1 ENS Live Breaking News

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. నాంపల్లి నుమాయిష్ కు వచ్చే సందర్శకుల కోసం మెట్రో సేవలను మరో గంటపాటు పొడిగించింది. దీనితో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఎల్బీనగర్, నాగోల్, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల నుండి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో బయల్దేరనుంది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం రూట్లలో మాత్రమే మెట్రో వేళలను పొడిగించారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో ప్రయాణించాలకునేవారికి మెట్రో చాలా ఉపయుక్తం కానున్నది.

Hyderabad

2023-01-02 04:46:33

గుంటూరు మృతులకు రూ.30 లక్షల పరిహారం

గూంటూరు టిడిపి సభ, తొక్కిసలాటలో మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చంద్రబాబుపై ఫైర్ అవుతున్న సమయంలో ఊహించని నష్టపరిహారం ప్రకటనలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షలు ఇస్తామని ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటించింది. ఇటు టిడిపి తరపున ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించగా, టిడిపీనేత కె.రవీంధ్ర రూ.2లక్షలు, డేగల ప్రభాకర్ రూ.లక్షచొప్పున ప్రకటించారు. కాగా రాష్ట్రప్రభుత్వం రూ.2 లక్షలు ప్రకటించింది. ఈ ఘటన సగటు పాఠకుడిగా మీ అనాలసిస్ కామెండ్ చేయండి.

Guntur

2023-01-01 17:23:28

ఆ మృతుల బాధ్యత చంద్రబాబుదే..విడదల రజనీ

చంద్రబాబుకి అర్జెంటుగా అధికారం తెచ్చేసుకోవాలనే యావతో పెట్టే సభలు, సమావేశాలు ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మండి పడ్డారు. గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయిన ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రి విడదల రజిని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జరిగిన రెండు సభలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నా చంద్రబాబుకి ఏమీ పట్టడం లేదన్నారు. ఏదో కానుకలు ఇస్తామని ఫేక్‌ ప్రచారం చేశారని, వాహనాలు పెట్టి జనాలను తరలించారని మంత్రి రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావ, అధికార దాహంతోనే ఈ దారుణం జరిగిందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Tadepalli

2023-01-01 16:50:01

గ్రామ సచివాలయాలకు ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమం తప్పకుండా సమయానికి ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్ మూడు సార్లు వేయాల్సి వుంటుం ది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయా ల్లో స్పంద న గ్రీవియన్స్ ప్రతీరోజూ మధ్యాహ్నాం 3 నుంచి 5గంటల వరకూ చేపట్టాలి. అలా చేపట్టకపోయి నా, అన్నిశాఖ సిబ్బందితోపాటు కార్యదర్శిలు సచివాలయాల్లో అందుబాటులో  లేకపోయినా చర్యలు తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఒక పూట కట్ చేస్తారు. 3 ఆలస్యా లకు ఒకరోజు జీతం కట్ చేస్తారు.

Tadepalli

2023-01-01 14:48:03

APPSC గ్రూప్-1 దరఖాస్తుల ద్వారా రూ.4.67 కోట్లు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ లో ప్రకటించిన 92 పోస్టులకు ఏకంగా ఒక లక్షా 26వేల 449 మంది దరఖాస్తు చేస్తున్నారు. అంటే కేవలం దరఖాస్తుల ద్వారానే 4 కోట్ల 67 లక్షల 86వేల 130 రూపాయాల ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజు రూ.250 కాగా ప్రాసెసింగ్ ఫీజ్ రూ.120 అభ్యర్ధిలు  చెల్లించారు. దీనితో ఏపీపీఎస్సీకి భారీగానే ఆదాయం సమకూరింది. కాగా సర్వీస్ కమిషన్ ఈనెల 8వ తేదీన గ్రూప్ -1 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎంత మంది పోటీపడుతున్నారనే విషయం ఆరోజు సాయంత్రానికి గాని తెలీదు.

