1 ENS Live Breaking News

2021-05-11 13:48:46

కరోనాలోనూ నరకం చూపిస్తున్న మొబైల్ నెట్వర్క్ లు..

భారతదేశంలో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు అదును చూసి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సమయానికి రీచార్జ్ చేయకపోతే సేవలు నిలుపుదల చేసేసే ప్రైవేటు మొబైల్ నెట్వర్క్ తోపాటు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ ఎల్ కూడా వినియోగదారులకు కరోనా సమయంలో చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని మొబైల్ నెట్వర్క్ సంస్థలు కాల్ క్వాలిటీని తగ్గించేయడంతోపాటు, ఇంటర్నెట్ స్పీడ్ ని కూడా పూర్తిగా కుదించేశాయి. తీసుకున్న ఆఫర్లకు అనుగుణంగా ప్రతీరోజూ, 1జిబీ, లేదా 2జీబీ ఇంటర్నట్ డెటాలో సగం కూడా వినియోగదారులకు అందించడం లేదు. ముఖ్యంగా జియో నెట్వర్క్ వినియోగదారులతో తీవ్రంగా ఆటలాడుతోంది. ఉచిత ఇంటర్నెట్, 4జి అని ప్రచారాలు ఊదరగొట్టి తీరా వినియోగదారులు అత్యధికంగా ఈ నెట్వర్క్ ని ఎంచుకున్న తరువాత కాల్ క్వాలిటీని పూర్తిగా తగ్గించేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వారంలో సుమారు నాలుగు రోజులు ఎయిర్ టెల్, ఐడియా నెట్వర్క్ లు తమ సిగ్నల్స్ ని ఆపేస్తున్నాయి. ఆ సమయంలో ఎవరినైనా సంప్రదించడానికి కూడా వీలు లేకుండా పోతుంది. నిత్యం బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ రావడం లేదు. ఎవరికైనా ఫోన్ చేయాలంటే గంటల తరబడి కాల్ కలిసే వరకూ అలా ఫోన్లు చేస్తూ చే ఉండాల్సి వస్తుంది. తీరా కాల్ కనెక్ట్ అయ్యిందంటే ఇవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అవతలి వ్యక్తికి అర్ధం కావడం లేదు...అదే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో ఇవతల వ్యక్తికి అర్ధం కావడం లేదు. ట్రాయ్ నిబంధనల మేరకు తీసుకున్న మొత్తానికి వినియోగదారులకు నాణ్యమైన కాల్ క్వాలిటీతోపాటు, ప్రకటించిన ఇంటర్నెట్ స్పీడు కూడా అదే స్థాయిలో అందించాల్సివున్న ప్రైవేటు నెట్వర్క్ లు ఏ ఒక్క నిబంధనను కూడా అమలు చేయడం లేదు. కరోణా సమయంలో అత్యవసరంగా వైద్య సహాయం కోసం ఎవరికైనా కాల్ చేయాలంటే సుమారు పది 15సార్లు ట్రై చేస్తే తప్పా కాల్ కనెక్ట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణాలు, నగరాల్లోకూడా ఇదే పరిస్థితి ఉందంటే మొబైల్ నెట్వర్క్ లు ఏ స్థాయిలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మొబైల్ నెట్వర్కలన్నీ ట్రాయ్, కేంద్ర టెలీకాం మంత్రిత్వశాఖ అధీనంలో ఉన్నప్పటికీ ఆ శాఖ నుంచి అధికారులు గానీ, మంత్రులు గానీ కరోనా సమయంలోనైనా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచన చేయకపోవడంతో ప్రైవేటు నెట్వర్క్ లు ఆడింది ఆటగా, పాడింది పాటగా తయారవుతున్నాయి. ఎపుడైనా తప్పిదారి కస్టమర్ కేర్ సెంటర్ కి కాల్ చేస్తే...నెట్వర్క్ లో మరమ్మతు చేస్తున్నారు కొద్ది రోజులు పరిస్థితి ఇలానే వుంటుందని చెప్పడంతో వినియోగదారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్లు గానీ మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేస్తే తప్పా ఈ కరోనా సమయంలో మొబైల్ వినియోగదారుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు..

