1 ENS Live Breaking News

15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 19 నుంచి 27వ‌ర‌కు వార్షి‌క బ్రహ్మోత్సవాలు, అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వ‌ర‌కు న‌వ‌రాత్రి  బ్రహ్మోత్సవాల‌ను పురస్కరించుకొని సెప్టెంబరు 15వ తేదీ మంగళవారం  ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.  కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

Tirumala

2020-09-05 13:49:29

అవినీతి పోలీసులను వెంటాడుతున్న ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్

ఒంటి మీద ఖాఖీషర్టు, బుజం పై రెండు స్టార్లు, లేదా ఒకటున్నా పర్లేదు వీటితో ప్రజలను ఎంతో మర్యాదగా రా రా, పోరా..ఏంటి రా..బలిసిందా.. అని ఎంతో మర్యాద గా మాట్లాడే ప్రశాకం జిల్లా పోలీసులకు ఇపుడు నానిపోతుంది...ఏంటి పోలీసులు భయపెడతారు గానీ భయపడం ఏంటి అనుకుంటున్నారా...అలా అనుకంటే పోలీ సు వ్యవహారాల్లో అడుగు పెట్టినట్టే...ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది పోలీసులను 10 రోజుల్లో సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ  సిద్ధార్థ్ కౌశల్ ఇపుడు జిల్లాలో అవినీతి పోలీసులకు సింహ స్వప్నంగా మారారు. ఎస్పీ పేరు చెబితే సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ ఉన్నట్టుండి వెనక్కి గిరుక్కున తిరిగినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఎవరిమీద సస్పెండ్ అవుతారోనని. అందేకాదు సస్పెండ్ అయిన పోలీసులపై జరిపే విచారణలో వాస్తవాలు తేలితే పోలీసుల మీదే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లాలోని పోలీసులంతా మంచివారిగా మారిపోతున్నారు. పోలీస్ స్టేషన్ కి ఎవరు వెళ్లినా చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. సెటిల్ మెంట్ అనే మాట బయటకు రాకుండా కామ్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడూ పోలీస్ సినిమాలు చూసిన జిల్లా పోలీసులకు రియల్ గా ఎస్సీ యాక్షన్ చూసిన తరువాత నోటి మాట రావడం లేదు. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు ఇలా వ్యవహరించి అవినీతి ఖాఖీలను ఇంటికి పంపితే బాగుండు అనే వాదన బలగా వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 25 మంది పోలీసులను సస్పెండ్ చేస్తేనే ఎస్పీ నయిం అస్మి పేరు ఊరూనోట మారు మ్రోగిపోయింది. ఇపుడు ప్రకాశం జిల్లా ఎస్పీ దానికి డబుల్ సంఖ్యలో అవినీతి పోలీసులపై తీసుకున్న చర్చ హాట్ టాపిక్ మారింది. అంతేకాదు ఆ మందిపై ఎంతమందిపై క్రిమినల్ కేసులు రుజువవుతాయోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ప్రకాశం జిల్లా

2020-09-05 12:50:41

సత్యదేవుని దర్శనాలు ఉదయం 6 నుంచి రాత్రి9 వరకూ

తూర్పుగోదావరి జిల్లా, అన్నవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో యధావిధిగా స్వామి వారి దర్శనాలు సెప్టెంబ రు 7వ తేది నుంచి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ జరపనున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు  కేంద్ర ప్రభు త్వ 4.0 అన్ లాక్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు చేస్తున్నట్టు చెప్పిన ఆయన భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి స్వామివారిని ధర్శించుకో వడానికి రావాలన్నారు. అంతేకాదు స్వామివారి కొండపై గదులు, సత్రాలు కూడా అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన వివరించారు. స్వామివారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యధావిధిగా సత్యదేవుని దర్శనాలు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. భక్తుల రద్దీని ద్రుష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఈఓ వివరించారు. కొండపై పారామెడికల్ సిబ్బంది సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా భక్తులు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు.

