1 ENS Live Breaking News

2020-12-01 08:32:36

మహిళల రక్షణే ధ్యేయంగా మహిళా మార్చ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ‘వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌’ను తన కార్యాలయంలో విడుదల చేశారు. ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్‌, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్‌ నంబర్లపై ...మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నకార్యక్రమం కోసం ఈబ్రోచర్ ఆవిష్కరణ చేపట్టారు. 100 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్‌ నేరాలపై మహిళా కమిషన్‌ అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ ఆర్కే రోజా,  వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ సుయజ్‌ తదితరులు  పాల్గొన్నారు.

Velagapudi

2020-11-30 14:53:47

ప్రజాప్రతినిధుల భద్రతపై రెండో కోణం..

ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పేర్నినానిపై క్రిష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. మిగిలిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ప్రజాప్రతినిధుల దగ్గరకు ప్రజలు నేరుగా వెళ్లి అర్జీలు ఇచ్చేవారు కానీ పేర్నినానిపై జరిగిన హత్యాయత్నం తరువాత ఇక నుంచి అర్జీలు భద్రతా సిబ్బంది మాత్రమే తీసుకునే చేయాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధులకు భద్రత కట్టుదిట్టం చేయకపోతే పోలీసు వైఫల్యంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే అవకాశం వున్నందున నిఘావర్గాలను సైతం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటనలో భాగస్వామ్యం చేయనున్నారని సమాచారం. అలా చేయకపోతే అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల దగ్గరకు ఎవరు వస్తున్నారు, ఎవరేంచేస్తున్నారనే విషయం అర్ధం అయ్యేలోపే ప్రమాధాలు సంభవిస్తాయని కూడా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అయితే ప్రజాప్రతినిధుల భద్రతను పెంచుతారా లేదంటే ఉన్నవారినే జాగ్రత్తగా ఉండేలా చేస్తారా...టార్గెట్ లో ఉన్న మంత్రులకు గన్ మేన్ లను పెంచుతారానే అనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది..

Velagapudi

2020-11-30 12:55:15

2020-11-29 16:33:50

2020-11-29 16:11:12

తిరుమలలో డిసెంబరు 14 నుంచి అధ్య‌య‌నోత్స‌వాలు..

* డిసెంబ‌రు 16న ధ‌నుర్మాసం ప్రారంభం. * డిసెంబ‌రు 20న సుబ్ర‌మ‌ణ్య‌ష‌ష్టి. * డిసెంబ‌రు 24న శ్రీ‌వారి స‌న్నిధిన చిన్న‌సాత్తుమొర‌. * డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి. *డిసెంబ‌రు 26న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి. * డిసెంబ‌రు 29న ద‌త్త జ‌యంతి.

Tirumala

2020-11-29 15:51:22

వేతన సంఘ సిఫార్సులు అమలు చేయాలి..

