1 ENS Live Breaking News

ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. పోస్టు గాల్లో.. విధులు మాత్రం పోలీసుశాఖలో..?!

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను పోలీసులుగా ఎలా పరిగణిస్తారు.. వారంతా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా పోలీసు శాఖలోకి వస్తే పోలీసులైపోతారా అంటూ కోర్టుకేసు.. నిజమే వీరుపోలీలుసు కాదు.. వీరికి పోలీసుశాఖకూ ఎలాంటి సంబంధమూ లేదంటూ సాక్షాత్తూ డిజీపి కార్యాలయం హైకోర్టుకి లిఖిత పూర్వకంగా అఫడవిట్ రాసిచ్చేసింది.. అప్పటి నుంచి ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసుల పోస్టు గాల్లోనే ఉంది.. పోలీసుశాఖ ద్వారా నియామకాలు చేశారు కనుక.. పోలీసుశాఖ నుంచే జీతాలు ఇస్తున్నారు.. పోస్టు సచివాలయశాఖలో బర్తీ చేశారు కనుక జీతం అక్కడి నుంచి వస్తోంది.. అంతే తప్పితే వీరి పోస్టు మాత్రం నేటికీ గాల్లోనే ఉంది..ఈ పరిస్థితి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం వరకూ అలాగే ఉండిపోయింది. నాటి ప్రభుత్వం మహిళా పోలీసుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుకుండా వదిలేసింది.. కానీ కూటమి ప్రభుత్వం ఏదోఒక నిర్ణయం తీసుకొని వారిని సముచిత స్థానంలో కూర్చోబెడతామని అసెంబ్లీలోనూ, మీడియాలో తెగ ప్రచారం చేసినా కూటమి ప్రభుత్వం కూడా తికమక వ్యవహారాలే చేస్తున్నది తప్పా మహిళా పోలీసులను నిర్ధిష్టంగా ఏం చేస్తుందనే విషయాన్ని మాత్రం తేల్చడం లేదు. వెరసీ ఈ మహిళా పోలీసుల పోస్టు, శాఖ గాల్లోనే ఉండగా.. వీరు మాత్రం అధికారికంగా పోలీసుశాఖలోని పోలీసులు విధులే చేస్తున్నారు.. అంటే ఇక్కడ కోర్టు పని కోర్టుది.. ప్రభుత్వ పని ప్రభుత్వానిది.. లేదా హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగానే బావించాలా..?!

ఒక ప్రభుత్వ ఉద్యోగి అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు..అక్కడ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా కోర్టుకి ఏవిధంగా రాసి ఇస్తే ఆవిధంగానే రాష్ట్రప్రభుత్వం వ్యవహరించాల్సి వుంది. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే.. తేడాగానే వ్యవహరిస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా అధికూడా అధికారికంగా.  పోలీసు పోస్టు  కాదు కానీ.. విధులు  మాత్రం అధికారంగా చేయిస్తూ... హైకోర్టు దాఖలు చేసిన అఫడివిట్ ని వక్రీకరిస్తూ.. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో జరుగుతున్న తేడా వ్యవహారం మరోసారి రచ్చకెక్కేటట్టు కనిపిస్తున్నది. మహిళా పోలీసులు గాల్లో ఉన్నారనీ, వారికి తలా తోకా లేదని.. వారికి ప్రభుత్వశాఖ కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఉద్యోగులకు ఇష్టం లేకుండా నేరుగా అగ్రీగోల్డ్ వ్యవహారంలో సమాచారం సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని కొంతమందిని పోలీసుశాఖ అభ్యర్ధన మేరకు సచివాలయ మహిళా పోలీసులను సీఐడికి అప్పగిస్తూ లిఖితపూర్వకంగా సర్క్యులర్ లను జారీ అయ్యాయి. అలా విశాఖపట్నంలో కూడా 60మందిని జివిఎంసీ నుంచి పోలీసుశాఖకు కేటాయిస్తు జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. 

 గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వశాఖను కేటాయించకుండానే అధికారికంగా పోలీసుల విధులు చేయిస్తున్న వైనం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. ఈ తేడా వ్యవహారంలో మరోసారి మహిళాపోలీసుల పోస్టు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళా పోలీసులు నియామకాలు పోలీసుశాఖ ద్వారానే జరిగినా.. కోర్టు కేసు, కోర్టుకి దాఖలు చేసిన అఫడవిట్(మహిళా పోలీసులకి, పోలీసుశాఖకి సంబంధం లేదు. వీరు పోలీసులు కాదు అని రాచ్చిన)  కారణంగా వీరంతా ఇపుడు పోలీసుశాఖకు చెందిన వారు కాదు. ప్రస్తుతం సచివాలయశాఖకు కేటాయించబడ్డ ఒక సాధారణశాఖలేని ఉద్యోగులు మాత్రమే. అలాంటి సందర్భంలో కోర్టుకి ఇచ్చిన అఫడివట్ ని కాదని మహిళా పోలీసులను ఏ నిబంధనలతో మళ్లీ అగ్రీగోల్డు సమాచారం సేకరించడానికి వీరిని పోలీసుశాఖలోని  సిఐడీ విభాగాని డిప్యుటేషన్ పై పంపిస్తున్నారో తెలియని పరిస్థితి. అలాగని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ విధానంలో రెండు మూడు సచివాలయాలను ఒక సచివాలయం మదించారు. ఆ సమయంలో కొందరు మహిళా పోలీసుల పోస్టులను గాల్లో పెట్టినట్టు లిఖిత పూర్వకంగా తెలియజేసినా. వారిని ఏం చేస్తున్నారో ఎక్కడా మరే ఇతర సర్క్యులర్ లోనూ తెలియజేయలేదు.

కానీ రాష్ట్రప్రభుత్వం ప్రకటించినట్టుగా మాత్రం గ్రామ, వార్డు సచివాలయశాఖ సిబ్బందిని మల్టీటాస్కింగ్ స్టాఫ్ గా వినియోగిస్తామన్న మాటకు వారిని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపేస్తూ సర్క్యులర్ ఇస్తున్నారు తప్పితే.. వారికి ఏ ప్రభుత్వశాఖ కేటాయిస్తున్నారో మాత్రం ఎక్కడా పేర్కొన లేదు. ఇటీవల ఇదే విషయమై హోం మంత్రి వంగల పూడి అనిత కూడా ఒక కీలక ప్రకటన చేశారు. సచివాలయ మహిళా పోలీసుల రిక్రూట్ మెంట్ అంతా తలా తోక లేకుండా అస్తవ్యస్తంగా చేశారని.. వారి చదువు, వయస్సు ఆధారంగా వారిని ఒక సముచితస్థానంలో కూర్చోబెడతామని ప్రకటన  చేశారు. అయితే అలా ప్రకటన చేసిన తరువాతే క్లస్టర్ విధానం తెరమీదకు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా కొందరు మహిళా పోలీసుల పోస్టులను రద్దుచేశారు.. అంటే ఉన్న పోస్టులను మధించారు. అలా ఏ సచివాలయంలో పోస్టు మధించారో లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు కూడా. ఆ విధంగా గాల్లో పెట్టిన వారిని ఏం చేస్తారు.. ఏ ప్రభుత్వశాఖకు పంపిస్తారు అనే విషయం క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇపుడు మళ్లీ తాజాగా సచివాలయశాఖ మహిళా పోలీసులను సిఐడీకి డిప్యూటేషన్ పై అగ్రిగోల్డ్ సమాచార సేకరణకు కావాలంటూ పోలీసుశాఖే జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడంతో దాని ఆధారంగా కొందరు సిబ్బందిని సిఐడి విభాగానాకి డిప్యూటేషన్ పై పంపిస్తూ సర్క్యులర్ లు జారీచేశారు.

