1 ENS Live Breaking News

SEBఆకస్మిక దాడులు.. 200లీటర్ల బెల్లంఊట ధ్వంసం

నాటుసారా తయారుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిఐ పి.అశోక్ హెచ్చరించారు. శుక్ర వారం ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో 200 లీట్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతోపాటు, 15 లీటర్ల సారా స్వాధీనం చే సుకున్నామన్నారు. ఈ మేరకు ప్రత్తిపాడులో ఆయన మీడియాకి దాడులకు సంబంధించిన  వివరాలను వెల్లడించా రు. కిర్లంపూడి మండ లంలోని ఎస్.తిమ్మాపురం, ఈ గోకవరం గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు వివరించారు. అక్కడ గీసాల లోవరాజు, పిచ్చుక సూర్యవతి అ నే మహిళను అరెస్టు చేసి వారి నుంచి సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా నాటు సారా తయారీ, వ్యాపారం, రవాణాకు పాల్పడితే క ఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని సిఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఈబి పి.సునీల్ కుమార్ బృందంతోపాటు, ప్రత్తిపాడు స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

2023-04-28 14:14:20

త్రిసభ్య కమిటీ విచారణకు హాజరైన కాలంచెల్లిన కార్యవర్గం

ప్రతిష్టాత్మక వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో అప్రజాస్వామికంగా పాలిస్తూ, కార్యకలాపాలు చేపడుతున్న కాలచెంచెల్లిన కార్యవర్గంపై జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున వేసిన త్రిసభ్య కమిటీ అధికారుల విచారణ వాడీ వేడిగా సాగింది. శుక్రవారం ఉదయం విశాఖ ఉడా కాంప్లెక్స్ లోని 6వ అంతస్తులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ మూర్తి నోటీసు మేరకు అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి దాడి రవికు మార్, ఉపాధ్యక్షుడు ఆర్. నాగరాజు పట్నాయక్, కోశాధికారి పిఎన్. మూర్తిలు రికార్డులతో సహా హాజరయ్యారు. వారితోపాటు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అక్రమ నిర్వహణ, నిర్వహణపై ఫిర్యాదులు చేసిన వారు కూడా హాజరయ్యారు. ఈ విచారణలో జిల్లా కలెక్టర్ విచారణ కమిటీ వేసిన తరువాత కూడా ఏవిధంగా సభ్యత్వాలు నమోదు ప్రక్రియ చేపట్టారని, అసలు విజెఎఫ్ బయిలా ప్రకారం సర్వసభ్య సమావేశం ఎప్పుడు పెట్టారని, సంఘం రిజిస్ట్రేషన్ రెవిన్యువల్స్, ఆడిట్ రిపోర్టులు, ఈ-ఫైలింగ్ లు, మినిట్స్ బుక్స్ ఎక్కడా అని ప్రశ్నించడంతో కంగుతిన్న కాలం చెల్లిన కార్యవర్గం తెల్లమొహం వేసింది. సొసైటీ యాక్టుకి విరుద్ధంగా ప్రస్తుత పాలక వర్గం వ్యవహరించడం వలనే సభ్యులు ఫిర్యాదులు చేశారనే విషయాన్ని విచారణ ఎదుర్కొంటున్న వారికి తెలియజేశారు. 

