1 ENS Live Breaking News

ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయం

ఢిల్లీలో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతి చెందిన యువతి కుటుంబానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కూడా కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ కేసు వాదించేందుకు ప్రముఖ న్యాయవా దిని నియమిస్తామని ఆమ్ ఆద్మీపార్టీ ప్రకటించింది. యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్లే మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కాగా తన కూతురుపై లైంగిక దాడి జరిగిందని తల్లి ఆరోపించారు.

Delhi

2023-01-03 14:52:49

కాకినాడ జిల్లాలో 2021తో పోలిస్తే2022లో 5% కేసులు తగ్గుదల

కాకినాడ జిల్లాలో 2021 ఏడాదితో పోల్చుకుంటే 5% కేసుల తగ్గుదల నమోదూందని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. శుక్రవారం ఎస్పీకార్యాలయంలో జిల్లా వార్షిక నివేదిక వివరాలను మీడియాకి వెల్లడించారు. 2021 లో 8,869 కేసులు నమోదు కాగా, 2022లో 8481 కేసులు మాత్రమే నమోదైనవి, 2021 తో పోలిస్తే 2022 లో 388 కేసులు (F.I.R.లు)నమోదై..మొత్తం మీద 5%శాతం కేసులు తగ్గాయన్నారు. జిల్లా పోలీస్ శాఖ  సమర్థవంతంగా  పని చేయడం వల్లే ఈ తగ్గుదల నమోదైందన్నారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో వినూత్న ఒరవడిని సృష్టించడం, విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంతమైన నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా పై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్లనే ఇది సాధ్యమైనదన్నారు.  మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2023 లో మరింత మెరుగైన పోలీసింగ్, సేవలను అందిస్తామని జిల్లా ఎస్పీ రవీంధ్రనాద్ బాబు మీడియాకి వివరించారు.

Kakinada

2022-12-30 09:42:55

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చూడ‌టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలని కాకినాడ ఆర్డీఓ బీవీ రమణ కోరారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ ఆర్‌డీవో అధ్యక్షతన డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణా రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ అప్పారావుతో పాటు జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం, డా. మోకా పవన్ 
కుమార్, బండి వీరలింగేశ్వరరావు, పిల్లి జ్యోతి, డివిజన్ స్థాయి క‌మిటీ స‌భ్యులు, వివిధ మండలాల తహసీల్దార్లు హాజర‌య్యారు.

తొలుత కాకినాడ డివిజన్ లో న‌మోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు, వాటి పురోగ‌తి, బాధితుల‌కు స‌హాయం పంపిణీ, ఉపాధి క‌ల్ప‌న, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు త‌దిత‌ర అంశాల‌పై 
స‌మావేశంలో చ‌ర్చించారు.  ఈ సంద‌ర్భంగా ఆర్‌డీవో బీవీ రమణ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఏర్పడిన త‌ర్వాత తొలిసారిగా క‌మిటీ నూత‌న స‌భ్యులతో డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్) స‌మావేశం నిర్వ‌హించినందుకు ఆనందంగా ఉంద‌ని కొత్త‌గా నియ‌మితులైన స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులకు సంబంధించి పెండింగ్ లో కేసులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన బాధితులకు సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్న మండల రెవెన్యూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో ఏటువంటి జాప్యం లేకుండా ఆయా మండల తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నెల 30వ తేదీన మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే సమావేశం సక్రమంగా నిర్వహించేందుకు కృషిచేయాలన్నారు. 

ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ బి.అప్పారావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో బాధితుల ప‌క్షాన నిలిచి వారికి భ‌రోసా క‌ల్పించే విధంగా కృషిచేయడం జరుగుతుందన్నారు. 
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ కాపీలను ఆర్డీవో కార్యాలయానికి, ఆయా తహసీల్దార్లు  కార్యాలయాలకు వెంటనే పంపిస్తున్నామ‌న్నారు. బాధితులకు వెంటనే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించే విధంగా మండలస్థాయిలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
     కాకినాడ డీఎస్‌పీ కె.మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు త‌మ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో  విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ డివిజన్ స్థాయి క‌మిటీ స‌భ్యులు సాపె సుధాకర్, మశిగిరి రాంబాబు, బొనగిరి బలబద్రరావు, సిద్ధమటపు రాజు.... పాటు ఎన్‌జీవో సంస్థ‌ల నుంచి హాజ‌ర‌య్యారు. డివిజన్ పరిధిలోని అధికార యంత్రాంగంతో క‌లిసి ప‌నిచేస్తూ ఎస్‌సీ, ఎస్‌టీల సంక్షేమానికి, భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించేలా ప‌నిచేస్తామ‌న్నారు. స‌మావేశంలో కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, కాజులూరు, సామర్లకోట, తాళ్ల‌రేవు, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండల తహసీల్దార్లు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