Tadepalli

2023-01-01 06:49:05

తూచ్.. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో మళ్లీ ఇంటర్వ్యూలు

ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే గ్రూప్-1, 2 పోటీపరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి మడమ తప్పింది. ప్రస్తుతం తీయబోయే గ్రూప్-1 పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయిన తరువాత ఇంటర్వ్యూలు పెట్టి పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తీస్తున్న 92 గ్రూప్-1 పోస్టులకు గతంలో భర్తీకాని 18 గ్రూప్-1 పోస్టులు కలిపే అవకాశం కూడా ఉందన్నారు. దానికి పాలనా పరమైన అనుమతులు రావాల్సి వుంటుందన్నారు. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తయితే గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్-1, 2, పోస్టులకు ఇంటర్వ్యూలు తీసేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ ఇంటర్వ్యూలు పెట్టడం విశేషం.

Tadepalli

2023-01-01 04:20:57

రత్నగిరిపై అందుబాటులోకి హరిహర సదన్ సత్రం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం సత్యగిరి కొండపైనఉన్న హరిహర సదన్ భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శనివారం నుంచే భక్తుల సౌకర్యార్ధం గదులు భక్తులకు కేటాయించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్టు దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు సత్రము వద్దనే రూమ్స్ భక్తులకు కేటాయిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. భక్తుల ఈవిషయాన్ని గమనించి హరిహర సదన్ సత్రము గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

annavaram

2022-12-31 12:04:41

ప్రెస్ అక్రిడిటేషన్లకు 3నెలలు కాలపరిమితి పొడిగింపు

ఏపీ సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసిన ప్రెస్ అక్రిడిటేషన్ల గడువు ఈఏడాది 31తో యుగియడంతో మరో మూడు నెలలు అంటే 31‌-03-2023 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మీడియా సంస్థలు, దినపత్రికల యాజమాన్యాలు సదరు అక్రిడిటేషన్ జర్నలిస్టుల జాబితాను తెలియజేస్తూ ఉమ్మడి 13 జిల్లాల డీపీఆర్వో కార్యాలయాలకు స్వయంగా లేఖలు పంపాల్సి వుంటుంది. ఈనేపథ్యంలో విధుల నుంచి తప్పుకున్నవారు, మానేసిన వారి జాబితాలను కూడా తెలియజేయాల్సి వుంటుంది తప్పితే.. కొత్తగా పేర్లు నమోదు చేయడానికి అవకాశం లేదు. లేఖలు ఈనెల 31నాటికి అన్నిజిల్లా డీపీఆర్వో కార్యాలయాలకు అందజేయాల్సి వుంటుంది. (BEST COACHING FOR SI & CONSTABLE : KEERTI COMPETITIVE INSTITUTE : KAKINADA ‌-9032228708)

Tadepalli

2022-12-28 07:42:35

సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వింతలే జరుగుతుంటాయి.. ఏపీలో13 జిల్లాలను విభజించి 26 జిల్లా లను చేస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ పబ్లికేషన్ చేసినా నేటికీ కేంద్రంలోనూ, రాష్ట్రపతి వద్ద ఇంకా కొత్త జిల్లాల ఆమోద ముద్రపడలేదు. ఇది చాలదన్నట్టు కొత్త జిల్లాల ఏర్పాటైనా కొత్తజిల్లాల్లో పరిపాలన పూర్తిస్థాయిలో జరగలేదు. కనీసం మీడియా ద్వారానైనా గుర్తింపు వచ్చి చస్తుందా అంటే అదీ లేకుండా పోయింది. ఇపుడు కొత్తగా జర్నలిస్టు సంఘాల నేతలందరూ తమకు ప్రభుత్వం ఇచ్చే ఆ కొన్ని ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి జిల్లాల నుంచే ఇవ్వాలని కోరుతున్నారట. మరీ వెటకారం కాకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటై..అన్నిజిల్లాలకు ప్రభుత్వం కలెక్టర్లను కూడా నియమిచింది. కొత్త జిల్లాల్లో కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు కలెక్టర్లు మాత్రమే జారీచేయాలి. కారణం అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టరే కనుక. అలా కాకుండా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల గొంతమ్మకోర్కెలు విని ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తే..కొత్త జిల్లాల్లో కలెక్టర్లు ఎలాంటి అధికారాలు, చైర్మన్ హోదాలు లేనట్టుగానే గుర్తించాల్సి వుంటుంది. అదే జరిగితే కేవలం సమాచారశాఖ ద్వారానే కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల స్థాయి తగ్గించిన శాఖగా గుర్తింపు కూడా పొందుతుంది.

