1 ENS Live Breaking News

కూటమిలోనూ వైఎస్సార్సీపీ పాలనే.. మహిళా పోలీసులను గాల్లోనే ఉంచారు..!?

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుపేరు మాత్రం సోమలింగం అన్నాడ వెనకటకి ఓ వికటకవి.. సరిగ్గా అదే విధానాన్ని పాటిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని కుదించడానికి ప్రవేశపెట్టిన క్లస్టర్ విధానానికంటే ముందుగా నోటిఫై చేసిన పోస్టులను రద్దు చేస్తున్నట్టు జాబితాలు సిద్దం చేసిన ప్రభుత్వం.. సదరు క్లస్టర్ లో రద్దు చేసిన పోస్టులు,  ఖాళీగా ఉన్న క్లస్టర్ లలో ఉద్యోగులను నియమించకుండానే సాధారణ బదిలీలకు తెరలేపింది. అలాగని క్లస్టర్ విధానమూ అమలు చేయలేదు..మరో ప్రక్క గాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులను ఈ శాఖకు బదిలీ చేస్తున్నది కూడా చెప్పలేదు.. ముఖ్యంగా సచివాలాయల్లో మహిళా పోలీసుల పోస్టులను రద్దు చేసే సమయంలో వారి అర్హతలను బట్టి వారిని సముచిత స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పిన హోం మంత్రి అనిత.. ఇపుడు గాల్లో పెట్టిన పోస్టుల విషయంలో ప్రభుత్వం ముందు ఏ విషయమూ తేల్చలేదు.. హోంశాఖకు చెందిన మహిళా పోలీసుల పోస్టులు గాల్లోనే ఉన్నా అటు ప్రభుత్వం దగ్గర గానీ, ఇటు జిల్లా కలెక్టర్ల వద్ద గానీ ప్రస్తావన తేవకపోవడంతో మహిళా పోలీసలు తమ పరిస్థితి ఏంటంటూ తలలు పట్టుకుంటున్నారు. తమను ఎక్కడికి విసిరేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు..!

వైఎస్సార్సీపీ ప్రభుత్వమే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో తేడాగా వ్యవహరించందునుకుండే దానికి రెండు రెట్లు కూటమి ప్రభుత్వం అంతకంటే దారుణంగా వ్యవహరిస్తుందనే విషయం రద్దు చేసిన పోస్టులను గాల్లో ఉంచి, వారి సంగతి తేల్చకుండా సాధారణ బదిలీలకు తెరలేపిన కూటమి ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తున్నది. రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ గా చేయాలని ప్రతిపాదించి.. దానిని అమలు చేయకుండానే కొన్ని సచివాలయ పోస్టులను రద్దు చేసి జాబితాలు విడుదల చేసింది. అందులో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులతోపాటు అధికంగా మహిళా పోలీసులే అధికంగా ఉన్నారు. వాస్తవానికి క్లస్టర్ విధానం కోసం ఉన్న పోస్టులను రద్దుచేసి జాబితా విడుదల చేశారు గనుక వారికి ముందుగా ఏ క్లస్టర్ లో ఖాళీలు ఉన్నాయో అక్కడ రద్దు చేసిన పోస్టులతో నిర్ధేశించిన పోస్టులను భర్తీచేయాల్సి వుంటుంది.

 ఆపై సాధారణ బదిలీలు చేపడితే గాల్లో ఉంచిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. కానీ దానికి వ్యతిరేకంగా క్లస్టర్ పేరు చెప్పి... పోస్టులను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామవార్డు సచివాలయాకు సందించిన సుమారు 1.30 లక్షల ఉద్యోగుల్లో 20శాతం పోస్టులను రద్దు చేసి జాబితాలు తయారు చేసి సచివాలయాలకు కూడా పంపేసి వారిని గాలిలో పెట్టింది.  క్లస్టర్ గా చేస్తామన్న సచివాలయాల్లో మహిళా పోలీసుల పోస్టులు ఖాళీలు ఉన్నా.. గాల్లోపెట్టిన వారిని మాత్రం ఎక్కడా నియమించకుండానే సాధారణ బదిలీలకు అందరు ఉద్యోగులను దరఖాస్తు చేసుకోవాలని జీఓ జారీ చేశారు. దానితో అందరూ ఇపుడు సాధారణ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గాల్లో ఉన్న మహిళా పోలీసులకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే గత సారి జరిగిన అభ్యర్ధన బదిలీల్లో చాలా మంది మహిళా పోలీసులకి బదిలీలు జరిగిపోయాయి. 

అలా వచ్చినవారిని ప్రస్తుతం పోస్టులు రద్దు చేసిన వారిలో ఎక్కువమందిని జాబితాల్లోకి చేర్చారు. సదరు క్లస్టర్ లలో ఖాళీలు ఉన్నా వారిని నియమించకుండా అలానే వదిలేశారు. దీనితో వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. గత ఏడాది బదిలీలపై వచ్చిన వారు ప్రస్తుత సాధారణ బదిలీల్లో దరఖాస్తు చేసుకోవడానికి లేదు. అలాగని క్లస్టర్ వ్యవస్థ కూడా అమలు కాలేదు. ఈ రెండూ జరక్కపోవడంతో రద్దైన పోస్టుల్లో మహిళా పోలీసులందరూ ఇంకా గాల్లోనే ఉన్నారు. బదిలీలు జరిగితే ఖాళీలన్నీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నవారు కోరుకుని జాయిన్ అయిపోతారు. ఇటు చూస్తే రద్దైన పోస్టులను గాల్లోనే ఉంచి వీరిని ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు. బదిలీల ప్రక్రియ పూర్తయిపోతే.. ఎక్కడో సుదూరాన ఉన్న ఖాళీల్లోకే గాల్లో ఉన్న మహిళా పోలీసులకు పోస్టింగులు ఇవ్వాల్సి వస్తుంది. అది ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఖాళీ ఏర్పడుతుందో.. వీరిని ఎక్కడ నియమిస్తారో.. అసలు రద్దు చేసిన పోస్టుల్లో ఉన్నవారిని సచివాలయాల్లో నియమిస్తారో లేదో కూడా వీరికి  ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. 

మహిళా పోలీసులకు ప్రస్తతం ఏ ప్రభుత్వశాఖ లేనప్పటికీ వారి నియామకాలన్నీ పోలీసుశాఖ ద్వారానే జరిగాయి. వాస్తవానికి క్లస్టర్ విధానంలో రద్దైన పోస్టులు ఏం చేస్తారనే విషయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వం ముందు, గ్రామ, వార్డు సచివాలయశాఖ ముందు పెట్టి ప్రస్తావించాల్సి వుంది. కానీ ఇక్కడ ఆపని కూడా జరగలేదు. అలాగని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు  మహిళా పోలీసులు, పోస్టులు రద్దైన సచివాలయ ఉద్యోగులు వెళ్లి మొర పెట్టుకుంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనపుడు మేము మాత్రం ఏం చేయగలమని చేతులెత్తేస్తున్నారు. కానీ డిఎస్సీ నియామకాలు చేసిన చైర్మన్, జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లొచ్చు. కానీ  కలెక్టర్లు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. 

ఇదే విషయమై విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను చరవాణిలో ఈరోజు-ఈఎన్ఎస్ వివరణ కోరిణా దానికి సమాధానం రాలేదు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టక ముందే రద్దు చేసిన పోస్టుల్లోని వారికి ఒక క్లారిటీ ఇవ్వడమో.. లేదంటే ఖాళీలు ఉన్నచోట క్లస్టర్ లోకి వెళ్లే చోట రద్దు చేసిన పోస్టుల్లోని వారిని భర్తీచేయడమో  చేయాలి. లేదంటే సాధారణ బదిలీల సమయంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఇతర ప్రాంతాలు కోరుకున్నవారు వచ్చి చేరిపోయి.. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి తీవ్ర నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

Visakhapatnam

2025-06-26 21:11:41

ఇక తాడో పేడో.. విశాఖలో కదంతొక్కిన సచివాలయ ఉద్యోగులు..!

విశాఖలో గ్రమ, వార్డు సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు.. ప్రధాన సమస్యలతోపాటు, ఆర్ధికేతర అంశాలు పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఈ మేరకు జీవిఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా ముందు ఏకరువు పెట్టారు సచివాలయ ఉద్యోగులు. ఆంధ్రప్రదశ్ ప్రభుత్వంలో 75 ప్రభుత్వశాఖలుంటే.. 75వ శాఖగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం కనీసం తమ శాఖకు చట్టబద్దత కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి ఆరేళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కూడా తమ ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే చాలా చిన్నచూపు చూస్తుందని వాపోయారు.

 దేశంలో ఎక్కడైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసిన దానికి క్యాబినెట్ లో ఆమోదం తెలిపి అసెంబ్లీలో చట్టబద్దత తీసుకువచ్చి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని.. కానీ గతం ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చింది అలానే వదిలేసిందని.. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తమ శాఖకు చట్టబద్దత తీసుకువచ్చే విషయంలో ఒక్కసారి కూడా క్యాబినెట్ లో సచివాలయ శాఖకు చట్టబద్దత కల్పించే అంశాన్ని చర్చించలేదన్నారు. పైగా  హోం మంత్రి వంగల పూడి అనిత సచివాలయ ఉద్యోగు విద్యార్హతలను బట్టి వారికి సముచిత స్థానాలు కల్పిస్తామని చెప్పిన తరువాతే ప్రభుత్వం కొన్ని పోస్టులు రద్దు చేసి మహిళా పోలీసులను గాల్లోనే ఉంచేశారని ఆరోపించారు. మహిళా పోలీసులు పోస్టులు ఏ క్లస్టర్ ఉన్నవారిని కలుపుతున్నారో అక్కడ పోస్టులు ఖాళీలు ఉన్నా అక్కడ వారిని నియమించకుండానే నేడు ఆఘమేఘాలపై బదిలీలు చేపడుతున్నారని అన్నారు.

 ఇలా చేయడం ద్వారా మహిళా పోలీసులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఐదేళ్లు దాటిని వారికి ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఇచ్చారు తప్పితే.. ఖాళీగా ఉన్న క్లస్టర్ సచివాలయాల్లో బదిలీలకు ప్రభుత్వం ఐదేళ్లు పూర్తవని వారికి, కొత్తగా గతేడాది బదిలీలపై వచ్చిన వారికి అవకాశం ఇవ్వలేదన్నారు.  ఏ ప్రభుత్వశాఖలోనూ గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉన్నంత మంది విద్యావంతులు లేరని.. అలాంటి తమను ప్రభుత్వ సేవలకోసం వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యోగం ఒక శాఖలో ఇచ్చి అన్ని ప్రభుత్వశాఖల విధులు తమతో చేయిస్తున్నా..ప్రభుత్వ ఉద్యోగంలో భవిష్యత్తు ఉందనే నమ్మకంతో చేస్తున్నామని.. కానా రాను రాను తమకు ఉద్యోగ భద్రత కరువైపోతుందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ వ్యతిరేక విధానాల కంటే కూటమి ప్రభుత్వం మరింత అధికంగా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని పేర్కొన్నారు. 

కనీసం ఉద్యోగులను సంప్రదించకుండా, ఉద్యోగులను ఏ శాఖలోని ఖాళీల్లో భర్తీచేస్తారో చెప్పకుండా రేషనలైజేషన్ పేరుతో చాలా ఉద్యోగాలను రద్దు చేసి తమను గాల్లో పెట్టిందని.. తీరా గాల్లో పెట్టిన వారిని ఎక్కడకు పంపిస్తున్నారో చెప్పకుండా మళ్లీ బదిలీలు చేస్తామని చెబుతుందని ధ్వజమెత్తారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తున్నారని.. అదేవిధంగా అన్ని ప్రభుత్వశాఖల విధులు తాము చేస్తున్నా తమకు మాత్రం పదోన్నతులు కల్పించే విషయం మాట్లాడితే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. యోగాలో విశాఖలో గిన్నిస్ రికార్డ్ సాధించడంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రధాన భూమివ వహించారని ప్రభుత్వానికి తమ వలన మంచి పేరు వస్తున్నా.. తమకు మాత్రం ప్రభుత్వంలో ఉద్యోగభద్రత కరువైందన్నారు. తమ ఉద్యోగులకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో నిరసన వివిధ రూపాల్లో తెలియజేస్తామని హెచ్చరించారు. 

ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించామని, ఇకపై ప్రజలు అర్జీలు సమర్పించే స్పందనలోనూ, ప్రభుత్వ అధికారుల ప్రత్యేక స్పందనలోనూ, ఎవరి సచివాలయాల్లో వారే ప్రభుత్వానికి తెలిసే విధంగా అర్జీలు సమర్పిస్తామని కూడా తెలియజేశారు. ప్రభుత్వం తమను ఎన్ని విధాలుగా వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాకపోతే తమకు పదోన్నతులు కల్పించి, నిర్ధిష్టమై సర్వీసు రూల్స్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ నిబంధనలు లేకపోతే ఎంతకాలమైనా తాము ఈ ఉద్యోగాల్లో మగ్గిపోవాల్సి వుంటుందని.. గత ప్రభుత్వం చేసిన తప్పులనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ తీవ్ర తాత్సారం చేస్తుందని ఆరోపించారు.

 ఉయ్ వాంట్ జస్టిస్, ప్రమోషన్ ఫస్ట్- ట్రాన్స్ ఫర్ నెక్స్ట్, నోషనల్ ఇంక్రిమెంట్లు విడుదల చేయాలి, 9నెలల అరియర్సు విఢుదల చేయాలవంటి, వార్డు టు వార్డు మాత్రమే బదిలీలు చేయాలి, ఖాళీల భర్తీ వెంటనే చేపట్టాలి, ఇతర శాఖల అధికారుల ఆదిపత్యాన్ని తగ్గించాలి, అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జీవిఎంసీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2025-06-23 14:57:15

మహా డేంజర్... విశాల విశాఖకు మంచినీటి గండం.. ఇక అంతా ఉప్పునీరే?!

విశాఖపట్నం పేరుకే అందమైన మహానగరం.. మంచినీరు తాగుదామంటే ఎక్కడ బోరు వేసినా అంతా ఉప్పునీరే.. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాం చిన విశాఖల విశాఖలో రానున్న రోజుల్లో మంచినీరు చాలా ఖరీదు కానున్నది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇబ్బడి ముబ్బడిగా తవ్వేస్తున్న బోర్లు విశాఖనగరంలోని భూగర్భ జలాలను హరించి వేస్తున్నాయి. నీటిని వినియోగించుకున్నవారు కనీసం వాడేసిన నీటినైనా భూమిలోకి పంపే ప్రయత్నం చేయడంలేదు. వాడుక నీరు కూడా మురికి కాలువల ద్వారా  సముద్రంలోనే కలిసిపోతున్నది. అదే ప్రతీ ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే.. భూగర్భ జలాల్లో అడుగంటిపోతున్న మంచినీటికి మళ్లీ జీవం రావడానికి అవకాశం వుంటుంది. కానీ ఆ పరిస్థితి మహా విశాఖ నగరంలో వున్న ప్రజలకు పట్టడం లేదు. అలాగని మహా విశాఖనగరపాలక సంస్థ కూడా రానున్న పెను ఉపద్రవాన్ని అంచనా వేయడం లేదు. 

అన్నీ అనుకూలించి పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రానున్న రోజుల్వో విశాఖ నగరవ వాసులకు మంచినీరు వస్తుంది. లేదంటే ఇతరరాత్రా మంచినీటి వనరులు ఎంతకాలమో నగర ప్రజల దాహార్తిని తీర్చలేవు. ఒక రకంగా చెప్పాలంటే అరబ్ దేశాల పరిస్థితి వచ్చేలా ఉంది ఇక్కడ కూడా. ప్రస్తుతం మహావిశాఖ నగర పరిధిలో భూ గర్భంలో మంచినీటి జల ఇంకి పోయి.. ఉప్పునీటి జల పైకివచ్చేసింది. ఇపుడు ఎక్కడ బోరుబావులు తవ్వినా అదే ఉప్పునీరు వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే రోజుల్లో ఆ ఉప్పునీరు కూడా బోరుబావుల్లోకి వచ్చే పరిస్థితి ఉండదు. మంచినీటి గండం నుంచి బయట పడాలంటే మాత్రం ఖచ్చితంగా విశాఖలో ఎన్ని ఇళ్లున్నాయో ప్రతీ ఒక్కరూ ఇంకుడు గుంతలను తవ్వించుకొని.. ఖచ్చితంగా వాడుక నీటిని భూమిలోకి పంపాల్సిన సమయం ఆశన్నమైంది. ఇదేదో విశాఖ వాసులను భయపెట్టడానికో, మరెందుకో చెప్పడంలేదు. విశాఖమహానగరం రానున్న రోజుల్లో ఎదుర్కోబోయే మంచినీటి గండాన్ని ముందుగానే ప్రస్తావించాల్సిన సమయం వచ్చినందున చెప్పాల్సి వస్తున్నది. 

