1 ENS Live Breaking News

ప్రముఖుల కార్యక్రమాల ప్రాంతాల్లో నో డ్రోన్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖుల కార్యక్రమాలు జరిగే ప్రదేశంలో నోడ్రోన్ జోన్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ లు పై నుంచి చిత్రీకరణ చేసే సమయంలో అసాంఘిక కార్యక్రమాలు, ప్రమాదాలు జరగవచ్చుననే ముందస్తు సంకేతాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా సభాస్థలం వద్ధ డ్రోన్ కెమెరాలతో షూట్ చేయాలనుకుంటే ముందుగా నగర పరిధిలో అయితే సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా పరిధిలో అయితే జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి  వుంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్  
లు ఆపరేట్ చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, కార్యక్రమాల సమయాల్లో సైతం డ్రోన్లను నిషేదిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఇదే విధంగా ప్రముఖుల కార్యక్రమాలు జరిగే సమయంలో ముందస్తు ప్రకటనలు చేయనున్నారు. అవసరాన్ని బట్టి వాటిని ప్రభుత్వమే చేపట్టే విధంగా  అనుమతులు మంజూరు చేయనున్నారు. 

Tadepalli

2022-11-13 10:14:41

సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతికి తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపికబురు అందనుంది. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతి నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలపై విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నందున ఉద్యోగులను బదిలీలు చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ల ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టినట్టు సమాచారం. మూడేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు బదిలీలు చేసి ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యుగులు, రెగ్యులర్ అయిన ఉద్యోగుల వివరాలను శాఖల వారీగా క్రోడీకరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తం సుమారు ఒక లక్షా 22 వేలకు పైగా ఉన్న ఉద్యోగులను జీఓఎంఎస్-5 ద్వారా ప్రభుత్వం సర్వీస్ ప్రొభేషన్ డిక్లరేషన్ చేసింది. అలా చేసిన ఉద్యోగులు, ఆ తరువాత కారుణ్య నియామకాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చేరిన ఉద్యోగులు, మధ్యలో పదోన్నతులు పొంది చేరిన కొత్త ఉద్యోగులు ఇలా అందరు ఉద్యోగుల జాబితాలను ప్రభుత్వం ఒక ప్రత్యేక జాబితాగా రూపొందిస్తున్నది. అందులో మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులను మాత్రం బదిలీ చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే సాధారణ ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికి అన్ని రకాల సదుపాయలు, బదిలీల నియమ నిబంధనలు వర్తిస్తాయా, లేదంటే ప్రత్యేకంగా నిబంధనలు రూపొందిస్తున్నారనే అనే అంశంపై ప్రభుత్వశాఖల కమిషనర్లతో చర్చలు జరుపుతున్నారని కూడా సమాచారం అందుతుంది. అన్ని ప్రభుత్వశాఖల రెగ్యులర్ ఉద్యోగులు లా అయితే వీరికి కూడా స్థానిక జిల్లాల బదిలీలతోపాటు, అంతర్ జిల్లా బదిలీలు కూడా జరిగే అవకాశం వుంది. లేకపోతే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆ అవకాశాన్ని కల్పిస్తూ జీఓ జారీ చేయాల్సి వుంటుందని ఓ ఉన్నతాధికారి తెలియజేశారు.

మొన్నటి వరకూ డిసెంబరు నాటికి బదిలీల ప్రక్రియ జరుగుతుందని భావించినా.. రాష్ట్రప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖపై ఉన్నతాధికారులు విదివిధానాలు రూపొందించకపోవడం వలనే ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు. ఈలోగా ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామిపై సంక్రాంతి నాటికి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసి ఆ తరువాత మార్చి లోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. అయితే సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర  
సమయం ఉన్నందున ముందుగా బదిలీలు చేపడితే ఆ తరువాత మళ్లీ ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశాలపైనా ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తున్నది. 2024ఎన్నికలు ఆరు నెలల సమయం ఉందనగా ఒకే చోట మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాల్సి వుంటుంది. ఆ విధంగా బదిలీలు చేస్తారా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం  ప్రత్యేక నియమ నిబంధనలు రూపొదించి బదిలీలు చేస్తారా అనే విషయం ఇంకా బయటకు రాలేదు. చూడాలి సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు సంబధించి ఏ విధమైన ప్రకటన జారీ చేస్తుందనేది..!

Tadepalli

2022-11-08 01:49:54

ఎమ్మెల్సీ ఓటరు నమోదులో మోరాయిస్తున్న వెబ్ సైట్

ఉత్తరాంధ్రాలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్నికల సంఘం ఆన్ లైన్ సర్వర్ మోరాయిస్తుంది. చాలా చోట్ల ఆన్ లైన్ ద్వారా ఓటరు  నమోదు ప్రక్రియకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించాలని ఓటర్లు కోరుతున్నారు.