కాకినాడ

2022-12-26 15:29:13

తప్పుడు ఆర్డర్ కాపీపై పోలీసులకు ఫిర్యాదు

హైకోర్టు పేరుతో ఒక కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ పై అప్పటి రిజిస్ట్రార్ (పరిపాలన) సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని, వాస్తవానికి అలాంటి సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ ని హైకోర్టు జారీ చేయలేదని హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) శ్రీ ఆలపర్తి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు మోసగాళ్లను న్యాయస్థానం ముందు హాజరుపర్చడానికి హైకోర్టు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.  డబ్బులిస్తే ఉద్యోగాలిప్పిస్తామని, రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రభావితం చేస్తామని మోసగాళ్లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని హైకోర్టు సూచించిందన్నారు. అభ్యర్థులను ప్రభావితం చేసేలా  రిక్రూట్ మెంట్ ప్రక్రియపై కామెంట్లు చేయడం, పేర్లను ప్రస్తావించి డబ్బులు చెల్లించడానికి ప్రొత్సహించడం వంటివి చేయడానికి ప్రయత్నించే మోసగాళ్లపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.

ఏదైనా తప్పుడు వార్తలు, సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా స్ప్రెడ్ చేసే వారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. అభ్యర్థులు రిక్రూట్‌మెంట్, నోటిఫికేషన్, పరీక్ష తేదీ-స్థలం, మార్కుల జాబితా, ప్రొవిజనల్ తదితర వివరాలకై హైకోర్టు అధికారిక వెబ్ సైట్ https://hc.ap.nic.in ను సందర్శించాలని హైకోర్టు సూచించిందన్నారు. ఏదైనా కల్పిత, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా నకిలీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, ఫలితాలు లేదా పోస్టింగ్ లెటర్‌లు తదితర వాటిని అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా గమనించినట్లైతే హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని కోరారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సదరు మోసగాళ్లను చట్ట ప్రకారం త్వరితగతిన విచారించడానికి హైకోర్టు అనుమతించిందని రిజిస్ట్రార్ శ్రీ ఆలపర్తి గిరిధర్ తెలియజేశారు.  

Tadepalli

2022-11-15 12:34:06

జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ కొయిలాడ పరశురామ్ పై జరిగిన దాడిని వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గాజువాక పోలీస్ స్టేషన్ లో సీఐ లంకా భాస్కర్రావు కు జర్నలిస్ట్ లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పరశురాం వైద్య సేవలు పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.  ఈ సందర్బంగా ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు డా. ఎం.ఆర్.ఎన్.వర్మ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వాదులు అందరూ ఇటువంటి సంఘటనలను ఖండించవలసిన అవసరం ఉందన్నారు .సంయమనం కోల్పోయి దాడులకు తెగబడుతున్న వారిని ఉపేక్షించరాదని అన్నారు.వార్తలు రాసే వారిని దాడులు చేయడం ద్వారా  భయపెట్టాలనుకోవడం సరికాదన్నారు. ఇంకెవ్వరూ ఇలా బరితెగించకుండా సంఘ టనకు కారణమైన బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్ట్ లపై దాడులను నివారించేందుకు అటాక్స్ కమిటీ లను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కె. రాము,పి. ప్రసాద్, నిట్టల, శ్రీనివాసరావు, పి, సత్యనారాయణ, కె. చక్రవర్తి,డి. హరనాథ్, డి.శివకుమార్ రెడ్డి,గిరి,ఎస్. నారాయణ రావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2022-10-19 12:10:56