వేతన సంఘం చేసిన సిఫార్సులను అమలు చెయ్యకుండా అనేక మార్గాల్లో మేనేజ్మెంట్లు దారులు వెతుకుతున్నాయని, సక్రమంగా అమలు చేసేందుకు ఫిబ్రవరిలో ఢిల్లీలో సమావేశమై ఒక కార్యా చరణ పధకం రూపొందించేందుకు  "అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ " (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్) సమాయత్తం కావాలని నిర్ణయించింది. ఈ రోజు ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ నిర్వహించిన జూమ్ సమావేశం అధ్యక్షులు శివకుమార్ సింగ్ ఠాకూర్(నాగపూర్) అధ్యక్షత వహించారు.ప్రదాన కార్యదర్శి వి.బాలగోపాలన్ (తిరువనంతపురం) మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న జర్నలిస్టులను, నాన్ జర్నలిస్టులను ఆదుకోవాల్సిన పలు మీడియా హౌస్ ల యాజమాన్యం ఉద్యోగులను తొలగించడం,జీతంలో కోటవిధించటం చాలా బాధాకరం అన్నారు. వేజ్ బోర్డ్ వేతనాలు అమలు కోసం పాత్రికేయులు,పాత్రికేయ ఇతరుల సమాచారాన్ని సేకరించడం జరుగుతోందని,అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్యను సేకరించాలని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఠాకూర్,బాలగోపాలన్ లు అన్ని రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులని కోరారు.అలాగే ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు,కర్ణాటకల లో ఫెడరేషన్ ని మరింత బల పరచి,ఆ రాష్ట్రాల్లోని జర్నలిస్ట్,నాన్ జర్నలిస్ట్స్ సమస్యలను పరిష్కరించాలని సీనియర్ జాతీయ ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర రావు ని ఆదేశించారు. జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు సీహెచ్ పూర్ణచంద్ర రావు (విజయవాడ)  నుండి ఈ జూమ్ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోప్రముఖ తెలుగు డైలీ విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ తో సహా 30 మంది వరకు కోవిడ్ మహమ్మారి భారిన పడి మరణించారని,వారి కుటుంబాలకు ఒక్కరికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. అలాగే దేశంలోనే ఏకైక ఇంగ్లీష్,హిందీ,ఉర్దూ భాష లలో వార్తలను అందిస్తున్న జాతీయ వార్తా సంస్థ "యూ ఎన్ ఐ "  యాజమాన్యం లోప భూఇష్టమైన నిర్ణయాలతో క్లిష్టమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయి ఉద్యోగులకు 45 నెలల జీతాలు బకాయిలు పడిందని,ఇలాంటి స్థితిలో ఎంతో కొంత ఆర్ధిక చేయూత కల్పిస్తున్న ప్రసారభారతి తన సబ్స్క్రిప్షన్ విరమించుకోవటం తో మరింత సంక్షోభం లోనికి నెట్ట బడిందని,వెంటనే కేంద్ర ప్రభుత్వం  ప్రసార భారతి సబ్స్క్రిప్షన్ ని పునరుద్ధరించాలని,దేశంలోనే ప్రతిస్టాత్మక వార్తా సంస్థలు  పి టిఐ,యూ ఎన్ ఐ లను జాతీయం చేసి , ఒకే గొడుగు క్రిందకు తెచ్చి గతంలో లాగా "సమాచార్"గా మార్చి వాటిని ,వాటిలో పనిచేసే జర్నలిస్ట్స్, నాన్ జర్నలిస్టులను ఆదుకునేలా  ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ తగిన కార్యాచరణ పధకం రూపొందించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు.ఈ జూమ్ సమావేశంలో  ఇంకా ఎం.పెరుమాళ్(   చెన్నై), దేబశిష్ (కలకత్తా) పీయూష్ కుమార్ (ఢిల్లీ) ఇంద్రకుమార్ భద్ర,శశికళ శ్రీవాత్సవ్(ముంబై) గోపన్ నాంపట్టు, మ్యాచుస్(కేరళ) లతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని వివిధ సమస్యలపై ముఖ్యంగా కోవిడ్ 19 ద్వారా ఎదుర్కొకొంటున్న ఆర్ధిక సమస్యలను చర్చించారు.

Machilipatnam

2020-11-29 15:42:14

అసెంబ్లీలో గీతం భూ దురాక్రమణలు చర్చకొచ్చేనా..?