New Delhi

2021-05-10 01:34:24

ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 14న అప్పన్న చందనోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి, ఈఓ సూర్యకళ, ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ ప్రభావం, దేశంలో పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలమేరకు చందనోత్సవం  ఏకాంతంగానే నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజను నిజరూప స్వామి ఎదురుగా నిర్వహించాలని నిర్ణయించారు. సంప్రదాయం ప్రకారం శ్రీ స్వామివారి చందనోత్సవం రోజున అంటే (14-05-21), వైశాఖ పౌర్ణమిరోజున, జ్యేష్ఠ పౌర్ణమిరోజున, ఆషాడ పౌర్ణమి రోజున మొత్తం నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. ఈ చందన సమర్పణలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్  11257208642, IFCS code SBIN 0002795కు గాని భక్తులు విరాళాలు పంపించవచ్చని అధికారులు తెలియజేశారు. అర కేజీ చందనం సమర్పణకోసం రూ. 10,116 (పదివేల నూటపదహార్లు), కేజీ  చందన సమర్పణకోసం రూ. 20,116(ఇరవైవేల నూటపదహార్లు)    భక్తులు పై అకౌంట్ కు పంపించవచ్చునన్నారు. చందన సమర్పణకోసం డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ , ఫొటో తీసి ,  అడ్రస్ పంపాలని అధికారులు కోరారు. అరకేజీ చందనం సమర్పించేవారికి చందనం ముక్కలను ప్రసాదంగా పంపిస్తామని తెలిపారు.  కేజీ చందనం సమర్పించినవారికి (రూ.20,116)అదనంగా  స్వామివారి శేషవస్త్రం ముక్క కూడా పోస్టు ద్వారా పంపించనున్నట్టు వివరించారు. భక్తులు తమ విరాళాలను 13-05-21 (గురువారం) లోగా పంపించాలన్న అధికారులు ఎంత చందనాన్నైనా భక్తులు స్వామివారికి సమర్పించ వచ్చునని చెప్పారు.  స్వామివారి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలియజేశారు.

  విరాళములు రూ.1116 (వెయ్యి నూటపదహార్లు)  శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజకు పంపిచే భక్తులు  గోత్రనామములతో పూజలు జరపించబడును. ఈ విరాళాలు సర్పించిన వారు సైతం స్క్రీన్ షాట్, ఫొటో తీసి, అడ్రస్, గోత్రనామాలు పంపించాల్సి ఉంటుంది.  భక్తులు ఈ అరుదైన, స్వామివారికి  అత్యంత ప్రీతిపాత్రమైన  చందనోత్సవంలో భాగస్వాములై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అధికారులు  విజ్ఞప్తి చేస్తున్నారు.

సింహాచలం

2021-05-03 14:48:11

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం..

తిరుమలలోని ఎస్వీబీసీ ట్రస్టుకి ఆదివారం రూ.కోటి విరాళం అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సం‌స్థ ప్ర‌తినిధులు ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై దాత విరాళం డిడిని అద‌న‌పు ఈవో,  ఎస్వీబీసీ ఎండి ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి కార్యక్రమాలు ఎస్వీబీసీ ద్వారా అన్ని భాషల్లోనూ భక్తులకు చేరేలా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు, టిటిడి సిబ్బంది డాలర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

తిరుమల

2021-05-02 07:47:40

BSNLసీఎండీ డికెపర్వాన్ త్వరగా కోలుకోవాలి..