విజయనగరం జిల్లా కలెక్టర్ సెల్ ఫోన్ హ్యాకింగ్

విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి సెల్ నెంబర్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కలెక్టర్ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నెంబర్లకు ఫోన్లు, మెసేజ్ లు పంపి డబ్బులు వసూలు చేసేందుకు తెగబడ్డారు. ఈ విషయం జిల్లాలోని పశుసంవర్ధశాఖ అధికారికి వచ్చిన మెసేజ్ ద్వారా నిరూపితం అయ్యింది. దీనితో వెంటనే కోలుకున్న కలెక్టర్ తన పేరుతో ఎవరైనా మెసేజ్ లు పెట్టినా.. డబ్బులు అడిగినా స్పందించవద్దని. తాను ఎవరికీ ఎలాంటి మెసేజ్ లు పెట్టడం లేదనే విషయాన్ని గుర్తించాలంటూ అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నెంబర్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. స్వయంగా వారే  మాట్లాడినట్టు, మెసేజులు పెడుతున్నారు. నేరుగా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులే పంపారనుకుంటున్న ఇవతలి వారు డబ్బులు పంపుతున్నారు. అయితే ఈ విషయం వెంటనే బయటకు పొక్కడంతో వెంటనే తేరుకుంటున్నారు. ఆపై వీరంతా పోలీసులకు ఫిర్యాదులు చేసి అవతలివారిని అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. అంతా అప్రమత్తం అయ్యారని తెలుసుకుంటున్న హ్యాకర్లు చల్లగా పలాయనం చిత్తగిస్తున్నారు. మీకు కూడా ఎవరైనా అపరచితులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మంచిగా మాట్లాడితే జాగ్రత్త వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు.

2022-10-14 10:49:26

బంధువులంటూ వచ్చేవారితో జరభద్రం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనూ, ఇత‌ర చోట్ల త‌న బంధువులు, స‌న్నిహితుల‌మ‌ని చెప్పుకొంటూ ప్ర‌భుత్వ అధికారులు, ఇత‌రుల నుండి కొంద‌రు వ్య‌క్తులు వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని అటువంటి వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి విజ్ఞ‌ప్తి చేశారు. ఆవిధంగా డ‌బ్బు వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిని న‌మ్మ‌వ‌ద్ద‌ని, త‌మ‌కు వారి స‌మాచారం, వివ‌రాలు అంద‌జేయాల‌ని కోరారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ప‌నులు చేస్తామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవ‌రు వ‌చ్చినా వారిని న‌మ్మి డ‌బ్బులు ముట్ట‌జెప్పి మోస‌పోవ‌ద్ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ తెలిపారు.

 ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వ అధికారులు, ఉద్యోగుల నుంచి వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తుల‌ను ప‌ట్టుకొని చ‌ట్ట‌ప్ర‌కారం వారిని శిక్షించ‌డంలో అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించ‌డం ద్వారా స‌హ‌క‌రించాల‌ని కోరారు. అదేవిధంగా ఫోన్ ద్వారా లేదా సోష‌ల్ మీడియా ద్వారా త‌న పేరు వినియోగించుకొని ఎవ‌రైనా ధ‌న స‌హాయం చేయాల‌ని కోరినా చెల్లించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. భూముల వ్య‌వ‌హారాల్లోనూ త‌న పేరు వినియోగించుకొని ల‌బ్దిపొందే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, అటువంటి వారిప‌ట్ల కూడా అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని సూచించారు. ఇప్ప‌టికే అటువంటి వ్య‌క్తుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌ని, పోలీసులు ద‌ర్యాప్తు చేసి నిందితుల‌ను ప‌ట్టుకొనేలోగా ఇత‌రులు మోస‌పోకుండా వుండే ఉద్దేశ్యంతో అప్ర‌మ‌త్తం చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

2022-10-14 09:47:48

ఎవరైనా మామూళ్లు అడిగితే నాకు చెప్పండి

తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) జిల్లా కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయం , ఇతర కార్యాలయాల నిర్వహణ పేరుతో నగదు వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీవ్రతరంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ పేరుతో నగదు వసూళ్లను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిణించడం జరుగుతుందన్నారు.  ఇటువంటి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలన్నారు.  ప్రభుత్వ మార్గదర్శకాలు, ఉత్తర్వులకు లోబడే పరిపాలన వ్యవస్థ ఉంటుందని మాధవీలత స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి లో అధికారులు, సిబ్బంది విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు.

 ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, మళ్లింపు వంటి అంశాలకు సంబంధించిన ఎటువంటి అవకతవకలకు పాల్పడిన, పాల్పడేందుకు ప్రోత్సహించినా అటువంటి వారి విషయంలో ఉపేక్షించేది లేదని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా జిల్లా యంత్రాంగానికి మచ్చ తెచ్చే విధంగా అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. 

2022-10-12 12:31:34

VOT122 పురుగుల మందు నిషేధం

విజీఎన్ ఆర్గానిక్స్ బ్యాచ్ నెంబర్ -VOT122 తయామిథాక్సాం 25%WG (తయోస్టార్ ట్రేడ్) పురుగుల మందు నాశిరకంగా నమోదు కాబడినదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి లీలావతి తెలిపారు. పురుగుల మందుల చట్టం 1968 ప్రకారం వీటిని నిల్వ చేయుట, అమ్మడాన్ని నిషేధించినట్టు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి నిషేదిత పురుగుల మందులను కొనుగోలు చేయడం మానుకోవాలని సూచించారు. కొన్ని సందర్భంగా నిషేధిక మందులను వినియగించడం ద్వారా దిగుబడి కోల్పోయే ప్రమాదంతోపాటు, రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారిణి మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Anakapalle

2022-09-29 12:51:03

నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు

సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసిసి) 2004లో విలీనం జరిగి సిపిఐ (మావోయిస్టు) గాఏర్పడి 2022 సెప్టెంబర్ 21వ తేదీకి 18 సంవత్సరాలు అయ్యింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుండి 27 వరకు వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వార్షికోత్సవాల నేపథ్యంలో పోలీసులు  అప్రమత్తమయ్యారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పిలుపు ఇచ్చారు.  దీంతో పోలీసు యంత్రాంగం ఏవోబీ వ్యాప్తంగా అప్రమత్తమైంది. 

అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు సరిహద్దు రాష్ట్రం ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్లతో పాటు ఛత్తీస్గఢ్లోని పోలీసు యంత్రాం గమంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలను విస్తృతం చేయడంతో పాటు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఆవుప్పోస్టులు, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలోని అవుట్ పోస్టుల్లో రెడ్ అలెర్డ్నుప్రకటించింది. మావోయిస్టు కార్యకలా పాలను నిరోధించడమే లక్ష్యంగా ఏవోబీ వ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. ఏవోబీ వ్యాప్తంగా అదనంగా పోలీసు బలగాలను మోహరించారు. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో వాహనాల తనిఖీలను పోలీసులు విస్తృతం చేశారు.

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ఏజెన్సీ ప్రాంతాలకు తిప్పే నైట్ హాల్ట్ సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేసింది. అటు మన్య ప్రాంత వాసులు కూడా సాయంత్రం ఐదులోపుగానే వారి పనులను చక్కబెట్టుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. మావోల హిట్ లిస్టులో వున్న కొందరు ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. మరోవైపు ప్రజాప్రతినిధుల వాహనాలకు భద్రత పెంచడంతో పాటు వారి ఏజెన్సీ పర్యటనలన్నీ రద్దు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కొనేందుకు ప్రభావిత ప్రాంతాల పోలీస్ స్టేషన్లను అన్ని జిల్లాల ఎస్పీలు, డిఎస్పీలు అప్రమత్తం చేశారు.

Paderu

2022-09-21 09:04:45

టిటిడిలో ఉద్యోగాల పేరుతో మోసంపై కేసు

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన తిరుమ‌ల‌లో ల‌డ్డూ కౌంట‌ర్ల‌ను నిర్వ‌హిస్తున్న కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిపై టిటిడి విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేర‌కు తిరుమల టు టౌన్ పోలీసులు శుక్ర‌వారం కేసు న‌మోదు చేశారు.   అనంతపురం జిల్లా కొత్త‌పేట‌కు చెందిన జి.బ‌బ్లూ అనే యువ‌కుడి ఫిర్యాదు మేర‌కు టిటిడి విజిలెన్స్ అధికారులు ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్నారు. కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన మేనేజ‌ర్ గణేష్, కో-ఆర్డినేట‌ర్ చందు, ల‌డ్డూ కౌంట‌ర్ బాయ్ మేక‌ల సురేష్ క‌లిసి కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థలో రెగ్యుల‌ర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువ‌త నుండి ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించ‌కుండా మోసం చేయ‌డంతో బ‌బ్లూ అనే యువ‌కుడు టిటిడి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు నిందితుల‌పై తిరుమ‌ల టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో Cr/No:: 151/2022 U/S 420 r/w 34 IPC కేసు న‌మోదు చేశారు.