అన్నవరం

2020-09-05 12:24:33

పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్..

ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలెప్ మెంట్ ఆఫీసర్స్ పోస్టులు మంజూరు చేయడం పట్ట ఎంపీడీఓలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెం డు దశాబ్దాలుగా ఎంపీడీఓలకు, ఈఓపీఆర్డీలలకు ప్రమోషన్ల విషయంలో ఎలాంటి ముందడగు లేక చాలా మంది అధికారులు ప్రమోషన్లు పొందకుండానే ఉద్యోగ విరమణలు చేశారు. ఇన్నేళ్ల తరువాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ శాఖలో  ప్రమోషన్ల తలుపు తెరవడంతో ఆఫీస్ సబార్డినెట్లు, పంచాయతీ కార్యదర్శిలు, మినిస్టరీయేల్ స్టాఫ్, ఏ.ఓలు, ఈఓ.పి.ఆర్&ఆర్.డి వరకూ 12 కాడర్లలో ప్రమోషన్స్ కదలికలు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మార్గం సుగమం చేయడంతో పంచాయతీరాజ్ ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేధికగా సహచర ఉద్యోగులతో పంచుకుంటున్నారు. అంతేకాదు వీరందరికీ ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా కింది విభాగాల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశముంది. దీంతో కొత్త ఉద్యోగాలు, ఉన్నవారికి ప్రమోషన్లు రెండూ ఒకే సారి జరగడానికి చాలా ఏళ్ల తరువాత లైన్ క్లియర్ కావడంతో పీఆర్ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి...

ఏపీ స్టేట్ సెక్రటేరియట్

2020-09-04 19:33:20

అక్టోబర్ 17 నుంచి దుర్గమ్మ దసరా మహోత్సవాలు

విజయవాడక కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అక్టోబరు 17 నుంచి ప్రారంభిస్తున్నట్టు దుర్గగుడి అధికారు ప్రకటించారు. ఈ సందర్భంగా అమ్మవారు 9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 17న తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా, 19న శ్రీ గాయత్రీ దేవిగా,  20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా, 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవిగా, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతోపాటు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించడానికి అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం కనిపిస్తోంది. రోజుకి ఎంతమందిని అమ్మవారి దర్శనానికి పంపాలనే విషయమై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ప్రకటించే అవకాశముంది.

దుర్గమ్మ గుడి

2020-09-04 19:16:28

శిరోముండం కేసులో నూతన్ నాయుడు అరెస్టు...

విశాఖజిల్లా లోని పెందుర్తి శిరోముండనం ఘటనలో సినీ నిర్మాత నూతన్‌ నాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు. ఈ సంద ర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,  సంఘటన జరిగిన తరువాత నూతన్ నాయుడు రాష్ట్రం వదిలి వెళ్లి పోవడంతో ప్రత్యేక బ్రుందాలను పంపి కర్నా టక ఉడిపిలో పట్టుకున్నామన్నారు. శిరోముండనం ఘటనలో సిసి ఫుటేజీలో కీలక ఆధారాలతోనే నిందితుడుని పట్టుకున్నామన్న సిపి సంఘటన జరిగిన రోజు మద్యాహ్నం 2.54కి ప్రియామాధురికి నూతన్ నాయుడు ఫోన్ చేశారని చెప్పారు. కాల్ డేటా ఆధారంగా నూతన్ నాయుడును గుర్తించామన్నారు. నూతన్ నాయు డు దగ్గర నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కర్నాటక కోర్టులో హాజరు పరిచినట్టు సిపి వివరించారు. ట్రాన్సిట్ వారెంట్ పై విశాఖ వస్తున్నామని, అదేవిధంగా నిందితుల కష్టడీ కోసం కోర్టులో పిటీషన్ వేసినట్టు వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా శిరోముండనం నింధితులను పోలీసులు వెంటాడి మరీ పట్టుకోవడం విశాఖలో చర్చనీయాంశం అవుతోంది. 