బీఎస్ఎన్ఎన్ఎల్ సీఎండీ డి.కెపర్వాన్ కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకొని, విధులకు హాజరు కావాలని భారతీయ టెలీకాం ఎంప్లాయిస్ యూనియన్(బీఎస్ఎన్ఎల్), భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్) జాతీయ అధ్యక్షులు వివిఎస్.సత్యన్నారాయణ ఆకాంక్షించారు. విశాఖలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, బిఎస్ఎన్ఎల్ లో చాలా మంది ఫీల్డు ఉద్యోగులు నేడు కోవిడ్ పాజిటివ్ తో బాధ పడుతున్నారన్నారు. వారికి ప్రభుత్వం నుంచి తక్షణ సదుపాయక కలుగజేయడానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. అలా చేయడం ద్వారా ఉద్యోగులకు భరోసా ఏర్పడుతుందన్నారు. చాలా మంది ఫీల్డు సిబ్బంది కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా మిగిలిన ఉద్యోగులతో కలిసి పనిచేయడం ఇబ్బంది కరంగా మారుతుందని, దీనిని యాజమాన్యం, ప్రభుత్వం ద్రుష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ లో విధులు నిర్వహిస్తున్నవారికి ఎవరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినా వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం తక్షణమే అందించాలన్నారు. సీఎండీ త్వరగా కోలుకోవడం ద్వారా ఉద్యోగులకు, సిబ్బందికి విధి నిర్వహణలో  చురుకుగా పాల్గొనడానికి, ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని వివిఎస్. సత్యన్నారాయణ తెలియజేశారు.

2021-04-28 15:03:05

శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం..

తిరుమల శ్రీవారికి ఆదివారం టయోటా ఇన్నోవా కారు విరాళంగా అందింది. హర్ష టయోటా సంస్థ తరఫున టిటిడి బోర్డు మాజీ సభ్యులు  భానుప్రకాష్ రెడ్డి  దాదాపు రూ.20 లక్షల విలువైన కారును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఆలయ డెప్యూటీ ఈఓ  హరీంద్రనాథ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిబ్బంది పాల్గొన్నారు.

తిరుమల

2021-04-25 13:24:22

శ్రీవారి సేవలు నిలుపుదల..

దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు శ్రీవారి సేవకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు ప్రకటన విడుదల చేసింది. తదుపరి శ్రీవారి సేవ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది ముందుగానే తెలియజేయగలము. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శ్రీవారి సేవకు రాదలచిన భక్తులు ఈ మార్పు గమనించి తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల టిటిడి అధికారులు కోరుతున్నారు.

తిరుమల

2021-04-20 17:46:21

ఆ విధానంతో ఎవరి ఓటు వారే వేస్తారు..

కేంద్ర ప్రభుత్వం నకిలీ ఓటర్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది... ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్టు లోక్‌సభలో వెల్లడించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్‌సభలో బుధవారం సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి ఇకపై ఓటర్ ఐడీకి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో కూడా తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.మరోవైపు తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు పెరుగుతూనే వస్తున్నారు. ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్‌ కార్డులను ఈసీ నియంత్రించడంలో విఫలం అవుతూనే వస్తుంది. బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని పేర్కొంది.

New Delhi

2021-03-17 21:56:11

ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు..

కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ముందుగా పీఎఫ్ రాష్ట్ర అదనపు కమిషనర్, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సెక్రటరీ కృష్ణచౌదరి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగక ముందు 2013లో హైదరాబాదులో ఈపీఎఫ్ సమావేశం జరిగిందన్నారు. ఎనిమిదేళ్ల తరవాత ప్రాంతీయ సమావేశం జరుగుతోందన్నారు. ప్రావిడెంట్ ఫండ్ వివరాలతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన వివరించారు. పీఎఫ్ పొందే సమయంలో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారాలను తెలిపారు. రాష్ఠ్ర విభజన తరవాత విజయవాడకు ఈపీఎఫ్ జోనల్ కార్యాలయం తరలొచ్చిందని, గుంటూరు, కడప, రాజమండ్రి, విశాఖపట్నం నగరాల్లో రీజనల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని పీఫ్ కార్యాలయ అధికారులు తెలిపారు. కొవిడ్ కాలంలో అత్యవసర విభాగం కింద  కార్యకలాపాలను కొనసాగించామన్నారు. ఈపీఎఫ్ విధానంలో ఉన్న ప్రయోజనాలను అధికారులు కమిటీకి వివరించారు. రాష్ట్ర విభజన తరవాత కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం నిర్వహించడంపై ఛైర్ పర్సన్ ఉదయలక్ష్మి ఆనందం వ్యక్తంచేశారు. కార్మికుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడంతో వారికి కార్మిక భవిష్యనిధి ప్రయోజనాలు అందజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన భవిష్యనిధి ప్రయోజనాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. భవిష్యనిధి రుణాలు, పింఛన్లు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఛైర్ పర్సన్ ఉదయలక్ష్మి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఆర్ధికశాఖ సంయుక్త కార్యదర్శి కె.ఆదినారాయణ, కార్మికశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.లక్ష్మీనారాయణ, నాలుగు జోన్ల రీజనల్ కమిషనర్లు కుందన్ అలోక్, టి.ఇందిర, సునీల్ కుమార్ దేబ్, వెంకట సుబ్బయ్య ,ఉద్యోగ, కార్మిక, వ్యాపార యాజమాన్య సంఘాల ప్రతినిధులు భాస్కరరావు, పార్ధ సారధి, రాజశేఖర్, గణపతి రెడ్డి, ముత్యాలు, సతీష్ మాదున్యా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Vijayawada

