా అవి కేంద్రం వరకూ వెళ్లడం లేదు. అలాగని రాష్ట్రప్రభుత్వం ఎంపీలు ఎన్ని లేఖలు రాసినా అవి దేశరాజధానిలో బుట్టదాఖలవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలన్నీ కంటితుడుపు చర్యేనని భావించాల్సి వస్తుంద స్టీలు ప్లాంట్ కోసం ఆలోచించేవారు విశ్లేషకులు భావించాల్సి వస్తుంది.. ఎవరు ఎన్ని అనుకున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సేల్ అయిపోతుందనే విషయం కాస్త బాధగానే ఉన్నప్పటికీ.. నాడు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన ఆర్ కార్డుదారుల నోట్లో మట్టి పడేలానే కనిపిస్తుంది. అన్నేళ్లుగా ఆర్ కార్డు దారుల సమస్యలు అధికారంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వం గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ పరిష్కరించలేదు. అలాగని అధికారంలో ఉన్నంతసేపూ పరిష్కరిస్తామంటూ ఐదేళ్ల కాలంలో హడావిడి చేయడం తప్పితే వారికి ఏ ప్రభుత్వం ద్వారా కూడా వారికి న్యాయం జరగలేదు. అంటే ఆ కర్మాగారం ప్రైవేటీకరణకు అప్పట్లోనే అంకురార్పణ జరిగిందనే అనుమానాలకు తాజా ఆర్ కార్డు దారులకు జరిగిన అన్యాయమనే సాక్షిగా నిలుస్తుంది. వారికి  నేటి వరకూ న్యాయం కుడా జరగలేదు సరికదా ఇప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలే వారికి న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. అన్నీ వెరసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో మిగిలివున్న 50శాతం షేర్ల అమ్మకం మొదలైనా, కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోకపోయినా స్టీల్ ప్లాంట్ తోపాటు, ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా నేటికీ కార్పోరేట్ సంస్థలదే పైచేయిగా నిలుస్తుందనడానికి మరోసారి  విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటుపరం అనే అంశం ఒక తాజా చిరస్థాయి ఉదాహరణగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేమూ లేదు..!

Visakhapatnam

2021-02-24 14:26:22

శ్రీ‌వారికి కానుక‌గా స్వ‌ర్ణ శంఖుచ‌క్రాలు..

త‌మిళ‌నాడుకు చెందిన తంగ‌దొరై అనే భ‌క్తుడు బుధ‌వారం తిరుమ‌ల శ్రీ‌వారికి స్వ‌ర్ణ శంఖు, చ‌క్రం కానుక‌గా అందించారు. ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వీటిని డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌కు అంద‌జేశారు. అనంత‌రం ఆల‌యం వెలుప‌ల తంగ‌దొరై మీడియాతో మాట్లాడుతూ తాను 50 ఏళ్లుగా తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకుంటున్నాన‌ని చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నం నిలిపివేశార‌ని, ఆ స‌మ‌యంలో తాను అనారోగ్యానికి గుర‌య్యాన‌ని అన్నారు. ఆరోగ్యం కుదుట‌ప‌డితే బంగారు శంఖుచ‌క్రాలు స‌మ‌ర్పిస్తాన‌ని స్వామివారికి మొక్కుకున్నానన్నారు. ద‌ర్శ‌నం ప్రారంభించిన త‌రువాత ప్ర‌తి వారం స్వామివారిని ద‌ర్శించుకుంటున్నాన‌ని చెప్పారు. 3.50 కిలోల బ‌రువు గ‌ల ఈ బంగారు శంఖుచ‌క్రాల విలువ దాదాపు 2 కోట్లు అని  తంగదొరై తెలిపారు.

Tirumala

2021-02-24 12:52:38

2021-02-23 17:35:53

క‌ల్యాణ‌మ‌స్తులో సేవ‌లందించాలి..

