1 ENS Live Breaking News

పోలీసు కేసుల్లో పురోగతి నమోదు చేయాలి

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, సర్కిళ్ల పరిధిలో నమోదైన కేసుల విషయంలో పురోగతి నమోదు చేయాలని జిల్లా ఎస్పీ  ఎం.దీపిక పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గతంలో నమోదై, దర్యాప్తులో ఉన్న చీటింగ్, తీవ్రమైన, సాధారణ కేసులను సమీక్షించి, దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. త్వరితగతిన కోర్టుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెద్ద ఎత్తున నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ  పి.సత్యనారాయణ రావు, ఎస్.ఈ.బి. అదనపు ఎస్పీ కుమారి ఎన్.శ్రీదేవీ రావు, డిఎస్పీలు టి.త్రినాథ్,  బి.మోహనరావు,  ఆర్.శ్రీనివాస రావు,  ఎల్.మోహనరావు, ఎల్.శేషాద్రి, ఎపిపిలు, పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-29 12:20:45

మరోసారి అనంతబాబు బెయిల్ పెండింగ్

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ విషయంలో మరోసారి గురువారం చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కేసులో రెండవ బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సి,ఎస్టీ కోర్టులో వాదనలు మగిసాయి. బాధిత కుటుంభం తరుపున ప్రముఖ న్యాయవాది, ఆంద్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు వాదనలు వినిపించారు. ముద్దాయి అనంత బాబుకు బెయిల్ మంజూరు చేస్తే బాధిత కుటుంబానికి ప్రాణ హాని ఉంటుందని కోర్టులో వాదించారు. అంతేకాకుండా ముద్దాయి గత నేర చరిత ను, రౌడీ షీట్ ఉన్న విషయాలను న్యాయస్థానం ముందుంచారు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలను విచారణాధికారి ఇంత వరకు గుర్తించలేదని సైతం న్యాయస్థానానికి వివరించారు. ఇలాంటి సమయంలో నేరస్థుడికి బెయిల్ మంజూరు చేస్తే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందిని కోర్టుకి తెలియజేశారు. ఒక చట్ట సభ సభ్యుడు ..ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన దేశ చరిత్రలో ఇదే ప్రధమం అని కూడా పేర్కొన్నారు. ఇరు పక్షాలు వాదనలు అనంతరం ముద్దాయి రెండవ బెయిల్ అప్లికేషన్ మీద ఆదేశాలు ఇచ్చేవిషయాన్ని న్యాయమూర్తి ఎమ్.నాగేశ్వరరావు ఈ నెల 18 కి  వాయిదా వేశారని ముప్పాళ్ల మీడియాకి వివరించారు.

Rajamahendravaram

2022-07-14 06:08:44

60 మంది మావోయిస్టులు లొంగుబాటు

మావోయిస్టు నేత రామకృష్ణ అలియాస్ అశోక్ ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో 33 మంది పార్టీ సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు డిజిపి హరికృష్ణ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే.  ఈ సందర్బంగా లొంగిపోయిన 60 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ సతీష్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల కృష్ణ, ఏఎస్పీ తుహిన్ సిన్హా  మంగళవారం సాయంత్రం ఎఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో కలసి ముచ్చటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ అవసరాలను మాకు తెలియచేస్తే మేము పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, కొన్ని సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్ వివరించారు.  లొంగిపోయిన సభ్యులలో కొండ్రుం, జూముడుం, తగ్గుపాడు, జుడిగూడ మొదలగు గ్రామాలకు చెందిన శ్రీకాంత్, లక్ష్మి, సూరిబాబు, కిల్లో శ్రీను తదితరులు ఆయా గ్రామాలలో రోడ్ లేదని, త్రాగు నీటి సదుపాయం లేదని, ఆధార్ లేదని, రేషన్ కార్డు లేదని, అంగన్వాడి భవనం లేదని, పాఠశాలకు అరకు నుండి ఒక టీచర్ వారానికి రెండు సార్లు పాఠశాలకు వస్తారని, కొండ్రుంగు గ్రామ వాలంటీర్ నెలకు రెండు సార్లు పాడేరు నుండి వస్తారని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ మీ గ్రామాలకు రెండు,మూడు రోజుల్లో వస్తామని, సమస్యలు పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. జిల్లాలో 6.50 లక్షల మందికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని, ఇంతకాలం మీరు అటువైపు ఉండి మీ జీవితాలనే కాకుండా పిల్లల భవిష్యత్తును కూడా త్యాగం చేసిసాధించింది ఏమీ లేదని, ఇప్పుడు జన జీవన స్రవంతిలో కలిశారు.  మేము అందించే ఫలితాలు చూస్తారని అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. మీ సమస్యలు విన్నవించటానికి ఎప్పుడైనా నన్ను నేరుగా కలవొచ్చని కలక్టర్ స్పష్టం చేసారు. 

             ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ జమిగూడ నుండి బూసిపుట్టు వరకు రోడ్ నిర్మాణం జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో తారు  వేస్తామని గుర్తు చేసారు. అదేవిధంగా, ప్రభుత్వం తరపున మేము మీకు అండగా ఉంటామని, మమ్మల్ని నమ్మండి అని సూచించారు.  ఇటీవల జమిగూడ నుండి 120 మంది సమస్యలపై  నన్ను కలవటానికి వచ్చినప్పటికీ రాత్రి వరకు కలవలేకపోయానని, వారి సమస్య విని వారికి భోజనాలు పెట్టించి ప్రత్యేక వాహనంలో వారి గ్రామానికి పంపించిన విషయం గుర్తు చేసిన పిఓ మీకోసం మేమున్నామన్న నమ్మకం  కలిగి ఉండాలని కోరారు.  ముందుగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీసులు, ప్రభుత్వం మీకు శత్రువులు కాదని, మీ హితం కోరే మిత్రులుగా గుర్తించాలని కోరారు.  చాలామంది తెలీకుండానే మావోయిస్టుల వైపు వెళుతున్నారని, అది సరి కాదని, సమస్యలుంటే జిల్లా యంత్రాంగానికి చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు . అభివృద్ధి ఒక్క రోజులో జరిగేది కాదని, వేచి చుస్తే అభివృద్ధి కనిపిస్తుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో ఎఎస్పీ తుహిన్  సిన్హా, డిఎస్పీ (ఎసిబి) వెంకట రావు, పలువురు సి ఐలు, ఎస్ ఐలు , లొంగిపోయిన పార్టీ, మిలీషియా సభ్యులు పాల్గొన్నారు. 

Paderu

2022-06-28 14:42:04

గొలుగొండ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు

గొలుగొండ పంచాయతీ శివారు గ్రామం శ్రీరాంపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను అదే గ్రామానికి చెందిన  లాలం రమేష్ మాయమాటలు చెప్పి పెల్లిచేసుకుంటానని లొంగదీసుకుని తెలియని ప్రాంతానికి తీసుకు వెళ్లిపోయాడు. దీనితో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించలేదని, అనుమానం వ్యక్తం చేస్తూ.. చేసిన ఫిర్యాదు ఆధారంగా యువకుడిపై పోక్సో చట్టం, కిడ్నాప్ సెక్షన్ల  కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్టు గొలుగొండ ఎస్ఐ ధనుంజయ్ నాయుడు తెలియజేశారు. ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేపడుతున్నట్టు మీడియాకి వివరించారు. మండల కేంద్రంలో పోక్సో కేసు నమోదు కావడం చర్చనీయాంశం అవుతుంది. 

Golugonda

2022-05-31 15:05:15

రైలు బాత్రూములో పేగుతెగని పసిబిడ్డ..