2021-03-17 21:51:10

రూ.1860 కోట్ల ఈఎస్ఐ ఆసుపత్రి..

రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం ఆపరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాకు మరో కేంద్ర పథకం ప్రాజెక్టు మంజూరయింది. రాజమహేంద్రవరం ఎంపీ,  వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి  సంతోష్ కుమార్ గంగ్వార్ ను కలిసి ఈ మేరకు ప్రాజెక్టును మంజూరు చేయించారు. ఈ మేరకు గోపాలపురం నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ మంజూరు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి ఎంపీ మార్గాని భరత్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. రాజమహేంద్రి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారికి సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ పరిధిలో కూడా పలు క్వారీలు  పరిశ్రమలు ఉండటం, పట్టణ గ్రామీణ ప్రజలు, కార్మికులు అధికశాతం ఉన్న నేపథ్యంలో  గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కృషి చేయడంతో కేంద్ర మంత్రివర్యులు గాంగ్వర్ కు విజ్ఞప్తి చేయడంతో ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైనట్టు ఎంపీ భరత్ రామ్ వివరించారు. సుమారు రు. 1860 కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతున్న  కొవ్వూరు గుండుగొలను జాతీయ రహదారి పరీవాహ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఎంతో మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఆసుపత్రి వల్ల వైద్య సదుపాయాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.  నిత్యం విపరీతమైన ట్రాఫిక్ రద్దీ తో ఉండే ఈ ప్రాంతంలో ఈ ఆసుపత్రి నిర్మాణం ఎంతో అందుబాటులో ఉంటుందని ఎంపీ వివరించారు. ఇటు కొవ్వూరు, అటు గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని కార్మిక రంగానికి ఈ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులో ఉండగలదని తెలిపారు. ఈ నేపధ్యంలో కొవ్వూరు నుంచి గోపాలపురం మధ్యలో జాతీయ రహదారిని ఆనుకొని ఈ వంద పడకల ఇఎస్ఐ ఆస్పత్రిని నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. కేంద్ర మంత్రి సంతోష్ కుమార్  ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో ఇఎస్ ఐ ప్రత్యేక డ్రైవ్  ఈ మేరకు త్వరలో పశ్చిమ గోదావరి జిల్లా పరిధి లోని కార్మికులు,  సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరు  ఇఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కార్మికుల ఇఎస్ఐ నమోదు ప్రక్రియను త్వరలో ప్రత్యేకంగా చేపట్టనున్నట్టు ఎంపీ భరత్ రామ్ తెలియజేశారు. ఈ మేరకు సంస్థలు, కంపెనీలు ఫ్యాక్టరీ యాజమాన్యాలు  కార్మికుల ఈఎస్ఐ నమోదు కృషి చేయాలని ఎంపీ భరత్ రామ్ తెలిపారు.

New Delhi

2021-03-16 21:37:59

ఎప్పుడో ఆ నోట్ల ముద్రణ ఆపేశాం..