మహిళా పోలీసులను సిఐడీకి అదనపు బాధ్యతలపై పంపేటపుడు ఇక్కడ ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంది.. 1)వీరి ఉద్యోగాలు కేసు కోర్టులో ఉండటం 2)పోలీసుశాఖే వీరు మహిళా పోలీసులు కాదు.. వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసిన విధానం 3)కోర్టు కేసు కారణంగా నేటి వరకూ ఏ ప్రభుత్వశాఖు చెందని ఉద్యోగులు మహిళా పోలీసులు గాల్లో ఉండిపోవడం 4)క్లస్టర్ విధానంతో కొంమంది పోస్టులను రద్దు చేస్తున్నట్టు లిఖిత పూర్వకంగా ప్రకటించడం 5) వారిని తిరిగి ఎక్కడైనా ఖాళీలు ఉన్నచోట భర్తీచేశారా అనే విషయాన్ని తెలుసుకోవడం. అవేమీ చేయకుండానే నేరుగా పోలీసుశాఖ అడిగిందనే ఒకే ఒక కారణంతో జిల్లా కలెక్టర్ నేరుగా 60 మంది మహిళా పోలీసులు లేదా మహిళా సంరక్షకులను సిఐడీ అప్పగిస్తూ సర్క్యులర్ ను జారీచేయడం. అంటే మహిళా పోలీసుల విషయంలో ఉన్న కోర్టు కేసులు, కోర్టులో సమర్పించిన అఫడవిట్ ను కాదని సిబ్బందిని అప్పగించడం దేనికి సంకేతం అనేది జిల్లా కలెక్టర్, రాష్ట్రప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క అవకాశం ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడానికి జిల్లా కలెక్టర్ కు ఉన్న జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఆ సర్క్యులర్ జారీచేశారా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. 

ఈ విషయాలన్నింటినీ ఈరోజు-ఈఎన్ఎస్ ఎప్పటినుంచో ప్రత్యేక కథనాలుగా  అందిస్తూ వస్తున్నది. అలా ఏవైతే కథనాల వస్తున్నాయో.. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఆ విధంగా చేసుకుంటూ వెళుతున్నది. అంటే ఈరోజు-ఈఎన్ఎస్ రాస్తున్న కథనాలన్నీ నిజమవుతున్నాయి. ఈ విషయంలో ఇక్కడ తప్పా మరే ఇతర ప్రధాన పత్రికలు, మీడియాలోనూ రాకపోవడం కూడా సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి. ఇదే విషయమై  విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను ఈరోజు-ఈఎన్ఎస్ చరవాణిలో లిఖిత పూర్వకంగా వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా ప్రస్తుతం మహిళా పోలీసుల్లో చాలా మందికి పోలీసు విభాగంలో పనిచేయడానికి ఇష్టంలేదనే అంశాలన్ని వారి చరవాణి గ్రూపుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. అసలు ప్రభుత్వశాఖే లేని మహిళా పోలీసులను ఏ విధంగా అదే పోలీసుశాఖలోని సిఐడీకి డిప్యూటేషన్ పై పంపుతున్నారనే అంశం చర్చనీయాంశం అవుతుంది...?!

visakhapatnam

2025-04-21 13:12:22

జీవిఎంసీకి కమిషనర్ కావలెను.. మోకాలడ్డుతున్న అవిశ్వాస బలపరీక్ష..?!

మహావిశాఖనగర పాలక సంస్థ ఇంటిపెద్ద లేని ఇల్లులా తయారైంది.. పరిపాలన మొత్తం సన్నగిల్లింది.. అధికారులు ఇష్టాను సారం వ్యవహ రిస్తున్నా.. స్పెషలాఫీసర్ వాటిని సరిదిద్దలేని పరిస్థితి, జీవిఎంసీపై దృష్టిపెడితే జిల్లా పరిపాలన పక్కకి పోతున్నది.. అలాగని రెండింటిపైనా దృష్టిపెట్టడానికి జిల్లా కలెక్టర్ కు సమయం సరిపోవడం లేదు.. ముఖ్య అధికారి లేని సంస్థలో క్రింది స్థాయి ఉద్యోగులు వారి పనులు చల్లగా చక్కబెట్టేస్తున్నారు.. విషయం ఆనోటా ఈనోటా తెలిసినా వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న మహావిశాఖనగరంలో అభివృద్ధి సన్నగిల్లిపోతున్నది.. జివిఎంసీకి కమిషనర్ కావాలి మహా ప్రభో అని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా.. కూటమి ప్రభుత్వంలో అధికారిని నియమించే పరిస్థితి కనిపించడం లేదు.. ప్రస్తుతం ఐఏఎస్ ల బదిలీలు జరుగుతు న్నవేళ గాడి తప్పుతున్న జీవిఎంసీకి కమిషనర్ వస్తారా లేదంటే అవిశాస్వం నెగ్గితన తరువాత నచ్చిన అధికారి తెచ్చుకుంటారా..? అనే చర్చ విశాఖలో జోరుగా సాగుతున్నది..?!

మహా విశాఖనగరపాలక సంస్థకు కమిషనర్ ఉంటేనే పరిస్థి చేదాటి పోతుంటుంది.. అలాంటిది నెలల తరబడి ఇద్ద పెద్ద నగరపాలక సంస్థను పరిపాలించే అధికారి లేకపోతే ఎన్నివిభాగాల సేవలు సన్నగిల్లిపోతాయో వేరేగా చెప్పాల్సి పనిలేదు. ఉన్న కమిషనర్ ని, నగరాన్ని చక్కగా అభివృద్ధి చేస్తూ గాడిన పెడుతున్న తరుణంలో ఇక్కడ పనిచేసే జీవిఎం కమిషనర్ డా.పి.సంపత్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడ ఎంత మంది కమిషనర్లు పనిచేసినా.. రాజకీయపార్టీ నేతలకు సిఫారసులను కాదని, ముక్కుసూటిగా పనిచేసే అధికారులుగా ఇద్దరే ఇద్దరు అధికారులు బాగా పేరు తెచ్చుకున్నారు. అందులో ఒకరు డా.లక్ష్మీషా, రెండవది డి.పి.సంపత్ కుమార్. అలాంటి అధికారులనే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంచకుండా వెనువెంటనే రాజకీయ ఒత్తిడిల కారణాలు చూపి బదిలీలు చేసింది. అలా బదిలీ చేసిన తరువాతనైనా కొత్త కమిషనర్ ను నియమించాల్సి వుంది. కానీ నేటి వరకూ ఎవరినీ నియమించకుండా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నే ఇన్చార్జి కమిషనర్ గా నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కి అటు జిల్లా పరిపాలన, ఇటు జివిఎంసీ అదనపు బాధ్యతలు చూడటం కష్టతరం అవుతున్నది. దానితో క్రింది స్థాయి అధికారులు ఉద్యోగులు వారి చేతికి పనిచెప్పి అందినకాడికి దండుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వారు పనులు చేస్తున్నారు. అలాగని విషయం తెలిసి వారిపై చర్యలు తీసుకోవడానికి ఇన్చార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారు. రేపో మాపో ఇన్చార్జి బాధ్యతలు తొలగిపోతాయ్.. ఆ మాత్రం దానికి నేనెందుకు చెడ్డ కావాలనే విధంగా పాము చావకుండా.. కర్ర విరగకుండా ఏదో మొక్కుబడిగా పనిచేసుకు పోతున్నారట ఇన్చార్జి కమిషనర్ కమ్ జిల్లా కలెక్టర్. అందులోనూ విశాఖలో కొంత మంది ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు, కార్పోరేటర్లకు గత కమిషనర్ ముక్కసూటి వ్యవహారం నచ్చకపోవడం, రాజకీయ పలుకుబడి వినియోగించి ఇక్కడి నుంచి బదిలీ చేయించారని జరుగుతున్న ప్రచారమే ఇపుడు నిజమైనట్టుగా కనిపిస్తున్నది. 

పాలకుల అడుగులకు మడుగులు ఒత్తే అధికారులు ఎవరూ ఇప్పటి వరకూ కనిపించనందునే జివిఎంసీ కమిషనర్ పోస్టు భర్తీ కాలేదని.. నేతలు కొంతమంది పేర్లు ప్రతిపాదించినా ఎందుకనో సీఎంఓ నుంచి దానికి గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు. దానికి తోడు కూటమి ప్రభుత్వ కార్పోరేటర్లు వైఎస్సార్సీపీ మేయర్ పై అవిశ్వాస నోటీసు ఇవ్వడం.. అది ఈనెల 19న పూర్తయితే అపుడు కొత్తగా మేయర్ తోపాటు, కమిషనర్ ను కూడా నియమించుకోవచ్చునని స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఇద్దరూ మనవారైతే మనకి నచ్చినట్టుగా పనులు చేయించుకోవచ్చునని  తద్వారా మహావిశాఖనగర పాలక సంస్థ పరిధి మొత్తం మన చేతుల్లోనే ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కారణంగా నేటి వరకూ జివిఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ ను నియమించలేదని సమాచారం అందుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరోసారి విశాఖలోని జీవిఎంసీ కమిషనర్ వ్యవహారం తెరమీదకు వచ్చి రక రకాల చర్చలకు దారితీస్తున్నది. పూర్తిగా పరిపాలన గాడి తప్పేవరకూ జివిఎంసికి ఇన్చార్జి అధికారులతో మమ అన్నట్టుగా పరిపాలన చేస్తారు తప్పా.. అనుకున్న.. అనుకూలంగా ఉన్న అధికారులు తారస పడేవరూ కమిషనర్ పోస్టు భర్తీచేయరనే వాదన నేటి వరకూ నిజం అవుతూ వస్తున్నది. చూడాలి  ప్రస్తుతం జరుగుతున్న ఐఏఎస్ లబదిల్లో నైనా జివిఎంసికి కమిషనర్ ను నియమిస్తారా..? లేదంటే ఈనెల 19న కూటమి కార్పోరేటర్ల అవిశ్వాస బలపరీక్ష నెగ్గిన తరువాత మేయర్ తోపాటు, కమిషనర్ నూ ఒకే సారి నియమిస్తారా..? అనేది..?! 

visakhapatnam

2025-04-14 20:57:29

సిగ్గు.. సిగ్గు.. పసివాడి శవంపై పైసలేరుకున్న తేడా మీడియా..?!