Visakhapatnam

2022-11-05 09:06:10

నవంబరు 1న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 1వ తేదీన మంగళవారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబరు 31న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.  పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం  
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం  నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.  మధ్యాహ్నం 1 నుంచి 5 

గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.  ఈ కారణంగా  అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం  ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2022-10-30 15:33:47

ఏపీలో జిల్లా కలెక్టర్లు చేసే అతిపెద్ద తప్పులు-1

రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది..జిల్లా కలెక్టర్ మంచి అధికారి, ప్రజా సంక్షేమం కోరుకునే అధికారిగా వ్యహరిస్తే జిల్లా అభివ్రుద్ధి పధంలో ముందుంటుంది. ఒక జిల్లాలో 75 ప్రభుత్వ శాఖలకు కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. అలాంటి జిల్లా కలెక్టర్ తన విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించడం వలన, కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై మూడేళ్లు దాడుటుతున్నా నేటికీ ఇక్కడ అందే సేవలేంటో ప్రజల్లో అవగాహన లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతీరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ వాటి అమలు ఎక్కడా జరగడం లేదనే విషయం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చే దరఖాస్తులే స్పష్టం చేస్తున్నాయి. అసలు ప్రభుత్వం సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించిన స్పందన కార్యక్రమాన్ని ఎందుకు జిల్లా కలెక్టర్లు అమలు చేయించలేకపోతున్నారనే ప్రశ్నకు వారి దగ్గరే సమాధానం లేదు. ఇదేదో కావాలని అంటున్నమాటలు కావు..రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ లెవ్ లో ఈఎన్ఎస్ నెట్వర్క్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తెలియజేస్తున్న విషయాలు. తమకు అవసరమైన ద్రువీకరణ పత్రాలకోసం అర్జీలు పెట్టుకున్నవాటినే సచివాలయంలో స్పందన దరఖాస్తులు సిబ్బంది చూపిస్తున్నారు. వాటి ద్వారానే మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు సచివాలయా సిబ్బంది. ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్లు తమ సచివాలయాల పర్యటనల్లో గుర్తించకపోవడం విశేషం.

ముందస్తు సమాచారంతోనే జిల్లా కలెక్టర్లు, జెసిల పర్యటనలు
జిల్లా కలెక్టర్, జెసిలు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే సమయంలో మండల అధికారులకు సమాచారం ముందుగా అందించిన తరువాతే సందర్శనలు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా అక్కడ సిబ్బంది అలెర్ట్ అయిపోతున్నారు. దీనితో అక్కడ లోపాలను కలెక్టర్ గుర్తించడానికి వీలుపడటం లేదు. అందులోనూ సచివాలయాలను సందర్శించే సమయంలో కొందరు జిల్లా కలెక్టర్లు సిబ్బంది డ్యూటీ చార్టులు, రిజిస్టర్ లను తనిఖీలు చేయడం లేదు. పరిస్ధితిని సాధారణంగా కనుక్కోవడం తప్పితే, నవరత్నాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యల దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి.. అసలు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం జరుగుతుందా..జరిగితే ఎన్ని అర్జీలు స్వీకరించారు..ఎన్ని పరిష్కరించారు.. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయాలనికి ఎందుకు దరఖాస్తులు అధికంగా వస్తున్నాయనే విషయాన్ని ఒక్క సచివాలయ సిబ్బందినిగానీ, మండల అధికారులను గానీ ప్రశ్నించినట్టు ఇప్పటి వరకూ కనిపించలేదు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు మాత్రం తమ పర్యటనల విషయం మండల అధికారులకు, సచివాలయ సిబ్బందికి తెలియకుండా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలా చేసిన సమయంలో వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి వీలుపడుతుంది. అలాంటి చోట్ల కాస్త అధికారులతో భయంతోనైనా స్పందన కార్యక్రమాన్ని అప్పుడప్పుడైనా నిర్వహిస్తున్నారు.

సచివాలయ సిబ్బంది ధరించే యూనిఫాంపై ద్రుష్టేది..?
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం కాకుండా వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఎల్లప్పుడూ సివిల్ డ్రెస్సుల్లోనే సిబ్బంది దర్శనమిస్తున్నారు. అదేమంటే ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం బ్యాండ్ మేళం డ్రెస్సులా ఉందనే బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి సచివాలయానికి రాగానే యూనిఫారంలో ఉన్నవారంతా సచివాలయ సిబ్బంది అని గుర్తించడానికి ప్రభుత్వం ఉద్యోగులకు యూనిఫారం ఇచ్చింది. అయితే దానికి విరుద్దంగా సిబ్బంది వ్యవహరిస్తున్నా చాలా జిల్లాల్లో కలెక్టర్లుగానీ, జెసిలుగానీ..అక్కడే ఉండే మండల అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ముందుగా కలెక్టర్ పర్యటనలు చేస్తున్న సమాచారం మండల అధికారులకు అందించడంతో  వచ్చే సమయానికి మాత్రం యూనిఫారాల్లో సిబ్బంది దర్శనమిస్తున్నారు. అప్పుడు కూడా షర్ట్ సచిలయానిది ఫ్యాంట్ వేరే రంగులో ఉన్నదీ ధరిస్తున్నారు. ఆ సమయానికి, ఆ తేదికి రికార్డులు సిద్దం చేస్తున్నారు. సచివాలయ పరిశరాల్లో బ్లీచింగ్ లు చల్లి జిల్లా కలెక్టర్ ద్రుష్టిలో తామంతా సక్రమంగా ఉన్నట్టు కలరిస్తున్నారు. అంతే తరువాత రోజునుంచి మళ్లీ సివిల్ యూనిఫారంలోనే వస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ కార్యదర్శిలే ఈ విధంగా చేస్తున్నారు. తమ కార్యదర్శి యూనిఫారం వేసుకు రాకుండా వస్తే లేనిది తామెందకు వేసుకోవాలంటూ మిగిలిన సిబ్బందికూడా లైట్ తీసుకుంటున్నారు. దీనితో సచివాలయానికి వచ్చే ప్రజలకు ఎవరు సచివాలయ ఉద్యోగులో.. ఎవరు సాధార ప్రజలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో కనీసం మండల అధికారులు కూడా సిబ్బందిని ప్రశ్నించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