తిరుమల తిరుపతి దేవస్థానం త్వ‌ర‌లో నిర్వ‌హించనున్న క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాలు లాంటి ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఆయా ప్రాంతాల్లోని శ్రీ‌వారి సేవ‌కులు త‌మవంతు స‌హ‌కారం అందించి సేవ‌లందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న శ్రీ‌వారి సేవ‌కుల‌తో మాట్లాడారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం నాడు విశేషంగా సేవ‌లందించార‌ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టిటిడి మ‌హాయ‌జ్ఞంలా త‌ల‌పెట్టిన అనేక హైంద‌వ ధార్మిక కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌న్న సంక‌ల్పంతో ఉంద‌న్నారు. ఇటీవ‌ల క‌ర్నూలులో ధ‌నుర్మాస ల‌క్ష్మీ దీపారాధ‌న‌, వైజాగ్‌లో కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం, నెల్లూరులో వ‌సంత పంచ‌మి స‌ర‌స్వ‌తి పూజ, తిరుమ‌ల‌లో జ‌రిగిన ర‌థ‌స‌ప్త‌మి కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కులు విశేషంగా సేవలందించార‌ని కొనియాడారు. స్వామివారికి భ‌క్తులంటే ఎన‌లేని ప్రేమ అని, పురాణాల్లోని ప్ర‌హ్లాద‌చ‌రిత్ర‌, గ‌జేంద్ర‌మోక్షం ఘ‌ట్టాలు దీన్ని నిరూపిస్తున్నాయ‌ని చెప్పారు.  ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో వారం రోజుల పాటు బ‌స చేసి స్వామివారికి ప్రియ‌మైన భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డం శ్రీ‌వారి సేవ‌కుల పూర్వ‌జ‌న్మ పుణ్య‌ఫ‌లమ‌న్నారు. సేవ‌కులు త‌మ ప్రాంతాలకు వెళ్లి ఇక్క‌డి అనుభ‌వాలు, వ‌స‌తుల‌ను తెలియ‌జేసి మ‌రింత మంది శ్రీ‌వారి సేవ‌కు వ‌చ్చేలా కృషి చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎస్ఇ-2  నాగేశ్వ‌ర‌రావు, ఇఇలు  సుబ్ర‌మ‌ణ్యం,  మ‌ల్లికార్జున ప్ర‌సాద్‌‌,  జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌)  స‌ర‌స్వ‌తి, ఏఈవో  ర‌మాకాంత‌రావు ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2021-02-23 15:51:46

2021-02-23 10:42:26

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోవిడ్ వేక్సిన్ వేసుకోవాలి..

కోవిడ్ టీకా వేసుకోవడం వల్ల మనల్ని మనం రక్షించు కోవడంతో పాటు వైరస్ వ్యాప్తి నియంత్రణకు మనవంతు సహకారం అందించనవారముతామని  ఇంఫాల్  డిప్యూటీ కమిషనర్ నయారోమ్ ప్రవీణ్ అన్నారు. సోమవారం ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఇతరులను కూడా రక్షించిన వారమవుతామని డిప్యూటీ కమిషనర్ కోరారు. కోవిడ్ వ్యాక్షిన్ పై ఎలాంటి అపోహలు వద్దని ప్రభుత్వం అనుమతించిన మేరకే వ్యాక్షిన్ వేయడం జరుగుతుందన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంతా తప్పకుండా కోవిడ్ వేక్సినేషన్  చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాను నియంత్రించడంలో మనవంతు సహకారానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు..

Imphal West

2021-02-22 17:07:22

ఉలందూరుపేటలో శ్రీవారి ఆలయం..

 తమిళనాడు రాష్ట్రం  ఉలుందురు పేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. అర్చకులు సంకల్పం, పుణ్యాహవాచనం, గణపతి పూజ,విష్వక్సేన పూజ నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నవధాన్యాలను భూమిలో ఉంచి ఆలయనిర్మాణానికి నాలుగు ఇటుకలు ఉంచి నాలుగు వేదాలను ఆవాహనం చేశారు. 24 బెత్తలు ( 18 అంగుళాలు) భూమిలో ఈ ఇటుకలు ఉంచి ప్రత్యేకంగా శిలాన్యాస పూజలు చేశారు. శ్రీవారి ఆలయానికి  ఉలందురు పేట ఎమ్మెల్యే,  టీటీడీ బోర్డ్ సభ్యులు కుమారగురు  ఆలయ నిర్మాణం కోసం 3 ఎకరాల 98 సెంట్ల భూమి దానంగా ఇచ్చారు.  దీంతో పాటు ఆలయ నిర్మాణానికి 3 కోట్ల 16 లక్షల రూపాయలు విరాళాల ద్వారా అందించారు. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారు,  శ్రీ ఆండాల్ అమ్మవారి ఉప ఆలయాలు  నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ గోడ, పోటు, ఆఫీసు, స్టోర్ రూము తో పాటు భక్తులకు సదుపాయంగా పార్కింగ్  ఏర్పాటు చేస్తున్నామని టిటిడి ప్రకటించింది. భూమి పూజ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు కుమరగురు భారీ ఏర్పాట్లు చేశారు.  తమిళనాడు ముఖ్యమంత్రి   యెడపాటి పళని స్వామి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, శాసన సభ్యులు  కుమరగురు దంపతులు, టీటీడీ పాలకమండలి సభ్యులు  శేఖర్ రెడ్డి, పలువురు శాసన సభ్యులు,  టీటీడీ చీఫ్ ఇంజినీర్  రమేష్ రెడ్డి తో పాటు వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఉలుందురుపేట

2021-02-22 12:27:33

పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు..

విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 189 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ఈ పారాయణంతో తిరుమలగిరులు పులకించాయి.  ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు పారాయణం జరిగింది. కోవిడ్ - 19 వ్యాధిని అరికట్టాలని, లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న‌ పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 318 రోజులు పూర్తి చేయగా, ఫిబ్రవరి 21వ తేదీకి సుందరకాండ పారాయ‌ణం 256 రోజులు పూర్తి అయింది. వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణం వ‌ల‌న బుద్ధి, బ‌లం, ధైర్యం కలిగి స‌కల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయని పండితులు తెలిపారు.  సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గ‌ల‌లోని  2,821  శ్లోకాల‌ను మొత్తం 16 ప‌ర్యాయాలు అఖండ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు.  టిటిడి ఇప్పటివరకు 9 ప‌ర్యాయాలు సుందరకాండ అఖండ పారాయ‌ణం పూర్తి చేసింది.         పదో విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 189 శ్లోకాలను శేషాచార్యులు, ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌,  మారుతి పారాయ‌ణం చేశారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు  గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్,  బుల్లెమ్మ బృందం " వీడివో అల విజయ రాఘవుడు..., సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించి "పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు... సంకీర్తనతో ముగించారు. ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు కలిపి  దాదాపు 200 మంది  పాల్గొన్నా‌రు.ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్లనుంచి,  ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో  ఎ.వి. ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కుల‌ప‌తి ఆచార్య మురళీధరశర్మ, అన్న‌మాచార్య ప్రాజెక్ట్ సంచాల‌కులు  దక్షిణామూర్తి, ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు

Tirumala

2021-02-21 18:10:08

మరోసారి సుందరకాండ అఖండ పారాయ‌ణం..

 కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ ఆదివారం 10వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఆది‌వారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.  శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.

Tirumala

2021-02-20 17:01:37

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా విడుదల..

శ్రీవారి  భక్తుల సౌకర్యార్థం మార్చి నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 20న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు, గదుల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా,  మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది.

Tirumala

2021-02-19 21:37:47

2021-02-19 16:43:26

తిరుమలలో వైభవంగా రథసప్తమి..

సూర్య జయంతిని పురస్కరించుకొని శుక్ర‌వారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ ఉత్స‌వంలో నిర్వ‌హించిన వాహ‌న‌సేవ‌ల‌ను పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించడం విశేషం. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యప్రభ వాహనం (ఉదయం 5.30 గం||ల నుండి 8 గం||ల వరకు) : అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది. చిన్నశేష వాహనం (ఉదయం 9 గం||ల నుండి 10 గం||ల వరకు) : సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి. గరుడ వాహనం (ఉదయం 11 గం||ల నుండి 12 గం||ల వరకు) : స్వామివారికి ఎన్ని వాహనసేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత చేకూరదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. హనుమంత వాహనం (మధ్యాహ్నం 1 గం|| నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు) : భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగి ఆశీర్వదించాడు.            ఈ కార్యక్రమాల్లో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌)  స‌దా భార్గ‌వి, బోర్డు స‌భ్యులు  పార్థ‌సార‌థి, ముర‌ళీకృష్ణ‌,  ప్ర‌శాంతిరెడ్డి,  గోవింద‌హ‌రి, ఇత‌ర బోర్డు స‌భ్యులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవోహ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-02-19 16:35:36