కొత్త జిల్లాలకు మీడియా ద్వారానే అసలైన గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన 13 కొత్తజిల్లాలు, పరిపాలన ప్రజలకు తెలియాలన్నా, పరిపాలన గాడిలోపడి కేంద్రప్రభుత్వ గుర్తింపు రావాలన్నా మీడియా ద్వారానే జరగాల్సి వుంటుంది. కానీ ఇపుడు అదే మీడియా ద్వారా కొత్తజిల్లాలకు, అక్కడి కొత్త కలెక్టర్లకు గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. కొత్త జిల్లాలు ఏర్పాటై ఇంతకాలం అవుతున్నా నేటికీ కొత్తజిల్లాల్లోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర 75 ప్రభుత్వశాఖల అధికారులకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. సగం సమాచారశాఖ గుర్తింపు రానీయకుండా చేస్తే..మరో సగం మిగిలివున్న మీడియా బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నది. అసలు సమాచారశాఖలోనే ఉమ్మడి జిల్లాల సమాచారశాఖ అధికారులు అటు రాష్ట్ర కమిషనర్ ను, సమాచారశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి కొత్త జిల్లాల్లో జరిగే కార్యక్రమాలు మీడియా ద్వారా దేశవ్యాప్తం కావాలి. కానీ కొత్త జిల్లాల పేర్లు పలకడానికి సమాచారశాఖ ద్వారా విస్త్రుత మీడియా ప్రచారం చేయడానికి సమాచారశాఖలోని అధికారులు ముందుకి రావడం లేదు.

పాతజిల్లాల నుంచే అక్రిడిటేషన్లు కావాలంటే కొత్తజిల్లాలెందుకు
ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్రెస్ అక్రిడిటేషన్ల జారీ భారీ మొత్తంలో పడిపోయింది. వచ్చే ఆ కొద్దపాటి ప్రెస్ అక్రిడిటేషన్లు పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఇవ్వాలంటూ కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఏపీ సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదారి పట్టిస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికోసం ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి కొత్త పరిపాలనా విధానాలను అమలు చేసిన తరుణంలో కొందరు జర్నలిస్టులు, మరికొందరు జర్నలిస్టు సంఘాల నేతలు ప్రెస్ అక్రిడిటేషన్ విషయంలో సమాచారశాఖను తప్పుదారి పట్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమాచారశాఖ కారణంగానే కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలు, డీడీలు ప్రభుత్వ సమాచారం ఇవ్వకుండా సోకాల్డ్ మీడియా జర్నలిస్టులతోనే ప్రెస్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వ అభివృద్ధిని, సమాచారాన్ని ప్రజలకు తెలియనీయకుండా సాయశక్తులా కృషిచేస్తున్నారు. ఇపుడు మళ్లీ ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో కూడాకొత్తజిల్లాల్లో కాకుండా.. ఉమ్మడి జిల్లాల్లో ఇస్తే రాష్ట్రంలో కొత్తజిల్లాల కలెక్టర్లు అధికారం లేనట్టుగా తేటతెల్లం అయిపోతుంది. ఇప్పటికైనా సమాచారశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి కొత్త అక్రిడిటేషన్ల విషయంలో నూతన జిల్లాల నుంచి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా కొత్తజిల్లాలకు గుర్తింపు రావడంతోపాటు, మీడియా ద్వారా కొత్త జిల్లాకలెక్టర్లు కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. లేదంటే కేంద్రం, రాష్ట్రపతి దృష్టిలో మాదిరిగానే ఇంకా ఏపీలో 13 జిల్లాలనే భావనతోనే అధికారికంగా ఉండాల్సి వస్తుంది..!