జిల్లా కలెక్టర్లకి తగ్గిపోయిన పరిధి..అయినా ఎక్కడి సమస్యలు అక్కడే
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన తరువాత 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. అంటే అదనంగా 13 మంది జిల్లా కలెక్టర్లు, 13 మంది జాయింట్ కలెక్టర్లు కొత్తగా వచ్చినా.. ఉమ్మడి జిల్లాలు విభజన జరిగి విస్తీర్ణం, వారి పరిధి తగ్గిపోయినా జిల్లాల్లో ప్రధాన సమస్యలు ఎక్కడివి అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామ, వార్డు స్థాయిలో కార్యాలయాలు.. సుమారు 10 నుంచి 19 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించినా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. నేటికీ సచివాలయాల్లో అందే సేవలు, సిబ్బంది ఎవరు, ఏఏ ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా ఉన్నారో.. ఆ ప్రాంత ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో.  గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలు లక్షా 23వేల మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినా.. ఫలితాలు మాత్రం మూడేళ్లు దాటిపోతున్నా కనీసం 20శాతం కూడా మెరుగు పడలేదు. జిల్లా కలెక్టర్లు పర్యటనలు చేసే సమయం మందుగా సమాచారం అందుకొని..కలెక్టర్లను సిబ్బంది, మండల అధికారులు బురిడీలు చేస్తున్నారు తప్పితే వాస్తవానికి సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందులోనూ మండలశాఖల్లోనూ రెగ్యులర్ అధికారులు లేకపోవడం, 70శాతం ఇన్చార్జిల పాలనతో ఉండటంతో ఈ సమస్య మరింత జఠిలం అవుతోంది.  గ్రామస్థాయిలో నేరుగా పది ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉన్నా, గ్రామసచివాలయం ఉన్నా స్పందన కార్యక్రమం మాత్రం జరగడం లేదు. అలా జరిగితే సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేవనే విషయాన్ని కలెక్టర్లు గుర్తించకపోవడం విశేషం. కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ విధంగా బురిడీ కొట్టించే సిబ్బందిని కలెక్టర్లు, జెసిలు సస్పెండ్లు చేస్తున్నారు. ఆ పరిస్థితి రాష్ట్రమంతా జరిగితే విషయం వేరే లెవల్ ఉంటుందనడంలో సందేహమే లేదు.

జిల్లా కలెక్టర్లు, జెసిలు తనిఖీలు చేయనవి ఇవే..
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ చాలా వరకూ జిల్లా కలెక్టర్లు, జెసిలు,  గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లే సమయంలో తనిఖీ చేయని అంశాలు క్రమ సంఖ్యలో తెలుసుకుంటే.. గ్రామాల్లోకి సిబ్బందిని తీసుకెళ్లి వీరిలో ఎంతమంది గ్రామస్తులకు తెలుసు అని ప్రశ్నించడం, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైనేజిల సమస్యలు, సిబ్బంది డ్యూటీచార్టులు, రిజిస్టర్ల నిర్వహణ, సిబ్బంది యూనిఫారం ధరించకపోవడం, ముఖ్యంగా సచివాలయాల్లో స్పందన నిర్వహంచని అంశం, శాఖల వారీగా వచ్చిన అర్జీలు, పరిష్కరించిన సమస్యలు, ప్రధానంగా పరిష్కారించాల్సిన సమస్యలు, కార్యదర్శిలు ఏ విధంగా సచివాలయాలు నిర్వహిస్తున్నారు..అందుబాటుల్లో ఉంటున్నారనే అంశం, సచివాలయ సేవలను సిబ్బంది ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తున్నారనే విషయం, కలెక్టర్ల పర్యటన సమయంలోనే కాకుండా నెలలో ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ పారిశుధ్య నిర్వహణ చేస్తున్నారు, బ్లీచింగ్ లు చల్లుతున్నారు, దానికోసం ఫినాయిల్, ఫాగింగ్ ఇతర వాటికి ఎంత మొత్తం లో ఖర్చు చేస్తున్నారు. అసలు చెత్తను పారిశుధ్య కార్మికులు ఏఏ ప్రాంతాల్లో..ఏఏ రోజుల్లో చేస్తున్నారు..? ఎంత మొత్తంలో లెక్కలు చూపిస్తున్నారు..తీసుకు వచ్చిన ఫలితాలేంటి, ముఖ్యంగా సచివాలయాలను నిర్వహించే కార్యదర్శిల రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? అసలు నిర్వహిస్తున్నారా లేదా? ప్రభుత్వ ఉత్తర్వులు అసలు నోటీసుబోర్డులో పెడుతున్నారా లేదా.. ఎన్ని ప్రభుత్వ ఉత్తర్వులను సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎన్ని ఉత్తర్వులను రిజిస్టర్లు వారీగా నమోదు చేస్తున్నారు. సచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బందికి ప్రధాన వీధులు, వాలంటీర్లు గ్రామంపై ఎంత పట్టుంది..? తదితర అంశాలను జిల్లా కలెక్టర్లుగానీ, జెసిలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు..

ముఖ్యగమనిక.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలనే తొలుతగా ఎందుకు తెలియజేశామంటే..ఏపీలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ శాఖపై అన్ని అంశాలను ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఏకకాలంలో తెలియజేస్తూ వస్తున్నాం. నిజంగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు, సిబ్బంది ప్రజలకు చేరువ అయ్యేవారు. కానీ అలా జరగలేదు. కొన్నిచోట్ల జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ లక్ష్యం మేరకు శ్రమిస్తున్నా,  పనిచేయని సిబ్బందిని సస్పెండ్లు చేస్తున్నా, మార్పు తీసుకురావాలని చేపడుతున్న చర్యలు.. ఫలితాలు అంతంత మాత్రంగానే వుస్తున్నాయి. ఆ కారణంతోనే ఈ పరిశోధనాత్మక కధనం అందించాల్సి వచ్చింది. ఈ విషయంలో మండలం అధికారులు కూడా జిల్లా కలెక్టర్లు, జెసిలు ఇతర జిల్లా అధికారులను బురిడీలను చేస్తున్నారు. మండల అధికారులు ఏవిధంగా జిల్లా కలెక్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారే విషయానికి సంబంధించిన వివరణాత్మక కధాన్ని వచ్చే కధనాల్లో అందిస్తాం. 