Visakhapatnam

2020-09-04 19:12:41

మంత్రి కన్నబాబుకి ప్రత్యేక శ్రేణి వాహనం..కారణం అదే

ఆంధ్రప్రదేశ్ లోని  మంత్రులకు ప్రమాదాలు పొంచివున్నాయా అవుననే అంటున్నాయి నిఘావర్గాలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొందరు మంత్రులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదేసమయంలో వారిని కొందరు అనుమానితులు టార్గెట్ చేసినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. దీంతో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. 15 రోజుల క్రితం మంత్రికి అపాయం పొంచివుందని నిఘావర్గాలు ప్రభుత్వానికి తెలియజేయడంతో హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు సెక్యూరిటీని కూడా పెంచారు. బాగా తెలిసిన అధికారులను తప్పా ఇతరులను ఎవరినీ మంత్రి వద్దకు నేరుగా పంపడం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ సూచనల మేరకు కొన్ని రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటిస్తున్నారు మంత్రి. ఈ వ్యవహారం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. మన్య ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులకు మావోయిస్టుల నుంచి ప్రమాదాం వుంటుందనే అనుమానంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తారు. ఇపుడు మంత్రికన్నబాబుకి ప్రత్యేక శ్రేణి వాహనాలు కేటాయింపుపై రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారితీసింది.

Amaravati

2020-09-04 18:54:55

తిరుమలలో జ్యుట్ బ్యాగులకు విశేష ఆదరణ..

తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా  లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం టీటీడీ ఏడాది క్రితం ప్రారంభించిన జ్యుట్ బ్యాగ్( నార సంచి) లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. lలడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం టీటీడీ ప్లాస్టిక్ కవర్లు విక్రయించేది. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందనే ఆలోచనతో ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. తొలుత పేపర్ కవర్లు ప్రవేశ పెట్టింది. వీటితో పాటు  జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేకంగా బ్యాగులు తయారుచేసి సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. ప్రసాదాలను తీసుకుని వెళ్ళడానికి ఇవి అనువుగా ఉండటంతో భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ఈ బ్యాగుల విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 5 లడ్డూలు పట్టే బ్యాగు రూ 25, 10 లడ్డూల బ్యాగు రూ 30, 15 లడ్డూలు తీసుకుని వెళ్లగలిగే బ్యాగు రూ 35, 25 లడ్డూలు తీసుకుని వెళ్లగలిగే బ్యాగు ధర రూ 55 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి  పీల్చక పోవడం ఈ బ్యాగు ప్రత్యేకత. సేలంకు చెందిన  మోహన్ కౌన్డర్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలు తీసుకుని వెళ్ళడానికి జ్యుట్ బ్యాగు చాలా ఉపయోగంగా ఉందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇవి చాలా ఉపయోగంగా ఉన్నాయని చెప్పారు.  ముంబై కి చెందిన భూషణ్ కడెకర్ మాట్లాడుతూ శ్రీ వారి లడ్డూ ప్రసాదాన్ని దూర ప్రాంతానికి క్యారీ చేయడానికి జ్యుట్ బ్యాగ్ చాలా ఈజీ గా ఉందన్నారు. ప్లాస్టిక్ కవర్ల కంటే ఇవి ఎంతో మేలనీ,  పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఉపయోగ పడతాయని ఆయన చెప్పారు.    

Tirumala

2020-09-04 18:42:26

యుపీఎస్సీ అభ్యర్ధుల కోసం ప్రత్యేక రైళ్లు...