అయితే దానికి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకే తమ సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టామని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, మీరు చేస్తున్నది చట్టవిరుద్ధమని జిల్లా రిజిస్ట్రార్ తేల్చిచెప్పారు. జనరల్ బాడీ సమావేశాలు లేకుండా, సభ్యుల ఆమోదం లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా 11ఏళ్లు ఏ విధంగా నిర్వహణ ఏవిధంగా చేస్తారని ప్రశ్నించినపుడు కూడా... కొంతమంది సభ్యులు  ప్రెస్ క్లబ్ పై కోర్టు కేసులు వేశారని అందుకే ఆలస్యం అయ్యిందని సమాధానం ఇచ్చారు. దానిపైనా జిల్లా రిస్ట్రార్ మాట్లాడుతూ, అలా కోర్టు కేసులు వేసిన విషయాన్ని అయినా సర్వసభ్య సమావేశం పెట్టి సభ్యులకు చెప్పారా? చెబితే దానికి సంబంధించిన ఆధారాలు, మినిట్స్, ఇవ్వాలని కనీసం కొంత సమయం కావాలని కోరారా? అన్నిప్రశ్నించడంతో మళ్లీ తెల్లమొహం వేశారు సదరు నిర్వహకులు. ఇలా జిల్లా రిజిస్ట్రార్ ప్రభుత్వ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టును అనుసరించి వేసిన ప్రశ్నలకు వీరిదగ్గర సమాధానాలు లేకపోవడంతో, రికార్డులు కూడా సక్రమంగా లేకపోవడంతో సుమారు గంటపాటు జరిగిన విచారణ అనంతరం వీరు నీరసంగా బయటకు రావాల్సి వచ్చింది. 

ఆ తరువాత ఫిర్యాదులు చేసిన వారిన కూడా జిల్లా రిజిస్ట్రార్ మూర్తి విచారించారు. వారి దగ్గర ఉన్న సమాచారాన్ని వారి ముందు ఉంచారు. చట్ట విరుద్ధ, అనధికార పాలకవర్గ అక్రమాలపై త్రిసభ్య కమిటీ కి పలు ఆధారాలు సమర్పించారు  వీజేఎఫ్ సీనియర్ సభ్యులు యుగంధర్ రెడ్డి, ఎస్.ఎస్ .శివ శంకర్, జి. జనార్ధన రావు, ఈశ్వర్ చౌదరి,  బంటయ్యలు. కాగా మొత్తం విచారణలో కోశాధికారి పాత్రవిషయంలోనూ, లెక్కల విషయంలోనూ చాలా అంశాలకు సమాధానాలు లేకపోవడంతో కమిటీ మొత్తం అంతర్మధనంలో పడింది. ఎలాగైనా ఈ విచారణ నుంచి సేఫ్ గా బయట పడేందుకు వారి వెనుక ఒక న్యాయవాధిని కూడా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారమే అంతా చేసినపుడు విచారణ సమయంలో న్యాయవాదిని ఎందుకు వెంట పెట్టుకొని వెళ్లాల్సి వచ్చిందనే కోణంలో ఇపుడు యావత్ ప్రెస్ క్లబ్ సభ్యుల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. చూడాలి విచారణ మొత్తంలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయనేది..!

Visakhapatnam

2023-04-21 07:36:18

VJFలో విచారణ ప్రారంభం ఆపై ఈసీ సభ్యులు మాయం

ప్రతిష్టాత్మక వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో కాలంచెల్లిన అనధికార కార్యవర్గం చేపడుతున్న వ్యవహారాలపై జిల్లా కలెక్టర్ డా.మల్లిఖా ర్జున నియమించిన త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది. విశాఖలోని డాబాగార్డెన్స్ లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఈమేరకు రికార్డులు పరిశీలన జరిగింది. జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే.మూర్తి రికార్డులు తనిఖీలు చేశారు. 2012 నుంచి నేటివరకూ సుమారు 11 ఏళ్లపాటు అప్రజా స్వా మికంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతోంది. అంతేకాకుండా సభ్యులతో ఎలాంటి సర్వసభ్య సమావేశాలు ఏర్పా టు చేయకుండా చట్టవిరుద్ధంగా కార్యక్రమాలు చేశారు. నాటి నుంచి నేటి వరకూ చేపడుతున్న కార్యకలాపాల ఖర్చులు, ఆదాయం, విరాళాల పై వేసిన ప్రశ్నలకు కార్యవర్గం నీళ్లునమిలిందట. దీనితో తొలి విచారణలోనే లెక్కలపై ప్రధానంగా దృష్టి పెట్టి కోశాధికారి, కార్యదర్శిలపైనే విచారణ అంతా సాగింది. ఈలోపులోనే విషయం తెలుసుకున్న ఇతర కార్యవర్గ సభ్యులు పలాయనం చిత్తగించారట.