Tirupati

2022-09-02 13:36:03

మ్రుతుల కుటుంబాలకు ఆదుకుంటాం

కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారీ సుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం మద్యాహ్నం జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు.  సోమవారం సాయంత్రం ప్రమాద సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 రోజుల వ్యవధిలో అదే పరిశ్రమలో మరో మారు ప్రమాదం సంభవించడం శోచనీయమని, దీనిపై  సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు గైకొంటామని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్యారీ సుగర్స్ పరిశ్రమలోని వ్యాక్యూమ్ కంట్రోల్ ప్యానెల్ వ్యవస్థలో జరిగిన ఈ దుర్ఘటనలో గొల్లప్రోలు మండలం, రంగప్పచెరువు గ్రామస్తుడు రాగం ప్రసాద్ (37), కాంట్రాక్ట్ టెక్నిషియన్; కె.గంగవరం మండలం, వట్రపూడి గ్రామస్తుడు పేరూరి సుబ్రమణ్యేశ్వరావు (33), సెంట్రీఫ్యూగల్ ఆఫీసర్ మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వీరికి తక్షణ సహాయంగా వైఎస్ఆర్ బీమా ద్వారా రూ. 5 లక్షలు, వర్క్సమెన్స్ కాంపెన్సేషన్ చట్టం క్రింద రూ. 10 లక్షలు అందజేస్తున్నామని, కంపెనీతో చర్చలు నిర్వహించి మృతుల కుటుంబాల‌కు న్యాయ‌మైన పరిహార మొత్తాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. 

గతంలో ఇదే కంపెనీ వేర్ హౌస్ లో జరిగిన ప్రమాదంపై ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, వేర్ హౌస్ ను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.  అలాగే సోమవారం సంభవించిన దుర్ఘటనపై కూడా హైపవర్ కమిటీ ఇప్పటికే ఏర్పాటు చేశామని, పరిశ్రమ మూసివేతకు క్లోజర్ ఆర్డర్ జారీచేసి, సేఫ్టీ ఆడిట్ చేపట్టడం జరిగిందన్నారు. ప్రమాదానికి భ‌ద్ర‌తా పరమైన లోపాలు కారణమైతే సంస్థపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇటువంటి దుర్ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా హైపర్ కమిటీ అధ్యయనంలో సూచించిన భ‌ద్ర‌తా పరమైన ఏర్పాట్లను అన్ని పరిశ్రమలలో క‌చ్చితంగా అమలు పరిచేలా చర్యలు గైకొంటామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ పర్యటనలో అడిషనల్ ఎస్‌పీ పి.శ్రీనివాస్, కాకినాడ ఆర్‌డీవో బి.వి.రమణ, కాకినాడ డీఎస్‌పీ భీమారావు, కార్మిక, కాలుష్య నియంత్ర‌ణ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Kakinada Rural

2022-08-29 15:05:04

చవితి నిబంధనలంటూ వేధిస్తే కాల్ చేయండి..