ఆ తల్లిది నిజంగానే జాలీ, దయా లేని రాతి గుండె.. అక్రమ సంతానం పడక సుఖానికి సజీవ సాక్ష్యమైపోతుందనో.. తండ్రి ఎవరో సమాజానికి చెప్పుకోలేని ఒళ్లు పొగరుపట్టిన పైత్యమో.  సక్రమం కాని ఆ బిడ్డ తన జీవితానికి అడ్డు తగులుతుందనో తెలీదుకానీ.. నవమాసాలు కడుపున మోసిన శిసువుని..అమ్మతనం గుర్తుచేసుకోకుండా.. అపుడే పుట్టిన పండంటి బిడ్డను పేగు తెంచకుండానే  రైలుబోగీ బాత్రూములోనే మంచినీటి వాష్ బేసిన్ లో వదిలిపెట్టిపోయిందా కసాయి తల్లి.. సభ్య సమాజం తలదిం చుకునేలా జరిగిన ఘటన ప్రతీ తల్లి గుండెనూ ఎంతగానో కదిలించింది.. రైలులో శిశువు ఏడుపు విన్న రైల్వే పోలీసులు బాత్రూమ్ ని తనిఖీ చేయడంతో వాష్ బేసిన్ లో  పండండి మగబిడ్డ పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించాడు.. తల్లికడుపునుంచి ఎలా పుట్టాడో అలానే రక్తపు మడుగులోనే పడిఉన్నాడు. నిరాశ్రయునిగా వున్న ఆ  ఆ బిడ్డను పోలీసులు తక్షణమే చేరదీసి వైద్యపరీక్షలు చేయించారు. ప్రతీ తల్లిగుండెనూ కదిలించిన ఈ ఘటన విశాఖలోని రైల్వేస్టేషన్ లో చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకుంటే.. విశాఖ రైల్వే స్టేషన్  ధన్‌బాద్-అల్లెపీ ఎక్స్‌ప్రెస్‌లోని టాయిలెట్‌లో వాష్ బేసిన్ లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం కావడంతో రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో స్పందించారు. బుదవారం ఉదయం 8.25 గంటలకు రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మగబిడ్డను ప్రసవించి, రైలు నెం. 13351 ధన్‌బాద్-అల్లెపీ ఎక్స్‌ప్రెస్‌లోని టాయిలెట్‌లో వదిలివేసిందని రైల్వే పోలీసులు మీడియాకి చెప్పుకొచ్చారు.  బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు సింహాచలం స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత సుమారు 8.20 గంటల సమయంలో బోకారో ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణీకులు శిశువు గురించి ఆన్‌బోర్డ్ టీటీ ఈ వి.బ్రహ్మాజీ తెలియ జేయడంతో  ఘటన వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.  సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్ పోలీసు లు   రైలు వద్దకు చేరుకుని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆసుపత్రికి తరలించారని ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స,సంరక్షణ నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా తల్లి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిడ్డను సొంతం చేసుకుంటే వారి పెంపకానికి పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని పోలీసులు చెబుతున్నారు. రైలులోనే కని వదిలి వెళ్లిపోయిన తల్లికోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.

Visakhapatnam

2022-05-11 17:06:44

తూ.గో. రూ.1.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం.. ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు

తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న కోటీ 50లక్షలు విలువచేసే 1500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు కాకినాడలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో పట్టుకున్న గంజాయిని మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సంరద్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ తనిఖీలల్లో ఐషర్ వ్యాన్ తోపాటు ఉత్తర ప్రదేశ్ కి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి,  నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ చెప్పారు. చింతూరు ఏఎస్సీ క్రిష్ణకాంత్ పర్యవేక్షణలో సిఐ యువకుమార్, ఎస్ఐ యాదగిరిగిలు దీనిని పట్టుకున్నారన్నారు. ఏఓబీ ప్రాంతం నుంచి అధికంగా ఈ గంజాయి రవాణా అవుతుందన్నారు. ముందుగా అందుకున్న సమాచారం ప్రకారం వాహనాలు తనిఖీ చేస్తుండగా రవాణా అవుతున్నగంజాయి పట్టుబడినట్టు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి రవాణా, నాటు తయారీలపై ఉక్కుపాదం మోపతున్నట్టు ఎస్పీ వివరించారు. గంజాయి ఏ రూపంలో రవాణా జరిగినా జిల్లా దాటి వెల్లకుండానే పట్టుకుని తీరతామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలే ఏఓబీ క్యాంప్ పరిధిలో సుమారు ఐదు కోట్ల విలువైన గంజాయి తోటలను ధ్వంసం చేసినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతుందటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఇకపై మరింతగా వాహన తనిఖీలు చేపట్ట నున్నట్టు ఎస్పీ వివరించారు. ఈ గంజాయి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కరణం కుమార్, ఎస్పీ కె.కుమారి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-11-14 13:25:44

రూ.20 లక్షల విలువైన గుట్కా స్వాధీనం..