Visakhapatnam

2023-04-20 14:34:27

VJF కార్యవర్గం కోర్టు కేసులలో మోసం చేసిన తీరిది

వైజాగ్ జర్నలిస్టుల ఫోరరం(విజెఎఫ్) అనధికార కార్యవర్గం సభ్యులందరికీ దారుణంగా బురిడీ కొట్టించడంతో మోసం కూడా చేసిందనే విష యం  విశాఖలోని జిల్లా ప్రిన్సిపల్ మరియు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు తేటతెల్లం చేస్తుంది. వివరాలు తెలుసుకుంటే.. 2015లో  బోడపాటి రామరాజు అనే సభ్యుడు విజెఎఫ్ కార్యవర్గసభ్యులు, ఎన్నికల అధికారి అయిన గంట్లశ్రీనుబాబు, ఎస్.దుర్గారావు(ప్రస్తుతం మృతిచెందారు), బి.ప్రభాకరశర్మలపై విశాఖలోని జిల్లా ప్రిన్సిపల్ మరియు సెషన్స్ జడ్జివారి కోర్టులో కేసునెంబరు OP/0000661/2015న కేసు వేశారు. అయితే కేసువేసిన తరువాత, ప్రత్యర్ధులుగానీ, కేసు దారు కానీ ఇద్దరూ కోర్టుకి హాజరు కాకపోవడంతో తేది 03-06-2016న డిఫాల్ట్ గా కేసును డిస్మిస్ చే శారు. ఈ జడ్జిమెంట్ నేరుగా ప్రభుత్వ  కోర్టువెబ్ సైట్  ద్వారా బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. అసలు కోర్టుకే వెళ్లకుండా ఈ కేసులో విజెఎఫ్ విజయం సాధించినట్టుగా కార్యవర్గం ప్రకటించుకుంటూ సభ్యులను మోసం చేస్తుంటడం విశేషం.

Visakhapatnam

2023-04-19 05:20:32

విశాఖ పోలీస్ కమిషనర్ దృష్టికి విజెఎఫ్ అక్రమాలు

విజెఎఫ్(విశాఖ జర్నలిస్టుల ఫోరం)లో అక్రమాలు,(Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)ను తుంగలోకి తొక్కి నిబం ధనలకు విరుద్ధం పరిపాలిస్తున్న పాలకవర్గం అక్రమాలు, అవినీతిపై వెంటనే విచారణ చేయించాలంటూ సీనియర్ జర్నలిస్టులు విశాఖ సిపి డా.త్రివక్రమవర్మ దృష్టికి తీసు కెళ్లారు. సోమవారం రాత్రి ఈమేరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫిర్యాదుచేశారు. సుమారు రూ.12కోట్ల మేర నిధులు, విరాళాలు, అనధికారికంగా  చేసి న మొత్తాలపై సొసైటీ యాక్టును అనుసరించి విచారణ చేయాలని కోరారు. ముఖ్యంగా 12ఏళ్లుగా ఎలాంటి ఎన్నికలు లేకుండా కోర్టుకేసుల నెపం చూపి, కనీ సం సొసైటీ ని బంధనల ప్రకారం సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించకుండా అనధికారికంగా పరిపాలన చేస్తున్నారని.. ఇపుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా మెం బర్ షిప్ డ్రైవ్ అక్రమంగా చేపడుతున్నారని సిపికి వివరించారు.