విశాఖ రుషికొండ ప్రాంతంలోప్రభుత్వానికి చెందిన రూ.800 కోట్లు విలుచేసే 40.50 ఎకరాల రెవిన్యూభూమిని దురాక్రమణ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పుడు ద్రువీకరణలు చూపిన విషయంలో గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీకి అన్నిదారులు మూసుకుపోతున్నట్టే కనిపిస్తుంది.. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ రద్దు బిల్లు చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీ లెజిస్లేచర్ బిల్లుతోనే గీతం ప్రైవేటు యూనివర్శిటీ బిల్లు పాస్ అయ్యింది. ఇపుడు అదే గీతం ప్రభుత్వ ఆస్థిని దురాక్రిమించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేసిందనే అభియోగాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇటు గీతం అవినీతి, భూ దురాక్రమణ, తప్పుడు ద్రువీకరణలపై ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి యుజిసి, ఎంఎంసీ, ఏఐసిటిఈలకు ఆధారాలతో ఫిర్యాదు చేసి గుర్తింపుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇపుడు తాజాగా రాష్ట్రప్రభుత్వం ఇదే విషయాన్ని అసెంబ్లీ ద్రుష్టికి తీసుకెళ్లి ప్రత్యేక తీర్మాణం చేయనున్నట్టు కూడా చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ఏదైన ఒక విషయానికి చట్టబద్దత తీసుకురావాలంటే అసెంబ్లీలో తీర్మాణం ఏర్పాటు చేసి దానిని చట్టం చేస్తుంది. అదేవిధంగా ఒక ప్రైవేటు డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ఏకంగా ప్రభుత్వ భూములను ఆక్రమించడంతోపాటు, వాటిని సొంత ఆస్తులుగా చూపి యుజిసి, ఎంఎంసీ, ఏఐసిటిఈ, నేక్ ల నుంచి గుర్తింపు కూడా పొందిన విషయాన్ని ఆధారాలతో అసెంబ్లీ ద్రుష్టికి కూడా తీసుకు రానుందని సమాచారం అలా చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ గీతం భూ దురాక్రమణ కళ్లకు కట్టినట్టు చూపించనున్నారు. ఇప్పటికే గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ ప్రభుత్వానికి చెందిన భూమిని ఆక్రమించిన తరుణంలో కొంత భూమిని స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన ఆక్రమిత ప్రాంతంలో అనుమతులు లేని కట్టడాలను కూలగొట్టే ప్రయత్నంలో గీతం రాత్రికి రాత్రే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివిషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, గీతం అవినీతి వ్యవహారంలో ఆధారాలన్నీ ఒక పెద్ద ఫైలుగానే సేకరించి పెట్టినట్టు సమాచారం అందుతోంది. రాష్ట్రప్రభుత్వం సేకరించిన ఆధారాలు ఒక్కసారి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రాస్తావిస్తే...ఏ మేర గీతం అవినీతికి పాల్పడింతో పూర్తిస్థాయిలో తేలనుంది. అంతే కాకుండా ఏదైనే యూజిసి నిబంధన ద్వారా ఏపి లెజిస్లేచర్ లో ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు పాసై యూజిసికి వెళ్లిందో..అదే విధానం ద్వారా అదే లెజిస్లేచర్ లో గీతం రద్దు బిల్లు ఆమోదిస్తే..దానిని యూజిసి గుర్తించాల్సి వస్తుంది. అలా గుర్తిస్తే గీతం డీమ్డ్ యూనివర్శిటీ గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అవినీతి వ్యవహారం నుంచి బయట పడదామనుకున్న భూ దురాక్రమిత గీతంకు అన్ని దారులు మూసుకుపోతున్నట్టే కనిపిస్తున్నాయి. అదే సమయంలో గీతంలోని విద్యార్ధులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారిని ఆంధ్రాయూనివర్శిటికీ అటాచ్ చేయాలని కూడా ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదులో కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరారు. దానివలన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ అనుమతులు రద్దు చేసే క్రమంలో విద్యార్ధులకు ఎలాంటి నష్టమూ జరగదని కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది భూ ఆక్రమిత గీతం తెరపై చూడాల్సిందే..!

Velagapudi

2020-11-29 14:20:19

2020-11-29 12:09:38

ఇక గ్రామాల్లోనే ప్రాధమిక ఆరోగ్యం..

గ్రామాల్లోనే నిరుపేదలకు ప్రాధమిక వైద్యం అందాలి.. పల్లెలు బాగుంటునే రాష్ట్రం శుభిక్షంగా వుంటుంది.. ఇవీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాటలు, ఆశయం..ఇపుడు ఆయన మాటలను తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిజం చేయబోతున్నారు. డా.వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల పేరుతో ప్రతీ గ్రామంలోనూ ఒక క్లినిక్ ని ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8585 క్లినిక్ లను ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భవన నిర్మాణాలు కూడా పూర్తి అయ్యాయి. 2500 మంది జనాభాకి ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటవుంది. అక్కడే 90 రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే పూర్తిస్థాయి ప్రాధమిక వైద్యం గ్రామంలోనే అందుతుందన్నమాట. ఇకపై కన్ను నొప్పి, కడుపునొప్పి, విరేచనాలు,  ఒళ్లునొప్పులు, ఇలా అన్ని ప్రాధమిక రుగ్మతలకు గ్రామంలోనే వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో ప్రభుత్వం మందులు అందుబాటులోకి తెస్తుంది. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు లేని గ్రామసచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక స్టాఫ్ నర్సు, ఒక ఆరోగ్య సహాయకులు ఉండి ప్రజలకు వైద్యసేవలు అందిస్తారు. గర్భిణీలకు కూడా ఇక్కడే వ్యాక్సిన్లు వేస్తారు. చిన్నపిల్లలకు  టీకాలను కూడా ఈ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలోనే అందుబాటులో ఉంచుతారు. ఒక రకంగా చెప్పాలంటే తల్లీబిడ్డా ఆరోగ్యాన్ని ఇక్కడే చూపించుకోవచ్చు. ప్రాధమిక వైద్యం దాటే అన్ని రోగాలను ఇక్కడి నుంచి పీహెచ్సీకి, అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రులకు వైద్యులు రిఫర్ చేస్తారు. డాక్టర్ వైఎస్సార్ కలలు గన్న గ్రామస్థాయిలో ప్రాధమిక వైద్యం మార్చి నెల నుంచి గ్రామసచివాలయాల్లో అందుబాటులోకి వస్తుంది. తరువాత ప్రత్యేకంగా నిర్మించిన కొత్తభవనాల్లోకి మార్చడానికి ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసింది. వైఎస్సార్సీపీపి ప్రభుత్వంలో ఇక వైద్య సేవలు కూడా ఇంటి ముంగిటకే రానున్నాయన్నమాట.