భాహ్యప్రపంచంలో ఏం జరిగినా ప్రజలముందు ఉంచేది, కళ్కకు కట్టినట్టు చెప్పేది మీడియా.. సమాజంలో  ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న అలాంటి మీడియాలో తేడాగాళ్లు ఎక్కువైపోతున్నారు.. కేవలం అక్రమార్కులకు కొమ్ము కాస్తూ దారుణంగా శవాలపై కూడా పైసలు ఏరుకుంటున్నారు.. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసి.. మరీ అందినకాడి దండేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.. అందునా ఇలాంటి తేడా మీడియాకి నాయకత్వం వహించే జర్నలిస్టు సంఘ నాయకులే శవరాజకీయం, పీనుగులపై పైసలు ఏరుకునే దండుకి నాయకత్వం వహిస్తున్నారంటే పరిస్థితి ఏధంగా మారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఏడేళ్ల పసివాడు స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోతే ఆ విషయాన్ని బయటకు రానీయకుండా తలో లక్షా తీసుకొని ఏమీ తెలియని మట్టిబుక్కడం లా కామ్ గా కూర్చున్నారు. కానీ ప్రజలకు అన్యాయం జరిగితే ఎప్పుడూ ప్రశ్నించే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాలుని మృతిపై సీబీఐ విచారణ చేయమని డిమాండ్ చేశారు. అదీ ఎందుకంటే నిర్వాహకులు పోలీసులు, మీడియాని కొనేసిన నిర్వాహకుల తీరు, ప్రజలను మోసం చేసి, వాటర్ వరల్డ్ విచక్షణా రహితంగా చెట్లు నరికేయడం, అక్రమ నిర్మాణాలు చేయడం వంటి అంశాలు బయటకు రావాలనేది ఆయన సంకల్పం.. అదే నేడు విశాఖలో హాట్ టాపిక్..!

విశాఖలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్, వాటర్ వరల్డ్ లో అకారణంగా మృతిచెందిన ఏడేళ్ల  బాలుడి రిషి శవాన్ని పీక్కుతినడానికి నగరంలో తేడా మీడియా రాబందులు ఎగురుకుంటూ వచ్చాయి. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ల్ లోనిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోయిన ఏడేళ్ల బాలుడి మృతిని పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటే.. విషయం బయటకు రాకుండా, స్పోర్ట్స్ క్లబ్ పై ప్రభావం పడకుండా నిర్వాహకులు మీడియాని లక్షలు పోసి కొనేశారనేది అసలు శారాంశం. స్పోర్ట్స్ క్లబ్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న నిర్వాహకులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఆ ప్రదేశంలోని చెట్లను భారీగా తొలగించినా ప్రశ్నించే అధికారి విశాఖలో కరువయ్యాడంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో విశాఖలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్, వాటర్ వరల్డ్ రింగ్ స్లోప్ బోర్డ్ నుంచి క్రింపడి మృతిచెందిన రిషిని నిర్వాహకులు వారి తప్పులేదన్నట్టుగా మృతిచెందిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని చూశారని సమాచారం అందుతుంది. అంటే ప్రమాదం జరిగే సమాయానికి బాలుడు బ్రతికే ఉన్నాడని.. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందినట్టు క్రియేట్ చేస్తే ఆ తప్పు మీ మీదకు రాదని.. తద్వారా విషయం బయటకు పొక్కినా.. ఎవరూ ఏమీ చేసేది లేదని.. అయితే మా వర్గం మీడియాకి రూ.15 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పి ఓ జర్నలిస్టు సంఘ నాయకుడు దగ్గరుండి ఈ ఢీల్ ని కుదుర్చుకొని చక్కగా బాలుడి శవంపై పైసలు పంచుకున్నారట. 

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీమీలీ బీచ్ రోడ్డు దగ్గర ఒక స్పోర్ట్స్ క్లబ్, నైట్ రేవ్ పార్టీలు చేసే క్లబ్లును ప్రస్తుత నిర్వాహకులు నడిపేవారని.. దానిపై ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వ హయాయంలో దానిని మూయించి వేశారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం స్పోర్ట్స్ క్లబ్ లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. ఎవరి దృష్టి వారిపై పడకుండా ఒక తేడా మీడియా కోటరీని ఏర్పాటు చేసుకొని, వారిని ముప్పొద్దులా మేపుతూ నచ్చినట్టు చేస్తున్నారనేది పబ్లిక్ టాక్ ఇపుడు. ఇపుడు అదే ప్రదేశంలో ఒక ఏడేళ్ల బాలుడు మృతిచెందితే అదెక్కడ తమ మెడకి చుట్టుకుంటుందోనని ఠాగూర్ సినిమా స్టైల్ లో హాస్పిటల్ నాటకం ఆడి, అటు బాలుడి తల్లిదండ్రులను భయపెట్టి, పోలీసు కేసులు అవుతాయని బెదిరించి కొంత మొత్తానికి సెటిల్ చేశారని కూడా చెబుతున్నారు. ఏదో నామ్ కే వాస్తే పోలీసు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుందామనుకునే సమయానికి తేడా మీడియా, జర్నలిస్టు సంఘ నాయకులు ఎంటర్ అయి.. తమ సంగతేంటని.. లేదంటే వెంట వెంటనే విషయాన్ని రుద్ది రుద్ది వదులుతామని చెప్పడంతో గత్యంతరం లేని నిర్వాహకులు మీడియా మొత్తానికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అందులో సగం ఒక వర్గం తేడా మీడియాకి, మరో సగం ఇంకో తేడా మీడియా వర్గానికి ఇచ్చారని టాక్. 

అయితే డబ్బులు తీసుకొని కూడా విషయాన్ని లీక్ చేసిన నాయకుడికి, దానిని పట్టుకొని బెదిరింపులకు దిగిన ఒక తేడా జర్నలిస్టు సంఘనాయకుడికే ఏకంగా రూ.5 లక్షలు ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అందునా ఈ కేసుని పూర్తిగా విచారణ చేస్తే వాటర్ వరల్డ్ నిర్మాణం కోసం లోపల ఎన్నిచెట్టు నరికేశారో ఆ విషయం గ్రీన్ ట్రిబ్యునల్ తగులుకుంటుందనేది వారి భయం. అయితే తేడా మీడియాలో శవంపై చల్లిన కాసులు అందకపోవడంతో బయటకు వచ్చి ఆ ఇద్దరికే( ఒకటి అడిగిన వారికి, రెండు అడగని వారికి)  మాత్రమే చెప్పడంతో విషయం దావానంలా నగరం మొత్తం వ్యాపించింది. అయితే మేజర్ మీడియాని మేనేజ్ చేశాం కనుక ఏం కాదులే అనే ధీమాతో కూడా నిర్వాహకులు ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ జరుగుతున్న అవకతవకలు, ఇతర చీకటి వ్యవహరాలు, బాలుని మృతి తదితర అంశాలపై సీబీఐ విచారణ జరిపంచాలని చేసిన డిమాండ్ ఇపుడు లోన జరుగుతున్న చీకటి కోణాలపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. అందునా తేడా మీడియా కూడా ఎంటర్ కావడం, చేతికి అందినంతా ఆ బాలుని శవంపై నొల్లేయడం.. పైగా పతివ్రతా శిరోమణి కబుర్లు చెబుతూ వాస్తవాలను మరుగున పడేలా చేయడం వంటి అంశాలు ఇపుడు విశాఖలో ఆశక్తి కరంగా మారాయి.  

విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్  లో వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి పై ఇప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజలు ప్రాణాలు పోతున్నా కేవలం సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తున్న వైనంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథం తో పోర్టు యాజమ్యం లాలూచీ బాలుడు మృతిచెందినా కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పోర్టు స్టేడియం నిర్వహణ చేస్తున్నా..స్టోర్ట్స్ పేరుతో మరొకరికి అనధికార సబ్ లీజ్ లు ఇస్తున్నా పోర్టు యాజమాన్యం ఏమీ అనకపోవడం వలనే ఇక్కడ అక్రమాలు పెద్ద ఎత్తున జరగుతున్నాయని.. విశ్వనాథంకు పోర్టు స్టేడీయం కు జరిగిన లీజు డాక్యమెంట్స్ బయట పెట్టాలని ఇపుడు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పోర్టు భూములు లీజుకి ఇచ్చే సమయంలో ఆ ప్రదేశంలో ఎన్ని చెట్లు ఉండేవి.. ఇపుడు అందులో ఎన్ని నరికేశారో లెక్కలు బయటకు తీయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపైనా, పోర్టు నిర్లక్ష్యం పైనా, క్లబ్ యాజమాన్యంపైనా గ్రీన్ ట్రిబ్యులనల్ కి వెళ్లడానికి సిద్దమవుతున్నట్టుగా సమాచారం అందుతున్నది. 

విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. లోన జరిగే అక్రమాలపై ఏ విధమైన విచారణ చేస్తుంది.. దానిని కాసులు ఏరుకొని భరోసా ఇచ్చిన తేడా మీడియా ఏ విధం అడ్డుకట్ట వేస్తుంది.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రకటనను ఏ విధంగా స్వీకరిస్తుందనే అంశాలకి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉన్నది. కానీ నిర్వాహకులు మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు తీసుకున్నామని.. తమపై గిట్టనివారు, మరికొందరు ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారాలు, డిమాండ్లు చేస్తున్నారని.. తాము నిమిత్త మాత్రులమని క్లబ్ నిర్వాహకులు చెబుతుండటం విశేషం.?!

visakhapatnam

2025-04-08 19:08:44

కార్పోరేటర్ల కూర్పులో అసమ్మతి కుంపటి..?! క్యాంపు రాజకీయాలకు ఉప్పందించేది ఎవరు..

మహావిశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలకు అసమ్మతి కుంపటి పొగపెడుతున్నట్టు కనిపిస్తున్నది.. విశాఖలో ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర వహించిన సీనియర్ నేతలు జంపింగ్ లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూటమిలో నేతలు వేరుకుంపటి పెట్టినట్టు తెలుస్తున్నది. దాని ప్రభావం రేపు అవిశ్వాసంలో కార్పోరేటర్ల కూర్పుపై ప్రభావం చూపిస్తుందా అనే విషయమై మహావిశాఖ నగరపరిధిలో హాట్ హాట్ చర్చ నడుతుస్తున్నది. దానికి ముక్తాయింపుగా ఓ సీనియర్ టిడిపి నేత ఇంటిలో కొందరు అసమ్మతి నేతలు పెట్టుకున్న సమావేశంలో మనకి గౌరవం దక్కని పార్టీలో మనమెందుకు యాక్టివ్ ఉండి కార్పోరేటర్లను కాపాడాలి..? అనే ప్రశ్న లేవనత్తారని.. ఆ కారణంగానే వైఎస్సార్సీపీకి ముందస్తు ఉప్పు అందడంతోనే కార్పోరేటర్ల క్యాంపు రాజకీయం మొదలైందనే విషయం ఇపుడు విశాఖలో గుప్పుమంటున్నది..అయితే అదేమీ లేదన్నట్టుగా నగరంలోని నేతలు చెబుతున్నప్పటికీ, అనుచరులు ప్రచారం చేస్తున్నప్పటికీ అసమ్మతినేతలు మాత్రం వారి పని వారు చేసుకు పోవడం వలనే కార్పోరేటర్ల కూర్పు కష్టమవుతుందని వాదన తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతున్నది..?

మహావిశాఖనగరపాలక సంస్థ  మేయర్ పీఠాన్ని అవిశ్వాసంతో చేజిక్కించుకోవాలని చూస్తున్న కూటమికి సొంత వారే వెన్నుపోటు పొడుస్తున్నట్టు పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ప్రభుత్వం ఇటవలన ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో పదవులు రాకపోవడం, మరికొందరికి కీలక పదవులు వస్తాయనుకున్నా రాకపోవడంతో వారే పీఠాన్ని కదిపే విషయంలో కాస్త ఇబ్బంది పెడుతున్నారని పార్టీలో అంతర్లీన విషయం బయటకు పొక్కుతున్నది. ఈ కారణంగానే కార్పోరేటర్ల కూర్పు, వైఎస్సార్సీపీ నుంచి వస్తున్న కార్పోరేటర్ల మద్దతుని విచ్చిన్నం చేయడానికి అసమ్మతి వాదులు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు పెద్ద ఎత్తున  ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టిడిపి, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు వారి వారి క్యాడర్ లతో నియోజకవర్గాల వారగీ సమీక్షా సమావేశాలు పెట్టిన సందర్భంలో కొందరు నాయకులు తమకేమి విలువ లేదని మదన పడ్డారట. అదే సమయంలో వైఎస్సార్సీపీ నుంచి టిడిపి లోకి వచ్చిన కొందరు నాయకులకు కూడా కూటమిలో సరైన స్థానం లేకపోవడం కూడా జీవిఎంసీ కార్పోరేటర్ల కూర్పు, బల నిరూపణ విషయంలో ప్రతిబంధకం అవుతున్నట్టు సమాచారం అందుతుంది. 

ఏకంగా కొందరు అసమత్తి వాదులు ఉన్నవారైనా అక్కడే ఉండిపోండి  తద్వారా మీకు పార్టీలో గౌరవం పెరుగుతుంది.. పిలిచారని వచ్చేస్తే మాకున్నపాటి విలువ కూడా మీకుండదు అనే కోణంలో వచ్చే కార్పోరేటర్లను కూడా వ్యతిరేక వర్గం వారితో ఉప్పందించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఈ విషయం కాస్త కూటమి అధిష్టానికి చేరడంతో రంగంలోని ఎంపీ, ఎమ్మెల్యేలను దించినా పరిస్థితి పూర్తిగా అనుకున్నట్టు మారలేదని కూడా తెలుస్తున్నది. అయితే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టే సందర్భంలో వార్డుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని అయినా మిగిలిన బలం కార్పోరేటర్లు కూటమి లోకి వస్తారని అంతా భావించారు. అయితే వైఎస్సార్సీపీ తెలివిగా క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో అది కాస్త బెడిసి కొట్టింది. తమకు కార్పోరేటర్ల బలం ఉందని ప్రకటించి బలనిరూపణకు వెళ్లినా మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అనుమానాలను కూటమి పెద్దలు వ్యక్తం చేస్తున్నారట. 

దానికి గల కారణాలను గ్రౌండ్ లెవల్ లో తెలుసుకుంటే ఎన్నికలవ వరకూ ఒకలా.. గెలిచిన తరువాత ఒకలా నేతలు వ్యవహరిస్తున్నారని.. అలాంటపుడు తామెందుకు పార్టీకోసం కష్టపడి పనిచేయాలనే వాదనను అసమ్మతి వాదులు తెరపైకి తీసుకు వచ్చారని.. వారిని బుజ్జగించడానికి మళ్లీ కూటమిలోనూ దువ్వే రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదే విషయం ఇద్దరు ముగ్గు టిడిపి నేతలు కూడా గత మూడు రోజుల నుంచి కొందరు కూటమి నేతల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం అందుతున్నది. దీనితో కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలానికి ఆశపడి విశాఖ మేయర్ పీఠాన్ని కదపాలని చూస్తున్న తరుణంలో అసమ్మతివాదులు గాలితీసేస్తున్నారని మాత్రం క్యాడర్ లోకి వెళ్లిపోయింది. అయినా దానిని తిప్పికొట్టడానికి, అలాంటి వారిని మచ్చిక చేయడానికి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు కూడా హామీలు ఇస్తున్నారని తెలిసింది. దీనితో కార్పోరేటర్లకు సహకరించే నేతలు, వెన్నంటి ఉండి పెట్టుబడులు పెట్టే నేతలు వారు చెప్పినట్టుగా కార్పోరేటర్లను చెప్పుచేతల్లో ఉంచుకొని ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని కూడా కూటమి నేతలు అక్కడక్కడా చెబుతున్నారట. చూడాలి అవిశ్వాసంలో బలపరీక్ష సమయంలో ఎవరు ఎవరి బలం ఏ విధంగా ప్రదర్శిస్తారనేది..?!!

visakhapatnam

2025-04-08 00:00:03

ఆయుష్ లో సర్వీస్ రూల్స్ అతిక్రమణ..! విశాఖలో ఇన్చార్జి ఆర్డీడిని సేవ్ చేయడానికేనా..?