శంఖవరం మండలం అన్నవరం జాతీయ రహదారిపై సుమారు రూ. 20,000,00 విలువచేసే 58 బస్తాల నిషేధిత గుట్కా ప్యాకెట్లను అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రహదారిపై ఉన్న శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి నమూనా ఆలయం సమీపంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఎస్సై. ఎస్.రవికుమార్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది వారి రోజు వారీ విధుల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా తుని నుండి కత్తిపూడి వైపు వెళుతున్న ఎ.పి.37 టిఈ 4567 నెంబర్ ఐషర్ వ్యానులో రవాణా అవుతున్న ఈ అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ తోపాటు సొత్తుకు యజమానులైన ఇద్దరు వ్యాపారస్తులను కలపి మొత్తం నలుగురురిని అదుపు లోనికి తీసుకున్నారు. వాహనాన్నీ, సరకునూ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నేరాన్ని, అభియోగాలను నమోదు చేసారు. వీరిని ప్రత్తిపాడు కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా వారికి  
తాత్కాలిక కారాగార వాస నిర్బంధాన్ని విధించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశంలో అమలాపురం డీఎస్పీ. అరిటాకుల శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు. ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణాపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు ఇచ్చిన నిర్దిష్ట సమాచారం మేరకు ఆయన ఆదేశాలకు అనుగుణంగా అన్నవరం ఎస్.ఐ. రవికుమార్, ఆయన సిబ్బంది సంయుక్తంగా వాహనాలను ఆకస్మిక తనిఖీ చేసి ఈ అక్రమ సొత్తు అక్రమ రవాణా గుట్టును రట్టు చేయడంతో ఈ నేరం వెలుగు చూసిందని అమలాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పాత్రికేయులకు వివరించారు.

Annavaram

2021-10-19 14:26:05

రూ.1.50లక్షల ఆషిస్ ఆయిల్ స్వాధీనం..

విశాఖజిల్లా నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద లక్ష యాభై వేల రూపాయల విలువైన 1. 510 లీటర్ల ఆషిస్(గంజాయి నుంచి తీసిన ఆయిల్) తో ముగ్గురు వ్యక్తులను నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి  ఏఎస్పీ మణికంఠ చందోలు గురువారం నాతవరం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం గన్నవరం మెట్ట వద్ద పోలీసులు మాటు వేసినట్లు తెలిపారు. ఆ సమయంలో బైక్ వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి బైక్ ను వెనక్కి తిప్పి పారిపోతుండగా వెంటపడి పోలీసులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో చంద్రరావు అనే వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో 1. 510 కిలోల హాషిస్ ఆయిల్ లభ్యమైనట్లు చెప్పారు. పట్టుబడిన ముగ్గురులో చంద్రరావు, చంటిబాబు చింతపల్లి మండలానికి చెందిన వారు కాగా విశ్వేష్ పడాల్ జి. మాడుగుల మండలానికి చెందిన వాడుగా పెర్కొన్నారు. వీరిని విచారించగా చింతపల్లి మండలం గొప్పిగుడుసుల గ్రామంలో గంజాయి నుంచి హాషిస్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు వారు వెల్లడించారని తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేసి‌ తయారీ మెషనరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హాషిస్ ఆయిల్ ను తునిలో ఒక వ్యక్తికి విక్రయించేందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మంది నిందితులను గుర్తించగా ఇంతవరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఒక బైక్, రెండు సెల్ ఫోన్లు, హాషిస్‌ ఆయిల్ ను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు స్థానిక ఎస్ఐ శేఖరం పాల్గొన్నారు.