చివరిగా ఒక్క మాట.. దేశంలో అత్యున్నత ఉద్యోగం ఐఏఎస్..అలాంటి ఐఏఎస్ లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం ఏకకాలంలో జరుగుతుంది. వారికి ఈఎన్ఎస్ ద్వారా కేవలం క్షేత్రస్థాయిలో జరగుతున్న విషయాలను, వాస్తవాలను మాత్రమే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ లక్ష్యం ఏ తప్పిదం వలన వెనెకబడిపోతుందో తెలియజేయాలని మాత్రమే గ్రౌండ్ లెవల్ లో మా నెట్వర్క్ ద్వారా సమాచారం సేకరించి ఈ విషయాలను తెలియజేశాం. వచ్చే కధనంలో మండల అధికారుల విషయంలో జరుగుతున్న తప్పులను వివరించే ప్రయత్నం చేస్తాం..!

Tadepalli

2022-10-22 03:17:53

తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో మ‌రో ముంద‌డుగు

తిరుమ‌ల ప‌విత్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో టీటీడీ మ‌రో ముంద‌డుగు వేసింది. తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ రథాల (ఉచిత బ‌స్సుల‌) స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్ల‌కు సంబంధించి టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు, ఆర్‌టిసి, టీటీడీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌ల‌ను కాలుష్య ర‌హిత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్ధ‌డానికి ఇప్ప‌టికే అనేక చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్ళు, క‌వ‌ర్ల నిషేదం కూడా ఇందులో ఒక భాగమ‌న్నారు. తొలివిడ‌త‌గా తిరుమ‌ల‌లో ప‌నిచేసే అధికారుల‌కు విద్యుత్‌తో న‌డిచే కార్ల‌ను అంద‌జేశామ‌న్నారు. రెండ‌వ విడ‌త‌గా తిరుప‌తి, తిరుమ‌ల మ‌ధ్య విద్యుత్ బ‌స్సులు ప్ర‌వేశ పెట్టామ‌న్నారు. వీటికి భ‌క్తుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని తెలిపారు.

 రెండ‌వ విడ‌త‌లో తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ‌ర‌థాల స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు 10 బ‌స్సులు విరాళంగా ఇవ్వాల‌ని ఒలెక్ట్రా కంపెని అధినేత శ్రీ కృష్ణారెడ్డిని కోరాన‌ని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్ బ‌స్సుల‌ను విరాళంగా అందించేందుకు ముందుకు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. బ‌స్సుల డిజైనింగ్‌, నిర్వ‌హ‌ణ ఎలా ఉండాల‌నే అంశంపై చ‌ర్చించేందుకు స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భ‌క్తుల‌కు స‌దుపాయంగా ఉండేలా బ‌స్సుల‌ను డిజైన్ చేయాల‌ని సూచించిన‌ట్లు చెప్పారు. 

 అనంత‌రం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నం నుండి లేపాక్షి స‌ర్కిల్ వ‌ర‌కు టీటీడీ చైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి అధికారుల‌తో క‌లిసి విద్యుత్ బ‌స్సులో ప్ర‌యాణించారు.  మూడ‌వ ద‌శ‌లో తిరుమ‌ల‌లో తిరిగే ట్యాక్సీలు, ఇత‌ర అద్దె వాహ‌నాల స్థానంలో టీటీడీ స‌హ‌కారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్ వాహ‌నాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు బ‌స్సుల డిజైన్లు, నిర్వ‌హ‌ణ అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. టీటీడీ చైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి కోరిక మేర‌కు 10 విద్యుత్ బ‌స్సులు విరాళంగా అందించ‌డం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు త‌మ‌కు అందించిన గొప్ప వ‌రంగా భావిస్తున్నామ‌ని కంపెని సిఎండి ప్ర‌దీప్ చెప్పారు. ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్  గోపినాథ్ రెడ్డి, జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి చెంగ‌ల్‌రెడ్డి, టీటీడీ ర‌వాణా విభాగం జిఎం  శేషారెడ్డి, తిరుమ‌ల డిపో మేనేజ‌ర్  విశ్వ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.       

Tirumala

2022-10-21 11:24:37

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్లు చేసే అతిపెద్ద తప్పు..!

ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు చేసే పరిపాలనకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ముఖ్యమైన పరిపాలనలో అందించే అధికారులే తప్పుచేస్తే.. ప్రజా పరిపాలన 75 ప్రభుత్వశాఖలను ఏ విధంగా సమన్వయం చేస్తారు..? ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయా..? ఏంటి నేరుగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్లు పడ్డాయని అనుకుంటున్నారా.. ఈ వార్త, తరువాత రాబోయే దారావాహికంలో ఇంకెలాంటి వార్తలు రాబోతున్నాయని అనుకుంటున్నారా..మీరు అనుకున్నది నిజమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సివిల్ సర్వీస్ అధికారులు(ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్) ఇలా అందరు అధికారులు చేస్తున్న చిన్న చిన్న తప్పులు, చూసీ చూడనట్టు వదిలేస్తున్న విషయాల కారణంగా జరగాల్సిన అభివ్రుద్ధి, పరిష్కారానికి నోచుకోవాల్సిన సమస్యలు, ప్రజలకు దగ్గర కావాల్సిన ప్రభుత్వ సేవలు ఎక్కడివి అక్కడే ఉండిపోతున్నాయి. 