Visakhapatnam

2023-04-17 17:20:23

బైకుని ఢీకొన్నకారు వ్యక్తి మ్రుతి ముగ్గిరికి గాయాలు

మితిమీరిన వేగం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అతివేగంతో  వచ్చిన కారు ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తిని బలంగా కొట్టగా, వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఆదివారం దేవరపల్లి జాతీయరహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో రెడ్డి అప్పల నాయుడు అనే కాంట్రాక్టర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం జాతీయ రహదారిపై ఒక కారు మితి మీరిన వేగం తో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ధీ కొట్టింది. దీంతో వ్యక్తితో సహా వాహనం సుమారు 15 అడుగుల వరకు ఈడ్చుకొని వెళ్ళి పోయింది. కారు ద్విచక్ర వాహనాన్ని కొట్టడంతోపాటు పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకుపోవడంతో దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. దుకాణంలో ఉన్న వ్యక్తుల కు తీవ్ర గాయాలయ్యాయి..కారులోని బెలున్స్ ఓపెన్ అవడం తో కారులోని వ్యక్తి నీ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రాంతీయ ఆసుప త్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jangareddigudem

2023-03-26 11:00:00

హెచ్ పీ సీ ఎల్ లో అగ్ని ప్రమాదం ఇద్దరికి గాయాలు

హెచ్ పీ సీ ఎల్ రిఫైనరీలో సోమవారం రాత్రి  అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ప్లాంట్ లో‌ఇ ఈటీపీ ప్రాంతంలో సోమవారం రాత్రి 11.20 గంటల సమయంలో క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా లీకయ్యింది. వెంటనే మంట లు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాల్వులని కట్టెయ్యడంతో క్రూడ్ ఆయిల్ లీకేజీ నిలువరించారు. హుటాహుటిన హెచ్ పీసీఎల్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తూతం ప్లాంట్ లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ప్రమాదం సంభవించినట్లు ప్రాధమికంగా నిర్థరించినట్లు హెచ్ పీ సీఎల్ అధికారులు వెల్లడించారు.

Gajuwaka

2023-02-28 04:11:33

కడపలో పుష్ప సీన్.. ఎర్రచందనం రవాణా గుట్టురట్టు

పుష్ఫ సినిమాలో సీన్లు ఎర్రచందనం రవాణాలో రిపీట్ అవుతున్నాయి. దీనితో  కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు మెరుపు దాడులు చేస్తున్నారు.  కొరియర్ సర్వీస్ మాటున తాడిపత్రి- ముద్దునూరు బైపాస్ రోడ్డులో ఎర్రచం దనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 6మంది ఎర్రచందనం స్మగ్లర్లును అడిషనల్ ఎస్పీ తుషార్ దుడి ఆధ్వర్యంలో డిఎస్పీ, చెంచుబాబు, సీఐలు నాగభూషణం, ఎస్సై సత్య నారాయణ, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. ప్రొద్దుటూరు కు చెందిన స్మగ్లర్ భాస్కర్ రెడ్డితో పాటు, రాజస్థాన్ రాష్ట్రం కు చెందిన రాజేంద్ర అనే స్మగ్లర్ అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ పేర్కొన్నారు.  అంతేకాకుండా  భాస్కర్ రెడ్డి పై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 40 ఎర్రచందనం దుంగలు,1 గూడ్స్ వాహనం, 1 స్కార్పియో, 4 మోటార్ సైకిల్ వాహనాలు, 7 సెల్ ఫోన్లు,5 గొడళ్ళు, 1 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.

Kadapa

2023-02-27 06:48:26

ఎన్ హెచ్16పై ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మ్రుతి

యర్నగూడెం జాతీయ రహదారి16 తాడిపూడి కాలువ వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మ్రుతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నాయగూడెం గ్రామానికి చెందిన 3 వ్యక్తులు కుటుంబ తగాదాల నిమిత్తం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు మోటార్ సైకిల్ పై రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న అశోక్ లైలాండ్ దోస్త్ వాహనాన్ని ఢీకొట్టడంతో సంఘటనలో బైక్ నడుపుతున్న నీలపాటి శ్రీహరి(40) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న వీరలక్ష్మి(40) వీర హంస(50) నేషనల్ హైవే అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు పరిస్థితి సమీక్ష సమీక్షించారు. సంఘటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
                                        