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఉన్న బోర్లలో ఉప్పునీరు, చప్పటి నీరు వస్తుండటంతో ప్రతీ ఒక్కరూ స్నానాలకు బోరు నీరు.. త్రాగడానికి మినరల్ వాటర్ కొనుక్కోవాల్సి వస్తున్నది. ఫలితంగా విశాఖలో 25 లీటర్ల మంచినీటి క్యాన్ రూ.50 నుంచి 200 వరకూ ధర పలుకుతుంది. అదీ ఆయా కంపెనీలను బట్టి. అదే మంచినీరు పూర్తిగా ఇంకిపోతే విశాఖ వాసుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేస్తేనే అది అత్యంత భయంకరంగా వుంటుంది. పేరుకి అందమైన నగరం.. త్రాగడానికి మంచి నీరు మృగ్యం అని ఇకపై అన్ని మీడియాలో ప్రధాన శీర్షికలతో వార్తలు వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. పర్యావరణ వేత్తలు ప్రజలను ఎంత చైతన్యం చేస్తున్నప్పటికీ అవగాహన, చలనం మాత్రం కొంత మందిలోనే వస్తున్నది. చాలా మంది వాడుక నీటిని భూగర్భ కాలువల్లోకే విడిచి పెడుతున్నారు. విశాఖవాసులు.. విశాఖ వచ్చి స్థిరపడాలనుకున్నవారికి ఒక భయకరమైన రహస్యం కూడా చెప్పాలి. రాష్ట్రంలో అత్యధికంగా సాల్ట్ వాటర్ ఫ్యూరి ఫయర్స్ విశాఖలోనే సేల్ అవుతున్నాయి. 

ఈ విషయం మహా విశాఖ నగరంలోని ఏర్పాటవుతున్న సాల్ట్ వాటర్ ప్యూరి ఫైయర్స్ ఏర్పాటు చేస్తున్న ప్రాంచైలీజే స్పష్టం చేస్తున్నాయంటే విశాఖ వాసులు ఉప్పునీటిని మంచినీరుగా.. వాడుక నీరుగా మార్చుకోవడాని ఏ స్థాయిలో వీటిపై ఆధార పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సాల్ట్ వాటర్ ఫ్యూరి ఫైయర్స్, సాల్ట్ వాటర్ ఫిల్టర్స్ అధికంగా వినియోగిస్తున్న విశాఖ వాసులు ఇంకుడు గుంతలను మాత్రం తవ్వించడం లేదు. కనీసం ప్రభుత్వమైనా ఆ పనికి పూనుకుకుంటే విశాఖ వాసులకు మంచినీరు రానున్న రోజుల్లోనైనా దక్కే అవకాశాలుంటాయి. లేదంటే మహావిశాఖ నగర పాలక సంస్థ సరఫరా చేసే మంచినీరు, బయట అధిక మొత్తం వెచ్చించి కొనుక్కునే మినరల్ వాటర్ మాత్రమే దక్కుళ్లు అవుతాయనడంలో అతిశయోక్తి కాదేమో. అందులోనూ అడపా దడపా ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు కాలేజీలు, గ్రూప్ హౌస్ నిర్వాహకులు తవ్వేస్తున్న వేల అడుగుల బోరుబావుల వలన ఆ చుట్టుప్రక్కల వుండేవారికి ఎండాకాలంలో నీరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. 

అలాంటి ప్రాంతాల్లో ముఖ్యమైనవి ఆరిలోవ, సీతమ్మధార, ఎండాడ, మధురవాడ, బీచ్ రోడ్డు, కేజీహెచ్  ఏరియా, మర్రిపాలెం, 104 ఏరియా, మాధవ ధార, ఎన్ఏడి కొత్తరోడ్డు, గోపాలపట్నం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో ఎండాకాంలో చాలా ఇళ్లలో బోరు బావులు పనిచేయవు. పనిచేయవంటే కరెంటు లేకపనిచేయడం కాదు ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలు తవ్వేసిన బోరుబావుల వలన పూర్తిగా భూగర్భ జాలాలు అడుగింటి పోతున్నాయి. ఈ పరిస్థితి విశాఖ మహానగరం మొత్తం వ్యాప్తిచెందకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ఇంకుడు గుంతలు ప్రతీ ఇంటి దగ్గరా తవ్వించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే మరో ఐదు, పదేళ్లు దాటితే ఉన్న ఆ కాస్త మంచినీటి జల పూర్తిగా ఇంకి పోయి జీవితాంతం ఉప్పునీటితోనే అన్ని అవసరాలను తీర్చుకోక తప్పదు.. పారాహుషార్.. ?!

visakhapatnam

2025-06-10 08:12:24

డేంజర్ బెల్స్.. కాలుష్యంలో అగ్రభాగాన విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ..!

మేడి పండు చూడ మేలిమై ఉండును.. పొట్ట విప్పిచూడ పురుగులుండు.. అన్న సామెత సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నానికి సరిగ్గా సరిపోతుంది. అందమైన విశాఖ నగరరం పైకి సుందరంగానూ.. లోన కాలుష్యంతో నిండిపోయింది. విశాఖ పోర్టు ద్వారా వాయు కాలుష్యం..జీవిఎంసీ డ్రైనేజీల  ద్వారా నీటి కాలుష్యం.. ఆ మురుగు నీరు సముద్రంలో కలవడం ద్వారా సముద్ర కాలుష్యం.. డ్రైనేజీలకు ఆనుకొని వున్న మంచి నీటి పైపుల్లోకి చేరుతున్న మురునీటితో మంచినీరు కలుషితం.. వేళా పాలా లేకుండా అర్ధరాత్రి సమయంలో అత్యధిక శబ్దాలతో మోగిస్తున్న డీజే సౌండ్లతో ధ్వని కాలుష్యంతో మహా విశాఖ నగరం అన్నింటా కలుషితం అవుతోంది. కాలుష్యం నుంచి విశాఖను కాపాడేస్తున్నామనే పాలకుల మాటలుకి విశాఖ నగరంలో  రోజు రోజుకి పెరుగుతున్న శ్వాస కోస వ్యాధుల బాధితులే సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. విశాఖలో ఇపుడు శ్వాస కోస వ్యాధుల ఆసుపత్రులు ప్రాంతానికి ఒకటి పుట్టుకొస్తున్నాయి. అంటే విశాఖ కాలుష్యం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

పోర్టు కాలుష్యాం బయటకు రాకుండా నిలువెత్తు కాంపౌండ్ గోడలు కట్టినా.. పోర్టుకి ఎదురుగా ఉన్న ఎస్సార్ కంపెనీ నుంచి వచ్చే దుమ్మూ, దూళీ, కన్వేయర్ బెల్టు ద్వారా వచ్చే నల్లభూడిలు వన్ టౌన్ ఏరియాని సందర్శిస్తే ఆ ప్రాంతంల పూర్తిగా మారిన రంగును బట్టే చెప్పొచ్చు కాలుష్యం ఏ స్థాయిలో వుంటుందో.. నల్లబూడిత బాధను తట్టుకోలేక పోర్టు ఏరియా, వన్ టౌన్ ఏరియా వాసులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. నిత్యం ట్రాఫిక్ లో ఉద్యోగాలు చేసే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ మధ్య కాలంలో అత్యధికంగా కాలుష్యం భారిన పడుతున్నారు. విశాఖ చట్టూ ఉన్న కర్మాగారాలు వలన తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఉదయం 5గంటల ప్రాంతంలో వచ్చే రసాయానాల దుర్వాన ముక్కు పుటాలు అదిరేలా వుంటుంది. ఒక్కోసారి గుక్కతిప్పుకోలేని రసాయాల వాసవచ్చి ప్రజలు ఉక్కిరి బిక్కిరి కూడా అవుతుంటారు. ఆ సమయంలో అయితే ఎవరూ పెద్దగా బయటకు రారనే ఉద్దేశ్యంతో ఆ సమయంలోనే నగరం వెలుపల ఉన్న కర్మాగారాలన్నీ వాయువులను బయటకు వదులుతున్నాయి. 

వీటిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కంపెనీలు బడాబాబులవి కావడంతో ఫిర్యాదులన్నీ బుట్టదాఖలు అవుతున్నాయి. ఎక్కడైనా సముద్రతీర ప్రాంతం వుందంటే అక్కడ మత్స్య ఉత్పత్తులు అధికంగా దొరుకుతుంటాయి. విశాఖలోని ప్రధాన ప్రాంతాల్లోని డ్రైనేజీలన్నీ బంగాళా ఖాతంలో కలవడంతో సముద్ర జలాలు కూడా కలుషితం అయి మత్స్య సంపద ఒడ్డుకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కర్మాగారాలు వదిలే వ్యర్ధాల కారణంగా సముద్రంలో చాలా దూరం వరకూ మత్స్యకారులకు చేపడు పడే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఆ కారణంగా కొద్దిపాటి చేపల వేటకే సముద్రం మధ్యవరకూ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్న గంగపుత్రుల మాటలు ఒకింద బాధను, భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. విశాఖలోని వాతావరణం మిగిలిన అన్ని ప్రాంతాల కంటే భిన్నంగానే వుంటుంది. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారిపోవుడం.. నగరం పరిధి ఎంత వరకూ ఉంటే అంతవరకూ కట్టడాలు వెలుస్తుండటంతో పచ్చని చెట్లు పెంచే ఖాళీ లేకుండా పోతున్నది. 

ఉన్న కొద్తి పాటి స్థలంలో ప్రభుత్వమే పెంచిన ఏడాకుల చెట్లు నుంచి వస్తున్న తిక్క వాసన నగర వాసులను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎక్కడైనా చెట్ల వలన స్వచ్చమైన గాలి వస్తుంటే.. విశాఖనగరంలో మాత్రం గాలి రసాయానాలు, వ్యర్ధాలు, తిక్క తిక్క వాసనలతో వస్తుంటుంది. ప్రస్తుతం విశాఖనగరంలో 60శాతం మంది వాటర్ ప్యూరీ ఫైయర్స్ వినియోగిస్తున్నారు. కలుషితం అయిన నీటిని త్రాగితే ఎక్కడ రోగాలు వస్తాయోననే భయంతో.. రానున్న రోజుల్లో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఎయిర్ ప్యూరీ ఫైయర్ లు కూడా కొనుక్కునే పరిస్థితికి విశాఖ మహా నగరం వచ్చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఏటా పర్యావరణ పరిరక్షణ దినోత్సం రోజున ప్రచార అర్భాటాల కోసం ఫోటోలకి ఫోజులిచ్చే సంస్థలు ఎంత మేర పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సి వుంది.

 విశాఖ పోర్టు ట్రస్టు ఎంత గోడ పరదాలు కప్పినా కాలుష్యం అంతకంతకూ పెరుగున్నది తప్పితే తరగడం లేదు. భీమిలీ నుంచి కాకినాడ వరకూ సముద్రతీర ప్రాంతంలోని ఎన్ని కర్మాగారాలు వాటి వ్యర్ధాలను సముద్రంలోకి మోతాదుకి మించి వదులుతున్నాయనే పరిశీలన చేసి వాటిని నియంత్రించలేకపోతేమాత్రం రానున్న తరలాకు మత్స్యసంపద అందని ద్రాక్షగా తయారైనా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు. సిటీ ఆఫ్ డెస్టినీ అంటే నగరాన్ని అందగా ఉంచడమే కాదు.. కాలుష్యం భారి నుంచి కాపాడి స్వచ్ఛమైన నగరంగా తీర్చి దిద్దే బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలపై కూడు ఉందనే విషయన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి..?!

visakhapatnam

2025-06-06 08:20:06

రూ.350 కోట్లు మడత పెట్టేశారట..? డ్రెజ్జింగ్ కార్పోరేషన్ లో డీజిల్ స్కామ్..!

డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా..ఈ కేంద్రప్రభుత్వ సంస్థ చాలా మందికి పెద్దగా పరిచియం లేని పేరు.. ఎప్పుడైనా సముద్రంలో ఇసుక మేటలు వేస్తే మాత్రం సముద్రంలోకి బడా బడా వెసల్స్ వచ్చి ఇసుకను బయటకు తోడుతాయి. చూడటానికి చాలా వింతగా కూడా కనిపిస్తుంటుంది. అలాంటి వింతలపై స్కెచ్ వేసి.. కోట్లు కొల్లగొడతారని ఎవరూ ఊహించరు.. అదే అలుసుగా తీసుకున్న డిజిసిఐ సంస్థకు చెందిన అధికారులు, ఏజెంట్లు.. వందల కోట్ల రూపాయల డిజీల్ బిల్లుల్లో లెక్కల్లో బొక్కలు చూపించి భారీ స్థాయిలో నొక్కేశారట. విషయం బయటకు రాకుండా ఇద్దరు ప్రజాప్రతినిధులకు కూడా వాటాలు ఇచ్చారట. అయితే అడక్కుండా ఎందుకు వాటాలిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తే వందల కోట్లలో తేడాలు వచ్చాయని బయటకు వచ్చిందని.. ఇదే అంశంపై పలు దఫాలు సమావేశాలు జరిగాయని కూడా చెబుతారు.. ఆ విషయం కాస్త సంస్థలోని వారు, సంస్థకు డీజిల్ సరఫరా చేసిన ఇండియన్ ఆయిల్ కంపెనీలోని ఏజెంట్లు.. ఆ విషయాన్ని ఇద్దరికే( ఒకటి అడిగిన వాడికి.. రెండూ అడగని వాడికి) చెప్పడం మొదలు పెట్టారు. దీనితో విషయం  గుప్పుమంది.. కొందరు సమాచార ప్రతినిధులు విషయం తెలుసుకొని చల్లగా వారి పని వాళ్లు కానిచ్చేశారు కూడా.. ఎవరికీ తెలియదనుకుంటున్నా డీజిల్ పొస స్కామ్  విశాఖలో ఇదే హాట్ టాపిక్..!

సముద్రంలో మేటలు వేసిన ఇసుకను ఒడ్డుకి తోడి సముద్ర అలల నుంచి ఒడ్డు ప్రాంతానికి రక్షణ కల్పించడానికి డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా భారీ వెసల్స్ తో ఇసుకను ప్రతీ ఏటా తవ్వుతుంటుంది. దానికి పోయి వందల కోట్లలో తేడాలు ఎందుకు వస్తాయని అందరూ అనుకోవచ్చు మీరంతా. ఇక్కడే అధికారులు, ఏజెంట్లు, ఆయిల్ కంపెనీలు, డ్రెజ్జింగ్ కి వెసల్స్ కి మరమ్మతులు చేసే సంస్థలు, సొంత వెసల్స్ లోని సిబ్బంది, అధికారుల బుర్రలు పాదరసంలా పనిచేస్తాయి. ఆ తెలివితోనే సముద్రంలోని ఇసుకను బయటకు తోడినంత సులువుగా వందల కోట్ల రూపాయలను ఎవరికీ తెలియకుండా మడత పెట్టేస్తారు. అసలు డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలోని స్కామ్ ఏ విధంగా జరుగుతుందో తెలిస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయి. దానితో మీరే అధికారులు ఏస్థాయిలో ప్రభుత్వానికి మస్కా కొట్టి పెద్ద మొత్తంలో నొక్కేస్తుంటారో చెప్పేస్తారు. అదే జరిగిందిట ఇప్పుడు కూడా. సాధారణంగా డిజిసిఐ డ్రెజ్జింగ్ వెసల్స్ సముద్రంలో ఇసుక మేటలను తోడే సమయంలో వెసల్స్ కి వందల వేల లీటర్లలో డీజిల్ అవసరం పడుతుంటుంది. అదే సమయంలో లేని మరమ్మతులు కూడా తెరపైకి వస్తాయి. 