విశాఖపట్నంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల ద్రుష్ట్యా అభ్యర్దుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇచ్చపురం - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకె త్రిపాటి తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు రైల్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి సుమారు  4500 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరవుతున్న ద్రుష్ట్యా రైల్వే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.   రైలు నెం .5831 (ఇచ్చాపురం-విశాఖపట్నం) ప్రత్యేక రైలు ఇచ్చపురం నుండి 05.09.2020 న 17.00 గంటలకు ప్రారంభమవుతుంది మరియు 17.39 గంటలకు పలాసా చేరుకుంటుంది మరియు 17.40 గంటలకు బయలుదేరుతుంది; శ్రీకాకుళం రోడ్ రాక 18.35 గంటలకు 18.36 గంటలకు బయలుదేరుతుంది; విజయనగరం 19.30 గంటలకు చేరుకుని 19.32 గంటలకు బయలుదేరి 21.00 గంటలకు గమ్యం విశాఖపట్నం చేరుకుంటుంది.    తిరిగి వచ్చే దిశలో 05832 (విశాఖపట్నం-ఇచ్చపురం) స్పెషల్ 06.09.2020 న 18.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది, ఇది 19.35 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది మరియు 19.37 గంటలకు బయలుదేరుతుంది; శ్రీకాకుళం రోడ్ 20.31 గంటలకు రావడం మరియు 20.32 గంటలకు బయలుదేరుతుంది; 21.30 గంటలకు పలాసా రాక, 21.31 గంటలకు బయలుదేరి 22.30 గంటలకు ఇచ్చాపురానికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో 16 జనరల్ బోగీలతోపాటు  2 సెకండ్ క్లాస్ ఒక లగేజ్ గేజ్ కమ్ బ్రేక్ బోగీలు ఉంటాయని ఆయన తెలియజేశారు. అభ్యర్ధులు రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Visakhapatnam

2020-09-04 17:58:08

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులు

క్రిష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్ వేను పదిరోజుల్లో రాకపోకలు జరపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. శుక్రవారం గన్నవరంలోని విమానాశ్రయంలోని కొత్తగా నిర్మించిన రన్ వేని ఎయిర్ పోర్టు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ రూ.470 కోట్లతో ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో  ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, మరో రూ.27 కోట్ల తో ఆప్రాన్ లింక్ టాక్సీ వే పూర్తయినట్టు కలెక్టర్ వివరించారు. అంతేకాకుండా త్వరలోనే బోయింగ్ 777, 747 అంతర్జాతీయ  విమాన సర్వీసులు కూడా ప్రారంభించడానికి ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయితే అన్ని దేశాలకు కనెక్టవిటీ బాగా పెరుతుందని విమాన ప్రయాణీకులు భావిస్తున్నారు. కొత్తగా చేపట్టిన పనులన్నీ పూర్తికావడంతో గన్నవరం ఎయిర్ పోర్టు నూతన శోభ సంతరించుకుంది.  ఈ కార్యక్రమంలో రెవిన్యూ, అధికారులతోపాటు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

Gannavaram

2020-09-04 16:23:52

సెప్టెంబరు 13 నుంచి ప్రశన్న వేంకటేశుని పవిత్రోత్సవాలు

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుంచి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈమేర కు సెప్టెంబరు 12న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. సెప్టెంబ‌రు 13వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 14న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 15న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సంద‌ర్భంగా మూడు రోజుల పాటు ఉద‌‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్నవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. కోవిడ్ - 19 నిబంధన‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు

అప్పలాయగుంట

2020-09-04 15:27:54

కృష్ణపట్నం పోర్టులో భారీవాటా అదానీ గ్రూప్ కే..

కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది. 45 రోజులు తరువాత శుక్రవారం కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు లభించింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా ఇందుకు సీల్ అప్రూవల్ ఇవ్వడంతో మొత్తం రూ.13,572 కోట్ల డీల్ ను కుదుర్చుకున్నట్టైంది. కృష్ణ పట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) సంస్థకు 75శాతం వాటాను కేటాయించింది ప్రభుత్వం. కృష్ణపట్నం పోర్టు బాధ్యతలు అదానీ గ్రూప్ కే ఇకపై సంబంధం అని ప్రభుత్వం తరపున ఎన్.ఓ.సి. ఇచ్చామని ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రాభివ్రుద్ధిని కాంక్షిస్తూ చేపట్టే కార్యక్రమాలు వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో ఈ సీల్ అప్రూవల్ ఇచ్చినట్టు చెప్పిన మంత్రి ఇకపై క్రిష్ణపట్నం పోర్టు శరవేగంగా అభివ్రుద్ధి చెందడానికి పూర్తిస్థాయిలో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాభివ్రుద్ధిలో ఈ డీల్ కూడా కీలకం కాబోతుందన్నారు.

