తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ కూడా ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్సు విధానాన్ని కొనసాగిస్తున్నారు. కత్తిపూడి, బెండపూడి గ్రామసచివాలయాల్లోని సిబ్బందికి కరోనా సోకిన తరువాత కూడా బయోమెట్రిక్ విధాన్ని అమలు చేయడంపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాత్రం సాధారణ హాజరు మాత్రమే ఉద్యోగులకు నమోదు చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎవరికి బయోమెట్రిక్ కారణంగా కరోనా ముప్పు వస్తుందోనని జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భయపడుతున్నారు. వివిధజిల్లా శాఖల అధికారుల సమన్వయ లోపమే దీనికి కారణమని చెబుతున్నారు. అధికారుల ఆదేశాలతో తప్పక బయోమెట్రిక్ అటెండెన్సు వేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.
పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జూన్ 29 వ తేదీన జరిగిన హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటన లో మరణించిన మహంతి గౌరీ శంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.15.00 లక్షల మొత్తానికి చెక్కు ను ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి శనివారం నాడు తన నివాసంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు. అలాగే సాయినార్ కంపెనీ తరపున ఇస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 35.00 లక్షల మొత్తానికి సంబంధించి ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి రూ. 10.00 లక్షల చెక్ ను, తండ్రి మహంతి లక్ష్ము నాయుడు కు రూ. 12.50 లక్షల చెక్ ను, తల్లి మహంతి అప్పల నరసింహ కు రూ. 12.50 చెక్ లను కూడా మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
పచ్చ పత్రికలు భూకంపాలన్నా, డర్టీయెస్ట్ పొలిటీషియన్ దడపుట్టించాలనుకున్నా, ఎల్లో వైరస్ సునామీలు సృష్టించాలనుకున్నా ప్రజలకు సమాచారం రకరకాల సోర్సెస్ నుంచి అందుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విషప్రచారం నడవదన్నారు. పైగా సముద్రం అంటే కోట్లాదిమందికి ఒక తల్లి, ప్రధాన ఆదాయవనరు అన్నారు. అదో అడ్వాంటేజ్ కూడా. 2004లో సునామీవచ్చి ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది చనిపోయినప్పుడు సముద్రం ఒక్క అడుగైనా ముందుకు వచ్చిందా? అన్నారు. డాక్ యార్డ్ లోని ఒక్క నౌకైనా తల్లకిందులయ్యిందా?. పెట్టని కోటల్లాంటి కొండలు, సముద్రమట్టానికి నగరం ఎత్తుగా ఉంటే సునామీలు ఎలావస్తాయి అన్నారు. ఇప్పటికైనా విశాఖపై విషం చిమ్మే ఎల్లోమీడియాల వస్తవాలను తెలుసుకోవాలని రాజీవ్ సూచించారు.
మద్యం రహిత సమాజ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మేరకు, విశాఖ జిల్లా అధికారులు అందరూ దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపేరు. "నషా ముక్త్ భారత్" కి తగిన సహకారాలను అందిస్తామనీ, సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపేరు. మధ్య దుకాణాల రద్దీ నియంత్రించేందుకు కరోనా మహమ్మారి నేపధ్యం లో మొండికేస్తున్న మందు బాబులను నిబంధన ప్రకారమే మద్యం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసేమని అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగు తున్నందున తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని మద్యం షాపు ల దగ్గర ప్రత్యేకంగా బారికేడ్లను నిర్మించి వీలైనంత తొందరగా దుకాణం నుంచి మధు ప్రియులను పంపించే ఏర్పాట్లను చేసేమని అన్నారు. ఈ కౌంటర్ల వ్యవస్థ రాష్ట్రం లోనే మొదటి సారిగా విశాఖ లో అమలు పరిచినట్టు తెలిపేరు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, GVMC, ఎక్సైజ్, డాక్టర్ల బృందంతో, కరోనా కట్టిడికై, 24/7 జిల్లా యంత్రాంగము కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్య క్రమంలో మద్య విమోచన ప్రచార కర్తలు సురేష్ బేతా, సైకాలజిస్ట్ డాక్టర్. జయలక్ష్మీ దిట్టకవి, చరిత్ పాల్గొన్నారు.
విశాఖపట్నంలో మరిన్ని పడకలు కోవిడ్ బాధితుల కోసం సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యులను ఆదేశించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకొనేందుకు తగిన చర్యలు నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ ను ఆదేశించారు. కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు నిదులు సమస్య లేదని, స్పెషలిస్టులు, వైద్యులు అందరూ సహకరించి కోవిడ్ ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇలాంటి సమయంలో వైద్యులు తమవంతు సహకారం అందించాలని ఐ.ఎం.ఎ., వైజాగ్ చాప్టర్ లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ దవళ భాస్కరరావు, ఐ.ఎం.ఎ., చాప్టర్, వైజాగ్ నుండి కోవిడ్-19 జిల్లా కో ఆర్డినేటర్ డా. బి. గోవిందరాజు, ఐఎంఎ కార్యదర్శి డా. కె. ఫణీందర్, తదితరులు పాల్గొన్నారు.
ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన డా.మౌనికను గోల్డ్ మెడల్ వరిచింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివిసుధాకర్ 2020 సంవత్సరానికి క్లినికల్ న్యూరాలజీలో ప్రతిష్టాత్మక డాక్టర్ ఎన్ టి సుబ్రహ్మణ్యం బంగారు పతకాన్ని ఫైనల్ ఇయర్ ఎండి జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ చింతాడా మౌనికాకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు. డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం ప్రఖ్యాత వైద్యుడు, జనరల్ మెడిసిన్ ఎంచుకోవడానికి అనేక మంది యువకులను ప్రేరేపించడంలో మార్గదర్శిగా నిలిచారు. దివంగత డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం AMC మరియు KGH కి చేసిన సేవలను మెడిసిన్ హోడ్ డా. ఎస్ శ్రీనివాస్ ప్రశంసించారు. డా. జ్ఞానసుందర రాజు, డా.రాధా కృష్ణన్, డా.ఎస్ఎన్ఆర్ నవీన్ , జనరల్ మెడిసిన్ యొక్క ఇతర అధ్యాపకులు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.
చిట్టివలస జ్యూట్ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యాజమాన్యాన్ని ఆదేశిం చారు.చిట్టివలస జ్యూట్ మిల్లు, యాజమాన్యం, కార్మికులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చిట్టివలస జ్యూట్ మిల్లు అగ్రిమెంటు చేసి సంవత్సరకాలం నిన్నటితో పూరైందు వలన మంత్రి సమావేశం నిర్వహించారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు యాజమాన్యం పూర్తిగా చెల్లించాలని, ప్రతికార్మికునికి శాశ్వత, ప్రత్యేక బదిలి, బదిలి, కొత్తగా బదిలి, కార్మీకులకు రూ.27,500/-లు చొప్పున మరియు అప్రంటిసు కార్మికులకు రూ.10,000/-లు చొప్పున ఇస్తానని యజమాన్యం ఒప్పుకున్న ప్రకారం తక్షణమే కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్ని వెంటనే చెల్లించాలని జ్యూట్ మిల్లు యజమాని కె.కె. బజోరి యాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో యజమాన్యం ప్రతినిధిలు జోషి, రామ్ కుమార్, ఐక్య కార్యాచరణ కమిటి కార్మిక నాయకులు కె.వరహాలరాజు, చిల్ల వెంకటరమణ, జీరు, వెంకటరెడ్డి, వలనకాల ఆదినారాయణరెడ్డి, దల్లి అప్పలరెడ్డి, పడాలరమణ, కొండపు ఈశ్వరరావు, రామ్ ప్తెడియ్య, మద్దెల దేవుళ్లు, నరవ రామరావు, తదితరులు పాల్గొన్నారు.
విశాఖపోర్ట్ ట్రస్ట్ లో గత12ఏళ్లుగా సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులను ఆదుకొని, సత్వరమే న్యాయంచేయాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు.శుక్రవారం 347 బ్యాచ్ కాజువల్ కార్మికులకి సంబందించిన పెండింగ్ అంశాలను పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు, డిప్యూటీ చైర్మన్ హరనాధ్ ల దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. కారుణ్య నియామకాల కింద 12 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన 347 క్యాజువల్ కార్మికులకు నేటికీ సరైన పనిలేకుండా నానా అవస్థలు పడుతున్నారని ఎంపీ తెలియజేశారు. కేంద్రమంత్రి మాoడవీయతోనూ మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చైర్మన్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,, కార్మిక సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ వర్మ, గోపి, కృష్ణ , ప్రసాద్ పాల్గొన్నారు..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చాపురంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కంటైన్మెంట్ జోన్స్ పెరుగుతున్నాయని అన్నారు. స్లమ్ ఏరియా లో, కంటైన్మెంట్ జోన్స్ లో ప్రతి ఇంటి నుండి శాంపిల్స్ సేకరించి వేగవంతం చేయాలని వివరించారు. బేల్లుపడ, రత్తకన్న , కండర వీధులలో కరోనా మరింత వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పరీక్షలు జరపటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం.వినోద్ బాబు, కమీషనర్ రామలక్ష్మి, వైద్య సిబ్బందికి ఇతర అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ 19 జిల్లా కంట్రోల్ రూమ్ (స్పందన హాల్) నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ కోవిడ్ సమస్యలు, పిర్యాధులు పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు. 08942 240605 ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని ఆయన చెప్పా రు. కంట్రోల్ రూమ్ కు అందిన ఫిర్యాదులు, సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగి హోమ్ ఐసో లేషన్ లో ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేకంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఈ కేంద్రం జిల్లా మహిళా సమాఖ్య ప్రాంగణంలో ఉందని, సమస్యలు ఉన్నవారు 08942 240615 ఫోన్ నంబరుకు తెలియజేయవచ్చని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న పచ్చ తోరణం” కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని హౌసింగ్ లేఔట్ లలో మొక్కలునాటే కార్యక్రమం ఈనెల 30 వ తారీకు లోపల పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ డ్వామా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పెందుర్తి మండలం, గుర్రంపాలెం పంచా యతీ, అక్కిరెడ్డిపాలెం లో పేదల