అదేమంటే నిరాటంకంగా డ్రెజ్జింగ్ వెసల్ పనిచేస్తున్నప్పుడు మరమ్మతులకు గురైందని.. దానిని రిపేరు చేయాలంటే లక్షల్లో ఖర్చు అయిందని కూడా చెబుతారు. మరమ్మతులు అయితే లక్షలే అదే గంటల కొద్దీ వెసల్ ఇసుకతవ్వే సమయంలో వేల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందంటూ లెక్కలు చూపించి మరీ బిల్లుల్లోనూ అడ్డంగా నొక్కేస్తున్నారు. అదీ ఎలా అంటే ఒక్కో డ్రెజ్జింగ్ వెసల్ ఇంజన్ ఆన్ లో ఉన్నప్పుడు గంటకు 30 నుంచి 50 లీటర్లు డీజిల్ కాలుతున్నట్టుగా లెక్కలు చూపిస్తున్నారట. వాస్తవానికి ఏ వెసల్ కి ఎంత మొత్తంలో డీజిల్ ఖర్చు అవుతుందనే విషయం చాలా ఏళ్లనుంచి అధికారులు కూడా సక్రమంగా లెక్కలు వేయలేదు. కేంద్రంలోని ఉన్నతాధికారులు ఇక్కడ డీజిల్ ఖర్చు.. దానిలోని కాకమ్మ లెక్కలు నమ్మే పరిస్థితి లేకపోతే.. ఇంత మొత్తంలో మడత పెట్టడానికి అవకాశం ఉండేది కాదేమోంటు అంటున్నారు విశ్లేషకులు. మన దగ్గరున్న డ్రెజ్జింగ్ వెసల్స్ అన్నీ కూడా చాలా పాతవని.. అందుకే డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారట. అయితే దానిని డిజిసిఐలోని ఉన్నతాధికాకులు నమ్మి అదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి వుంటుంది. 

అలా తీసుకెల్లడానికే డీజిల్ బిల్లులో భారీ స్థాయిలో నొక్కేసిన మొత్తాన్ని అధికారుల హోదాకి తగ్గట్టుగా పంపకాలు చేసుకొని.. రేపన్నారోజు ఏ ప్రజాప్రతినిధి మాట్లాడకుండా ముందుగానే వారిని ప్రశన్నం చేసుకొని వారికి కూడా వాటాలు సమర్పిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇదంతా ఢిల్లీ, ముంబై కేంద్రాల్లోని కార్యాలయ అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అంటే అంతా తెలిసే జరుగుతుందని.. విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై కార్యాలాయల్లోని అధికారులకు కూడా డీజిల్ స్కామ్ లోని వాటాలు వెళుతున్నట్టుగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇదే విషయమై విశాఖలోని డిజిసిఐ అధికారులను వివరణ కోరేందుకు ఈరోజు-ఈఎన్ఎస్ ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఒకరిద్దరు చోటా  అధికారులు అడక్కుండానే ముందుకి వచ్చి ఏ మీడియాకి డిజిసిఐ లోని డీజిల్ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగానే మాట్లాడుతుండటాన్ని బట్టి విషయం ఏస్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. ఎంత మొత్తానికి డీజిల్ బిల్లుల రూపంలో మడత పెట్టారో కూడా వేరేగా చెప్పాల్సిన పనిలేదు.

-విషయం బయటకు రాకుండా ఒక అధికారి బదిలీ
డిజిసిఐలో వేల లీటర్ల ఖర్చు అయినట్టుగా చూపిన డీజిల్ స్కామ్ విషయం తెలిసిన ఒక అధికారిని మూడో కంటికి తెలియకుండా కేంద్ర కార్యాలయానికి బదిలీల చేసినట్టు తెలిసింది. మరో అధికారికి వార్నింగ్ ఇచ్చి.. విషయం మీడియాకి తెలిస్తే.. నువ్వు దానిని బయట పెట్టినట్టుగా భావించాల్సి వస్తుందని కూడా చెప్పారట. అయితే ఈ పంపకాల విషయం మాత్రం ఓ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఓ స్టార్ హోటల్ లో చర్చించుకున్న తరువాతనే అక్కడి నుంచి విషయం బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ సుమారు  రూ.350 కోట్లకు పైనే డీజిల్ లెక్కల్లో బొక్కలు పెట్టి అందిన కాడికి మొత్తం నొక్కేశారట. విషయాన్ని సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులకు, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కి చెందిన సిబ్బంది కూడా సమాచారాన్ని కేంద్రం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడంలో విచారణకు వచ్చిన అధికారికి కూడా కోట్లలోనే ముడుపులు ఇచ్చినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.

విచారణ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సంస్థలోని ముఖ్య అధికారులుకు వెసల్ నిర్వాహకులకు, కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలకు, మరికొందరు తెలుగు సమాచార ప్రతినిధులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చిన కారణంగానే ఇన్నికోట్ల రూపాయల డీజిల్ స్కామ్ ఇప్పటి వరకూ బయటకు రాకుండా ఉండిపోయిందని చెబుతారు. చూడాలి ఇంత పెద్ద మొత్తంలో జరిగిన డ్రెజ్జింగ్ కార్పోరేషన్ డీజిల్ స్కామ్ వ్యవహారంలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారు.. ఫిర్యాదులు వెళ్లిన సిబిఐ ఎలా కేసుని విచారణ చేస్తుంది.. ఈ సీన్ లో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎవరనే విషయం త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలున్నాయి..?!

visakhapatnam

2025-05-31 15:32:21

విశాఖలో తేడా మీడియా కేటుగాళ్లు..? అందరి పేరుతో వీళ్లే డబ్బులు నొక్కేస్తారు..!

వాడికి పొట్ట విప్పితే అక్షర ముక్క రాదు.. వార్తలు రాయడమంటే అదేంటి అడుగుతాడు.. ఒక సింగిల్ కాలమ్ వార్త రాయమంటే కనీసం వారం రోజులు సమయం తీసుకుంటాడు.. అదేంటంటే వీడికి ముందు రాయడం రావాలి కదా.. పెన్ను పట్టుకోవడం కూడా సక్రమంగా రాదు.. కానీ జేజుబులో మాత్రం ప్రెస్ రిపోర్టర్ ఐడీకార్డు.. ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కూడా వుంటుంది.. వార్తలు రాయడం రాదు కానీ.. పక్కోడు రాసే వార్తలన్నీ వీడే  ఆ పేపర్ కి, ఛానల్స్ కి రాసి ఇస్తున్నట్టు అందరినీ నమ్మిస్తాడు.. వీడి మాటలు నమ్మే వెర్రి పుష్పాలు బొక్కబోర్లా పడి మరీ నమ్మేస్తారు.. అంతేకాదు వీడు ప్రెస్ నోటు రిపోర్టర్లకు పంపాలంటే ఒక రేటు.. దానిని పత్రికల్లో రాయించాలంటే  మరోరేటు.. దానిని వాట్సప్ గ్రూపుల్లో తన చెంచాగాళ్లతో తిప్పించాలంటే మరో రేటు.. అంతేకాదండోయ్ అందరి విలేఖరుల పేర్లు చెప్పి వీడొక్కడే మొత్తం నొక్కేయడంలో మాత్రం సిద్ధ హస్తుడు.. విశేషం ఏంటంటే ఇలాంటి తేడా గాళ్లనే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు గుడ్డిగా నమ్మేసి  వేలకు వేలు దారపోస్తూ.. వీరి దారుణంగా పెంచి పోషిస్తున్నారు.. చేస్తున్నది తప్పని తెలిసినా.. అవసరం వారితో మీడియా కేటుగాళ్లనే ఆశ్రయించేలా చేస్తున్నది.. రోజు రోజుకీ విశాఖలో పెరిగిపోతున్న ఈ తేడాగాళ్ల వలన నిజంగా కంటెంట్ తో వార్తలు రాసే నికార్శైన జర్నలిస్టులు కూడా బయట రిపోర్టర్లమని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుంది..?!

మహా విశాఖ నగరంలో మీడియా కేటుగాళ్లు, ప్రెస్ ఐడీ కార్డుతో చలా మణీ అయిపోతున్న తేడా జర్నలిస్టులు ఎక్కువైపోతున్నారు. ఎవడైనా కాస్త డబ్బున్న బకరా దొరికితే వాడిని వెర్రి పుష్పం చేసి.. మీడియా పేరుతో మొత్తం పిండేసి పీల్చి పిప్పి చేసేస్తున్నారు. వీడికి అంత సీన్ లేదని తెలిసినా.. తప్పని సరి పరిస్థితుల్లో ఆ మీడియా కేటుగాళ్లనే ప్రచారం కోసం, జనం మెప్పుకోసం, పత్రికలు, ఛానల్స్ లో వార్తల కోసం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘసేవకులు ఆశ్రయించాల్సి వస్తున్నది. వాస్తవానికి వీడికి పొట్టవిప్పితే అక్షరం ముక్క రాదు.. అవతలి వాడు పచ్చి బూతులు రాసి ప్రెస్ నోటు పెట్టినా దానిని అక్షరం పొల్లుపోకుండా అలాగే కాపీ పేస్టు చేసి మరీ వార్తగా రాసేస్తాడు.. దానినే క్లిప్పింగు చేసి పంపేస్తాడు.. ఇదంతా వీడే రాసేశాడనుకొని అవతలి వాడు గుడ్డిగా నమ్మేస్తున్నాడు.  ఈ పేపర్ క్లిప్పింగులు అన్నీ చూపించి డబ్బులు నొక్కేస్తున్నారు ఈ కేటుగాళ్లు.. ఈ ఆర్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదండోయ్.. మీకోసం ప్రజలందరికీ తెలిసే విధంగా ఎక్కు పేపర్లలో రాయించానని చెప్పి మరీ పేపర్ కి ఇంత మొత్తం ఇవ్వాలని చెప్పి.. అదనంగా కూడా నొక్కేస్తున్నారు. 

వాస్తవానికి వాట్సప్ గ్రూపుల్లో వచ్చే ప్రెస్ నోట్లు, వార్తలను ఏరి కోరి వినియోగించుకోవడమే ఈ మీడియా తేడా కేటుగాళ్ల పని.. ఆ వార్తలు ఏ పేపర్ లలో వచ్చాయో చూసి.. సదరు నిర్వాహకుల ఇంటికి వెళ్లి మరీ డబ్బులు లాగేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా కారులో వెళ్లి టిప్పు టాపు డాబు చూపించి మరీ అందరి పేరూ చెప్పి వీళ్లే డబ్బులు లాగేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే చిన్న, స్థానిక పత్రికలు ఒక్కోసారి వార్తలు చాలక వాట్సప్ గ్రూపుల్లో వచ్చే వార్తలతో పత్రికలను నింపుతుంటారు.. చిన్న పత్రికలకి ఆ సమాయానికి పత్రికలు నిండితే.. అలా నిండిన పత్రికల క్లిప్పింగులతో వీళ్లు వీరి జేబులను నింపుకుంటున్నారు. అవే ఈ మీడియా కేటుగాళ్లకు పెట్టుబడి. అలా వచ్చిన వార్తలు, పత్రికలు వాట్సప్ గ్రూపుల్లోవస్తుంటాయి. మళ్లీ వాటినే ఏరి కోరి జాగ్రత్త చేసి.. అవతలి వ్యక్తి, సంస్థల ఫోన్ నెంబర్లు కనుక్కొని మరీ వెళ్లి.. అన్ని పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు చూపించి.. ఇదిగో మీకోసమే ఇన్ని పేపర్లలో రాయించాను చూడండి అని చెప్పి డబ్బులు గుంజేస్తున్నారు. 

లోకల్  పేపర్ కి రూ.500 ఇవ్వాలి.. ప్రధాన పత్రికలకు రూ.1000 ఇవ్వాలి.. ప్రెస్ నోట్ తయారు చేయించినందుకు  రూ.2వేలు ఇవ్వాలి.. వాట్సప్ గ్రూపుల్లో ప్రెస్ నోట్లు  తిప్పినందుకు రూ.1500 ఇవ్వాలి.. ఇక  నా సర్వీస్ చార్జి మీరు మంచి మనసుతో రూ.3000 ఇస్తే సరిపోతుంది. ఒక వేళ ఇవ్వకపోతే మా సంస్తకు ఎంతో కొంత మీకు నచ్చిన మొత్తంలో రూ.30వేలో, రూ.50వేలో  ఒక యాడ్ ఇప్పించండి  అంటూ మాయమాటలు చెప్పి అనుకున్న టార్గెట్ మొత్తం లాగేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొమ్ములు తిరిగిన మార్కెటింగ్ టీమ్ సైతం వీరి జిమ్మిక్కుల ముందు దిగదుడుపే.. మీ సంస్తకి భారీ స్థాయిలో ప్రచారం కల్పించే పూచీ నాది అంటూ కల్లబొల్లి మాటలతో నమ్మ బలికి వేలల్లో గుంజేస్తున్నారు. ఒక్కోసారి ఇతర దినపత్రికలకు యాడ్స్ ఇప్పించాల్సి వస్తే అందులో 30శాతం కమిషన్ ముందుగానే యాడ్ ఇప్పించినందుకు కూడా లాగేస్తున్నారు. ఫలితంగా సదరు వ్యక్తి లేదా సంస్థ నుంచి అన్ని రకాల ప్రెస్ నోట్లు ప్రధాన పత్రికల వారికి రూ.300, చిన్న పత్రికలకు 200 ఇచ్చి ఆ క్లిప్పింగులనే మళ్లీ అవతలి వాడికి పంపిస్తూ.. డబ్బులు, కమిషన్లు లాగేస్తూ.. కాలం గడిపేస్తున్నారు. 

అలాగని నిజంగా వార్తలు రాసే వెర్రి గొర్రి రిపోర్టర్లు ఈ తేడా గాళ్లను అడటం లేదు.. అడిగితే మళ్లీ ఎక్కడ కమర్షియల్  ప్రెస్ నోటు పంపడేమోననే భయం తో కూడా అడగం లేదు  కారణంగా వార్తకు ఎంతో కొంత వస్తుందని. అంతేకాదు ఒక్కోసారి జరిగే కమర్షియల్ ప్రోగ్రామ్స్ సదరువ్యక్తులకు ప్రధాన పత్రికల్లో పనిచేసే రిపోర్టర్లు చూపించి.. వీళ్లంతా మనం ఎంత చెబితే అంత అని నమ్మిస్తూ వస్తున్నారు.  ఒక్కోసారి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించి వచ్చే వార్తలు, సంస్థలపై వచ్చే వార్తలను కూడా వీరే రాయించినట్టుగా చూపించి మరీ గంప గుత్తగా డబ్బులు దండేస్తున్నారంటే ఈ తేడీ మీడియా కేటుగాళ్లు విశాఖలో ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి తేడాగాళ్లే మళ్లీ కొన్ని జర్నలిస్టుల సంఘాలను మెయింటేన్ చేస్తూ.. తాము జర్నలిస్టులను తెగ ఉద్దరించేస్తున్నామని, క్రిందా మీదా పడిపోయి మరీ జర్నలిస్టులకు సంక్షేమం చేసేస్తున్నామని కూడా అన్ని వర్గాలను నమ్మిస్తూ.. జర్నలిస్టుల సంక్షేమం పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారట.

 అంతేకాదు సదరు కార్యక్రమాలు చేసినపుడు ప్రైవేటు జనాలను, సాంస్క్రుతిక కార్యక్రమాలకు చిన్నపిల్లల తల్లిదండ్రులతో వచ్చే వారినే జర్నలిస్టుల కుటుంబాలుగా నమ్మించి హాలు మొత్తం నిండేలా చూపించి మరీ అధికారులను, ప్రజా ప్రతినిధులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు. నిజంగా చాలా మంది జనం వచ్చారనుకొని వీరి కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు స్పాన్సర్ షిప్ లు కూడా ఇచ్చేస్తున్నారు మదుపరులు. దీనిని బట్టి  మీడియా కేటుగాళ్లకు జర్నలిస్టుల యూనియన్లు, ప్రెస్ ఐడీ కార్డులు, సీనియర్ జర్నలిస్టులుగా, ప్రధాన పత్రికల్లో రిపోర్టర్ల నెట్వర్క్ ఏ స్థాయిలో ఉపయోగ పడుతుందో వేరేగా చెప్పాల్సి పనిలేదు. పైగా ప్రధాన పత్రికల్లో వీరి కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రచురితం అయ్యేలా సదరు పత్రికల్లోని బ్యూరోలకు, ఎడిషన్ ఇన్చార్జిలకు ముందుగానే వీరు చేసు కార్యక్రమాల్లో సన్మానాలు, సత్కారాలు చేయడంతోపాటు, కార్యక్రమాలకు రావడానికి వెళ్లడానికి కార్లు ఏర్పాటు చేస్తున్నారు. 