Velagapudi

2020-11-29 11:57:10

2020-11-29 10:51:43

2020-11-29 09:09:16

శ్రీభగవద్గీత పారాయ‌ణంతో జ్ఞానం..

శ్రీ కృష్ణ ప‌ర‌మాత్ముడు ఉప‌దేశించిన భగవద్గీతకు సమానమయిన గ్రంధం ఈ లోకంలో మరొకటి లేదని, గీతా పారాయ‌ణంతో జ్ఞానం, స‌త్‌ప్ర‌వ‌ర్త‌న, ప్ర‌సాదిస్తాయ‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి తెలిపారు. కంచి స్వామి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై శనివారం సాయంత్రం గీతా పారాయ‌ణంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వామివారు అనుగ్రహభాషణం చేస్తూ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన  శ్రీభగవద్గీత ప్రపంచంలోని  సర్వ మానవాళికి అన్ని సమస్యలకు మార్గం చూపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని అనుసరిస్తే ధర్మమే అందరిని కాపాడుతుందన్నారు. జప, హోమ, దానాల ద్వారా జ్ఞాన జ్యోతిని పొంద‌వ‌చ్చ‌న్నారు. కంచి పీఠం ఆధ్వర్యంలో 1966వ సంవత్సరం నుండి భగవత్ గీతను ముద్రించి దేశ విదేశాల‌లో ప్రచారం చేస్తున్న‌ట్లు తెలిపారు. టిటిడి ప్రతి రోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో గీతా పారాయణం నిర్వహించడాన్ని అభినందించారు. ఈ  కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వీక్షిస్తున్నార‌ని, త‌ద్వారా గీతా సారాంశాన్ని తెలుసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. లోక కల్యాణార్థం సెప్టెంబర్ 10వ తేదీ నుండి ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు టిటిడి తిరుమలలో గీతా పారాయణం నిర్వహిస్తున్న విషయం విదితమే. టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి , బోర్డు సభ్యులు  డి.పి.అనంత,  గోవింద‌హరి,  కృష్ణమూర్తి వైద్య‌నాధ‌న్‌ తదితరులు  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Tirumala

2020-11-28 20:47:43

2020-11-28 19:11:15

తుపాను మ్రుతులకు రూ.5లక్షలు నష్టపరిహారం..

ఆంధ్రప్రదేశ్ లో తుపాను కారణంగా మ్రుతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షలు నష్టపరిహారం అందించాలని సీఎం జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. నివర్‌ తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలైన చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం పంట నష్టాలను స్వయంగా చూశారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం మాట్లాడుతూ, తుపాను ప్రాంతాల్లోని వారికి తక్షణ సహాయం కింద రూ.500 ఇవ్వాలని ఆదేశించారు. మూడు జిల్లాల్లోని పంట నష్టాలపై తక్షణమే అంచాలు వేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. తుపానుకి దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యే పర్యటించి వారికి దైర్యం చెప్పాలన్నారు. పునరావస కేంద్రాల్లో ఉన్నవారికి కూడా రూ.599 చొప్పున అందజేయాలన్నారు. వరద ప్రాంతాల్లో సహయక చర్యలు జరుగుతూనే ఉండాలన్నారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం, మంచినీరు, మందులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

Velagapudi

2020-11-28 16:26:08