వాటిని మూడేళ్లుగా గ్రౌండ్ రియాలిటీలో ఈఎన్ఎస్ నెట్వర్క్ పరిశీలించింది. అలా పరిశీలించిన విషయాలను, అంశాలను అటు ప్రభుత్వం, ఇటు ప్రజల ద్రుష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో కొందరు ఐఏఎస్ అధికారులు నొచ్చుకున్నా..మరికొందరు మెచ్చుకున్నా.. కేవలం ప్రభుత్వ లక్ష్యం వారు చేసె తప్పుల కారణంగా ఏవిధంగా అభివ్రుద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాలని సంకల్పించాం. ఇదే సమయంలో కొన్ని విషయాలను రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడిన సమయంలో తెలిసిన అంశాలను కూడా వార్తల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అహర్నిసలు శ్రమిస్తుంటే..అదే సమయంలో ఐఏఎస్ లతో పాటు ఇతర సివిల్ సర్వీసు అధికారులు కాస్త ఉదాసీనంగా వ్యవహరించడం, కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించడం వలన జరిగే అనర్ధాలను కూడా ఈ దారావాహికంలో అందించే ప్రయత్నం చేస్తాం.

 కేవలం అధికారులు ఆ విధంగా చేయడం వలన..ఇప్పటి వరకూ ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎందుకు చేరలేదనే విషయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాం. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా మేము అందించే కధనాలు సూచనలుగా ఉంటాయని కూడా భావిస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పాలన ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలంటే జిల్లాకి ముఖ్యమైన అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తే ఫలితాలు వస్తాయనే విషయంలో మేము మూడేళ్లుగా పరిశీలించిన విషయాలను అందిస్తాం. మేము అందించే కధనాలు మీకు నచ్చితే మీరు మీకు తెలిసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ద్రుష్టికీ కూడా తీసుకెళ్లవచ్చు. సివిల్ సర్వీస్ అధికారుల తప్పులు ఎంచేటంత తోపులం అని చెప్పడం లేదు గానీ..కేవలం ఆ విధంగా జరగడం వలన జరిగిన అనర్ధాన్ని మాత్రమే తెలియజేయాలని సంకల్పించాం.. వచ్చే కధనంలో ఏ ప్రభుత్వ శాఖలో ఏ తప్పు జరిగిందో, దానిని జిల్లా కలెక్టర్ నుంచి ఇతర సివిల్ సర్వీస్ అధికారులు ఎందుకు వాటిని పట్టనట్టు వదిలేశారనే విషయాతో మీముందుకి వస్తాం..!

Tadepalli

2022-10-21 01:50:37

ఏపిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అటకెక్కినట్టేనా..?

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసినంత త్వరగా ప్రభుత్వం కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లును నిర్మాస్తామని చెప్పిన మాటను అంతే త్వరగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తున్నది. 13 కొత్తజిల్లాల్లో శాస్వతంగా కొత్త కలెక్టరేట్లు నిర్మించాలని హుటా హుటీన స్థలసేకరణ చేసి, అక్కడ 75 ప్రభుత్వ శాఖలను ఒకేచోట ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం జిల్లాల విభజన తరువాత అద్దె ప్రభుత్వ కార్యాలయాల్లోనే కొత్తజిల్లాల్లోని కలెక్టరేట్లను, జిల్లా కార్యాలయాలను నిర్వహిస్తోంది. కొత్త జిల్లాల్లోని అధికారులతోపాటు, కార్యాలయాల్లోని సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. ఇటీవల రెండు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినా అవి ఎప్పటికి పూర్తవుతాయో కొత్తజిల్లాల్లో ఖాళీలు ఉన్న అధికారులను సిబ్బందిని ఎప్పుడు నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు అయినా చాలా మంది అధికారులు, సిబ్బంది పాత జిల్లాల నుంచే రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు శాస్వత భవనాలు లేక 75 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కేవలం నలుగురు నుంచి ఐదుగురు సిబ్బందితోనే జిల్లాకార్యాలయాలు నడుస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు ఒకేచోట ప్రభుత్వ శాఖల సేవలన్నీ అందుతాయి. అంతేకాకుండా అటు ప్రభుత్వానికి కూడా కార్యాలయాల నిర్వహణ వ్యయం కూడా చాలా కలిసొస్తుంది. ఒకేచోట ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు బ్లాకుల వారీగా ఏర్పాటవడంతో జిల్లా కలెక్టర్ కు సైతం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యవసర సమావేశాలు పెట్టినపుడుకూడా జిల్లా అధికారులంతా ఒకే చోట నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాలు హాజరు కావడానికి వీలుపడుతుంది. వేర్వేరు చోట్ల కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అధిక కరెంటు, వినియోగ, భవనిర్మాణాల వ్యయం కూడా చాలా ఎక్కువగానే అవుతుంది. అలా కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే చోట పెద్ద భవనం బ్లాకుల వారీగా ఏర్పాటు చేస్తే ఇటుప్రజలకు , ప్రభుత్వానికి రెండింటికీ ఎంతో మేలుగా వుంటుంది.

ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల విభజన చేసింత త్వరగా, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తామని చేసిన ప్రకటనను కూడా పక్కన పెట్టేసింది. కొన్ని కొత్త జిల్లాల్లోప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం అందుబాటులోలేవు. దీనితో ప్రభుత్వం కొన్ని చోట్ల తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. జిల్లా ఏర్పాటు పూర్తయిన తరువాత అయినా నిర్మాణాలు చేపడుతుందని భావిస్తే వాటిని పూర్తిగా పక్కనపెట్టింది. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మాణంతోపాటు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారి, ఆర్డీఓ, ఇలా అందరికీ ప్రభుత్వ నివాస స్థలాలు క్యాంపు కార్యాలయాలు కూడా నిర్మించాల్సి వుంటుంది. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేడెట్ కలెక్టరేట్లను కూడా కొంత కాలం వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాల, తరగతుల ప్రారంభంలో ప్రభుత్వం బిజీగా వుంది. బహుసా వీటి నిర్మాణాలు పూర్తయిన తరువా కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2022-10-20 02:51:57

తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వవైభవం..

తిరుమలలోని పలు ప్రాంతాల్లో భక్తులకు ఆహ్లాదకరంగా ఉద్యానవనాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం సీనియర్ అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో జిఎన్సి టోల్ గేట్ వద్ద గల గీతోపదేశం పార్కు, జిఎన్సి నుండి బస్టాండ్ వరకు రోడ్డుకు కుడి వైపున గల పార్కు, శంఖుమిట్ట వద్దగల నామాల పార్కు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోపల, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద రంగురంగుల పుష్పాలు,  పచ్చని మొక్కలతో చక్కగా పార్కులను అభివృద్ధి చేశామన్నారు. స్పెషల్ టైప్, నారాయణగిరిలో రెండు నెలల్లో ఉద్యానవనాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలో అకేషియా చెట్ల స్థానంలో సాంప్రదాయ మొక్కలు పెంచాలని, ఔటర్ రింగ్ రోడ్డులో ఆహ్లాదకరంగా మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. 

విభాగాల వారీగా ఎన్నో ఏళ్లుగా లక్షలాదిగా ఉన్న ఫైళ్లు, ఇతర రికార్డులను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటైజ్ చేసి భద్రపరచాలని ఆదేశించారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధికి సంబంధించి టాటా సంస్థ ముందుకు వచ్చిందని, అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. తిరుమల నూతన పరకామణి భవనానికి అవసరమైన యంత్రాలను మరో నెలలోపు సమకూర్చుకోవాలన్నారు. టిటిడిపై వస్తున్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని న్యాయ విభాగం అధికారులను కోరారు.

        రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నోడల్ గోశాలలను అనుసంధానం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈఓ సూచించారు. పాలనలో మరింత సమర్థత పెంచేందుకు వీలుగా నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని, తద్వారా రోజువారీ పాలన వ్యవహారాల పర్యవేక్షణకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని అన్నారు. అనంతరం పే అండ్ అకౌంట్స్, విద్య విభాగాలకు సంబంధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈఓ పరిశీలించారు.   ఈ సమావేశంలో టిటిడి జెఈవోలు  సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ  షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-10-19 16:52:55

ఇక పిల్లల సంరక్షణ సెలవులు 180 రోజులు

ఆంధ్రప్రదేశ్ లోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సమయం దాటిని తరువాత ఇచ్చే పిల్లల సంరక్షణ సెలవుల విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సెలవులు కేవలం 60 రోజులు మాత్రమే ఉండేవి. అయితే వాటిని ప్రభుత్వం పిల్లల సంరక్షరార్ధం 180 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవులను మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవుల తరువాత పది విడతలుగా వీటిని వినియోగించుకునే అవకాశం వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తరువాత వారి పిల్లల సంరక్షణలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ఎవరైనా ఉద్యోగులు సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఈ సెలవులను వినియోగించుకంటే మాత్రం వారి సర్వీస్ రెగ్యులైజేషన్ గడువు పెరుగనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులైజేషన్ సమయంలో ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి గడుపు తీరిన తరువాత వారి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంతో దీనిని అమలు చేశారు.

Tadepalli

2022-10-19 08:04:49

సమర్ధవంతంగా విధి నిర్వహణ చేయాలి

విధి నిర్వహణలో ఎక్కడా రాజీలేకుండా సమర్ధవంతంగా పనిచేయాలని శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్ లకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సూచించారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ మార్గనిర్ధేశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అనేవిధంగా పనిచేసి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసిన ఐపీఎస్ లలో  ధీరజ్‌ కునుబిల్లి, జగదీష్‌ అడహళ్ళి, సునీల్‌ షెరాన్, రాహుల్‌ మీనా లు ఉన్నారు.

Tadepalli

2022-10-18 07:06:54

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరణ మ్రుదంగం..!

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించాలనే ఉన్నత లక్ష్యంతో మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు ఉద్యోగుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసి ఈశాఖలో ప్రత్వం దాని పరిపాలన బాధత్యలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయిలో కట్టబెట్టకపోవడం, నిర్ధిష్ట ప్రణాళికతో వ్యవహరించడకపోవడంతో అనుకున్న లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. అధికారుల మొండి వైఖరి, గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సిబ్బందిపై తీసుకొస్తున్న ఒత్తిడి కారణంగా ఉద్యోగులు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఒకే ఏడాది విశాఖజిల్లాలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, కాకినాడ జిల్లాలో హార్టికల్చర్ అసిస్టెంట్ సుభాష్ చంద్రవర్మ, కేవలం అధికారుల పని ఒత్తిడి కారణంగానే బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగాఉందో అర్ధంచేసుకోవచ్చు. ఒక విధివిధానం, ముందుచూపు, వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవరిస్తున్న అధికారుల తీరు ఉద్యోగుల ప్రాణాలను హరిస్తున్నాయి.