Tadepalli

2022-12-27 10:51:39

పెద్ద కబుర్లాడే అధికారుల పాలిట పాసుపతాస్త్రం..!

పేరుకే వారంతా సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 అధికారులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పెద్దగా పట్టించుకోరు..పైగా ప్రభుత్వం యొక్క బాధ్యతను వారే తమ బుజాలపై తెగ మోసేస్తున్నట్టు ఇచ్చే ఫీలింగ్, కలరింగ్, బిల్డప్ మామూలుగా ఉండదు. కిందిస్థాయి ఉద్యోగులు చేసే పనిని, పడిన కష్టాన్ని వీరి ఖాతాలోకి మళ్లించుకొని ప్రభుత్వం దగ్గర చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఆఫీసుకి గంట ఆలస్యంగా వచ్చి రెండు గంటలు ముందు ఇంటికి వెళ్లిపోయే అధికారులను గాడిలో పెట్టడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ బయో మెట్రి అటెండెన్స్ ఉత్తర్వులపై(ఏస్థాయి అధికారైనా బయోమెట్రిక్ వేయాల్సిందే) క్రిందిస్థాయి సిబ్బంది, నిబద్దతలో పనిచే అధికారుల నుంచి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఖచ్చితంగా బయో మెట్రిక్ వేయాల్సిందేననే నిబంధనను అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి బయట ప్రైవేటు పనులు చేసుకునేవారికి సింహ స్వప్నం లాంటి నిబంధన ఇన్నేళ్ల తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపై ఉద్యోగి అంటే కార్యాలయంలో ఉండి తీరాలనే నిబంధన అమలు కావడంతోపాటు, ప్రజల సమస్యలు కూడా సత్వరమే పరిష్కారం అవుతాయనే భావన ప్రతీ ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది.

75ఏళ్ళ చరిత్రలో ఒకే ఒక్క..ప్రభుత్వం
75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకూ బయో మెట్రిక్ వేసి విధులు నిర్వహించేలా చేసిన ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ జగన్ ప్రభుత్వం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులంటే నచ్చిన సమాయానికి వస్తాం..చిరాకొస్తే ఇంటికి వెళ్లిపోతామనే దోరణిలోనే ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల వ్యవహారం నడిచింది. కానీ చరిత్రలో మొట్టమొదటి సారిగా..అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ, కార్యాలయ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ బయో మెట్రిక్ అటెండెన్సు(ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్) వేయాలనే నిబంధన తీసుకురావడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ విధానం ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఇబ్బందిగా ఉన్నా సరైన ప్రభుత్వసేవలు సకాలం అందాలంటే ప్రతీ ఉద్యోగీ, అధికారి ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాల్సి అవసరం వుంది. దానికోసం ఏర్పాటు అన్నిశాఖల, అన్ని స్థాయి అధికారులు అటెండెన్సు వేయాలనే నిబంధన ఇపుడు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు పొందుతోంది..

కల్లబొల్లి మాటలకు, డుమ్మావిధులకు ఇక చెల్లుచీటి
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ విధానం వలన ప్రతీసారి కల్లబొల్లి మాటలు చెబుతూ విధులకు డుమ్మాకొట్టేవారు, కాకమ్మ కబుర్లు చెప్పి ప్రభుత్వ విధినిర్వహణలో బయటకు వెళ్లిపోయి సొంత పనులు చూసుకునేవారు,నేనొక్కడినే తెగ కష్టపడిపోతున్నాను.. మిగిలిన వారంతా కూర్చొని జీతం తీసేసుకుంటున్నారని తెగఫీలైపోయే ప్రభుత్వ కొలువు వెలగబెడుతున్నమహానుభావులందరూ ఇక చచ్చినట్టు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందే. అంతేకాకుండా ఎంతసేపు ఆలస్యంగా వస్తే అంతసేపు కార్యాలయంలో విధులు నిర్వహించాలి..లేదంటే జీతంలో కోత వంటి చర్యలు కూడా అమలు చేస్తామంటున్న ప్రభుత్వ చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయనే ఆశాభావాన్ని విధినర్వహణే దైవంగా బావించే ఉద్యోగులు, అధికారులు చక్కగా స్వాగతిస్తున్నారు. గతంలో ఆడుతూ, పాడుతూ, విధులకి వచ్చే వారందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇపుడు గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు తయారైంది.