 దసరా వంటి  పండుగలకు ప్రత్యేకంగా పోతులను వేసి మరీ మటన్ బాక్సులు, చికెన్ బాక్సులు తీసుకెళ్లి ఇవ్వడం.. ఇంటిళ్లపాదికి సరిపోయే విధంగా మిఠాయి బాక్సులు ఇవ్వడం, శని, ఆదివారాలు వస్తే ప్రత్యేకంగా మళ్లీ మటన్, చికెన్ లు పంపడం, కొందరు బిగ్ షాట్ లను పరిచియం చేస్తూ వారితో ప్రత్యేకంగా యాడ్స్ ఇప్పించడం తేడా మీడియా ఇలా వేయని వేషాలంటూ లేవు.  అయితే సమయానికి డబ్బులు, అవసరాలకు కార్లు, ప్రయాణాలు చేసేటప్పుడు దారి ఖర్చులు, పండుగలకు పబ్బాలకు మిఠాయి బాక్సులు, కొత్తబట్టలు,  అప్పుడప్పుడు మధ్యలో స్పెషల్ క్యాష్ ఇస్తుంటే  ఏ మీడియా వాడైనా ఎందుకు ఈ తేడాగాళ్లకు సహాయం చేయకుండా ఉంటారు చెప్పండి. అలాగని వాస్తవాలను నికార్శైన జర్నలిస్టులు చెప్పినా సదరు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంఘ సేవకులు నమ్మే పరిస్థితి లేదు. ఆ సమయానికి ఆ మీడయా కేటుగాళ్లను వీళ్ల ముందు తిట్టడం మళ్లీ వాళ్లనే ప్రత్యేకించి డబ్బులు ఇస్తూ మరీ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇలా ప్రెస్ కార్డు, సీనియర్ జర్నలిస్టు, జర్నలిస్టుల సంఘం, జర్నలిస్టుల పేర్లతో పబ్బం గడిపేసే వారు విశాఖలో లెక్కు మించి ఉన్నారు. 

ఇవన్నీ అందరికీ తెలుసు.. కానీ డబ్బులు, వస్తువులు, అవసరాల ముందు ఎవరికీ ఏమీ కనపడవు, వృత్తి ధర్మం అసలే కనిపించదు. వీడికి వార్త రాస్తే వాడికెంత.. రాసినందుకు నాకెంత.. ఎప్పుడైనా అవసరం వస్తే ఏ విధంగా ఉపయోగపడతాడు అది మాత్రమే అన్ని పత్రికల నిర్వాహకలు, ఏరియా రిపోర్టర్లు, ఆఖిరికి జిల్లా ప్రధాన విలేఖరులు కూడా చూస్తూ.. ఈ మీడియా కేటుగాళ్ల కబంధ హస్తాల్లోని మ్యాజిక్ పడిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్కరోజులో ఇలాంటి తేడాగాళ్లను నియంత్రించడం చాలా కష్టం.. అసలు జరగని పని.. కానీ అప్పుడప్పుడైనా ఈ మీడియా కేటుగాళ్ల కోసం అందరికీ తెలియజేసే బాధ్యతను నిజమైన జర్నలిస్టులు తీసుకోవాలి. లేదంటే సమాజంలో నాల్గవ స్థంబంగా వున్న నిజమైన జర్నలిస్టుల మనుగడ కూడా రానున్న రోజుల్లో ప్రశ్నార్ధకం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సమాజ సేవకులు పొట్ట విప్పితే అక్షరం ముక్క రాని ఇలాంటి మీడియా కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా  ఉండాల్సిన సమయం ఆశన్నమైంది. 

మీకోసం నిజంగా పనిచేసే జర్నలిస్టులను ప్రోత్సహించండి తప్పులేదు.. చిన్న పత్రికలకు చేయూత నివ్వండి మీ పేరు చెప్పుకొని మరో రెండ్రోజులు పత్రికలు ప్రింట్ చేసుకుంటారు.. పత్రికలను నడుపుకుంటారు.. అంతే తప్పా నిలువునా మోసం చేస్తూ.. జర్నలిస్టుల పొట్టగొట్టి అక్షరం ముక్క రాకపోయినా జనాలకు మెరుపులను, పత్రికలను చూపించి మోసం చేసేవారి నియంత్రించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కాదు కూడదు అంటే తెలుసుకదా.. మీరే వెర్రి పుష్పాలు అవుతారు.. మీ డబ్బుతో మీడియా కేటుగాళ్లు అభివృద్ధి చెందుతారు నిజమైన జర్నలిస్టులు నిజంగానే రాయడం మానేస్తారు. కనీసం జర్నలిజాన్ని బ్రతికించడానికి మీరే  తొలి అడుగు వేయండి. మీకోసం వార్తలు రాయడం వచ్చిన వాడితో రాయించుకోండి.. అలాంటి వారికి సహాయం చేయండి.. చేతనైతే అభివృద్ధి చేయండి.. నిజమైన వర్కింగ్ జర్నలిస్టుల సంఘాలకు చేయూత నివ్వండి, స్పాన్సర్ షిప్పులు చేయండి. అంతే తప్పా తేడా, మీడియా కేటుగాళ్లను నియంత్రించడం మాత్రం మీతోనే మొదలు పెట్టండి.. సత్యమేవ జయతే..!

visakhapatnam

2025-05-10 18:19:52

ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. పోస్టు గాల్లో.. విధులు మాత్రం పోలీసుశాఖలో..?!

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను పోలీసులుగా ఎలా పరిగణిస్తారు.. వారంతా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా పోలీసు శాఖలోకి వస్తే పోలీసులైపోతారా అంటూ కోర్టుకేసు.. నిజమే వీరుపోలీలుసు కాదు.. వీరికి పోలీసుశాఖకూ ఎలాంటి సంబంధమూ లేదంటూ సాక్షాత్తూ డిజీపి కార్యాలయం హైకోర్టుకి లిఖిత పూర్వకంగా అఫడవిట్ రాసిచ్చేసింది.. అప్పటి నుంచి ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసుల పోస్టు గాల్లోనే ఉంది.. పోలీసుశాఖ ద్వారా నియామకాలు చేశారు కనుక.. పోలీసుశాఖ నుంచే జీతాలు ఇస్తున్నారు.. పోస్టు సచివాలయశాఖలో బర్తీ చేశారు కనుక జీతం అక్కడి నుంచి వస్తోంది.. అంతే తప్పితే వీరి పోస్టు మాత్రం నేటికీ గాల్లోనే ఉంది..ఈ పరిస్థితి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం వరకూ అలాగే ఉండిపోయింది. నాటి ప్రభుత్వం మహిళా పోలీసుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుకుండా వదిలేసింది.. కానీ కూటమి ప్రభుత్వం ఏదోఒక నిర్ణయం తీసుకొని వారిని సముచిత స్థానంలో కూర్చోబెడతామని అసెంబ్లీలోనూ, మీడియాలో తెగ ప్రచారం చేసినా కూటమి ప్రభుత్వం కూడా తికమక వ్యవహారాలే చేస్తున్నది తప్పా మహిళా పోలీసులను నిర్ధిష్టంగా ఏం చేస్తుందనే విషయాన్ని మాత్రం తేల్చడం లేదు. వెరసీ ఈ మహిళా పోలీసుల పోస్టు, శాఖ గాల్లోనే ఉండగా.. వీరు మాత్రం అధికారికంగా పోలీసుశాఖలోని పోలీసులు విధులే చేస్తున్నారు.. అంటే ఇక్కడ కోర్టు పని కోర్టుది.. ప్రభుత్వ పని ప్రభుత్వానిది.. లేదా హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగానే బావించాలా..?!

ఒక ప్రభుత్వ ఉద్యోగి అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు..అక్కడ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా కోర్టుకి ఏవిధంగా రాసి ఇస్తే ఆవిధంగానే రాష్ట్రప్రభుత్వం వ్యవహరించాల్సి వుంది. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే.. తేడాగానే వ్యవహరిస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా అధికూడా అధికారికంగా.  పోలీసు పోస్టు  కాదు కానీ.. విధులు  మాత్రం అధికారంగా చేయిస్తూ... హైకోర్టు దాఖలు చేసిన అఫడివిట్ ని వక్రీకరిస్తూ.. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో జరుగుతున్న తేడా వ్యవహారం మరోసారి రచ్చకెక్కేటట్టు కనిపిస్తున్నది. మహిళా పోలీసులు గాల్లో ఉన్నారనీ, వారికి తలా తోకా లేదని.. వారికి ప్రభుత్వశాఖ కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఉద్యోగులకు ఇష్టం లేకుండా నేరుగా అగ్రీగోల్డ్ వ్యవహారంలో సమాచారం సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని కొంతమందిని పోలీసుశాఖ అభ్యర్ధన మేరకు సచివాలయ మహిళా పోలీసులను సీఐడికి అప్పగిస్తూ లిఖితపూర్వకంగా సర్క్యులర్ లను జారీ అయ్యాయి. అలా విశాఖపట్నంలో కూడా 60మందిని జివిఎంసీ నుంచి పోలీసుశాఖకు కేటాయిస్తు జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. 

 గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వశాఖను కేటాయించకుండానే అధికారికంగా పోలీసుల విధులు చేయిస్తున్న వైనం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. ఈ తేడా వ్యవహారంలో మరోసారి మహిళాపోలీసుల పోస్టు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళా పోలీసులు నియామకాలు పోలీసుశాఖ ద్వారానే జరిగినా.. కోర్టు కేసు, కోర్టుకి దాఖలు చేసిన అఫడవిట్(మహిళా పోలీసులకి, పోలీసుశాఖకి సంబంధం లేదు. వీరు పోలీసులు కాదు అని రాచ్చిన)  కారణంగా వీరంతా ఇపుడు పోలీసుశాఖకు చెందిన వారు కాదు. ప్రస్తుతం సచివాలయశాఖకు కేటాయించబడ్డ ఒక సాధారణశాఖలేని ఉద్యోగులు మాత్రమే. అలాంటి సందర్భంలో కోర్టుకి ఇచ్చిన అఫడివట్ ని కాదని మహిళా పోలీసులను ఏ నిబంధనలతో మళ్లీ అగ్రీగోల్డు సమాచారం సేకరించడానికి వీరిని పోలీసుశాఖలోని  సిఐడీ విభాగాని డిప్యుటేషన్ పై పంపిస్తున్నారో తెలియని పరిస్థితి. అలాగని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ విధానంలో రెండు మూడు సచివాలయాలను ఒక సచివాలయం మదించారు. ఆ సమయంలో కొందరు మహిళా పోలీసుల పోస్టులను గాల్లో పెట్టినట్టు లిఖిత పూర్వకంగా తెలియజేసినా. వారిని ఏం చేస్తున్నారో ఎక్కడా మరే ఇతర సర్క్యులర్ లోనూ తెలియజేయలేదు.

కానీ రాష్ట్రప్రభుత్వం ప్రకటించినట్టుగా మాత్రం గ్రామ, వార్డు సచివాలయశాఖ సిబ్బందిని మల్టీటాస్కింగ్ స్టాఫ్ గా వినియోగిస్తామన్న మాటకు వారిని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపేస్తూ సర్క్యులర్ ఇస్తున్నారు తప్పితే.. వారికి ఏ ప్రభుత్వశాఖ కేటాయిస్తున్నారో మాత్రం ఎక్కడా పేర్కొన లేదు. ఇటీవల ఇదే విషయమై హోం మంత్రి వంగల పూడి అనిత కూడా ఒక కీలక ప్రకటన చేశారు. సచివాలయ మహిళా పోలీసుల రిక్రూట్ మెంట్ అంతా తలా తోక లేకుండా అస్తవ్యస్తంగా చేశారని.. వారి చదువు, వయస్సు ఆధారంగా వారిని ఒక సముచితస్థానంలో కూర్చోబెడతామని ప్రకటన  చేశారు. అయితే అలా ప్రకటన చేసిన తరువాతే క్లస్టర్ విధానం తెరమీదకు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా కొందరు మహిళా పోలీసుల పోస్టులను రద్దుచేశారు.. అంటే ఉన్న పోస్టులను మధించారు. అలా ఏ సచివాలయంలో పోస్టు మధించారో లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు కూడా. ఆ విధంగా గాల్లో పెట్టిన వారిని ఏం చేస్తారు.. ఏ ప్రభుత్వశాఖకు పంపిస్తారు అనే విషయం క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇపుడు మళ్లీ తాజాగా సచివాలయశాఖ మహిళా పోలీసులను సిఐడీకి డిప్యూటేషన్ పై అగ్రిగోల్డ్ సమాచార సేకరణకు కావాలంటూ పోలీసుశాఖే జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడంతో దాని ఆధారంగా కొందరు సిబ్బందిని సిఐడి విభాగానాకి డిప్యూటేషన్ పై పంపిస్తూ సర్క్యులర్ లు జారీచేశారు.

మహిళా పోలీసులను సిఐడీకి అదనపు బాధ్యతలపై పంపేటపుడు ఇక్కడ ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంది.. 1)వీరి ఉద్యోగాలు కేసు కోర్టులో ఉండటం 2)పోలీసుశాఖే వీరు మహిళా పోలీసులు కాదు.. వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసిన విధానం 3)కోర్టు కేసు కారణంగా నేటి వరకూ ఏ ప్రభుత్వశాఖు చెందని ఉద్యోగులు మహిళా పోలీసులు గాల్లో ఉండిపోవడం 4)క్లస్టర్ విధానంతో కొంమంది పోస్టులను రద్దు చేస్తున్నట్టు లిఖిత పూర్వకంగా ప్రకటించడం 5) వారిని తిరిగి ఎక్కడైనా ఖాళీలు ఉన్నచోట భర్తీచేశారా అనే విషయాన్ని తెలుసుకోవడం. అవేమీ చేయకుండానే నేరుగా పోలీసుశాఖ అడిగిందనే ఒకే ఒక కారణంతో జిల్లా కలెక్టర్ నేరుగా 60 మంది మహిళా పోలీసులు లేదా మహిళా సంరక్షకులను సిఐడీ అప్పగిస్తూ సర్క్యులర్ ను జారీచేయడం. అంటే మహిళా పోలీసుల విషయంలో ఉన్న కోర్టు కేసులు, కోర్టులో సమర్పించిన అఫడవిట్ ను కాదని సిబ్బందిని అప్పగించడం దేనికి సంకేతం అనేది జిల్లా కలెక్టర్, రాష్ట్రప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క అవకాశం ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడానికి జిల్లా కలెక్టర్ కు ఉన్న జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఆ సర్క్యులర్ జారీచేశారా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. 

ఈ విషయాలన్నింటినీ ఈరోజు-ఈఎన్ఎస్ ఎప్పటినుంచో ప్రత్యేక కథనాలుగా  అందిస్తూ వస్తున్నది. అలా ఏవైతే కథనాల వస్తున్నాయో.. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఆ విధంగా చేసుకుంటూ వెళుతున్నది. అంటే ఈరోజు-ఈఎన్ఎస్ రాస్తున్న కథనాలన్నీ నిజమవుతున్నాయి. ఈ విషయంలో ఇక్కడ తప్పా మరే ఇతర ప్రధాన పత్రికలు, మీడియాలోనూ రాకపోవడం కూడా సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి. ఇదే విషయమై  విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను ఈరోజు-ఈఎన్ఎస్ చరవాణిలో లిఖిత పూర్వకంగా వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా ప్రస్తుతం మహిళా పోలీసుల్లో చాలా మందికి పోలీసు విభాగంలో పనిచేయడానికి ఇష్టంలేదనే అంశాలన్ని వారి చరవాణి గ్రూపుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. అసలు ప్రభుత్వశాఖే లేని మహిళా పోలీసులను ఏ విధంగా అదే పోలీసుశాఖలోని సిఐడీకి డిప్యూటేషన్ పై పంపుతున్నారనే అంశం చర్చనీయాంశం అవుతుంది...?!

visakhapatnam

2025-04-21 13:12:22

జీవిఎంసీకి కమిషనర్ కావలెను.. మోకాలడ్డుతున్న అవిశ్వాస బలపరీక్ష..?!