Nathavaram

2021-10-07 07:25:49

అయ్యన్నపై వన్ టౌన్ స్టేషన్ లో కేసు నమోదు..

ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి, దళిత మహిళా నాయకురాలైన మేకతోటి సుచరిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖలోని పైవన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. శనివారం ఈ మేరకు  విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పర్సన్ కొండా రమాదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ లు ఈ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుక్రవారం గుంటూరులో జరిగిన ఒక సభలో చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ  సీఎంపైనా, హోమంత్రిపైనా అసభ్యపదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. దిశా చట్టం పై తప్పుడు ప్రచారాలతో ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. ఆ కారణాలపైనే చింతకాయల అయ్యన్నపాత్రుడు పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ కాకి పద్మ , 39వ వార్డు ఇంఛార్జి కొల్లి సింహాచలం, వార్డు అధ్యక్షుడు సురాడ తాతారావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అలమండ్ విజయ్, 36 వ వార్డు అధ్యక్షుడు కోరుకొండ సూర్యప్రసద్, సిటిమోటర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

One Town

2021-09-18 08:17:49

2నెలల్లో ద‌ళారుల‌పై 25 కేస్‌లు న‌మోదు..

శ్రీ‌వారి దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం క‌లిగి ఉన్నారనే ఆరోపణలపై టిటిడి నిఘా మ‌రియు భద్రాతా విభాగం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు నెల‌ల‌లో వ్య‌వ‌ధిలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 41 మందిని అరెస్టు చేశారు. జూలై మరియు ఆగస్టు నెలల్లో భక్తులకు స్వామివారి దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్ర‌యిస్తున్న దళారులను టిటిడి విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో కొంతమంది ప్రజా ప్రతినిధుల నకిలీ లేఖలు, నకిలీ వెబ్‌సైట్లు, ట్రావెల్ ఏజెన్సీలు భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. భక్తులను మోసం చేయ‌డానికి ప్రయత్నించినందుకు, వారి మనోభావాలు దెబ్బ‌తిసేలా న‌డుచుకున్న ద‌ళారుల‌పై  తిరుమల, తిరుపతిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టిటిడి విజిలెన్స్ విభాగం అధికారులు ఫిర్యాదులు నమోదు చేశారు. భక్తులు దళారులను నమ్మొద్దని, దర్శనం కోసం నకిలీ వెబ్‌సైట్‌లు,  ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించవద్దని టిటిడి ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది. టిటిడి అధికారిక వెబ్‌సైట్ www.tirupatibalaji.gov.in నుంచి మాత్ర‌మే ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి మ‌రోసారి విజ్ఞప్తి చేస్తున్నది. దళారులు, నకిలీ వెబ్‌సైట్ నిర్వ‌హ‌కులు, ట్రావెల్ ఏజెన్సీలపై నేరం రుజువైతే టిటిడి చట్టపరంగా తీవ్రమైన‌ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తోంది.

Tirumala

2021-08-21 17:02:10

విశాఖలో ఏసీబీకి చిక్కిన అవినీతి ఎస్ఐ..

విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పై శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ పాత నిందితుడు వద్ద కేసు మాఫీకు సంబంధించి వ్యవహారంలో ఏడు వేల రూపాయలు లంచం అడిగిన ఎస్ ఐ శ్రీనివాస్రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.  కేసులో నిందితులైన బొడ్డేపల్లి వైకుంఠ రావు అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐని పట్టుకున్నారు. గత కొంతకాలంగా ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులు కూడా ఉన్నాయి. బాధితుల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాలంటే నే బాధితులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారని పలువురు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఏసీబీ దాడులు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాసరావు శైలి ముందు నుంచి కూడా వివాదా స్పదంగా ఉందన్న వాదనలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులను భయపెట్టి బెదిరించి సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు శ్రీనివాసరావు పాపం పండింది. నిందితుడైన బొడ్డేపల్లి వైకుంఠరావు నేరుగా ఎసిబి అధికారు లకు సమాచారం ఇచ్చి రెడ్హ్యాండెడ్గా లంచం ఇస్తూ పట్టుబడినట్లు చేశారు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు జరగడంతో ఒక్కసారిగా పోలీసుశాఖ ఉలిక్కి పడింది.ఈ దాడుల్లో ఎసిబి డిఎస్పీ బివిఎస్ రామన మూర్తి సిఐలు లక్ష్మణమూర్తి, ఎస్ రమేష్,ఎస్ కే గఫుర్,ప్రేమకుమార్,తదితరులు పాల్గొన్నారు. ఎస్సై శ్రీనివాస్ ను రిమాండ్కు తరలించారు.
 