అమలు చేస్తేనే అసలైన ప్రగతి..లేదంటే తిరోగమనమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు బయో మెట్రిక్ వేయాలనే నిబంధన ద్వారా జవాబుదారీ తనాన్ని పెంచనుంది. అదే సమయంలో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగినీ సమయానికి కార్యాలయానికి తీసుకొచ్చి పనిచేయించిన ఘనత కూడా ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి దక్కుతుంది. అదే సమయంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి వ్యతిరేకత వస్తుందని ఈ నిబంధనల్లో సడలింపులు చేస్తే ప్రగతి మాట అలా ఉంచితే..ఉన్న కాస్త ప్రగతి కూడా తిరోగమనంలో పయనించే పరిస్థితి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడిలు ఎక్కడ నుంచి వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ ను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చుననే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే ఎలా పనిచేసినా, వెళ్లినా, వెళ్లకపోయినా నెల అయ్యేసరికి జీతాలు వచ్చేస్తాయన్న ధీమా నుంచి నెల పూర్తయినా జీతాలు వస్తాయో రావో అనే పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులకు రుచి చూపించిన ప్రభుత్వం, ఇపుడు అన్నిస్థాయిల అధికారుల చేత పనిచేయించాలని తీసుకున్న ఈ 

నిర్ణయం మాత్రం ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాలంటే వెయ్యిరెట్లు మెరుగ్గా వుందని సాధారణ ప్రజల నుంచి పనిచేసే అధికారులందరూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. చూడాలి పెద్దకబుర్లాడే అధికారులతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ అటెండెన్సు ఏ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచి పనిచేయిస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందనేది..!

Tadepalle

2022-12-27 09:46:33

ఏపీలో26 జిల్లాల సంఖ్య ప్రభుత్వానికి కీడుని తెస్తున్నదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని 26 జిల్లా సంఖ్య(2+6=8 ఈ సంఖ్య సంఖ్యాశాస్త్రం ప్రకారం దెయ్యం లేదా డెవిల్ సంఖ్య అంటారు) కీడు తెస్తున్నదా..అంటే అవుననే అంటున్నారు న్యూమరాలజిస్టులు. ఇదే సంఖ్యతో ప్రభుత్వం తన పరిపాలన కొనసాగిస్తే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చ రిస్తున్న అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన సమయంలోనే ఈ విషయాన్ని న్యూమరాలజిస్టులు ప్రభుత్వం దృష్టికి, కొందరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం అనుకున్నట్టుగా కేవలం 26 జిల్లాలనే రా జపత్రం (గెజిట్ నోటఫికేషన్) ద్వారా ప్రకటించి ప్రచురించింది. అప్పటి నుంచి చాలా విషయాల్లో ప్రభుత్వాకి అంతా కీడే జరుగుతున్నదని, కొత్త జిల్లా బిల్లుకి కేంద్రంలో రాష్ట్రపతి ఆమోద ముద్రలభించలేదని, పోలవరానికి నిధులు ఆగిపోయాయని, 3 రాజధాను అంశం ముందుకు వెళ్లలేదని, నవరత్నాల్లోని ముఖ్యమైన మధ్యపాన నిషేదాన్ని అమలు చేయలేకపో తున్నారని, అభివృద్ధి సక్రమంగా జరగక ఆర్ధికంగా ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయని..న్యూమరాలజిస్టులు చెప్పుకొస్తున్నారు. ఇటీవల కాలం ఆ ప్రచారం మరింత అధికమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. అటు ప్రభుత్వం కూడా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది..పరిపాలనా పరమైన ఇబ్బదులు, ప్రజల జిల్లా కేంద్రానికి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయా అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం వస్తు న్నది.