మహావిశాఖనగర పాలక సంస్థ ఇంటిపెద్ద లేని ఇల్లులా తయారైంది.. పరిపాలన మొత్తం సన్నగిల్లింది.. అధికారులు ఇష్టాను సారం వ్యవహ రిస్తున్నా.. స్పెషలాఫీసర్ వాటిని సరిదిద్దలేని పరిస్థితి, జీవిఎంసీపై దృష్టిపెడితే జిల్లా పరిపాలన పక్కకి పోతున్నది.. అలాగని రెండింటిపైనా దృష్టిపెట్టడానికి జిల్లా కలెక్టర్ కు సమయం సరిపోవడం లేదు.. ముఖ్య అధికారి లేని సంస్థలో క్రింది స్థాయి ఉద్యోగులు వారి పనులు చల్లగా చక్కబెట్టేస్తున్నారు.. విషయం ఆనోటా ఈనోటా తెలిసినా వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న మహావిశాఖనగరంలో అభివృద్ధి సన్నగిల్లిపోతున్నది.. జివిఎంసీకి కమిషనర్ కావాలి మహా ప్రభో అని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా.. కూటమి ప్రభుత్వంలో అధికారిని నియమించే పరిస్థితి కనిపించడం లేదు.. ప్రస్తుతం ఐఏఎస్ ల బదిలీలు జరుగుతు న్నవేళ గాడి తప్పుతున్న జీవిఎంసీకి కమిషనర్ వస్తారా లేదంటే అవిశాస్వం నెగ్గితన తరువాత నచ్చిన అధికారి తెచ్చుకుంటారా..? అనే చర్చ విశాఖలో జోరుగా సాగుతున్నది..?!

మహా విశాఖనగరపాలక సంస్థకు కమిషనర్ ఉంటేనే పరిస్థి చేదాటి పోతుంటుంది.. అలాంటిది నెలల తరబడి ఇద్ద పెద్ద నగరపాలక సంస్థను పరిపాలించే అధికారి లేకపోతే ఎన్నివిభాగాల సేవలు సన్నగిల్లిపోతాయో వేరేగా చెప్పాల్సి పనిలేదు. ఉన్న కమిషనర్ ని, నగరాన్ని చక్కగా అభివృద్ధి చేస్తూ గాడిన పెడుతున్న తరుణంలో ఇక్కడ పనిచేసే జీవిఎం కమిషనర్ డా.పి.సంపత్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడ ఎంత మంది కమిషనర్లు పనిచేసినా.. రాజకీయపార్టీ నేతలకు సిఫారసులను కాదని, ముక్కుసూటిగా పనిచేసే అధికారులుగా ఇద్దరే ఇద్దరు అధికారులు బాగా పేరు తెచ్చుకున్నారు. అందులో ఒకరు డా.లక్ష్మీషా, రెండవది డి.పి.సంపత్ కుమార్. అలాంటి అధికారులనే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంచకుండా వెనువెంటనే రాజకీయ ఒత్తిడిల కారణాలు చూపి బదిలీలు చేసింది. అలా బదిలీ చేసిన తరువాతనైనా కొత్త కమిషనర్ ను నియమించాల్సి వుంది. కానీ నేటి వరకూ ఎవరినీ నియమించకుండా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నే ఇన్చార్జి కమిషనర్ గా నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కి అటు జిల్లా పరిపాలన, ఇటు జివిఎంసీ అదనపు బాధ్యతలు చూడటం కష్టతరం అవుతున్నది. దానితో క్రింది స్థాయి అధికారులు ఉద్యోగులు వారి చేతికి పనిచెప్పి అందినకాడికి దండుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వారు పనులు చేస్తున్నారు. అలాగని విషయం తెలిసి వారిపై చర్యలు తీసుకోవడానికి ఇన్చార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారు. రేపో మాపో ఇన్చార్జి బాధ్యతలు తొలగిపోతాయ్.. ఆ మాత్రం దానికి నేనెందుకు చెడ్డ కావాలనే విధంగా పాము చావకుండా.. కర్ర విరగకుండా ఏదో మొక్కుబడిగా పనిచేసుకు పోతున్నారట ఇన్చార్జి కమిషనర్ కమ్ జిల్లా కలెక్టర్. అందులోనూ విశాఖలో కొంత మంది ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు, కార్పోరేటర్లకు గత కమిషనర్ ముక్కసూటి వ్యవహారం నచ్చకపోవడం, రాజకీయ పలుకుబడి వినియోగించి ఇక్కడి నుంచి బదిలీ చేయించారని జరుగుతున్న ప్రచారమే ఇపుడు నిజమైనట్టుగా కనిపిస్తున్నది. 

పాలకుల అడుగులకు మడుగులు ఒత్తే అధికారులు ఎవరూ ఇప్పటి వరకూ కనిపించనందునే జివిఎంసీ కమిషనర్ పోస్టు భర్తీ కాలేదని.. నేతలు కొంతమంది పేర్లు ప్రతిపాదించినా ఎందుకనో సీఎంఓ నుంచి దానికి గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు. దానికి తోడు కూటమి ప్రభుత్వ కార్పోరేటర్లు వైఎస్సార్సీపీ మేయర్ పై అవిశ్వాస నోటీసు ఇవ్వడం.. అది ఈనెల 19న పూర్తయితే అపుడు కొత్తగా మేయర్ తోపాటు, కమిషనర్ ను కూడా నియమించుకోవచ్చునని స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఇద్దరూ మనవారైతే మనకి నచ్చినట్టుగా పనులు చేయించుకోవచ్చునని  తద్వారా మహావిశాఖనగర పాలక సంస్థ పరిధి మొత్తం మన చేతుల్లోనే ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కారణంగా నేటి వరకూ జివిఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ ను నియమించలేదని సమాచారం అందుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరోసారి విశాఖలోని జీవిఎంసీ కమిషనర్ వ్యవహారం తెరమీదకు వచ్చి రక రకాల చర్చలకు దారితీస్తున్నది. పూర్తిగా పరిపాలన గాడి తప్పేవరకూ జివిఎంసికి ఇన్చార్జి అధికారులతో మమ అన్నట్టుగా పరిపాలన చేస్తారు తప్పా.. అనుకున్న.. అనుకూలంగా ఉన్న అధికారులు తారస పడేవరూ కమిషనర్ పోస్టు భర్తీచేయరనే వాదన నేటి వరకూ నిజం అవుతూ వస్తున్నది. చూడాలి  ప్రస్తుతం జరుగుతున్న ఐఏఎస్ లబదిల్లో నైనా జివిఎంసికి కమిషనర్ ను నియమిస్తారా..? లేదంటే ఈనెల 19న కూటమి కార్పోరేటర్ల అవిశ్వాస బలపరీక్ష నెగ్గిన తరువాత మేయర్ తోపాటు, కమిషనర్ నూ ఒకే సారి నియమిస్తారా..? అనేది..?! 

visakhapatnam

2025-04-14 20:57:29

సిగ్గు.. సిగ్గు.. పసివాడి శవంపై పైసలేరుకున్న తేడా మీడియా..?!

భాహ్యప్రపంచంలో ఏం జరిగినా ప్రజలముందు ఉంచేది, కళ్కకు కట్టినట్టు చెప్పేది మీడియా.. సమాజంలో  ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న అలాంటి మీడియాలో తేడాగాళ్లు ఎక్కువైపోతున్నారు.. కేవలం అక్రమార్కులకు కొమ్ము కాస్తూ దారుణంగా శవాలపై కూడా పైసలు ఏరుకుంటున్నారు.. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసి.. మరీ అందినకాడి దండేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.. అందునా ఇలాంటి తేడా మీడియాకి నాయకత్వం వహించే జర్నలిస్టు సంఘ నాయకులే శవరాజకీయం, పీనుగులపై పైసలు ఏరుకునే దండుకి నాయకత్వం వహిస్తున్నారంటే పరిస్థితి ఏధంగా మారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఏడేళ్ల పసివాడు స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోతే ఆ విషయాన్ని బయటకు రానీయకుండా తలో లక్షా తీసుకొని ఏమీ తెలియని మట్టిబుక్కడం లా కామ్ గా కూర్చున్నారు. కానీ ప్రజలకు అన్యాయం జరిగితే ఎప్పుడూ ప్రశ్నించే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాలుని మృతిపై సీబీఐ విచారణ చేయమని డిమాండ్ చేశారు. అదీ ఎందుకంటే నిర్వాహకులు పోలీసులు, మీడియాని కొనేసిన నిర్వాహకుల తీరు, ప్రజలను మోసం చేసి, వాటర్ వరల్డ్ విచక్షణా రహితంగా చెట్లు నరికేయడం, అక్రమ నిర్మాణాలు చేయడం వంటి అంశాలు బయటకు రావాలనేది ఆయన సంకల్పం.. అదే నేడు విశాఖలో హాట్ టాపిక్..!

విశాఖలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్, వాటర్ వరల్డ్ లో అకారణంగా మృతిచెందిన ఏడేళ్ల  బాలుడి రిషి శవాన్ని పీక్కుతినడానికి నగరంలో తేడా మీడియా రాబందులు ఎగురుకుంటూ వచ్చాయి. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ల్ లోనిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోయిన ఏడేళ్ల బాలుడి మృతిని పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటే.. విషయం బయటకు రాకుండా, స్పోర్ట్స్ క్లబ్ పై ప్రభావం పడకుండా నిర్వాహకులు మీడియాని లక్షలు పోసి కొనేశారనేది అసలు శారాంశం. స్పోర్ట్స్ క్లబ్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న నిర్వాహకులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఆ ప్రదేశంలోని చెట్లను భారీగా తొలగించినా ప్రశ్నించే అధికారి విశాఖలో కరువయ్యాడంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో విశాఖలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్, వాటర్ వరల్డ్ రింగ్ స్లోప్ బోర్డ్ నుంచి క్రింపడి మృతిచెందిన రిషిని నిర్వాహకులు వారి తప్పులేదన్నట్టుగా మృతిచెందిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని చూశారని సమాచారం అందుతుంది. అంటే ప్రమాదం జరిగే సమాయానికి బాలుడు బ్రతికే ఉన్నాడని.. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందినట్టు క్రియేట్ చేస్తే ఆ తప్పు మీ మీదకు రాదని.. తద్వారా విషయం బయటకు పొక్కినా.. ఎవరూ ఏమీ చేసేది లేదని.. అయితే మా వర్గం మీడియాకి రూ.15 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పి ఓ జర్నలిస్టు సంఘ నాయకుడు దగ్గరుండి ఈ ఢీల్ ని కుదుర్చుకొని చక్కగా బాలుడి శవంపై పైసలు పంచుకున్నారట. 

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీమీలీ బీచ్ రోడ్డు దగ్గర ఒక స్పోర్ట్స్ క్లబ్, నైట్ రేవ్ పార్టీలు చేసే క్లబ్లును ప్రస్తుత నిర్వాహకులు నడిపేవారని.. దానిపై ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వ హయాయంలో దానిని మూయించి వేశారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం స్పోర్ట్స్ క్లబ్ లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. ఎవరి దృష్టి వారిపై పడకుండా ఒక తేడా మీడియా కోటరీని ఏర్పాటు చేసుకొని, వారిని ముప్పొద్దులా మేపుతూ నచ్చినట్టు చేస్తున్నారనేది పబ్లిక్ టాక్ ఇపుడు. ఇపుడు అదే ప్రదేశంలో ఒక ఏడేళ్ల బాలుడు మృతిచెందితే అదెక్కడ తమ మెడకి చుట్టుకుంటుందోనని ఠాగూర్ సినిమా స్టైల్ లో హాస్పిటల్ నాటకం ఆడి, అటు బాలుడి తల్లిదండ్రులను భయపెట్టి, పోలీసు కేసులు అవుతాయని బెదిరించి కొంత మొత్తానికి సెటిల్ చేశారని కూడా చెబుతున్నారు. ఏదో నామ్ కే వాస్తే పోలీసు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుందామనుకునే సమయానికి తేడా మీడియా, జర్నలిస్టు సంఘ నాయకులు ఎంటర్ అయి.. తమ సంగతేంటని.. లేదంటే వెంట వెంటనే విషయాన్ని రుద్ది రుద్ది వదులుతామని చెప్పడంతో గత్యంతరం లేని నిర్వాహకులు మీడియా మొత్తానికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అందులో సగం ఒక వర్గం తేడా మీడియాకి, మరో సగం ఇంకో తేడా మీడియా వర్గానికి ఇచ్చారని టాక్. 

అయితే డబ్బులు తీసుకొని కూడా విషయాన్ని లీక్ చేసిన నాయకుడికి, దానిని పట్టుకొని బెదిరింపులకు దిగిన ఒక తేడా జర్నలిస్టు సంఘనాయకుడికే ఏకంగా రూ.5 లక్షలు ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అందునా ఈ కేసుని పూర్తిగా విచారణ చేస్తే వాటర్ వరల్డ్ నిర్మాణం కోసం లోపల ఎన్నిచెట్టు నరికేశారో ఆ విషయం గ్రీన్ ట్రిబ్యునల్ తగులుకుంటుందనేది వారి భయం. అయితే తేడా మీడియాలో శవంపై చల్లిన కాసులు అందకపోవడంతో బయటకు వచ్చి ఆ ఇద్దరికే( ఒకటి అడిగిన వారికి, రెండు అడగని వారికి)  మాత్రమే చెప్పడంతో విషయం దావానంలా నగరం మొత్తం వ్యాపించింది. అయితే మేజర్ మీడియాని మేనేజ్ చేశాం కనుక ఏం కాదులే అనే ధీమాతో కూడా నిర్వాహకులు ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ జరుగుతున్న అవకతవకలు, ఇతర చీకటి వ్యవహరాలు, బాలుని మృతి తదితర అంశాలపై సీబీఐ విచారణ జరిపంచాలని చేసిన డిమాండ్ ఇపుడు లోన జరుగుతున్న చీకటి కోణాలపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. అందునా తేడా మీడియా కూడా ఎంటర్ కావడం, చేతికి అందినంతా ఆ బాలుని శవంపై నొల్లేయడం.. పైగా పతివ్రతా శిరోమణి కబుర్లు చెబుతూ వాస్తవాలను మరుగున పడేలా చేయడం వంటి అంశాలు ఇపుడు విశాఖలో ఆశక్తి కరంగా మారాయి.  

విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్  లో వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి పై ఇప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజలు ప్రాణాలు పోతున్నా కేవలం సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తున్న వైనంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథం తో పోర్టు యాజమ్యం లాలూచీ బాలుడు మృతిచెందినా కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పోర్టు స్టేడియం నిర్వహణ చేస్తున్నా..స్టోర్ట్స్ పేరుతో మరొకరికి అనధికార సబ్ లీజ్ లు ఇస్తున్నా పోర్టు యాజమాన్యం ఏమీ అనకపోవడం వలనే ఇక్కడ అక్రమాలు పెద్ద ఎత్తున జరగుతున్నాయని.. విశ్వనాథంకు పోర్టు స్టేడీయం కు జరిగిన లీజు డాక్యమెంట్స్ బయట పెట్టాలని ఇపుడు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పోర్టు భూములు లీజుకి ఇచ్చే సమయంలో ఆ ప్రదేశంలో ఎన్ని చెట్లు ఉండేవి.. ఇపుడు అందులో ఎన్ని నరికేశారో లెక్కలు బయటకు తీయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపైనా, పోర్టు నిర్లక్ష్యం పైనా, క్లబ్ యాజమాన్యంపైనా గ్రీన్ ట్రిబ్యులనల్ కి వెళ్లడానికి సిద్దమవుతున్నట్టుగా సమాచారం అందుతున్నది. 

విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. లోన జరిగే అక్రమాలపై ఏ విధమైన విచారణ చేస్తుంది.. దానిని కాసులు ఏరుకొని భరోసా ఇచ్చిన తేడా మీడియా ఏ విధం అడ్డుకట్ట వేస్తుంది.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రకటనను ఏ విధంగా స్వీకరిస్తుందనే అంశాలకి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉన్నది. కానీ నిర్వాహకులు మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు తీసుకున్నామని.. తమపై గిట్టనివారు, మరికొందరు ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారాలు, డిమాండ్లు చేస్తున్నారని.. తాము నిమిత్త మాత్రులమని క్లబ్ నిర్వాహకులు చెబుతుండటం విశేషం.?!

visakhapatnam

2025-04-08 19:08:44

కార్పోరేటర్ల కూర్పులో అసమ్మతి కుంపటి..?! క్యాంపు రాజకీయాలకు ఉప్పందించేది ఎవరు..

మహావిశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలకు అసమ్మతి కుంపటి పొగపెడుతున్నట్టు కనిపిస్తున్నది.. విశాఖలో ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర వహించిన సీనియర్ నేతలు జంపింగ్ లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూటమిలో నేతలు వేరుకుంపటి పెట్టినట్టు తెలుస్తున్నది. దాని ప్రభావం రేపు అవిశ్వాసంలో కార్పోరేటర్ల కూర్పుపై ప్రభావం చూపిస్తుందా అనే విషయమై మహావిశాఖ నగరపరిధిలో హాట్ హాట్ చర్చ నడుతుస్తున్నది. దానికి ముక్తాయింపుగా ఓ సీనియర్ టిడిపి నేత ఇంటిలో కొందరు అసమ్మతి నేతలు పెట్టుకున్న సమావేశంలో మనకి గౌరవం దక్కని పార్టీలో మనమెందుకు యాక్టివ్ ఉండి కార్పోరేటర్లను కాపాడాలి..? అనే ప్రశ్న లేవనత్తారని.. ఆ కారణంగానే వైఎస్సార్సీపీకి ముందస్తు ఉప్పు అందడంతోనే కార్పోరేటర్ల క్యాంపు రాజకీయం మొదలైందనే విషయం ఇపుడు విశాఖలో గుప్పుమంటున్నది..అయితే అదేమీ లేదన్నట్టుగా నగరంలోని నేతలు చెబుతున్నప్పటికీ, అనుచరులు ప్రచారం చేస్తున్నప్పటికీ అసమ్మతినేతలు మాత్రం వారి పని వారు చేసుకు పోవడం వలనే కార్పోరేటర్ల కూర్పు కష్టమవుతుందని వాదన తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతున్నది..?

మహావిశాఖనగరపాలక సంస్థ  మేయర్ పీఠాన్ని అవిశ్వాసంతో చేజిక్కించుకోవాలని చూస్తున్న కూటమికి సొంత వారే వెన్నుపోటు పొడుస్తున్నట్టు పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ప్రభుత్వం ఇటవలన ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో పదవులు రాకపోవడం, మరికొందరికి కీలక పదవులు వస్తాయనుకున్నా రాకపోవడంతో వారే పీఠాన్ని కదిపే విషయంలో కాస్త ఇబ్బంది పెడుతున్నారని పార్టీలో అంతర్లీన విషయం బయటకు పొక్కుతున్నది. ఈ కారణంగానే కార్పోరేటర్ల కూర్పు, వైఎస్సార్సీపీ నుంచి వస్తున్న కార్పోరేటర్ల మద్దతుని విచ్చిన్నం చేయడానికి అసమ్మతి వాదులు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు పెద్ద ఎత్తున  ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టిడిపి, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు వారి వారి క్యాడర్ లతో నియోజకవర్గాల వారగీ సమీక్షా సమావేశాలు పెట్టిన సందర్భంలో కొందరు నాయకులు తమకేమి విలువ లేదని మదన పడ్డారట. అదే సమయంలో వైఎస్సార్సీపీ నుంచి టిడిపి లోకి వచ్చిన కొందరు నాయకులకు కూడా కూటమిలో సరైన స్థానం లేకపోవడం కూడా జీవిఎంసీ కార్పోరేటర్ల కూర్పు, బల నిరూపణ విషయంలో ప్రతిబంధకం అవుతున్నట్టు సమాచారం అందుతుంది. 

ఏకంగా కొందరు అసమత్తి వాదులు ఉన్నవారైనా అక్కడే ఉండిపోండి  తద్వారా మీకు పార్టీలో గౌరవం పెరుగుతుంది.. పిలిచారని వచ్చేస్తే మాకున్నపాటి విలువ కూడా మీకుండదు అనే కోణంలో వచ్చే కార్పోరేటర్లను కూడా వ్యతిరేక వర్గం వారితో ఉప్పందించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఈ విషయం కాస్త కూటమి అధిష్టానికి చేరడంతో రంగంలోని ఎంపీ, ఎమ్మెల్యేలను దించినా పరిస్థితి పూర్తిగా అనుకున్నట్టు మారలేదని కూడా తెలుస్తున్నది. అయితే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టే సందర్భంలో వార్డుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని అయినా మిగిలిన బలం కార్పోరేటర్లు కూటమి లోకి వస్తారని అంతా భావించారు. అయితే వైఎస్సార్సీపీ తెలివిగా క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో అది కాస్త బెడిసి కొట్టింది. తమకు కార్పోరేటర్ల బలం ఉందని ప్రకటించి బలనిరూపణకు వెళ్లినా మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అనుమానాలను కూటమి పెద్దలు వ్యక్తం చేస్తున్నారట. 

దానికి గల కారణాలను గ్రౌండ్ లెవల్ లో తెలుసుకుంటే ఎన్నికలవ వరకూ ఒకలా.. గెలిచిన తరువాత ఒకలా నేతలు వ్యవహరిస్తున్నారని.. అలాంటపుడు తామెందుకు పార్టీకోసం కష్టపడి పనిచేయాలనే వాదనను అసమ్మతి వాదులు తెరపైకి తీసుకు వచ్చారని.. వారిని బుజ్జగించడానికి మళ్లీ కూటమిలోనూ దువ్వే రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదే విషయం ఇద్దరు ముగ్గు టిడిపి నేతలు కూడా గత మూడు రోజుల నుంచి కొందరు కూటమి నేతల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం అందుతున్నది. దీనితో కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలానికి ఆశపడి విశాఖ మేయర్ పీఠాన్ని కదపాలని చూస్తున్న తరుణంలో అసమ్మతివాదులు గాలితీసేస్తున్నారని మాత్రం క్యాడర్ లోకి వెళ్లిపోయింది. అయినా దానిని తిప్పికొట్టడానికి, అలాంటి వారిని మచ్చిక చేయడానికి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు కూడా హామీలు ఇస్తున్నారని తెలిసింది. దీనితో కార్పోరేటర్లకు సహకరించే నేతలు, వెన్నంటి ఉండి పెట్టుబడులు పెట్టే నేతలు వారు చెప్పినట్టుగా కార్పోరేటర్లను చెప్పుచేతల్లో ఉంచుకొని ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని కూడా కూటమి నేతలు అక్కడక్కడా చెబుతున్నారట. చూడాలి అవిశ్వాసంలో బలపరీక్ష సమయంలో ఎవరు ఎవరి బలం ఏ విధంగా ప్రదర్శిస్తారనేది..?!!

visakhapatnam

2025-04-08 00:00:03

ఆయుష్ లో సర్వీస్ రూల్స్ అతిక్రమణ..! విశాఖలో ఇన్చార్జి ఆర్డీడిని సేవ్ చేయడానికేనా..?

ఆయుష్ శాఖ లో జిల్లా అధికారులు అభ్యంతరం లేకుండా కావాలనే తప్పులు చేయొచ్చు.. దళిత మహిళా ఉద్యోగులపై చేయి చేసుకోవ చ్చు.. అవకాశం ఉంటే తన్నొచ్చు.. దళిత వైద్యులను మాలనాకొడకా.. మాదిగ నా కొడకా అని తిట్టేయవచ్చు.. టార్గెట్ పెట్టుకొని ఉద్యోగుల ఉద్యోగులను ఇష్టమొచ్చినట్టు వేధించవచ్చు..  రోస్టర్ పాయింట్లను కాదని , సీనియారిటీలో వున్న వైద్యులను పక్కకి నెట్టేసి కాసులు చెల్లించి అడ్డదారిలో  ఇన్చార్జి ఆర్డీడి కూడా అయిపోవచ్చు.. ఇక్కడ కేవలం డబ్బులంటే ఏ పనైనా అయిపోతుంది..అందునా ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహాకులు పైరవీలు చేస్తే వైద్యఆరోగ్యశాఖ నుంచి ఆయుష్ కమిషనరేట్ లోని అధికారుల వరకూ జీ హుజూర్ అనాల్సిందే.. 

ఈ ఆయుష్ శాఖలో సర్వీస్ రూల్స్ లేవు.. వాటి అమలు లేదు జరగదు కూడా.. ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైన అధికారులు లాంగ్ లీవ్ లోకి పంపించే దైర్యం కూడా ఆయుష్ లోని కమిషనర్ గానీ..వైద్యఆరోగ్యశాఖలోని ముఖ్యకార్యదర్శి గానీ చేయలేరు.. లిఖితపూర్వకంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కనీసం పల్లెత్తి మాట కూడా అనలేని దుస్థితి.. కారణం మామూళ్లు.. అంతకు మించి పైరవీలు.. వెరసి దళిత మహిళా ఉద్యోగులకు అవమానం.. దళిత వైద్యులకు వేధింపులు.. చేసిన తప్పులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా.. కమిషనరేట్ అధికారులు విశాఖ జోన్-1 ఇన్చా ఆర్డీడిపై చర్యలు తీసుకోవడం లేదంటే ఏ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు..! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆయుష్ శాఖలోని వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రూల్స్ ని కావాల్సిన వారికోసం అడ్డగోలుగా వినియోగిస్తున్నారు కమిషనరేట్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు.  పైసలిస్తే సర్వీసు రూల్స్ కూడా తప్పు చేసిన వారికే అనుకూలంగా ఉంటాయని రుజువు చేసి మరీ చూపిస్తున్నారు. మధ్య మధ్యలో చేయితడిపినందుకు  తప్పుకి దొరక్కుండా ఫిర్యాదులొచ్చిన అధికారులకు మెమోలు ఇచ్చి విచారణ నీరుగారిపోయేదాకా సా..గ దీస్తున్నారు తప్పితే కనీసం విచారణ చేయకపోగా.. సర్వీసు నిబంధనలను అమలు చేస్తూ.. దళిత మహిళా ఉద్యోగిపై చేయిచేసుకున్నపై కేసుపై ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు అయినా విశాఖ ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై చర్యలు తీసుకోలేదు. అదేమంటే ఇది ఆ ప్రైవేటు ఐఏఎస్ స్లడీ సర్కిల్ నిర్వాహకుడు ప్రభావితం చేస్తున్న కేసు.. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన ఆదేశాలొస్తే తప్పా.. సర్వీసు నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు అయిన అధికారిణిపై చర్యలు తీసుకోలేం.

 ఇదంతా పెద్దల లాబాయింగ్.. ఇందులో చాలా మందితోపాటు ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆయుష్ కమిషనరేట్ అధికారులు చేతులెత్తేస్తున్నారు.  అంతెందుకు ఒక జిల్లా అధికారిపై పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన తరువాత సదరు ఉద్యోగినిని లాంగ్ లీవ్ పై పంపించాలి.. ఆపై ఇన్చార్జి పోస్టులో ఉన్నవారి ఆర్డర్లు రద్దు చేసి మరో అధికారిని సదరు అధికారి స్థానంలో నియమించాలి. కనీసం ఆ పని చేయడానికి కూడా ఆయుష్ కమిషనర్ దగ్గర నుంచి అధికారులు వరకూ దైర్యం చేయలేకపోతున్నారంటే.. ఏ స్థాయిలో లాబీయింగ్ విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.లక్ష్మీభాయ్ విషయంలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చునని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఇక్కడ దళిత వైద్యులను కులంపేరుతో దూషించినా.. మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకొని వేధించినా.. పోలీసు కేసు నమోదు అయినా.. కేసులు పెట్టిన వారిని కావాలంటే బెదిరించగలం కానీ..

తప్పుచేసిన వారిని ఏమీ చేయలేమని.. ఆమె వెనుక బలమైన వ్యక్తులు, ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సెంటర్ నిర్వాహకులు పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారని అధికారులు కూడా వెనుకడుగు వేస్తున్నారని.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని.. తప్పు చేసిన అధికారిణిపై చర్యలు తీసుకోవడానికి సర్వీసు రూల్స్ లో నిబంధనలున్నా.. ఆమె చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ తాము ఆందోళనకు దిగుతున్నామని దళిత సంఘాల నేతలు ప్రకటించారు.  విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా. ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన తప్పులు ఆయుష్ కమిషనరేట్, వైద్యఆరోగ్యశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోని అధికారులకు ఎందుకు కనిపించలేదో ఒక్కసారి వరుస క్రమంలో తెలుసుకుంటే..  సర్వీసు నిబంధనలను అతిక్రమించి సీనియారిటీ లిస్టులో అట్టడు స్థానంలో ఉన్న ఈమె సర్వీసు నిబందనలు అతిక్రమించి అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడిగా పోస్టింగ్ సంపాదించడం,

ఆమెకు కమిషనరేట్ అధికారుల వత్తాసు..  సుమారు 30 ఆయుష్ డిస్పెన్సరీలను కావాలని డోర్ లాక్ చేయించి  విశాఖ జిల్లా పరిషత్ మీటింగ్ హాలుతో ఉదయం 11 గంటకి వైద్యుని  రిటైర్ మెంట్ ఫంక్షన్లు, సన్మానాలు చేయించుకోవడం.. చేసిన తప్పును నుంచి బయట పడటానికి వైద్యులే తప్పుచేసినట్టుగా.. మళ్లీ ఆ తప్పు మరెప్పుడూ చేయమన్నట్టుగా వైద్యులతోనే లిఖిత పూర్వకంగా  సంజాయిషీ లేఖలు రాయించడం...  దళిత వైద్యులు పనిచేసే డిస్పెన్సిరీలకు వెళ్లి కావాలనే దళిత వైద్యులను మాలనాకొడకా.. మాదిగనాకొడకా అని కులం పేరుతో దూషించడం, ఉద్యోగులు కావాలని వేధించడం, విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో పనిచేసే దళిత మహిళా జూనియర్ అసిస్టెంట్ సుష్మాపై చేయి చేసుకోవడంతోపాటు కులం పేరుతో దూషించడం,

సదరు ఘటనపై విశాఖ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన సమయంలో ఆయుష్ కమినరేట్ నుంచి చేయిచేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి, జూనియర్ అసిస్టెంట్లను లాంగ్ లీవ్ పై వెళ్లిపోమంటే.. జూనియర్ అసిస్టెంట్ లీవులోకి వెళ్లిపోయినా.. ఇన్చార్జి ఆర్డీడి మాత్రం తనకి లిఖిత పూర్వకంగా ఆర్డర్ వస్తే తప్పా సెలవు పెట్టేది లేదని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్సు వేస్తూ ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహించడం.. వైద్యులకు, ఇతర సిబ్బందికీ సెలవులు మంజూరు చేయడం.. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసుపెట్టిన వారికి, దళిత వైద్యులు చేసిన ఫిర్యాదుల విషయంలో మిగతా వైద్యులు, సిబ్బంది తనకు అనుకూలంగా పనిచేయాలని చెప్పడం,

 అధికారులను, సిబ్బందిని, ఆయుష్ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి, తనకు అనుకూలంగా లేకపోతే ఎలాగైనా సక్రమంగా విధులకు రాని మీ అందరి విషయాలు కమిషనరేట్ లో బయట పెడతానని బెదిరించడం, ఆయుష్ కమిసనర్ డి. ముంజులకి ఏమీ రాదని.. తాను ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో పనిచేశానని.. జీఓలన్నీ తానే చేసేదానినని తనకు పెద్ద బ్యాగ్ గ్రౌండ్ ఉందని.. ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులతో కమిషనరేట్ లో పైరవీలు చేయించడం.. ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత సర్వీసు నిబంధనల ప్రకారం ఇన్చార్జి విధుల నుంచి కమిషనరేట్ అధికారులు తప్పించకుండా పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేయించడం చూస్తుంటే.. తమలాంటి దళితలకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని దళిత వైద్యులు, సంఘాల ప్రతినిధులు, వేధింపులకు గురైన వైద్యులు, ఇన్చార్జి ఆర్డీడి చేతలో దెబ్బలు తిన్న దళిత ఉద్యోగిణి ప్రశ్నిస్తున్నారు.