Yernagudem

2023-02-26 12:08:56

కిడారి, సివేరి హత్యల మావోయిస్టు రైనో అరెస్టు

2018 సెప్టెంబర్‌ 23న జరిగిన మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న మావోయిస్టు రైనోను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ‌కి చెందిన డివిజన్ కమిటీ మెంబర్ జనుమూరి శ్రీనుబాబు(రైనో)ను పోలీసులు ఆ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. రైనో దగ్గర నుంచి ఒక ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.  ఏవోబీ ప్రత్యేక జోన్‌ డివిజినల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న రైనో ఏఓబీలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు ఆ ప్రకటనలో వివరించారు.  గత ప్రభుత్వం రైనోపై రూ.5లక్షల రివార్డు ప్రకటించింది కూడా. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టుగా రైనో ఉన్నాడు. 

Paderu

2023-02-22 14:47:54

142 మంది మందుబాబులకు 5రోజులు జైలు శిక్ష

విశాఖ నగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కేసులు నమోదైన వారికి భీమిలి కోర్టు ఐదు రోజులు జైలుశిక్ష, జరిమానా కూడా విధించిందని పోలీస్ కమిషనర్  సిహెచ్ శ్రీకాంత్ తెలియజేశారు. మరో 52 మందికి బీచ్ లో పరిశుభ్రత శిక్ష, మరికొందరికి వివిధ ట్రాఫిక్ జంక్షన్ లలో ట్రాఫిక్ రూల్స్ ప్లకార్డు పట్టుకునే శిక్ష విధించారని పేర్కొన్నారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కోర్టుముందు హాజరు పరుస్తామని హెచ్చరించారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో మందుబాబులకు కోర్టు శిక్షవిధించడం చర్చనీయాంశం అవుతోంది. కాగా ప్రతీరోజూ ట్రాఫిక్ పోలీసులు వందలాది మంది మందుబాబులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకొని కేసులు రాస్తున్నారు.  పోలీసులతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న కెమెరాలు సైతం జీబ్రా లైన్ క్రాసింగ్ కేసులు నమోదు చేస్తూ వాహదారులకు దడ పుట్టిస్తున్నాయి.

Visakhapatnam

2023-02-21 11:30:02

గల్లంతైన ఇద్దరు యువకుల మ్రుతదేహాలు లభ్యం

అప్పు ఘర్ వద్ద సముద్రంలో గల్లంతయిన ఇద్దరు యువకుల మ్రుతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి. శివరాత్రి సముద్ర స్నానాల సందర్భంగా బీచ్ గార్డ్ గా వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన అఖిల్,.ప్రవీణ్ ల మ్రుతదేహాలు లభ్యం కావడంతో బంధువులు పెద్ద సంఖ్యలో బీచ్ వద్దకు చేరుకున్నారు. కాగా ఎక్కడైతే వీరు సముద్రంలో పడిపోయారో అక్కడే ఇద్దరినీ గుర్తించినట్టు స్కూబా డైవర్లు తెలియజేశారు. వారి మ్రుతదేహాలను బయటకు తీసి వారి కుటుంబాలకు అందజేశారు. బాధిత కుటుంబాలను  వైజాగ్ ఈస్ట్ సమన్వయకర్త విజయనిర్మల పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ లు స్వయంగా వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ మిత్రుల మ్రుతదేహాలను ఆఖరి చూపు చూసుకోవడానికి పెద్ద ఎత్తున వారి స్నేహితులు, బంధులువులు తరలి వచ్చారు. ఈ ఘటనపై గతంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Visakhapatnam