26 సంఖ్య వెనుక ఏమున్నది..ఏం చెబుతుంది..
న్యూమరాలజీలో 8వ సంఖ్యలను డెవిల్ నెంబరు అనిపిలుస్తారు. అదే 9వ సంఖ్యను కింగ్ నెంబర్ అని పిలుస్తారు. కింగ్ నెంబరు కావాలని కోరుకునేవారు చాలా మంది వారు తీసుకున్న మొబైల్ నెంబరు గానీ, వాహనాల నెంబర్లు గానీ తొమ్మిది వచ్చేలా తీసుకుంటారు. టోటల్ 8 సంఖ్య వచ్చేలా ఎవరూ తీసుకోరు. 100 మందిలో ఈ 8వ అనే సంఖ్య ఒకటి నుంచి 5 గురు సభ్యులకు కూడా పనిచేయదని..ఇది కంప్లీట్ గా డివిల్ నెంబరు అని నమ్ముతారు. అదే క్రైస్తవులైతే ఈ సంఖ్యను సాతాను(దెయ్యం)గా అభివర్ణిస్తారు. అలాంటిది ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా మార్చారు. ఇపుడు ఆ కొత్త జిల్లాలు అభివృద్ధి 26 జిల్లాల సంఖ్య కారణంగానే  నోచుకోలేదని.. అంతేకాకుండా ప్రభుత్వం కోర్టుల్లో వేసిన కేసులను గెలువలేకపోతున్నదని, ఏ విషయంలోనూ గ్రహాలు అనుకూలించక అభివృద్ధి పనులకి ముందడుగు పడటం లేదని, ఆదాయం పెరగడం లేదని, శాస్వత అభివృద్ధి పనులు సైతం చేపట్టలేకపోతున్నదనేది ప్రస్తుతం జరుగుతున్న వాదన. వాదన అనేకంటే ప్రస్తుత రాష్ట్రం యొక్క ఆర్ధిక పరిస్థితి కూడా అలానే వున్నదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్యను ఒక కొత్తజిల్లా అదనంగా చేర్చి 27 జిల్లాలు చేస్తే ఆ సంఖ్య న్యూమరాలజీ(సంఖ్యాశాస్త్రం) ప్రకారం ఇటు ప్రభుత్వానికి జిల్లాలకు కూడా మంచి జరుగుతుందని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు.  

27వ జిల్లా ఏర్పాటు సుగమం అయ్యిందా..?
ఏపీలో కొత్తజిల్లాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 26 సంఖ్య న్యూమరాలజీ ప్రకారం డెవిల్ నెంబరు అనే ప్రచారాన్ని అటుంచితే..పరిపాలనా పరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నది. 26 జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవర ఐటీడీఏ ప్రాంతాన్ని కూడా చేర్చారు. దీనితో జిల్లా కేంద్రం పాడేరుకి ఇక్కడి ప్రజలు వెళ్లాంటే ఒకరోజంతా ప్రయాణం సుమారు 485 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప వెళ్లలేరు. అదేవిధంగా అధికారుల పరిస్థితికూడా అంతే. ఈ ప్రాంతం నుంచి మండల, డివిజన్ అధికారులు పూర్తిస్థాయిలో జిల్లా కేంద్రానికి, జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాలను అనుకున్న సమయంలో రాలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దానిని దృష్టిలో ఉంచుకొని ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి తరువాత 27వ జిల్లాగా రంచపచోడవరం రెవిన్యూ డివిజన్ లోని 11 మండలాలు కలుపుతూ ఒక జిల్లాగా చేయాలని భావిస్తున్నట్టు ఒక ఉన్నతాధికారి ఈఎన్ఎస్ తో చెప్పుకొచ్చారు. 