భారతదేశంలో రూ.2వేల నోట్లను ఎప్పుడో ముద్రణ నిలిపివేసినట్టు కేంద్రప్రభుత్వం సోమవారం లోక్ సభ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించింది. 2016లో నోట్ల ర‌ద్దు త‌ర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను నిలపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ‌త రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించ‌డం నిలిపివేశామని  ప్రకటించింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత‌పూర్వకంగా స‌మాధానం కూడా ఇచ్చారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయని, 2021, ఫిబ్రవ‌రి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు త‌గ్గింద‌ని మంత్రి పేర్కొన్నారు. లావాదేవీల డిమాండ్ మేర‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంద‌ని మంత్రి తెలిపారు. కాగా, న‌ల్లధ‌నానికి అడ్డుక‌ట్ట వేసే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను ర‌ద్దు చేసి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చింది..

New Delhi

2021-03-15 20:14:45

ఇక నోటా పేరు చెబితే వారికి హడలే..

అవును నిజమే ఇకపై ఓటరు నోటా అని చెబితే ఎన్నికల బరిలో నిలబడ్డ రాజకీయనాయకుడికి తడిచి పోవాల్సిందే. ఏంటీ ఈ నోటాకున్న ప్రత్యేకత అనుకుంటున్నారా. అయితే మీరు ముందు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఒక్కసారి చదివితే మీరే ముక్కున వేలేసుకుంటారు. ఏదైనా ఎన్నికల్లో అత్యధికంగా నోటాకి ఓట్లు పోలైతే ఆ ఎన్నిక రద్దు చేసి మళ్లీ ఎన్నిక జరిపించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటీషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ విధంగా సంచలన తీర్పునివ్వడం ఇపుడు దేశంలోనే హాట్ టాపిగ్ గా మారింది. ఇకపై ప్రజలకు ఏ రాజకీయనాయకుడపైన అయినా ఇష్టం లేకపోతే..ఆయన ప్రజలకు పనిచేయడని భావించిన తరుణంలో ప్రజలు అత్యధికంగా నోటాకి ఓటు వేస్తే ఇక ఆ ఎన్నిక రద్దైనట్టే. అంటే ఈ లెక్కన ఎన్నికల బరిలో నిలబడే నేతలంతా ఎంత జాగ్రత్తగా మసలుకుంటారనేది చాలా స్పష్టంగా కనిపించినట్టు అవుతోంది. అంతేకాకుండా ఈ సారి చేసిన హామీలు అమలు చేయని నేతలను కూడా నోటాకి ఓటు వేసి ఎన్నికలు అయిన వెంటనే దించేయడానికి కూడా సుప్రీంకోర్టు తీర్పు చాలా ఉపయోగ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ

2021-03-15 20:12:38

శ్రీవారి ఆశీస్సులు పొందడం అద్రుష్టం..

 తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టము గా భావిస్తున్నానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శనివారం ఉదయం మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  అనంతరం దేవస్థానం వెలుపల మీడియాతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మాట్లా డుతూ వెంకటేశ్వర స్వామి వారు తన ఆశీర్వాదం తీసుకోవడానికి నాకు మరొకసారి అవకాశాన్ని  కల్పించారని.. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టము గా భావిస్తున్నానని తెలిపారు..  130 కోట్ల మంది భారతీ యులను కోవిడ్ నుండి కాపాడుటకు దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పోరాడారని తెలిపారు.. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మన దేశం ఎవరి మీద ఆధారపడకుండా   స్వశక్తితో కోవిడ్ వ్యాక్సిన్ ను  తయారు చేశామని, 150 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేసే సామర్థ్యం కలదని..అందు లో భాగంగా 75 దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ ద్వారా వస్తువుల రవాణా అత్యధిక శాతం చేయడం జరిగిందని ,కోవిడ్ నిబంధనలను సవరించడం వల్ల ప్రయాణికుల సంఖ్య 80 శాతం పెరిగిందని తెలి పారు.అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసర మైన అన్ని మెరుగైన వస తుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని, తిరు పతి రైల్వే స్టేషన్ లో విస్తరణ పనులు ముమ్మరంగా సాగు తున్నాయని తద్వారా ఎక్కువ రైళ్ల రాక పోకలకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో  జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-03-13 16:19:09