Arilova

2021-08-20 09:35:34

4.6 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత..

శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 4.6 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు దాడి చేసి  పట్టుకున్నారని పెద్దాపురం డివిజన్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. శనివారం ముందుగా అందిన సమాచారం మేరకు సివిల్ సప్లైస్ అధికారులతో తనిఖీలు నిర్వహించగా కత్తిపూడి గ్రామంలో ఒక ఇంటిలో  మల్లిపాముల బాబ్జి అనే వ్యక్తి   అక్రమ రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచడాన్ని కనుగొన్నామని ఏఎస్ ఓ తెలిపారు. వీటిని సీజ్ చేసి అతనిపై 6 ఏ కేసు నమోదుచేసినట్టు అధికారులు వివరించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం విలువ రూ.92 వేలు గా నిర్ధారించామన్నారు. ఈ బియ్యాన్ని సీల్ చేసి  దగ్గర్లో ఉన్న ఎంఎస్ ఓ పాయింట్ కి తరలించినట్టు వివరించారు.ఈ దాడులలో డివిజనల్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాద్, తుని , శంఖవరం, జగ్గంపేట సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లు రామారావు ,ఇస్మాయిల్, కృష్ణ  పాల్గొన్నారు.

Kathipudi

2021-08-07 14:15:22

ఆ.. మ్రుగాళ్లకు కఠన శిక్షలు తప్పవు..

మహిళలపై అమానీయమైన ఘటనలకు పాల్పడుతున్న మృగాళ్ళకు కఠిన శిక్షలు అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.  రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామంలో అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికలాంగ మహిళను గురువారం  రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలిసి పరామర్శించారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పి, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధిత కుటుంభాన్ని ఆదుకోవటానికి ప్రకటించిన రూ.5 లక్షల చెక్కును  మంత్రులు అందించారు. అనంతరం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చిన్నపిల్లల విభాగంలో చికిత్స పొందుతున్నఏడునెలల చిన్నారిని, విద్యుత్ షాక్ గురై అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న యువకుడు కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. 

 ఈ సందర్భంగా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడలేని, వినపడని మహిళ పశువులు కాయటానికి వెళ్ళినప్పుడు ఆమె పై జరిగిన అత్యంత దారుణంగా జరిగిన అత్యాచార సంఘటన సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది అన్నారు. మహిళలపై వేధింపులకు గురి చేస్తున్న వారిని శిక్షించేందుకు  కఠిన చట్టాలు అమలు చేసినా మృగాళ్ళు రెచ్చిపోవటం చాలా బాధాకరంగా ఉందన్నారు. అత్యాచారానికి గురైన మహిళ కనీసం తన బాధను సైతం తెలపలేని పరిస్థితిలో చాలా భయపడి పోయి బ్రతకలేను అని ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై  ప్రాధమిక విచారణ అనంతరం ఇప్పటికే 376 సెక్షను క్రింద కేసు నమోదు చేయటం జరిగిందని, కేసు పూర్తిగా ఎగ్జామిన్ చేయటం జరిగిందని, దీని ప్రకారం నిందితునిపై మరిన్ని  సెక్షన్లు క్రింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించం జరుగుతుందన్నారు. మహిళలపై అత్యాచారాలకు, వేదింపులకు పాల్పడుతున్న వ్యక్తులకు కఠినంగా శిక్షలు అమలు చేయటానికే దిశా చట్టంను రూపొందించటం జరిగిందన్నారు. గతంలో అత్యాచార సంఘటనలు జరిగితే దర్యాప్తు సమయం 100 నుంచి 180 రోజలు ఉండేదని, దిశ చట్టం వచ్చిన తరువాత 50 రోజుల్లో పూర్తి చేయటం జరుగుతుందన్నారు. 