ఆయుష్ శాఖ లో జిల్లా అధికారులు అభ్యంతరం లేకుండా కావాలనే తప్పులు చేయొచ్చు.. దళిత మహిళా ఉద్యోగులపై చేయి చేసుకోవ చ్చు.. అవకాశం ఉంటే తన్నొచ్చు.. దళిత వైద్యులను మాలనాకొడకా.. మాదిగ నా కొడకా అని తిట్టేయవచ్చు.. టార్గెట్ పెట్టుకొని ఉద్యోగుల ఉద్యోగులను ఇష్టమొచ్చినట్టు వేధించవచ్చు..  రోస్టర్ పాయింట్లను కాదని , సీనియారిటీలో వున్న వైద్యులను పక్కకి నెట్టేసి కాసులు చెల్లించి అడ్డదారిలో  ఇన్చార్జి ఆర్డీడి కూడా అయిపోవచ్చు.. ఇక్కడ కేవలం డబ్బులంటే ఏ పనైనా అయిపోతుంది..అందునా ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహాకులు పైరవీలు చేస్తే వైద్యఆరోగ్యశాఖ నుంచి ఆయుష్ కమిషనరేట్ లోని అధికారుల వరకూ జీ హుజూర్ అనాల్సిందే.. 

ఈ ఆయుష్ శాఖలో సర్వీస్ రూల్స్ లేవు.. వాటి అమలు లేదు జరగదు కూడా.. ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైన అధికారులు లాంగ్ లీవ్ లోకి పంపించే దైర్యం కూడా ఆయుష్ లోని కమిషనర్ గానీ..వైద్యఆరోగ్యశాఖలోని ముఖ్యకార్యదర్శి గానీ చేయలేరు.. లిఖితపూర్వకంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కనీసం పల్లెత్తి మాట కూడా అనలేని దుస్థితి.. కారణం మామూళ్లు.. అంతకు మించి పైరవీలు.. వెరసి దళిత మహిళా ఉద్యోగులకు అవమానం.. దళిత వైద్యులకు వేధింపులు.. చేసిన తప్పులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా.. కమిషనరేట్ అధికారులు విశాఖ జోన్-1 ఇన్చా ఆర్డీడిపై చర్యలు తీసుకోవడం లేదంటే ఏ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు..! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆయుష్ శాఖలోని వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రూల్స్ ని కావాల్సిన వారికోసం అడ్డగోలుగా వినియోగిస్తున్నారు కమిషనరేట్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు.  పైసలిస్తే సర్వీసు రూల్స్ కూడా తప్పు చేసిన వారికే అనుకూలంగా ఉంటాయని రుజువు చేసి మరీ చూపిస్తున్నారు. మధ్య మధ్యలో చేయితడిపినందుకు  తప్పుకి దొరక్కుండా ఫిర్యాదులొచ్చిన అధికారులకు మెమోలు ఇచ్చి విచారణ నీరుగారిపోయేదాకా సా..గ దీస్తున్నారు తప్పితే కనీసం విచారణ చేయకపోగా.. సర్వీసు నిబంధనలను అమలు చేస్తూ.. దళిత మహిళా ఉద్యోగిపై చేయిచేసుకున్నపై కేసుపై ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు అయినా విశాఖ ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై చర్యలు తీసుకోలేదు. అదేమంటే ఇది ఆ ప్రైవేటు ఐఏఎస్ స్లడీ సర్కిల్ నిర్వాహకుడు ప్రభావితం చేస్తున్న కేసు.. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన ఆదేశాలొస్తే తప్పా.. సర్వీసు నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు అయిన అధికారిణిపై చర్యలు తీసుకోలేం.

 ఇదంతా పెద్దల లాబాయింగ్.. ఇందులో చాలా మందితోపాటు ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆయుష్ కమిషనరేట్ అధికారులు చేతులెత్తేస్తున్నారు.  అంతెందుకు ఒక జిల్లా అధికారిపై పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన తరువాత సదరు ఉద్యోగినిని లాంగ్ లీవ్ పై పంపించాలి.. ఆపై ఇన్చార్జి పోస్టులో ఉన్నవారి ఆర్డర్లు రద్దు చేసి మరో అధికారిని సదరు అధికారి స్థానంలో నియమించాలి. కనీసం ఆ పని చేయడానికి కూడా ఆయుష్ కమిషనర్ దగ్గర నుంచి అధికారులు వరకూ దైర్యం చేయలేకపోతున్నారంటే.. ఏ స్థాయిలో లాబీయింగ్ విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.లక్ష్మీభాయ్ విషయంలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చునని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఇక్కడ దళిత వైద్యులను కులంపేరుతో దూషించినా.. మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకొని వేధించినా.. పోలీసు కేసు నమోదు అయినా.. కేసులు పెట్టిన వారిని కావాలంటే బెదిరించగలం కానీ..

తప్పుచేసిన వారిని ఏమీ చేయలేమని.. ఆమె వెనుక బలమైన వ్యక్తులు, ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సెంటర్ నిర్వాహకులు పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారని అధికారులు కూడా వెనుకడుగు వేస్తున్నారని.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని.. తప్పు చేసిన అధికారిణిపై చర్యలు తీసుకోవడానికి సర్వీసు రూల్స్ లో నిబంధనలున్నా.. ఆమె చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ తాము ఆందోళనకు దిగుతున్నామని దళిత సంఘాల నేతలు ప్రకటించారు.  విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా. ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన తప్పులు ఆయుష్ కమిషనరేట్, వైద్యఆరోగ్యశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోని అధికారులకు ఎందుకు కనిపించలేదో ఒక్కసారి వరుస క్రమంలో తెలుసుకుంటే..  సర్వీసు నిబంధనలను అతిక్రమించి సీనియారిటీ లిస్టులో అట్టడు స్థానంలో ఉన్న ఈమె సర్వీసు నిబందనలు అతిక్రమించి అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడిగా పోస్టింగ్ సంపాదించడం,

ఆమెకు కమిషనరేట్ అధికారుల వత్తాసు..  సుమారు 30 ఆయుష్ డిస్పెన్సరీలను కావాలని డోర్ లాక్ చేయించి  విశాఖ జిల్లా పరిషత్ మీటింగ్ హాలుతో ఉదయం 11 గంటకి వైద్యుని  రిటైర్ మెంట్ ఫంక్షన్లు, సన్మానాలు చేయించుకోవడం.. చేసిన తప్పును నుంచి బయట పడటానికి వైద్యులే తప్పుచేసినట్టుగా.. మళ్లీ ఆ తప్పు మరెప్పుడూ చేయమన్నట్టుగా వైద్యులతోనే లిఖిత పూర్వకంగా  సంజాయిషీ లేఖలు రాయించడం...  దళిత వైద్యులు పనిచేసే డిస్పెన్సిరీలకు వెళ్లి కావాలనే దళిత వైద్యులను మాలనాకొడకా.. మాదిగనాకొడకా అని కులం పేరుతో దూషించడం, ఉద్యోగులు కావాలని వేధించడం, విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో పనిచేసే దళిత మహిళా జూనియర్ అసిస్టెంట్ సుష్మాపై చేయి చేసుకోవడంతోపాటు కులం పేరుతో దూషించడం,

సదరు ఘటనపై విశాఖ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన సమయంలో ఆయుష్ కమినరేట్ నుంచి చేయిచేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి, జూనియర్ అసిస్టెంట్లను లాంగ్ లీవ్ పై వెళ్లిపోమంటే.. జూనియర్ అసిస్టెంట్ లీవులోకి వెళ్లిపోయినా.. ఇన్చార్జి ఆర్డీడి మాత్రం తనకి లిఖిత పూర్వకంగా ఆర్డర్ వస్తే తప్పా సెలవు పెట్టేది లేదని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్సు వేస్తూ ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహించడం.. వైద్యులకు, ఇతర సిబ్బందికీ సెలవులు మంజూరు చేయడం.. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసుపెట్టిన వారికి, దళిత వైద్యులు చేసిన ఫిర్యాదుల విషయంలో మిగతా వైద్యులు, సిబ్బంది తనకు అనుకూలంగా పనిచేయాలని చెప్పడం,