ఈ-కేవైసీకి ముందుకి రాని బడా రైతులు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతుల భూముల వివరాలు, పంటల వివరాలు తెలుసుకోవడంతోపాటు వారికి పంటలు వేసిన సమయంలో ప్రక్రుతి వైపరీత్యాలు వచ్చిన నష్టానికి సహాయం అందించేందుకు గ్రామ సచివాలయాల్లోని హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ఆయా ఆర్బీకేల్లో నమోదు చేస్తున్న ఈ-కేవైసీ చేయించుకోవడానికి బడా రైతులు ముందుకి రావడం లేదు. తమకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంగానీ, ఎలాంటి సహాయం వద్దని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. పంటలు నమోదు చేసుకోవడానికి చిన్నా, చితకా రైతులు తప్పా మరెవరూ ఆశక్తి చూపించడం లేదు. పైగా ఈ-కేవైసీ ఎందుకు చేయించుకోవాలనే విషయంపై రైతులకు ముందుగా అవగాహన లేకపోవడం కూడా ఈ పరిస్థితి కారణం అవుతోంది. జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రభుత్వం ఈ-కేవైసీ ఎందుకు ప్రవేశపెట్టిందనే విషయాన్ని ముందుగా రైతులకు తెలియజేస్తే దానిపై అవగాహన పెంచుకొని, వివరాల నమోదుకి ముందుకి వస్తారు. కానీ ఆపనిని అరకొరగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు.

గ్రామస్థాయిలో పరిస్థితి పట్టని జిల్లాఅధికారులు
గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వున్న ఆర్బీకేల ద్వారా ఈ-కేవైసీ, వివరాల నమోదు బాధ్యతను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారులు  అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లకు టార్గెట్లు విధిస్తున్నారు. తీరా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ముందుకి రావకపోవడంతో గ్రామస్థాయిలో సిబ్బంది ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటున్నది. ఆ విషయాన్ని మండల, జిల్లా అధికారులతోపాటు కలెక్టర్, జెసిలకు చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. తాము చెప్పిన పనిచేయాల్సిందేనంటూ తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. కొంత మంది మొండిగా పని చేయిస్తున్నా..మరికొంత మందికి ఈ ఒత్తిడి మానసి శిక్షగా పరిణమిస్తోంది. గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితి పలానా విధంగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోకపోతే తాము ఇంకెవరికి చెప్పాలంటూ గ్రామ సచివాలయశాఖలో పనిచేసే ఆర్టికల్చర్, అగ్రికల్చర్, సెరీకల్చర్ అసిస్టెంట్లు నెత్తీ నోరూ కొట్టుకుంటూ లబోదిబో మంటున్నారు. ఈ తరుణంలోనే అధికారు ఒత్తిడి తట్టుకోలేక హార్టికల్చర్ అసిస్టెంట్ వర్మ గోదావరినదిలోకి దూకి బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. 

బెదిరింపులు, ఒత్తిడి తోనే ఉద్యోగులతో విధులు
గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందితో జిల్లా అధికారులు తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు చేస్తూనే ఉద్యోగాలు చేయిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన తరువాత శాఖల వారీగా జిల్లా అధికారులు సచివాలయాల్లో సిబ్బంది పనిచేసే విధి నిర్వహణను తనిఖీలు చేస్తున్నారు గానీ, టూర్ డైరీలు, డ్యూటీ రిజిస్టర్లు, ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్న విషయాన్ని గానీ పట్టించుకున్నది లేదు. కానీ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలొస్తే మాత్రం ఆ పనిభారాన్ని సచివాలయ సిబ్బందిపై నేరుగా రుద్దేస్తున్నారు.  సచివాలయశాఖలో కూడా కొన్నిశాఖల సిబ్బందికి నేటికీపూర్తిస్థాయిలో పనిలేదు. కొంత మంది ఉన్నా వారంతా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. మరికొందరు పనిచేస్తున్నా అలాంటి వారిపైనే అధికారులు కూడా పనిభారాన్ని తీవ్రంగా మోపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జెసిలు, జిల్లా అధికారులు, మండల స్థాయిలో మండల అధికారులు ఆఖరికి సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిలు సైతం ఒకే విధంగా ఉద్యోగులపై తీవ్రస్థాయిలో బెదిరింపులు, ఒత్తిడి తీసుకు వచ్చి మాత్రమే పనిచేయిస్తున్నారు. మరికొంత మంది అధికారులు ఒక అడుగు ముందుకేసి పులిహోర కలిపి వారి, అవసరాలు తీర్చుకునే పనులు కూడా చేపట్టారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ప్రభుత్వశాఖల అధికారుల్లో కొరవడిన సమన్వయం
గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత సదరుశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా శాఖల అధికారుల్లో సమన్వయం పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. సచివాలయ శాఖలో ఉన్న 19శాఖలకు సంబంధించిన ఆయాశాఖల ముఖ్యల కార్యదర్శిలు, కమిషనర్లు ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు ప్రాపర్ ఛానల్ లో మండల అధికారులకు పంపడం లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయంల నుంచి ఉత్తర్వులు రాకపోయినా..సచివాలయ సిబ్బంది సదరు ప్రభుత్వశాఖ ద్వారా జారీ అయిన ఉత్తర్వులను సేకరించి ఈ విషయాన్ని మండల అధికారులకు తెలియజేసినా..చూపించినా అవి బుట్టదాఖలు అవుతున్నాయి. తమకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేస్తే తప్పా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వచ్చినా వాటిని అమలు చేసేది లేదంటే వాటిని ఏమీకాకుండా పక్కన పడేస్తున్నారు. పైగా సచివాలయంలోని ఎవరిశాఖల ఉద్యోగాలు, వారి శాఖల విధులు చేసుకోనీయకుండా మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు తీవ్ర ఒత్తిడిలు తీసుకొస్తున్నారు. 