అత్యాచార ఘటనను రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించాలని సూచించటంతో చెక్కును అందించామన్నారు. బాధితురాలి సోదరుడుకు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం అందించనున్నామన్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ  చెవి, మూగ యువతిపై అగంతకుడు దాడి చేసి, హింసించి, అత్యాచారం చేసిన దారుణ సంఘటనకు బాధపడుతూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  జాలీ పడే స్థితిలో ఉన్న వికలాంగురాలిపై సైతం అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే నిందితున్ని కస్టడీలోకి తీసుకోవటం జరిగిదన్నారు. ఇటువంటి దారుణ, కృర సంఘటనలకు పాల్పడే వ్యక్తులను క్షమించేది లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందించామని, బాధితురాలి తమ్మునికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు దిశా చట్టంను అమల్లోకి తీసుకువచ్చి దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారన్నారు.  మహిళలకు అన్ని వేళల సహాయం అందించేందుకు దిశా యాప్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. నేరప్రవృత్తి మనస్తత్వంతో చట్టాలంటే భయం లేకుండా మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర నాయుడు, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి, జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరక్టర్ మనోరంజని, జీజీహెచ్ వైద్యులు పాల్గొన్నారు.

Guntur

2021-07-29 16:34:00

దర్శన టికెట్ల వ్యాపారంపై కఠినచర్యలు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ 300 టికెట్లతో పాటు కళ్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు.  కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నై కి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థ భక్తులనుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.. భక్తులు www tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామా తో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.

Tirumala

2021-07-25 12:40:20

187 అనధికార దుకాణాలపై చర్యలు..

మహావిశాఖ నగర పరిధిలో 187 దుకాణాలలో బినామీలు ఉన్నట్లు గుర్తించామని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసి  చేపట్టిన వివిధ సంస్కరణల్లో భాగంగా, జివిఎంసి ఆదాయం పెంపొందించేందు, సంస్థకు చెందిన వివిధ గుత్తలు ద్వారా వచ్చే ఆదాయ లోపాలను సరి చేసి ఒక ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 187 దుకాణాలు వాస్తవ గుత్తేదారులు బదులు బినామీలు ఉన్నట్లు గుర్తించి వాస్తవ గుత్తేదారులకు నోటీసులు జారీ చేశామన్నారు.  గడువు లోపల ఖాళీ చేయకపోతే బినామీలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గుత్తకాలం పూర్తయినప్పటికీ లీజు పునరుద్ధరణ చేయకుండా అనధికారికంగా ఉన్న 389 దుకాణాలను గుర్తించామని, ఇందులో నెలసరి అద్దె చెల్లిస్తున్నప్పటికీ, రెన్యువల్ కాకపోవడంతో అనధికారంగా ఉన్నట్లు భావిస్తామని తెలిపారు. జివిఎంసి ఆదాయాన్ని పెంచేందుకు మూడు సంవత్సరాలు లీజు దాటిన దుకాణాలను మరల వేలం నిర్వహిస్తామని, ఇంతకాలం అద్దె చెల్లించని లీజుదారుల నుండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ఉపయోగించి అద్దె వసూలు చేస్తామని, ఈ చర్యల వలన  గుత్తలను  క్రమబద్దీకరణ చేయడమే కాకుండా, జివిఎంసికి ఆదాయం వస్తుందని, కావున జివిఎంసి తీసుకున్న చర్యలకు గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సహకరించాలని కమిషనర్ ఆప్రకటనలో కోరారు.

విశాఖ సిటీ

2021-07-09 13:44:55