 అధికారులను, సిబ్బందిని, ఆయుష్ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి, తనకు అనుకూలంగా లేకపోతే ఎలాగైనా సక్రమంగా విధులకు రాని మీ అందరి విషయాలు కమిషనరేట్ లో బయట పెడతానని బెదిరించడం, ఆయుష్ కమిసనర్ డి. ముంజులకి ఏమీ రాదని.. తాను ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో పనిచేశానని.. జీఓలన్నీ తానే చేసేదానినని తనకు పెద్ద బ్యాగ్ గ్రౌండ్ ఉందని.. ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులతో కమిషనరేట్ లో పైరవీలు చేయించడం.. ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత సర్వీసు నిబంధనల ప్రకారం ఇన్చార్జి విధుల నుంచి కమిషనరేట్ అధికారులు తప్పించకుండా పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేయించడం చూస్తుంటే.. తమలాంటి దళితలకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని దళిత వైద్యులు, సంఘాల ప్రతినిధులు, వేధింపులకు గురైన వైద్యులు, ఇన్చార్జి ఆర్డీడి చేతలో దెబ్బలు తిన్న దళిత ఉద్యోగిణి ప్రశ్నిస్తున్నారు.

పైగా ఇదే విషయమై జాతీయ ఎస్సీ కమిషన్, లోకాయుక్తా, స్టేట్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదులు చేసినా.. కనీసం చర్యలు తీసుకోలేదంటే ఏ స్థాయిలో సదరు ఇన్చార్జి ఆర్డీడి చేస్తున్న పైరవీలు కనిపించడం లేదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో ఆయుష్ కమిషనర్ డి.మంజులను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నించగా.. విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ విషయంలో విచారణ ఇంకా కొనసా..గుతుందని.. ఇటీవలే మెమోలు జారీ చేశామని.. ఎవరూ లేకనే ఆమెనే ఇంకా ఇన్చార్జి ఆర్డీడిగా కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. లాంగ్ లీవ్ పై వెళ్లమని మౌఖిక ఆదేశాలొచ్చినా ఎందుకు వెళ్లకుండా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేస్తూ పనిచేస్తున్నారని.. దానికి ఏ విధంగా సమర్ధిస్తున్నారని.. అది సర్వీస్ రూల్స్ కి విరుద్దం కాదా అని..? 

సర్వీసు నిబంధనలు అమలు చేసి ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తే.. ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ ఇంకా రాలేదని.. వచ్చిన వెంటనే తాము ఏమి చేస్తున్నామో మీడియాకి చెబుతామని బదులిచ్చారు. అంతవరకూ విచారణ కొనసా...గుతున్నట్టుగానే బావించాలని స్పష్టం చేశారు. దీనిని బట్టి ఆయుష్ శాఖలో దళిత వైద్యులకు, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా..  అధికారులు చేతిలో తన్నులు తిన్నా.. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఎఫ్ఐఆర్ లు నమోదైనా తప్పుచేసిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉండవనేది తేలిపోయింది..?!

visakjha

2025-03-15 21:49:35

కూటమి పరువు తీస్తున్న ఆయుష్.. ఆ కేసు నీరు గార్చేందుకుకేనా..?!

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పరువుని.. పరిపాలనాపరమైన అంశాల విషయంలో ఆయుష్ శాఖ ప్రభుత్వం పరువు తీస్తున్నట్టుగానే కనిపిస్తున్నది.. దళితులకు, దళిత ఉద్యోగులకు ఓ ప్రక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ లుపెద్ద పీట వేస్తుంటే.. ఆయుష్ శాఖలో మాత్రం అడ్డదారిన ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చేసిన డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ దళిత కార్యాలయ ఉద్యోగిపై చేయిచేసుకోవడంతోపాటు, కులం పేరుతో దూషించినా ఆయుష్ కమిషనర్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు నోరు మెదపడం లేదు.. పైగా ఇదేశాఖలోని వైద్యులను వేధిస్తున్నవిషయంపైనా.. మాలనాకొడుకులు.. మాదిగ నా కొడుకులు అని కులం పేరుతో దూషించిన విషయమై దళిత వైద్యులు చేసిన ఫిర్యాదుపైనా అతీ గతీ లేదు.. అంతేకాదు.. నేరుగా విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా పరిపాలనాపరమైన విచారణ నేటికీ చేయలేందంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు..!

ఏ ప్రభుత్వ శాఖలోనైనా.. విధి నిర్వహణ సమయంలో డిస్పెన్సరీలు మూయించేసి.. ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్  సమావేశ మందిరంలో రిటైర్ ఫంక్షన్ చేస్తారా..? అలా చేసిన జిల్లా అధికారిని సర్వీసు నిబంధనలు ఉల్లంగించి ప్రవర్తించిన విషయంలో రాష్ట్ర కార్యాలయం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంతేకాకుండా.. ఎక్కడైనా ఒక క్రింది స్థాయి మహిళా ఉద్యోగిని ఇన్చార్జి జిల్లా అధికారిగా ఉన్నవారిపై చేయి చేసుకుంటారా..? ఇలా ఎక్కడైనా జరుగుతుందా..? ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడిని దళిత వైద్యులు ఎక్కడైనా లైంగికంగా వేధించే దర్యం చేస్తారా..? అసలు ఇది జరిగే పనేనా..? సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్న ఉద్యోగి.. సీనియర్ అసిస్టెంట్ నే ఎదిరించి మాట్లాడలేరు..

 అలాంటిది ఒక మహిళా దళిత ఉద్యోగి తనను కొట్టిందని బట్టలు చించేసుకుంటే దానిని రాష్ట్ర అధికారులు, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు నమ్మేస్తున్నారంటే అసలు ప్రాధమిక స్థాయి విచారణ పరిపాలన ఎక్కడికి పోతున్నట్టు..? అని వాపోతున్నాయి వైద్యఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ వర్గాలు. కులం పేరుతో దూషించి, వేధించడంతో వేధనతో ఆయుష్ కమిషనర్  డి.మంజుల, ప్రిన్సిప్ సెక్రటరీ ఎంటీ.క్రిష్ణబాబుకి దళిత వైద్యులు ఫిర్యాదు చేస్తే.. గతంలో ఇక్కడే పనిచేసిన ప్రస్తుతం ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి తిరిగి ఎవరైతే తనపై ఫిర్యాదు చేశారో అదే వైద్యులపై తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే మాత్రం కమిషనరేట్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ద పడిపోతున్నారని.. 

కానీ దళిత ఉద్యోగిని కొట్టి.. కులం పేరుతో దూషించి స్థాయికి మించి కమిషనర్ నే ఎదిరించి మాట్లిడిన వీడియోలు, ఆడియోలు ఆయుష్ కమిషనరేట్  ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే నేటికీ అతీ గతీ లేదు. అంతేకాదు ఈ విషయం పెద్దది కాకుండా ఇద్దరు ఉద్యోగులను లాంగ్ లీవ్ పై వెళ్లిపోమన్న అధికారులు, విశాఖలో ఇన్చార్జి ఆర్డీడిని ఎవరినీ వేయకుండా.. వైద్యులను, సిబ్బందిని వేధించిన అదే అధికారికి అనధికార బాధ్యతలు అప్పగించడం కూడా విస్మయాన్ని కలిగిస్తున్నది. ఇదెక్కడి పరిపాలన అంటే ఆయుష్ శాఖలో ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు ఇక్కడి ఉద్యోగులు. సీనియారిటీ లిస్టులో పేరు లేకపోయినా.. ఇక్కడ అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడిలు అయిపోవచ్చునని... అర్హత ఉన్నవారిని కావాలనే తొక్కిపెట్టి మరీ పోస్టింగ్ ఆర్డర్లు తెచ్చుకోవచ్చుననే విషయం ప్రస్తుతం విశాఖలోని జోన్-1 

ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి విషయంలో రుజువైంది. గత కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన అవకతవకలను కొత్తగా వచ్చిన కమిషనర్ గుర్తించి నివృత్తి చేస్తారనుకుంటే.. అన్నీ వదిలేసి విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. పక్కాగా ఆధారాలు, ఫిర్యాదులు ఉన్న అధికారిణిపై ఆయుష్ కమిషనరేట్ అధికారులు విచారణ చేయకపోవడం, కనీసం ప్రశ్నించకపోవడం, దుమారం రేగుతున్న విషయాన్ని బయటకు రాకుండా ఓ ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు నేరుగా ఆయుష్ కమిషనరేట్ అధికారులు, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో చక్రం తిప్పడం కావాలనే ఇన్చార్జి ఆర్డీడిని బయట పడేయడానికి తెరవెను రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

అంతేకాకుండా ప్రస్తుతం  విధుల్లో వైద్యులను, సిబ్బందిని సెలవులో ఉంటూనే తనకి సహాయం చేయాలని ఫోన్లు చేసి ఇన్చార్జి ఆర్డీడి బ్రతిమిలాడుతున్నారట. త్వరలో విచారణ జరుగుతుందని..అపుడు అందరూ దళిత వైద్యులు, దళిత ఉద్యోగికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి ఆర్డీడి మాటలు విన్న వైద్యులకు, డిస్పెన్సరీ సిబ్బందికి ఎన్ని సెలవులు కావాలంటే అన్ని సెలవులు మంజూరు చేస్తున్నారు ఇన్చార్జి ఆర్డీడి. అదే దళిత వైద్యులు, ఫిర్యాదుచేసిన వారిలో ఏ ఒక్క వైద్యుడు సెలవు అడిగినా వారికి మాత్రం ఒక్క సెలవు కాదు కదా.. పదినిమిషాల పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని వైద్యులు వాపోతున్నారు.  మరోప్రక్క బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్, లోకాయుక్తాకి కూడా ఫిర్యాదు చేశారు. 

ఇంత జరుతున్నా ఆయుష్ కమిషనర్ మాత్రం ఇన్చార్జి ఆర్డీడి విషయంలో కనీసం విచారణ ఎందుకు చేయడం లేదని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నిస్తే.. ప్రస్తుతం రాష్ట్రకార్యలయంలో విచారణ జరుగుతుందని.. ప్రభుత్వంలో ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలంటే సర్వీసు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఇంకా ఇన్చార్జిగా కొనసాగుతున్నారా..? ఆమె కొనసాగుతున్నారని ఇంకా ఎవరినీ ఆమె స్థానంలో నియమించలేదున్నారు. అంతేకాకుండా ఏదైనా, ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై ఏదైనా చర్యలు తీసుకుంటే ముందుగా మీడియాకి తెలియజేస్తామని కమిషనర్ డి.మంజుల వివరణ ఇచ్చారు.

visakhapatnam

2025-03-06 21:22:09

ఆయుష్ లోనూ అమ్ముడు పోతున్నారు..?! సీన్ లోకి ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు

ఆయుష్ శాఖలో డబ్బున్నవాడితే రాజ్యం.. పలుకుబడి ఉంటే తప్పులు చేసినా అన్నీ ఒప్పులైపోతాయ్.. చేసిన తప్పులకు ఆధారాలున్నా కనీసం ప్రాధమిక విచారణ కూడా చేయరు.. అంతేకాదు.. అవసరం అయితే ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ ల పిల్లలు శిక్షణ పొందే ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కూడా రంగంలోకి దిగిపోతారు.. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకూ అందరిని మేనేజ్ చేసేస్తారు.. ఫలితంగా విషయం పక్కదారి పట్టి.. ఆయుష్ కమిషనర్ ను ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు.. అదేమంటే పై నుంచి హెవీ ప్రజర్ అంటారు..కేసును మొత్తం నీరుగార్చేస్తారు..!

విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన  ప్రతీ తప్పుకీ ఆయుష్ కమిషనర్ డి. మంజుల వద్ద ఆధారాలున్నాయి.. వాటిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి.. దళిత ఉద్యోగిపై చేయి చేసుకున్న ఫిర్యాదు, పీఎంపాలెం స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేను నమోదైన ఎఫ్ఐఆర్, విధినిర్వహణలో డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ డిస్పెన్సరీలన్నీ మూసేసి మరీ విశాఖలోని జిల్లా పరిషత్ లో చేయించుకున్న సన్మానాలు.. దళిత వైద్యులను కులం పేరుతో దూషించిన అంశంపై ఫిర్యాదులు.. విధి నిర్వహణ పేరిట ఉద్యోగులు, వైద్యులను బెదిరించి, భయపెట్టిన ఫిర్యాదులు అన్నీ ఆయుష్ కమిషనర్ దగ్గరే ఉన్నాయి.. అదేంటో నేటికీ జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడిపై చిన్న విచారణ కూడా జరపలేదంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. 

అసలు ఈమె విషయంలో ప్రైవేటు ఐఏఎస్ శిక్షణా సంస్థలకు చెందిన వారు మధ్యలోకి రావడం ఏంటి..? వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ సిబ్బంది ఏక పక్షంగా ఈమెకే వత్తాసు పలకడం ఏంటి..? నన్ను ఎవరూ ఏమీ చేయలేరని కావాలని చేసిన తప్పులన్నీ ఏమైపోయాయి..?  అంటే తప్పులన్నీ అందరూ మరిచి పోతారని లాంగ్  లీవ్ పై వెళ్లమన్న ఆయుష్ కమిషనరేట్ అధికారులు అన్ని తప్పులు చేసిన ఈమె మాత్రం విచారణ చేయకపోవడం చేస్తుంటే ఏ స్థాయిలో యావత్ వైద్య ఆరోగ్యశాఖ ను మేనేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే అసలు ఆయుష్ కమిషనర్ కే ఏమీ తెలీదు జీఓలు, పరిపాలనా నేను చెప్పినట్టే జరుగుతుందని మీటింగ్ లో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ లు ఉన్నా అధికారులు నోరు మెదపడం లేదంటే ఇందకంటే మనీ మేనేజ్ మెంట్.. అఫిషియల్ పొలిటికల్ మేనేజ్ మెంట్ మరొకటి వుంటుందా..అనేది తేలాల్సి వుంది. 

జోన్-1 ఆయుష్ ఇన్చార్జి  డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో జరుగుతున్న తాత్సారం విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ ఆయుష్ కమిషనర్ మంజులను వివరణ కోరగా.. ఇంకా త్వరలోనే విచారణ వేస్తామని తీరుబడిగా చెబుతున్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులున్నాయి కదా అంటే.. అవన్నీ పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే విచారణ చేయడం మాత్రం పక్కగా ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చారు. అంతేకాదు సదరు ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులకి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే లిఖితపూర్వకంగా చేస్తే వాటిపై పరిశీలన చేస్తామని వివరణ ఇచ్చారు. అంతే తప్పా తప్పులన్నీ డైరెక్టుగా కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు.. కనీసం విచారణ కూడా చేయలేదంటే మాత్రం మాట దాటవేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఇప్పటికే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఓ మంత్రి పేషీ అధికారులు, ఒక ప్రైవేటు ఐఏఎస్ శిక్షణా సంస్థ(ఇందులోనే సీనియర్ ఐఏఎస్ అధికారి పిల్లలు శిక్షణ పొందుతున్నారు) 

నిర్వాహకుడు అందరూ ఉన్నారని.. ఆ కారణంగానే సదరు ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులన్నీ ఆధారాలతో ఉన్నా ఏమీ వేన్నట్టుగా.. ఆమె చాలా మంచి ఇన్చార్జి ఆర్డీడి కితాబు ఇస్తున్నారట. ఇదే కదా దళితులుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయడమంటే.. ఇదే కదా దళిత వైద్యులను కులం పేరుతో దూషించినా ఇన్చార్జి ఆర్డీడిని పల్లెత్తు మాటనకపోవడం. బహుసా ఇంతటి సహకారం అన్యాయానికి గురైన మహిళా దళిత ఉద్యోగిని, దళిత ఆయుష్ వైద్యులకు కమిషనరేట్ నుంచి అందివుంటే నిజంగా ప్రభుత్వ పరిపాలనపై నమ్మకాలుండేవి..చూడాలి వాస్తవాలను ఇంకా ఎన్నేళ్లు కప్పిపుచ్చుతారనేది..?!

visakhapatnam

2025-03-03 20:40:02

4 రోజులుగా నానుస్తున్నారు..?! -జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడిపై కేసు నమోదు చేయని పోలీసులు