ఒక్కముక్కలో చెప్పాలంటే మండల శాఖ అధికారులే సచివాలయశాఖ రాష్ట్ర ముఖ్యకార్యదర్శిలుగా వ్యవహరించడం విశేషం. ఒక్క విధి నిర్వహణలోనే కాకుండా పర్మిషన్లు, సెలవులు, సభలు సమావేశాలకు వెళ్లాలన్నా కూడా మండల అధికారుల అనుమతి కావాలని ఆదేశించి వాటిని కార్యదర్శిల ద్వారా అమలు చేయడం కూడా సచివాలయ సిబ్బంది విధి నిర్వహణకు, పనిఒత్తిడికి కారణం అవుతోంది. కేవలం జిల్లా కలెక్టర్ నుంచి మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిల వరకూ పరిపాలన విషయంలో సమన్వయం లేకపోవడమే ఉద్యోగులపై ఒత్తిడికి కారణం గా కనిపిస్తున్నది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై ఆ తరువాత మరో ఉద్యోగం చూసుకొని వెళ్లిపోతున్న ఉద్యోగల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మరికొందరు ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలకు రిజైన్ చేసి కూడా వెళ్లిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నా జిల్లా అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో పనిఒత్తిడి అధికమై సచివాలయ సిబ్బంది బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ద్రుష్టిసారించకపోతే ప్రజలకు సేవలందించే సచివాలయ ఉద్యోగుల పడుతున్న తీవ్రమైన ఒత్తిడి, అధికారుల మొండి వైఖరి, వ్యహార తీరుపై వ్యతిరేకత, నిరసన అధికమై ప్రభుత్వానికి మచ్చ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!

Amaravati

2022-10-18 05:58:09

5 మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది ప్రవేశాలు

రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా కొత్తగా ఏర్పాటు కానున్న ఐదు వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. శనివారం విజయనగరం జిల్లా ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ లు చేపట్టేందుకు అవసరమైన వసతులు కల్పించడంపై దృష్టి సారించామన్నారు. ఈ ప్రాంతాల్లో భారతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ౩౩౦ పడకల ఆసుపత్రులు అందుబాటులో ఉన్నందున ఆయా ప్రదేశాల్లో వచ్చే ఏడాది నుంచి తరగతులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన అదనపు వసతులు కల్పిస్తూ భవనాలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

 జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాల భవనాల నిర్మాణ పరిస్థితి, బోధనాసుపత్రిగా రూపొందించనున్న జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కల్పిస్తున్న అదనపు వసతులు ఏ మేరకు జరుగుతున్నాయనే పరిశీలన  చేసే నిమిత్తం ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు  జిల్లా కేంద్రంలో పర్యటించారు. తొలుత గాజులరేగ వద్ద నిర్మాణంలో వున్నా వైద్య కళాశాల భవనాల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. వచ్చే డిసెంబర్ నాటికి వైద్య కళాశాల భవనాలు సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థ ఎన్.సి.సి. ప్రతినిధులకు సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్య కార్యదర్శి  బోధనాసుపత్రిగా మార్పు చేయనున్న దృష్ట్యా దీనికి అవసరమైన అదనపు సౌకర్యాల కల్పన ఏ మేరకు జరిగిందనే విషయం తెలుసుకునేందుకే ఈరోజు పర్యటిస్తున్నట్టు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. 

ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల్ని ఏర్పాటుకు నిర్ణయించారని, దీనిలో భారత వైద్య మండలి నిబంధనల మేరకు ౩౩౦ పడకల ఆసుపత్రి సిద్ధంగా వున్నచోట వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్య కళాశాల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అధ్యాపకుల నియామకం కోసం ప్రక్రియ ప్రారంభించి కొందరిని ఎంపిక చేయడం జరిగిందని, మిగిలిన పోస్టులకు నియామకాలు వచ్చే  వారంలో చేపడతామన్నారు. 

2022-10-15 11:27:03

ఏపీ ప్రభుత్వం దిమ్మతిరిగే ఉత్తర్వులు.. 17నుంచి పులుసు కారిపోద్ది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉద్యోగుల విషయంలో దిమ్మతిరిగే ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా జిల్లా కలెక్టర్లతో ఎన్ని వార్నింగులు ఇచ్చినా అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే చాలా సీరియస్ గా తీసుకుంది. 17వ తేదీ నుంచి ప్రతీ ఉద్యోగి ఉదయం పదగంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధి నిర్వహణలో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ప్రతీనెలా 75 ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇలా మొత్తం వారి మాన్యువల్, బయో మెట్రిక్ అటెండెన్సు సాధారణ పరిపాలనశాఖకు పంపించాలని పేర్కొంది.  

ఇకపై ఉద్యోగులు విధినిర్వహణలో చేసిన విధులకు సంబంధించి మాత్రమే జీతబత్యాలు ఇచ్చేలా చర్యలు తీసుకోబుతన్నారనే వార్నింగ్ కూడా ఉత్తర్వులతో పేర్కొంది. ఇటీవలే ఐఏఎస్ అధికారులకు సైతం ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు అమలు చేసిన ప్రభుత్వం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలనే ఉత్తర్వులు ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లుపరిగెట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ ఎన్నిఆదేశాలిచ్చినా వాటి అమలు చేయని ప్రభుత్వ శాఖలు తాజాగా ఇచ్చిన ఈ టైమింగ్ ఉత్తర్వులను ఏవిధంగా పాటిస్తారు.. ఏ మరకు విధిర్వహణ సాగిస్తారనేది..!

2022-10-15 10:44:58