వినాయక చవితి, నిమజ్జనంలు ఎప్పటిలాగే ఘనంగా జరుపుకోవడానికి పోలీసు శాఖ సహకారం ఉంటుందన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. పోలీస్ శాఖ వినాయక నిమజ్జనం కొరకు ఎటువంటి ప్రత్యేక ఆంక్షలు విధించటం లేదనీ.. ప్రజలు ఎప్పటిలాగే వినాయక నిమజ్జనం ఘనంగా జరుపుకోవాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి సూచించారు. నిబంధనలంటూ  క్రింది స్థాయి సిబ్బంది నుంచి తీవ్ర ఆంక్షలు విధిస్తే సంబంధిత CP /SP/ DIG ని సంప్రదించాలని కోరారు. డీజీపీ ఆఫీస్‌లో సైతం అడిషనల్ డీజీ (L&O) రవి శంకర్ అయ్యన్నార్, DIG (L&O)(9908017338).. రాజశేఖర్ బాబు (8008111070) అందుబాటులో ఉంటారని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలియజేశారు. భద్రత దృష్ట్యా ఎప్పటిలాగే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జన సమయంలో భద్రత దృష్ట్యా పోలీసు శాఖ ప్రతి సంవత్సరం కొన్ని సూచనలు ఇవ్వటం ఆనవాయితీగా ఉందన్నారు. అంతకు ముందు ఇచ్చిన సూచనలు జతపరుస్తున్నామన్నారు.. ఈ విషయంలో ఎటువంటి అపోహలకు లోను కావొద్దని విన్నవించారు. ఈ విషయంలో ఎటువంటి రాద్ధాంతం చేయవద్దని మనవి చేశారు. ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా కొన్ని సూచనలు ఇచ్చామన్నారు డీజీపీ. ఆర్గనైజయింగ్ కమిటీ ఎటువంటి అఫిడవిట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని.. 

పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ/పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లలో సమాచారం అందించాలన్నారు. ఫైర్, విద్యుత్ శాఖల అనుమతితో పాటు వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు/మండపాలు దగ్గర ఇసుక, నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలరి,, నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలి అన్నారు. పందిళ్ళు/మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను ఉపయోగించాలి అన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలన్నారు.

మండపాల వద్ద క్యూలను మేనేజ్ చేసే భాద్యతను పోలీస్‌శాఖతో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం అన్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని.. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో వేషధారణలు, డీజే వంటివాటికిపైన ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Guntur

2022-08-29 07:07:07

కోక కోసం కొట్టుకుంటే కొలువు ఊడింది

కోక తెచ్చిన గొడవ ఆ పోలీసు అధికారి వీఆర్ కి వెళ్లేలా చేసింది.. ఒంటిపై ఖాకీ చొక్కా ఉంటే తన అంతటి వాడు లేడని విర్రవీగే పోలీసులు ఒక్కోసారి చేసే తప్పులు యావత్ పోలీసుశాఖకే చెడ్డపేరు తీసుకువస్తాయి. ఓ మహిళా కానిస్టేబుల్ కోసం ఒక సీఐ, మరో కానిస్టేబుల్  బహిరంగ కొట్టుకోవడం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్ లో చర్చనీయాంశం అయ్యింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన  పోలీసులే కోక కోసం నడిరోడ్డుపై కొట్టుకోవడం అందరూ వేలెత్తి చూపేలా చేసింది. భీమవరం వన్ టౌన్ పోలీస్టేషన్లో ఓ లేడీ కానిస్టేబుల్ ని రాజేశ్ అనే కానిస్టేబుల్ బైక్ పై లిఫ్ట్ ఇస్తుండటాన్ని సీఐ కృష్ణభగవాన్ చూసి తట్టుకోలేకపోయాడు. దీనితో ఈవిషయమై కానిస్టేబుల్ ని ప్రశ్నించి..అజమాయిషీ చేసే తరుణంలో పర్శనల్ అనే మాట రావడంతో ఆ విషయం కాస్త చినికి చినికి గాలివానగా మారింది. వారిద్దరికీ మధ్య చెలరేగిన వివాదానికి కారణమైంది. ఆపై ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వచ్చింది. జిల్లాలో పోలీసుశాఖ పరువుని తీసిన ఈ ఘటన ఉన్నతాధికారులకు కోపాన్ని తెప్పించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా..  విచారణ చేసిన ఉన్నతాధికారులు సీఐని తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ వీఆర్ కు పంపారు. ఆడదాని కోసం రాజ్యాలే పోయాయని పురాణాల్లో చదువున్నకున్నాం..ఒక్క మహిళా కానిస్టేబుల్ కోసం ఒక పోలీసు అధికారి, మరో కానిస్టేబుల్ నడిరోడ్డుపై తన్నకోవడం భీమవరంలోచే చూస్తున్నామంటూ అక్కడవారంతా బహిరంగంగానే పోలీసుల చేసిన ఘటనపై దుమ్మెత్తి పోశారు. ఎంతవారలైనా కాంత దాసులే అనడానికి కోక కోసం పోలీసుల కొట్లాట ఉదాహరణగా చెప్పొచ్చేమో...

Bhimavaram

2022-07-30 07:07:48