హౌసింగ్ లేఅవుట్ వద్ద 71వ వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అటవీ శాఖ మొక్కలు నాటిన తర్వాత వాటిని పెంచే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని కోరారు. స్థానిక శాసన సభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాట్లాడు తూ ప్రకృతి ని కాపాడవలసిన బాధ్యత అందరిది అన్నారు. ముఖ్యమంత్రి తలపెట్టిన "జగనన్న పచ్చతోరణం" పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆహుతులు అందరిచే ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటుతామని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతామని, వనాలను నరకనివ్వమని, వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరిస్తామని, రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు 71 వ వనమహోత్సవం లో భాగంగా పెందుర్తి నియోజక వర్గం, గుర్రంపాలెం హోసింగ్ లేఔట్ లో అధికారులు అందరూ మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు మొత్తం 30000 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీశాఖ కన్జర్వేటర్ రామ్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్ డి ఓ పి. కిషోర్, డి ఎఫ్ ఓ లక్ష్మణ్, డి ఎఫ్ ఓ అనంతసాగర్, స్క్వాడ్ డి ఎఫ్ ఓ సూర్యనారాయణ , వుడా డి ఎఫ్ ఓ శాంతి స్వరూప్, డి పి ఓ కృష్ణ కుమారి, డ్వామా ఎ పి డి ఆంజనేయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సచివాలయ మహిళా వాలంటీర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా సచివాలయంలోని సంప్రదించాలని సచివాలయ పోలీసు అధి కారిణి జిఎన్ఎస్ శిరీష అన్నారు. సోమవారం శంఖవరం గ్రామసచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామంలో మహి ళ ల రక్షణ, అంగన్వాడీల పర్యవేక్షణ, మహిళల ఆశ్రమాల సందర్శన స చివాలయం తరపున చేపడతామన్నారు. ఇటీవల కొందరు ఆకతాయిలు మహిళా వాలంటీర్లను వేధిస్తున్నట్టు తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించి అన్నవరం స్టేషన్ కి అప్పగిస్తామన్నారు. ఏ మహిళకు కష్టమొచ్చినా నేరుగా సచివాలయనికి వచ్చి స్పందనలో ఫిర్యాదు చేయాలన్నారు. లేదంటే దిశ కాల్ సెంటర్ కి ఫోన్ చేయాలని ఆమె సూచించారు. వాలంటీర్లకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ఆమె మీడియాకి వివరించారు. ప్రతీరోజూ నిర్వహించే స్పందనలో దరఖాస్తు చే సుకుంటే మహిళల సమస్యలను ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచారం కరపత్రాలను సోమవారం అరకు ఎంపీ గొడ్డేటి.మాధవి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లు ఆవిష్కరించారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా ముందుకెళుతుందన్నారు. ఇప్పటికే దశలవారీగా మద్యం షాపులు సంఖ్య తగ్గించడంతో పాటు, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచడం శుభపరిణామం అన్నారు. మద్యం వద్దు - కుటుంబం ముద్దు అనే నినాదంతో ఏర్పాటుచేసిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఏపీఏఏసీ స్టేట్ ఇంఛార్జి సురేష్ బేత మాట్లాడి ప్రజల్లోకి మద్యపాన నిశేదం అంశాన్ని పూర్తిస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు సుఖంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలనే విషయం ప్రజలు తెలుసుకునేలా ప్రచారాన్ని అన్ని గ్రామాలకు విస్తరించాలని ఈ సందర్భంగా ఎంపీలు సూచించారు.
శంఖవరంలో మరో 13కరోనాపాజిటివ్ కేసులు నమోదైనట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా..ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లా ుతూ, శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 13 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు ఏ పనిచేసినా తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలమేరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలన్న ఆయన అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఇపుడు పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి మరోసారి కోవిడ్ 19 పరీక్షలు చేయనున్నట్టు డాక్టర్ వివరించారు.
సచివాలయ మహిళా వాలంటీర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా సచివాలయంలోని సంప్రదించాలని సచివాలయ పోలీసు అధికారిణి జిఎన్ఎస్ శిరీష అన్నారు. సో మవారం శంఖవరం గ్రామసచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామంలో మహిళల రక్షణ, అంగన్వాడీల పర్యవేక్షణ, మహిళల ఆశ్రమాల సందర్శన స చివాలయం తరపున చేపడతామన్నారు. ఇటీవల కొందరు ఆకతాయిలు మహిళా వాలంటీర్లను వేధిస్తున్నట్టు తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తిం చి అన్నవరం స్టేషన్ కి అప్పగిస్తామన్నారు. ఏ మహిళకు కష్టమొచ్చినా నేరుగా సచివాలయనికి వచ్చి స్పందనలో ఫిర్యాదు చేయాలన్నారు. లేదంటే దిశ కాల్ సెం టర్ కి ఫోన్ చేయాలని ఆమె సూచించారు. వాలంటీర్లకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ఆమె మీడియాకి వివరించారు. ప్రతీరోజూ నిర్వహించే స్పందనలో దరఖాస్తు చే సుకుంటే మహిళల సమస్యలను ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.