2023-02-21 10:53:00

కిక్కు దిగేదాకా ఆప్రాంతంలోని చెత్తంతా ఎత్తాల్సిందే

విశాఖలో మందుబాబులకు వింత శిక్షను అమలు చేసింది మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 52 మంది మందుబాబులకు ఆర్కేబీచ్ లోని వ్యర్ధాలను, చెత్తను పరిశుభ్రం చేయాలని ఆదేశించింది. దీనితో మందుబాబులంతా వరుసగా ఆర్కే బీచ్ లోకి వచ్చి చెత్తను శుభ్రం చేశారు. విశాఖలోని మెట్రోపాలిటిన్ కోర్టు వేసిన శిక్ష ఇపుడు ఉమ్మడి విశాఖజిల్లాలో చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఫైన్లు వేస్తారు. ఆతరువాత సీజ్ చేసిన మోటారు వాహనాలను ఫైన్లు కట్టి విడిపించు కుంటారు. కానీ విచిత్రంగా కోర్టు ఈ తరహా శిక్షలు వేయడంతో మందుబాబులకు తాగింది మొత్తం దిగిపోయింది. ప్రస్తుతం ఈ అంశం విశాఖజిల్లాలోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇలా శిక్షలు పడిన వారంతా బీచ్ లోదర్శనమిచ్చారు. చక్కగా చేతికి గ్లౌజులు వేసుకొని, పోలీసుల పర్యవేక్షణలో బీచ్ లోచెత్తను శుభ్రం చేశారు మందుబాబులు..

Visakhapatnam

2023-02-21 09:59:16

అనకాపల్లి జిల్లాలో 110 సెల్ ఫోన్లు బాధితులకు అప్పగింత

అనకాపల్లిజిల్లా పోలీస్ 2వ విడతలో రికవరీ చేసిన 110 ( రూ.23 లక్షల విలువగల) మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీగౌతమి శాలి తెలియజేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాయంలో “మొబైల్ రికవరీ  మేళా ” కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, ప్పటివరకు  241 మొబైల్ ఫోన్ల ను (విలువ రూ.48 లక్షలు)  పొగోట్టుకున్న ఇతర  రాష్ట్రాలు, జిల్లాల్లో  రికవరి చేసి భాధితులకు అందజేశామన్నారు. మొబైల్ ఫోన్ పోతే ... జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్: 95052 00100 కు Hi టైప్ చేయడం ద్వారా (akpmobiletracker.in)లింక్ నొక్కడం ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్.ఐ.ఆర్ కట్టకుండా, పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా సులభతరం చేశామన్నారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. అదనపు ఎస్పీ (క్రైమ్స్)  పి.సత్యనారాయణరావు,  సిఐలు/నరసింహారావు, లక్ష్మణ్ మూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు,  ఐటి కోర్ ఎస్సై రఘు వర్మ పాల్గొన్నారు.


Anakapalle

2023-02-21 09:12:36

వీఆర్ కు డిఎస్పీ సునీల్..ఈఎన్ఎస్ లైవ్ వార్తకు స్పందన

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ప్రచురించిన అనకాపల్లి డిఎస్పీకి వెరైటీ పనిష్మెంట్..జస్ట్ బదిలీ అనే వార్తలపై తక్షణ మే స్పందించింది. గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసి తన సొంత అవసరాలకు వాడుకున్న అనకాపల్లి డిఎస్పీ సునీల్ ను ప్రభుత్వం తొలుత బదిలీ చేసింది. అయితే ఆ విషయాన్ని పోలీసుశాఖలో పెద్ద అధికారులు తప్పుచేస్తే బదిలీ తప్పా చర్యలేమీ ఉండవనే విషయాన్ని ఉటంకిస్తూ.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో వార్తను ప్రచురించింది. ఈ వార్త కాస్త రాష్ట్రంలో దావానంలా వ్యాపించింది. దీనితో డిఎస్పీ సునీల్ ను బదిలీ కాకుండా వీఆర్ పంపుతూ డిజిపి కార్యాలయం ఉత్తర్వులను జారీచేసింది. ఈ చర్య కాస్తా పోలీసుశాఖలో సంచలనం అయ్యింది. ఒక డిఎస్పీ విషయంలో పోలీసుశాఖ ద్వారా తప్పుకి దొరకకూడదనే విషయాన్ని పక్కాగా అమలు చేసి చర్యలు తీసుకోవడం.. ఆపై ఇలాంటి తేడా వ్యవహారాలు చేసే పోలీసు సిబ్బందికి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు చేసింది పోలీసుశాఖ..!

Tadepalli

2023-02-18 15:59:26