పైగా ఇదే విషయమై జాతీయ ఎస్సీ కమిషన్, లోకాయుక్తా, స్టేట్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదులు చేసినా.. కనీసం చర్యలు తీసుకోలేదంటే ఏ స్థాయిలో సదరు ఇన్చార్జి ఆర్డీడి చేస్తున్న పైరవీలు కనిపించడం లేదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో ఆయుష్ కమిషనర్ డి.మంజులను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నించగా.. విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ విషయంలో విచారణ ఇంకా కొనసా..గుతుందని.. ఇటీవలే మెమోలు జారీ చేశామని.. ఎవరూ లేకనే ఆమెనే ఇంకా ఇన్చార్జి ఆర్డీడిగా కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. లాంగ్ లీవ్ పై వెళ్లమని మౌఖిక ఆదేశాలొచ్చినా ఎందుకు వెళ్లకుండా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేస్తూ పనిచేస్తున్నారని.. దానికి ఏ విధంగా సమర్ధిస్తున్నారని.. అది సర్వీస్ రూల్స్ కి విరుద్దం కాదా అని..? 

సర్వీసు నిబంధనలు అమలు చేసి ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తే.. ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ ఇంకా రాలేదని.. వచ్చిన వెంటనే తాము ఏమి చేస్తున్నామో మీడియాకి చెబుతామని బదులిచ్చారు. అంతవరకూ విచారణ కొనసా...గుతున్నట్టుగానే బావించాలని స్పష్టం చేశారు. దీనిని బట్టి ఆయుష్ శాఖలో దళిత వైద్యులకు, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా..  అధికారులు చేతిలో తన్నులు తిన్నా.. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఎఫ్ఐఆర్ లు నమోదైనా తప్పుచేసిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉండవనేది తేలిపోయింది..?!

visakjha

2025-03-15 21:49:35

కూటమి పరువు తీస్తున్న ఆయుష్.. ఆ కేసు నీరు గార్చేందుకుకేనా..?!

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పరువుని.. పరిపాలనాపరమైన అంశాల విషయంలో ఆయుష్ శాఖ ప్రభుత్వం పరువు తీస్తున్నట్టుగానే కనిపిస్తున్నది.. దళితులకు, దళిత ఉద్యోగులకు ఓ ప్రక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ లుపెద్ద పీట వేస్తుంటే.. ఆయుష్ శాఖలో మాత్రం అడ్డదారిన ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చేసిన డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ దళిత కార్యాలయ ఉద్యోగిపై చేయిచేసుకోవడంతోపాటు, కులం పేరుతో దూషించినా ఆయుష్ కమిషనర్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు నోరు మెదపడం లేదు.. పైగా ఇదేశాఖలోని వైద్యులను వేధిస్తున్నవిషయంపైనా.. మాలనాకొడుకులు.. మాదిగ నా కొడుకులు అని కులం పేరుతో దూషించిన విషయమై దళిత వైద్యులు చేసిన ఫిర్యాదుపైనా అతీ గతీ లేదు.. అంతేకాదు.. నేరుగా విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా పరిపాలనాపరమైన విచారణ నేటికీ చేయలేందంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు..!

ఏ ప్రభుత్వ శాఖలోనైనా.. విధి నిర్వహణ సమయంలో డిస్పెన్సరీలు మూయించేసి.. ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్  సమావేశ మందిరంలో రిటైర్ ఫంక్షన్ చేస్తారా..? అలా చేసిన జిల్లా అధికారిని సర్వీసు నిబంధనలు ఉల్లంగించి ప్రవర్తించిన విషయంలో రాష్ట్ర కార్యాలయం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంతేకాకుండా.. ఎక్కడైనా ఒక క్రింది స్థాయి మహిళా ఉద్యోగిని ఇన్చార్జి జిల్లా అధికారిగా ఉన్నవారిపై చేయి చేసుకుంటారా..? ఇలా ఎక్కడైనా జరుగుతుందా..? ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడిని దళిత వైద్యులు ఎక్కడైనా లైంగికంగా వేధించే దర్యం చేస్తారా..? అసలు ఇది జరిగే పనేనా..? సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్న ఉద్యోగి.. సీనియర్ అసిస్టెంట్ నే ఎదిరించి మాట్లాడలేరు..

 అలాంటిది ఒక మహిళా దళిత ఉద్యోగి తనను కొట్టిందని బట్టలు చించేసుకుంటే దానిని రాష్ట్ర అధికారులు, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు నమ్మేస్తున్నారంటే అసలు ప్రాధమిక స్థాయి విచారణ పరిపాలన ఎక్కడికి పోతున్నట్టు..? అని వాపోతున్నాయి వైద్యఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ వర్గాలు. కులం పేరుతో దూషించి, వేధించడంతో వేధనతో ఆయుష్ కమిషనర్  డి.మంజుల, ప్రిన్సిప్ సెక్రటరీ ఎంటీ.క్రిష్ణబాబుకి దళిత వైద్యులు ఫిర్యాదు చేస్తే.. గతంలో ఇక్కడే పనిచేసిన ప్రస్తుతం ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి తిరిగి ఎవరైతే తనపై ఫిర్యాదు చేశారో అదే వైద్యులపై తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే మాత్రం కమిషనరేట్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ద పడిపోతున్నారని.. 

కానీ దళిత ఉద్యోగిని కొట్టి.. కులం పేరుతో దూషించి స్థాయికి మించి కమిషనర్ నే ఎదిరించి మాట్లిడిన వీడియోలు, ఆడియోలు ఆయుష్ కమిషనరేట్  ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే నేటికీ అతీ గతీ లేదు. అంతేకాదు ఈ విషయం పెద్దది కాకుండా ఇద్దరు ఉద్యోగులను లాంగ్ లీవ్ పై వెళ్లిపోమన్న అధికారులు, విశాఖలో ఇన్చార్జి ఆర్డీడిని ఎవరినీ వేయకుండా.. వైద్యులను, సిబ్బందిని వేధించిన అదే అధికారికి అనధికార బాధ్యతలు అప్పగించడం కూడా విస్మయాన్ని కలిగిస్తున్నది. ఇదెక్కడి పరిపాలన అంటే ఆయుష్ శాఖలో ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు ఇక్కడి ఉద్యోగులు. సీనియారిటీ లిస్టులో పేరు లేకపోయినా.. ఇక్కడ అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడిలు అయిపోవచ్చునని... అర్హత ఉన్నవారిని కావాలనే తొక్కిపెట్టి మరీ పోస్టింగ్ ఆర్డర్లు తెచ్చుకోవచ్చుననే విషయం ప్రస్తుతం విశాఖలోని జోన్-1 

ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి విషయంలో రుజువైంది. గత కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన అవకతవకలను కొత్తగా వచ్చిన కమిషనర్ గుర్తించి నివృత్తి చేస్తారనుకుంటే.. అన్నీ వదిలేసి విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. పక్కాగా ఆధారాలు, ఫిర్యాదులు ఉన్న అధికారిణిపై ఆయుష్ కమిషనరేట్ అధికారులు విచారణ చేయకపోవడం, కనీసం ప్రశ్నించకపోవడం, దుమారం రేగుతున్న విషయాన్ని బయటకు రాకుండా ఓ ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు నేరుగా ఆయుష్ కమిషనరేట్ అధికారులు, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో చక్రం తిప్పడం కావాలనే ఇన్చార్జి ఆర్డీడిని బయట పడేయడానికి తెరవెను రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

అంతేకాకుండా ప్రస్తుతం  విధుల్లో వైద్యులను, సిబ్బందిని సెలవులో ఉంటూనే తనకి సహాయం చేయాలని ఫోన్లు చేసి ఇన్చార్జి ఆర్డీడి బ్రతిమిలాడుతున్నారట. త్వరలో విచారణ జరుగుతుందని..అపుడు అందరూ దళిత వైద్యులు, దళిత ఉద్యోగికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి ఆర్డీడి మాటలు విన్న వైద్యులకు, డిస్పెన్సరీ సిబ్బందికి ఎన్ని సెలవులు కావాలంటే అన్ని సెలవులు మంజూరు చేస్తున్నారు ఇన్చార్జి ఆర్డీడి. అదే దళిత వైద్యులు, ఫిర్యాదుచేసిన వారిలో ఏ ఒక్క వైద్యుడు సెలవు అడిగినా వారికి మాత్రం ఒక్క సెలవు కాదు కదా.. పదినిమిషాల పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని వైద్యులు వాపోతున్నారు.  మరోప్రక్క బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్, లోకాయుక్తాకి కూడా ఫిర్యాదు చేశారు. 

ఇంత జరుతున్నా ఆయుష్ కమిషనర్ మాత్రం ఇన్చార్జి ఆర్డీడి విషయంలో కనీసం విచారణ ఎందుకు చేయడం లేదని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నిస్తే.. ప్రస్తుతం రాష్ట్రకార్యలయంలో విచారణ జరుగుతుందని.. ప్రభుత్వంలో ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలంటే సర్వీసు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఇంకా ఇన్చార్జిగా కొనసాగుతున్నారా..? ఆమె కొనసాగుతున్నారని ఇంకా ఎవరినీ ఆమె స్థానంలో నియమించలేదున్నారు. అంతేకాకుండా ఏదైనా, ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై ఏదైనా చర్యలు తీసుకుంటే ముందుగా మీడియాకి తెలియజేస్తామని కమిషనర్ డి.మంజుల వివరణ ఇచ్చారు.

visakhapatnam

2025-03-06 21:22:09

ఆయుష్ లోనూ అమ్ముడు పోతున్నారు..?! సీన్ లోకి ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు

ఆయుష్ శాఖలో డబ్బున్నవాడితే రాజ్యం.. పలుకుబడి ఉంటే తప్పులు చేసినా అన్నీ ఒప్పులైపోతాయ్.. చేసిన తప్పులకు ఆధారాలున్నా కనీసం ప్రాధమిక విచారణ కూడా చేయరు.. అంతేకాదు.. అవసరం అయితే ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ ల పిల్లలు శిక్షణ పొందే ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కూడా రంగంలోకి దిగిపోతారు.. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకూ అందరిని మేనేజ్ చేసేస్తారు.. ఫలితంగా విషయం పక్కదారి పట్టి.. ఆయుష్ కమిషనర్ ను ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు.. అదేమంటే పై నుంచి హెవీ ప్రజర్ అంటారు..కేసును మొత్తం నీరుగార్చేస్తారు..!

విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన  ప్రతీ తప్పుకీ ఆయుష్ కమిషనర్ డి. మంజుల వద్ద ఆధారాలున్నాయి.. వాటిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి.. దళిత ఉద్యోగిపై చేయి చేసుకున్న ఫిర్యాదు, పీఎంపాలెం స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేను నమోదైన ఎఫ్ఐఆర్, విధినిర్వహణలో డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ డిస్పెన్సరీలన్నీ మూసేసి మరీ విశాఖలోని జిల్లా పరిషత్ లో చేయించుకున్న సన్మానాలు.. దళిత వైద్యులను కులం పేరుతో దూషించిన అంశంపై ఫిర్యాదులు.. విధి నిర్వహణ పేరిట ఉద్యోగులు, వైద్యులను బెదిరించి, భయపెట్టిన ఫిర్యాదులు అన్నీ ఆయుష్ కమిషనర్ దగ్గరే ఉన్నాయి.. అదేంటో నేటికీ జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడిపై చిన్న విచారణ కూడా జరపలేదంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. 

అసలు ఈమె విషయంలో ప్రైవేటు ఐఏఎస్ శిక్షణా సంస్థలకు చెందిన వారు మధ్యలోకి రావడం ఏంటి..? వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ సిబ్బంది ఏక పక్షంగా ఈమెకే వత్తాసు పలకడం ఏంటి..? నన్ను ఎవరూ ఏమీ చేయలేరని కావాలని చేసిన తప్పులన్నీ ఏమైపోయాయి..?  అంటే తప్పులన్నీ అందరూ మరిచి పోతారని లాంగ్  లీవ్ పై వెళ్లమన్న ఆయుష్ కమిషనరేట్ అధికారులు అన్ని తప్పులు చేసిన ఈమె మాత్రం విచారణ చేయకపోవడం చేస్తుంటే ఏ స్థాయిలో యావత్ వైద్య ఆరోగ్యశాఖ ను మేనేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే అసలు ఆయుష్ కమిషనర్ కే ఏమీ తెలీదు జీఓలు, పరిపాలనా నేను చెప్పినట్టే జరుగుతుందని మీటింగ్ లో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ లు ఉన్నా అధికారులు నోరు మెదపడం లేదంటే ఇందకంటే మనీ మేనేజ్ మెంట్.. అఫిషియల్ పొలిటికల్ మేనేజ్ మెంట్ మరొకటి వుంటుందా..అనేది తేలాల్సి వుంది. 

జోన్-1 ఆయుష్ ఇన్చార్జి  డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో జరుగుతున్న తాత్సారం విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ ఆయుష్ కమిషనర్ మంజులను వివరణ కోరగా.. ఇంకా త్వరలోనే విచారణ వేస్తామని తీరుబడిగా చెబుతున్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులున్నాయి కదా అంటే.. అవన్నీ పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే విచారణ చేయడం మాత్రం పక్కగా ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చారు. అంతేకాదు సదరు ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులకి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే లిఖితపూర్వకంగా చేస్తే వాటిపై పరిశీలన చేస్తామని వివరణ ఇచ్చారు. అంతే తప్పా తప్పులన్నీ డైరెక్టుగా కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు.. కనీసం విచారణ కూడా చేయలేదంటే మాత్రం మాట దాటవేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఇప్పటికే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఓ మంత్రి పేషీ అధికారులు, ఒక ప్రైవేటు ఐఏఎస్ శిక్షణా సంస్థ(ఇందులోనే సీనియర్ ఐఏఎస్ అధికారి పిల్లలు శిక్షణ పొందుతున్నారు) 

నిర్వాహకుడు అందరూ ఉన్నారని.. ఆ కారణంగానే సదరు ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులన్నీ ఆధారాలతో ఉన్నా ఏమీ వేన్నట్టుగా.. ఆమె చాలా మంచి ఇన్చార్జి ఆర్డీడి కితాబు ఇస్తున్నారట. ఇదే కదా దళితులుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయడమంటే.. ఇదే కదా దళిత వైద్యులను కులం పేరుతో దూషించినా ఇన్చార్జి ఆర్డీడిని పల్లెత్తు మాటనకపోవడం. బహుసా ఇంతటి సహకారం అన్యాయానికి గురైన మహిళా దళిత ఉద్యోగిని, దళిత ఆయుష్ వైద్యులకు కమిషనరేట్ నుంచి అందివుంటే నిజంగా ప్రభుత్వ పరిపాలనపై నమ్మకాలుండేవి..చూడాలి వాస్తవాలను ఇంకా ఎన్నేళ్లు కప్పిపుచ్చుతారనేది..?!

visakhapatnam

2025-03-03 20:40:02

4 రోజులుగా నానుస్తున్నారు..?! -జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడిపై కేసు నమోదు చేయని పోలీసులు

వడ్డించేవాడు మనోడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరిలోకి అన్నీ వచ్చిచేరతాయ్..అలాగే విశాఖలోని జోన్-1 ఆయుష్ ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చెప్పినట్టుగా పోలీసు, రెవన్యూ, కమిషనరేట్ ఆయుష్ అధికారులు వింటున్నప్పుడు.. అన్యాయమైపోయిన దళిత ఉద్యోగులకు, వైద్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది..? దళిత వైద్యులను మాల నాకొడుకూ, మాదిగనా కొడుకు అని తిట్టారని స్వయంగా వైద్యులే కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.. అదే ఇన్చార్జి ఆర్డీడి విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో దళిత ఉద్యోగిపై చేయిచేసు కున్నారు.. దుర్భాలాడారు.. తమను కులం పేరుతో దూషించారని పీఎంపాలెం పోలీసు స్టేషన్ లో ఫిబ్రవరి 19న ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టాలని ఫిర్యాదు చేస్తే నేటికీ అతీ గతీలేదు.. విచారణ పేరుతోనూ, ఉద్యోగి బంధువులను బెదిరింపులకు పాల్పడుతూ కేసుని నానుస్తూ నీరు గార్చే స్తున్నారు తప్పా.. ఒక క్రింది స్థాయి ఉద్యోగి జిల్లా అధికారిణిపై ఏ విధంగా తిరగబడి, చేయిచేసుకుంటుందని కనీసం ఆలోచించకుండా దళిత ఉద్యోగి ఫిర్యాదును పట్టించుకోలేదు. తమకు జరిగిన అన్యాయంపై విశాఖ నగర సిపీ డా.శంఖబ్రత బాగ్జీ ఉన్న పోలీస్ కమిషనరేట్ పరిదో కూడా న్యాయం జరగకపోవడంతో.. బాధితులు లోకాయుక్తాను ఆశ్రయించారు..!

విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ ఈనెల 19న దళిత ఉద్యోగిని ఆర్డీడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుష్మాను కొట్టి, కులం పేరుతో దూషించిన కేసు విషయంలో నాలుగు రోజులుగా హైడ్రామ నడుస్తున్నది తప్పితే పోలీసులు కేసు నమోదు చేయడంలేదు. కష్టమంటూ పోలీసు స్టేషన్ మెట్లక్కితే.. నేనున్నాంటూ అభయమిచ్చే నగర పోలీస్ కమిషనర్ డా.శంఖభ్రతబాగ్జీ ఉన్న కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఒక దళిత మహిళ ఉద్యోగి పెట్టిన కేసుపై మీన మేషాలు లెక్కిస్తున్నారు. మరో వైపు ఎలాగైనా ఈ కేసును నీరుగార్చి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేయాలని ఇన్చార్జి ఆర్డీడి అన్ని దారులు వెతుకుతున్నట్టు సమాచారం. అంతేకాదు పోలీసుల విచారణలో సైతం చేసిన తప్పుపై ప్రశ్నిస్తుంటే పొంతన లేని సమాధారాలు చెబుతున్నారట. ఇలా ఆమెపై పెట్టిన కేసు విషయంలో నాలుగు రోజులు తాత్సారం చేస్తూ వస్తూ బాధిత దళిత ఉద్యోగిని ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ.. అట్టు జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిప్పుతున్నారు. 

దీనితో విసుగు చెందిన దళిత ఉద్యోగిని లోకాయుక్తాకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకు వెళతానని ఆవేదనతో చెబుతున్నారు బాధిత ఉద్యోగిని. తమను కులం పేరుతో దూషించి కొట్టడమే కాకుండా తమపై లేని పోని కేసులు పెట్టించి తమను, తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కూడా వాపోతున్నారు. మహిళలకు, అందునా దళిత మహిళలకు అన్యాయం జరిగిందని.. నగరంలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేటికీ అతీ గతీ లేదని చెబుతున్నారు. ఎన్నిరోజులు తాము సెలువులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టు తిరగాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాట్సప్ లో ఫిర్యాదు పెడితే స్వయంగా నగర పోలీస్ కమిషనర్ స్పందిస్తున్నారని..కానీ స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా.. మాకు అన్యాయం జరిగిందని బోరున విలపించినా.. బెదిరిస్తున్నారు.. రాజీ చేసుకోమంటున్నారు తప్పితే పోలీస్ కేసు మాత్రం నమోదు చేయడం లేదని చెబుతున్నారు. 

-కాలయాపన సమయంలో సిబ్బందిపై తిరిగి ఫిర్యాదులు
ఆయుష్ లో దళిత ఉద్యోగిని సుష్మనిపై  చేయిచేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై పెట్టిన కేసుపై పోలీసులు కేసుకట్టకుండా తాత్సారం చేస్తున్న సమయంలో ఉద్యోగులపై ఇన్చార్జి ఆర్డీడి మరోఫైల్ తయారు చేసి వైద్యఆరోగ్యశాఖకు పంపించారు. అంటే ఇక్కడ తనపై కేసుపెట్టిన వారిని ఏ విధంగానైనా శాఖాపరంగా ఇరికించడానికే ఇన్చార్జి ఆర్డీడికి అటు రెవిన్యూ అధికారులు, ఇటు పోలీసులు, మరోవైపు ఆయుష్ కమిషనరేట్ అధికారులు సహాయం అందిస్తున్నట్టు పక్కాగా తేలిపోతున్నది. అంతేకాకుండా తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని తన అనుకూల మీడియా ద్వారా ఇన్చార్జి   ఆర్డీడి ఈలోగా ప్రచారం కూడా చేయించుకుని ఆ  పేపర్ క్లిప్పింగులనే అధికారులకు పంపడంతోపాటు, ఆయుష్ ఉద్యోగులు తప్పు చేస్తున్నారని.. దానిపై తాను విచారణ చేస్తున్నాననే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి కొత్త డ్రామాకి తెరలేపారు. 

దానితో దళిత ఉద్యోగికి జరిగిన అన్యాయంపైనా.. జిల్లా అధికారి క్రింది స్థాయి సిబ్బందిని విధినిర్వహణలో ఉన్న సమయం చేయిచేసుకొని కులం పేరుతో దూషించినా ఏ ఒక్క మీడియాలోనూ వాస్తవాలు బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు ఇన్చార్జి ఆర్డీడి. ఇపుడు కూడా వాస్తవాలు బయటకు రాకుండా జరుగుతున్న తంతు మీడియాలో రాకుండా తనదైన రీతిలో నిలుపుద చేయించుకోగలుగుతున్నారు. విచారణ విషయంలో ఓ మంత్రి వద్ద పీఏగా పనిచేస్తున్నవ్యక్తి, ఓ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కమిషనరేట్, పోలీసులను ప్రభావితం చేస్తున్నారని తెలిసింది. 

-ఇన్చార్జి ఆర్డీడిపై ఫిర్యాదులున్న కనీసం స్పందించలేదు
విశాఖలోని ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై దళిత వైద్యులు, సిబ్బంది నేరుగా కమిషనర్ డి.మంజుల కే లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అలా ఫిర్యాదు చేసినందుకు వైద్యులంతా కలిసి తనను లైంగికంగా వేధిస్తున్నారని కూడా తిరిగి ఫిర్యాదు చేశారు ఇన్చార్జి ఆర్డీడి. ఒక జిల్లా అధికారిణిపై క్రింది స్థాయి ఉద్యోగులుగానీ, సిబ్బంది గానీ లైంగికంగా ఏవిధంగా వేధిస్తారు.. ఏవిధంగా తిరిగి చేయిచేసుకుంటారనే కనీసం ఆలోచంచడం లేదు అటు కమిషనర్, ఇటు విశాఖలోని పోలీసులు. పైగా ఇన్చార్జి ఆర్డీడికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. కేసుని గత నాలుగు రోజులుగా నానుస్తూ వస్తున్నారు తప్పితే ఎఫ్ఐఆర్ ఫైలు చేయలేదు. ఆయుష్ శాఖలో తనకు తిరుగు లేదని, తనని ఎవరూ ఏమీ చేయలేరని.. బహిరంగంగానే సవాల్ చేసిన ఇన్చార్జి ఆర్డీడి ఇటీవల జోన్ లోని అన్ని డిస్పెన్సరీలను మూయించేసి.. జిల్లా పరిషత్ లో డ్యూటీ సమయంలో ఒక వైద్యుని ఉద్యోగ విరమణ కార్యక్రమం కూడా చేశారు. 

అంతేకాకుండా ఆ విషయం మీడియా ద్వారా  బయటకు రావడంతో.. ఎక్కడ తాను ఇరుక్కుపోతానోనని భావించిన ఇన్చార్జి ఆర్డీడి తమకు తెలీకుండా వచ్చామని.. ఇకపై అలా విధినిర్వహణ సమయంలో రామని అదే కార్యక్రమానికి వచ్చిన వైద్యులందరితోనూ క్షమాపన లేఖలు కూడా రాయించారు. విచిత్రం ఏంటంటే ఆ విషయం కూడా మీడియా ద్వారా బయటకు వచ్చేసింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సీనియర్ వైద్యులు ఉండగా ఎక్కడో అట్టడుగున్న ఉన్న ఈమెకు గత ఆయుష్ కమిషనర్ ఇన్చార్జి ఆర్డీడి బాద్యతలు అప్పగించారు. అప్పటి నుంచి వైద్యులపై తన పవర్ ను చూపిస్తూ.. ఆయుష్ లో అంతా నేనే అన్నట్టుగా వ్యహరిస్తున్నారు ఇన్చార్జి ఆర్డీడి. ఈ విషయం కమిషనరేట్ అధికారులకి, సాక్షాత్తూ కమిషనర్ దృష్టికే వెళ్లినా తనని ఎవరూ చేయలేరని.. బీరాలు పోతూ దళిత ఉద్యోగులపై చేయి చేసుకునే వరకూ వచ్చారు.

 ఇక్కడ కూడా తన పలుకుబడిని వినియోగించి కేసు నమోదు కాకుండా చేసుకోవడంలో సఫలీ కృతులు అవుతున్నారు. చేసిన తప్పులు క్లియర్ గా కనిపిస్తున్నా.. దళిత వైద్యులు, సిబ్బంది లిఖిత పూర్వక ఫిర్యాదులున్నా.. విశాఖలో పోలీసులు మాత్రం దళిత ఉద్యోగిణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేయడం లేదు. బహుసా లోకా యుక్తా అయినా ఈ దళిత ఉద్యోగినికి, వైద్యులకు న్యాయం జరుగుతుందని భావించి దానిని ఆశ్రయించారేమో. చూడాలి ఇప్పటికైనా ఆయుష్ లో దళిత ఉద్యోగులకి, వైద్యులకి ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఏం జరుగుతుందనేది..?!

visakhapatnam

2025-02-22 07:47:54

మాల.. మాదిగనా కొడుకులని తిడుతున్నారండీ..! ఇన్చార్జి ఆర్డీడిపై కమిషనర్ కి దళిత వైద్యులు ఫిర్యాదు

మాల, మాదిగనా కొడుకుల్లారా.. మీ సంగతి చూస్తా..నేను చెప్పినట్టు చేయకపోతే మీరు ఏవిధంగా డ్యూటీలు చేస్తారో చూస్తాను.. మీకు జీతాలు ఎలా వస్తాయో చూస్తాను.. మీరు రాయిస్తే ఒకటి అరా పత్రికల్లో రాయించగలరు.. నేనుు తలచుకుంటే నా అనుకుల మీడియా ద్వారా ఏమైనా రాయించగలను.. నాతో పెట్టుకోవద్దు.. అయినా దళిత డాక్టర్లు, సిబ్బందీ మీకు కూడా అంత పౌరుషమా.. నాపైనే మీడియాలో నేను చేసినవన్నీ రాయిస్తారా..? మీ సంగతి చూస్తా..నేనే ఇక్కడ ఇన్చార్జి ఆర్డీడిగా ఉంటా..? ఎవరు ఏం చేస్తారో చూద్దాం.. ఏం పీకుతారో అదీ చూస్తాను.. నాకంటే సీనియర్లు ఎంతమంది ఉన్నా నేనే ఇన్చార్జి ఆర్డీడీగా రాగలిగానంటే నా రేంజ్ ఏంటో మీకు తెలియడం లేదు.. ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. జిల్లా కార్యాలయంలో దళిత ఉద్యోగిణిపై చేయిచేసుకోవడంతోపాటు.. వైద్యులను కూడా కులం పేరుతో దూషిస్తున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ వైద్యులు, సిబ్బందిపై కురిపిస్తున్న తిట్ల దండకంపై వైద్యులు లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదు అంశాలు..!

 విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఇన్చార్జి ఆర్డీడి డా. ఝాన్సీ లక్ష్మీభాయ్ పై దళిత వైద్యులు, కార్యాలయ సిబ్బంది, బిసి సామాజిక వైద్యులు ఆయుష్ కమిషనర్ డి.మంజుల కి తమను కులం పేరుతో దూషిస్తూ వేస్తున్నారంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా దళిత వైద్యులను, మాదిగనా కొడుకు, మాలనా కొడుకూ అంటూ సంభోదిస్తూ.. జిల్లా కార్యాలయంలోని సిబ్బంది ముందు అవహేళన చేస్తూ.. కించ పరుస్తూ మాట్లాడుతున్నారనే విషయాన్ని ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో దళిత ఉద్యోగిణి సుష్మపై చేయిచేసుకోవడంతోపాటు, కులం పేరుతో దూషించిన వ్యవహారంలో పీఎంపాలెం పోలీసు స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ  కేసు వ్యవహారం నడుస్తుంది.  

అదే సమయంలో వైద్యులు కూడా నేరుగా అమరావతిలోని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతోపాటు దానిని సీఎం కార్యాలయం, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయం, ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పంపిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. ఇన్చార్జి ఆర్డీడి ఉంటూ సీనియర్ దళిత వైద్యులను కులం పేరుతో దూషించడాన్ని వైద్యులు, సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వశాఖల్లోనూ అందునా ప్రజలకు వైద్యసేవలు అందించే వైద్యులను అంటరాని వాళ్లగా ఇన్చార్జి ఆర్డీడి చూటడం, నోటికొచ్చినట్టు తిట్ల దండకాన్ని తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. ఎంత దళిత వైద్యులం అయితే మాత్రం తమను ఈ విధంగా తిడతారా..? సంబోధిస్తారా..? మాకు న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులుగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా అని తమ ఆవేదనను కమిషనర్ ముందు ఉంచారు. 

అంతేకాకుండా తాము లైంగిక పరమైన వేధింపులు చేస్తున్నామని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఒక జిల్లా అధికారిణిని క్రిందిస్థాయి వైద్యులు లైంగికంగా ఏ విధంగా వేధిస్తారనే విషయాన్ని కమిషనర్ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ.. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని, తన అనుకూల మీడియాని వెంటపెట్టుకొని డిస్పెన్సరీలకు వచ్చి.. వారిముందే తమను దుర్భాషలాడుతున్నారని, నానా హడావిడీ చేస్తున్నారని కూడా ఫిర్యాదులో పొందు పరిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రాజకీయ నాయకులను, కలవడంతోపాటు ఎన్నికల విషయమై చర్చలు జరుపుతూ ఎన్నికల కోడ్ ని కూడా ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. 

తమపై ఇన్చార్జి ఆర్డీడి చేస్తున్న వేధింపులు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న కార్యకలాపాలపైనా సమగ్ర విచారణ జరపడంతోపాటు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని.. రానున్న రోజుల్లో దళిత వైద్యులు, సిబ్బందిని మానసిక ఇబ్బందులకు గురిచేయకుండా న్యాయం చేయాలని వైద్యులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్, లోకాయుక్తాకి కూడా ఫిర్యాదులు పంపినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడి దళిత ఉద్యోగిపై చేయి చేసుకోవడంపై దళిత సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి.

-దళిత వైద్యుల ఫిర్యాదు వాస్తవమే-ఆయుష్ కమిషనర్ మంజుల
విశాఖలోని జోన్-1 పరిధిలోని ఆయుష్ వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ కులం పేరుతో దూషించడంతోపాటు,  టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నట్టు వైద్యులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారని ఆయుష్ కమిషనర్ డి.మంజుల ఈరోజు-ఈఎన్ఎస్ కి వివరణ ఇచ్చారు. గతంలోనూ ఈమె వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాయని, మొత్తం అన్ని వ్యవహారాలపైనా విచారణ చేస్తామని, వాస్తవాలు తేలితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు. అదే సమయంలో దళిత ఉద్యోగిని పై చేయిచేసుకున్న వ్యవహారంలో విచారణ చేస్తామని.. విధి నిర్వహణలో ఉద్యోగులపై అధికారులు చేయి చేసుకోవడం సర్వీస్ రూల్స్, సిసిఎల్ఏ రూల్స్ కి విరుద్దమని పేర్కొన్నారు. గతంలో డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వైద్యులందరితోనూ డిస్పెన్సిరీలకి తాళాలు వేయించి విశాఖలోని జిల్లా పరిషత్ హాలులో రోజంతా  కార్యక్రమం చేపట్టిన విషయమై కూడా విచారణ జరుగుతుందన్నారు. అసలు విశాఖలోని జోన్-1 ఆర్డీడి కార్యాలయంలోనూ, ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ఏం చేస్తున్నారనే విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తామని కమిషనర్  పేర్కొన్నారు.



visakhapatnam

2025-02-20 16:16:37