క్రిష్ణపట్నం పోర్టు

2020-09-04 15:10:48

ఆ ఆలయంలో గోపాలడుని మొక్కితే పెళ్లైపోతుంది...

ఆ ఆలయాన్నికీ..శ..1850లో నిర్మించారు. ఇక్కడున్న రాజగోపాస్వామి(వేణుగోపాల స్వామి)కి  మొక్కితే పెళ్లికాని వారికి పెళ్లి, స్వామివారికి సేవలు చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అంతే కాదండోయ్ ఆర్ధిక బాధలు, కుటుంబ కలహాలు కూడా మటుమాయం అయిపోతాయ్.. ఏంటి కంప్యూటర్ కాలంలోనూ ఈ కధలు అనుకుంటున్నారా..ఈ ఆలయం మహత్యం అలాంటిది మరి..అది నిజమో కాదో తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...ఈ ఆలయ చరిత్ర తెలుసుకుంటే... విశాఖపట్నం జిల్లా, కోటవురట్ల మండలం, కైలాపట్నం గ్రామంలో ఉందీ శ్రీశ్రీశ్రీ రాజగోపా స్వామి దేవస్థానం. ఈ ఆలయంలోనే ఆండాళమ్మ అమ్మవారు కూడా కొలువుదీరి వున్నారు. ఈ ప్రముఖ దేవస్థానం చరిత్రలోకి వెళితే...విజయనగర మహరాజుల ఆహ్వానం మేరకు శ్రీమాన్ ప్రతివాద భయంకర మంత్ర రత్న, శ్రీనివాసాచార్య అయ్యవార్లు ఈ ఆలయంలోని స్వామివారిని పూరీ నుంచి తీసుకు వచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. అప్పట్లో ఈ రాజగోపాలస్వామి ఆలయం ఎంతో పేరు, ప్రతిష్టలు, 500 ఎకరాల మాన్యం కలిగిన దేవస్థానం. అయితే కాలక్రమంలో మాన్యం ప్రభుత్వం రైతుల వసం చేయగా కేవలం ఆలయం మాత్రమే మిగిలింది. ఈ ఆలయంలో జాతి పిత మహాత్మాగాంధీ 1929లో కూర్చొని 1008 మార్లు శ్రీరామ నమ జపం చేసినట్టు చరిత్ర చెబుతోంది.  అంతేకాదు. ఈ ఆలయంలోనే విప్లవ వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు, మహర్షి ఎక్కిరాల రామస్వామి కూడా జపం చేసిన చరిత్రగలది శ్రీశ్రీశ్రీ రాజగోపాలస్వామి దేవస్థానం. ఈఆలయానికి వివిధ బాధలతో వచ్చి వారి మనసులోకి కోర్కెలను స్వామివారితో విన్నవించుకుంటారు. ఇక్కడి స్వామివారు భక్తులు మొక్కులు తరువాత తీరిన కోర్కెల ఆధారంగా మొక్కలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. క్రీ.శ.1869లో ఈ ఆలయంలో పీతాంబరం అప్పమ్మగారి తల్లి నున్న సుబ్బ కళ్యాణ మండపం కట్టించారు. క్రీ.శ.1899-1900 ఏట నండూరి సీతారామాచార్యులు ఆండాళ్లమ్మ తల్లికి ఇక్కడే దేవాలయం కట్టి ప్రతిష్టించారు. ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించినదే. అప్పట్లో తవ్విన ఊటబావినుంచే తీసిన నీటిని అనునిత్యం స్వామికి తీర్ధంగా సమర్పిస్తారు. కీ.శ. 1964లో ఆలయం తిరిగి పునరుద్దరించారు. ఇంతటి చరిత్ర గలిగిన స్వామివారి దేవస్థానం నేటికి అభివ్రుద్ధికి నోచుకోకపోయినా, చరిత్రమాత్రం ఖండతరాలు దాటింది. దీర్ఘకాలికంగా పెళ్లికాని, ఉద్యోగం రానివారు ఇక్కడి స్వామివారిని మొక్కుకుంటే ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఇక్కడ చాలా అధికంగా ఉన్నాయి. దీంతో చాలా మంది ఇక్కడి రాజగోల స్వామివారికి పెళ్లికోసం, ఉద్యోగం కోసం మొక్కలు మొక్కుకుంటారు.  అవి తీరగానే అనుకున్న కానుకలు హుండీలో వేస్తారు. స్వామివారి ఆలయాని తమవంతు సహాయంగా అభివ్రుద్ధి చేయాలని, భక్తుల సహకారంతో స్వామివారికి తిరిగి పూర్వ వైభవం తీసుకు రావాలని ఈఎన్ఎస్ లైవ్ యాప్ సంకల్పించింది. ఈ ఆలయంలో ఏ భక్తుడి కోరికైనా తీరితే ఆలయం అభివ్రుద్ధికి తమ వంతు సహాయం చేయాలని, ఆ నిధులతో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ భక్తులను కోరుతోంది. అంతేకాదు స్వామి వారి ఆలయంలో విద్యుత్ వ్యవస్థను త్వరలోనే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తరపున పునరుద్దరించనున్నట్టు ఈఎన్ఎస్ మీడియా హౌస్ అధినేత పి.బాలభాను(బాలు) ప్రకటించారు. స్వామివారికి చేసిన సహాయం మనందరికీ తిరిగి పదింతలు స్వామి కరుణ, కటాక్షాల రూపంలో వస్తుందని భావించే వారంతా మీవంతు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలునిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎంతో పూర్వ చరిత్ర ఉన్న ఈ రాజగోపాలస్వామివారిని దర్శించి పునీతులు కండి. మీ మొక్కులు తీరితే స్వామివారి కోసం చిన్న సహాయంతో, మీ పేరుతో ఒక అభివ్రుద్ధి కార్యక్రమం చేపట్టండి. లోకా సమస్తా సుఖినోభవంతు...!