అయితే అది కార్యరూపం దాల్చుతుందా..లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వున్నదనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 26 అనే సంఖ్య మొత్తం కలిపితే 8 వస్తుందని..ఈ నెంబరు కీడు,చెడుకి సంకేతమనే విషయం ఇటు ప్రుభుత్వం దృష్టికి కూడా వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రచారాలు, సంఖ్యాశాస్త్రం తదితర అంశాలను పక్కనపెడితే అల్లూరి జిల్లాలకు ఆ మూలన వున్న రంపచోడవరం ప్రాంతాన్ని జిల్లాగా విడదీయడం ద్వారా పరిపాలన సౌలభ్యం, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని విషయం ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలపై పోరాటం చేసిన ప్రాంతాలన్నీ ఒకే జిల్లాల్లో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా తయారు చేసిందన్నారు.

ఇపుడు ప్రధానంగా రంపచోడవరం ప్రాంతాన్ని తప్పితే జిల్లాకి పెట్టిన పేరు విషయంలో భావం పోతుందన్నారు..కానీ ఇపుడు అన్ని అంశాల్లోనూ పరిపాలనా ఇబ్బందులు, అధికారులు, ప్రజల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నదన్నారు. ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని కొత్తజిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని.. అల్లూరి జిల్లా భావం పోకుండా అల్లూరి పోరాటం చేసిన ప్రాంతాలను విభజించకుండా కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తారా అనే విషయం కూడా పరిశీలనలో ఉందన్నారు. న్యూమరాలజీ చెబుతున్నట్టుగా 26 సంఖ్యను 27 చేయడంతోపాటు ప్రజల ఇబ్బదులను తీర్చడానికి 27వ జిల్లా రాష్ట్రంలో ఏర్పాటవుతుందే సంకేతాలైతే వస్తున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2022-12-27 02:24:24

దర్శన టోకెన్‌ ఉన్న భక్తులకు వైకుంఠద్వార దర్శనం

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300/` ఎస్‌ఇడి టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్‌టిసి బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌,
ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పి హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు.

భక్తులు టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యసదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈవో వెంట అదనపు ఈవో(ఎఫ్‌ఏసి)  వీరబ్రహ్మం, 
సివిఎస్వో నరసింహ కిషోర్‌,  ఎస్వీబీసీ సిఈవో  షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌  నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2  జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ట్రాన్స్ పోర్టు జిఎం  శేషారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి  శాస్త్రి తదితరులు ఉన్నారు.

Tirumala

2022-12-26 11:25:45

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ మరో జాబ్ నోటిఫికేషన్..?

ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. దానికోసం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మిగిలిన ఉద్యోగాల భర్తీచేపట్టనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం 2019లో లక్షా 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా అపుడు 1.20వేల మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఆ తరువాత పలు ప్రభుత్వశాఖల్లో విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాల క్రింద కొన్ని పోస్టులను భర్తీచేసింది. ఇంకా మిగిలిని ఉద్యోగాలను శాఖల వారీగా విడి విడిగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీచేయడానికి ఏర్పాట్లు పూర్తి అయినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దానికోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీ వివరాలను ప్రభుత్వం సేకరించి ఉంచింది.

Tadepalli

2022-12-25 11:43:40

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవలే ఇచ్చిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించి అభ్యర్ధుల వయోపరిమితిని రెండేళ్లకు పెంచారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకపోవడం, చాలా మంది అభ్యర్ధులకు వయస్సు దాటిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖ ద్వారా వెళ్లిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోద ముద్రవేశారు. దీనిపై అధికారిక ప్రకటన సోమవారం వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం అభ్యర్ధుల వయోపరిమితి రెండేళ్లు పెంచడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. అంతేకాకుండా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారిక సంఖ్య కూడా భారీగా పెరగనున్నది.

Tadepalli

2022-12-25 08:08:12

27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27న బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. ఆరోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉన్న కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని మీడియా ద్వారా తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏడాది స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ నిర్వహిస్తుంటారు.

Tirumala

2022-12-25 07:49:15