Kailasapatnam

2020-09-04 13:02:53

ఆయుష్ డిస్పెన్సరీల్లో పారామెడికల్ సిబ్బందిని భర్తీచేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్(ఆయుర్వేదం,యునాని, సిద్ద, హోమియోపతి,నేచురోపతి) డిస్పెన్సరీలను బలోపేతం చేయాలని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్రమోడి మానస పుత్రిక అయిన ఆయుష్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఒక్క విశాఖజిల్లాలలోనే చాలా డిస్పెన్సిరీల్లో వైద్యుల కొరతతోపాటు,  పారామెడికల్ సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు అన్ని రకాల రోగాలకు ఆయుష్ వైద్య విధానాలను ప్రముఖంగా ఆచిరిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీటిని పక్కన పెట్టిందన్నారు. దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి వైద్య విధానాల్లో మంచి మందులు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వీటి నిర్వహణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వెచ్చిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. గతంలో పీహెచ్సీలకు అనుబంధంగా ఆయుష్ డిస్పెన్సరీలు ఉండేవని వాటిలో ఇపుడు చాలావాటిని తొలగించారన్నారు. అంతేకాకుండా చాలా డిస్పెన్సిరీల్లో మందులు కూడా లభ్యం కావడం లేదున్నారు. ప్రభుత్వం ఆయుష్ డిస్పెన్సరీల్లో ఖాళీగా వున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించి ప్రధాని మోదీ ఆశయ సాధనకు క్రుషిచేయాలని  ప్రభుత్వాన్ని కోరారు. తాము కూగా ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుని ద్రుష్టికి తీసుకు వెళతామమన్నారు కొప్పల రామ్ కుమార్. 

Visakhapatnam

2020-09-04 08:37:12