వడ్డించేవాడు మనోడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరిలోకి అన్నీ వచ్చిచేరతాయ్..అలాగే విశాఖలోని జోన్-1 ఆయుష్ ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చెప్పినట్టుగా పోలీసు, రెవన్యూ, కమిషనరేట్ ఆయుష్ అధికారులు వింటున్నప్పుడు.. అన్యాయమైపోయిన దళిత ఉద్యోగులకు, వైద్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది..? దళిత వైద్యులను మాల నాకొడుకూ, మాదిగనా కొడుకు అని తిట్టారని స్వయంగా వైద్యులే కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.. అదే ఇన్చార్జి ఆర్డీడి విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో దళిత ఉద్యోగిపై చేయిచేసు కున్నారు.. దుర్భాలాడారు.. తమను కులం పేరుతో దూషించారని పీఎంపాలెం పోలీసు స్టేషన్ లో ఫిబ్రవరి 19న ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టాలని ఫిర్యాదు చేస్తే నేటికీ అతీ గతీలేదు.. విచారణ పేరుతోనూ, ఉద్యోగి బంధువులను బెదిరింపులకు పాల్పడుతూ కేసుని నానుస్తూ నీరు గార్చే స్తున్నారు తప్పా.. ఒక క్రింది స్థాయి ఉద్యోగి జిల్లా అధికారిణిపై ఏ విధంగా తిరగబడి, చేయిచేసుకుంటుందని కనీసం ఆలోచించకుండా దళిత ఉద్యోగి ఫిర్యాదును పట్టించుకోలేదు. తమకు జరిగిన అన్యాయంపై విశాఖ నగర సిపీ డా.శంఖబ్రత బాగ్జీ ఉన్న పోలీస్ కమిషనరేట్ పరిదో కూడా న్యాయం జరగకపోవడంతో.. బాధితులు లోకాయుక్తాను ఆశ్రయించారు..!

విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ ఈనెల 19న దళిత ఉద్యోగిని ఆర్డీడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుష్మాను కొట్టి, కులం పేరుతో దూషించిన కేసు విషయంలో నాలుగు రోజులుగా హైడ్రామ నడుస్తున్నది తప్పితే పోలీసులు కేసు నమోదు చేయడంలేదు. కష్టమంటూ పోలీసు స్టేషన్ మెట్లక్కితే.. నేనున్నాంటూ అభయమిచ్చే నగర పోలీస్ కమిషనర్ డా.శంఖభ్రతబాగ్జీ ఉన్న కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఒక దళిత మహిళ ఉద్యోగి పెట్టిన కేసుపై మీన మేషాలు లెక్కిస్తున్నారు. మరో వైపు ఎలాగైనా ఈ కేసును నీరుగార్చి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేయాలని ఇన్చార్జి ఆర్డీడి అన్ని దారులు వెతుకుతున్నట్టు సమాచారం. అంతేకాదు పోలీసుల విచారణలో సైతం చేసిన తప్పుపై ప్రశ్నిస్తుంటే పొంతన లేని సమాధారాలు చెబుతున్నారట. ఇలా ఆమెపై పెట్టిన కేసు విషయంలో నాలుగు రోజులు తాత్సారం చేస్తూ వస్తూ బాధిత దళిత ఉద్యోగిని ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ.. అట్టు జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిప్పుతున్నారు. 

దీనితో విసుగు చెందిన దళిత ఉద్యోగిని లోకాయుక్తాకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకు వెళతానని ఆవేదనతో చెబుతున్నారు బాధిత ఉద్యోగిని. తమను కులం పేరుతో దూషించి కొట్టడమే కాకుండా తమపై లేని పోని కేసులు పెట్టించి తమను, తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కూడా వాపోతున్నారు. మహిళలకు, అందునా దళిత మహిళలకు అన్యాయం జరిగిందని.. నగరంలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేటికీ అతీ గతీ లేదని చెబుతున్నారు. ఎన్నిరోజులు తాము సెలువులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టు తిరగాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాట్సప్ లో ఫిర్యాదు పెడితే స్వయంగా నగర పోలీస్ కమిషనర్ స్పందిస్తున్నారని..కానీ స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా.. మాకు అన్యాయం జరిగిందని బోరున విలపించినా.. బెదిరిస్తున్నారు.. రాజీ చేసుకోమంటున్నారు తప్పితే పోలీస్ కేసు మాత్రం నమోదు చేయడం లేదని చెబుతున్నారు. 

-కాలయాపన సమయంలో సిబ్బందిపై తిరిగి ఫిర్యాదులు
ఆయుష్ లో దళిత ఉద్యోగిని సుష్మనిపై  చేయిచేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై పెట్టిన కేసుపై పోలీసులు కేసుకట్టకుండా తాత్సారం చేస్తున్న సమయంలో ఉద్యోగులపై ఇన్చార్జి ఆర్డీడి మరోఫైల్ తయారు చేసి వైద్యఆరోగ్యశాఖకు పంపించారు. అంటే ఇక్కడ తనపై కేసుపెట్టిన వారిని ఏ విధంగానైనా శాఖాపరంగా ఇరికించడానికే ఇన్చార్జి ఆర్డీడికి అటు రెవిన్యూ అధికారులు, ఇటు పోలీసులు, మరోవైపు ఆయుష్ కమిషనరేట్ అధికారులు సహాయం అందిస్తున్నట్టు పక్కాగా తేలిపోతున్నది. అంతేకాకుండా తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని తన అనుకూల మీడియా ద్వారా ఇన్చార్జి   ఆర్డీడి ఈలోగా ప్రచారం కూడా చేయించుకుని ఆ  పేపర్ క్లిప్పింగులనే అధికారులకు పంపడంతోపాటు, ఆయుష్ ఉద్యోగులు తప్పు చేస్తున్నారని.. దానిపై తాను విచారణ చేస్తున్నాననే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి కొత్త డ్రామాకి తెరలేపారు. 

దానితో దళిత ఉద్యోగికి జరిగిన అన్యాయంపైనా.. జిల్లా అధికారి క్రింది స్థాయి సిబ్బందిని విధినిర్వహణలో ఉన్న సమయం చేయిచేసుకొని కులం పేరుతో దూషించినా ఏ ఒక్క మీడియాలోనూ వాస్తవాలు బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు ఇన్చార్జి ఆర్డీడి. ఇపుడు కూడా వాస్తవాలు బయటకు రాకుండా జరుగుతున్న తంతు మీడియాలో రాకుండా తనదైన రీతిలో నిలుపుద చేయించుకోగలుగుతున్నారు. విచారణ విషయంలో ఓ మంత్రి వద్ద పీఏగా పనిచేస్తున్నవ్యక్తి, ఓ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కమిషనరేట్, పోలీసులను ప్రభావితం చేస్తున్నారని తెలిసింది. 

-ఇన్చార్జి ఆర్డీడిపై ఫిర్యాదులున్న కనీసం స్పందించలేదు
విశాఖలోని ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై దళిత వైద్యులు, సిబ్బంది నేరుగా కమిషనర్ డి.మంజుల కే లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అలా ఫిర్యాదు చేసినందుకు వైద్యులంతా కలిసి తనను లైంగికంగా వేధిస్తున్నారని కూడా తిరిగి ఫిర్యాదు చేశారు ఇన్చార్జి ఆర్డీడి. ఒక జిల్లా అధికారిణిపై క్రింది స్థాయి ఉద్యోగులుగానీ, సిబ్బంది గానీ లైంగికంగా ఏవిధంగా వేధిస్తారు.. ఏవిధంగా తిరిగి చేయిచేసుకుంటారనే కనీసం ఆలోచంచడం లేదు అటు కమిషనర్, ఇటు విశాఖలోని పోలీసులు. పైగా ఇన్చార్జి ఆర్డీడికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. కేసుని గత నాలుగు రోజులుగా నానుస్తూ వస్తున్నారు తప్పితే ఎఫ్ఐఆర్ ఫైలు చేయలేదు. ఆయుష్ శాఖలో తనకు తిరుగు లేదని, తనని ఎవరూ ఏమీ చేయలేరని.. బహిరంగంగానే సవాల్ చేసిన ఇన్చార్జి ఆర్డీడి ఇటీవల జోన్ లోని అన్ని డిస్పెన్సరీలను మూయించేసి.. జిల్లా పరిషత్ లో డ్యూటీ సమయంలో ఒక వైద్యుని ఉద్యోగ విరమణ కార్యక్రమం కూడా చేశారు. 

అంతేకాకుండా ఆ విషయం మీడియా ద్వారా  బయటకు రావడంతో.. ఎక్కడ తాను ఇరుక్కుపోతానోనని భావించిన ఇన్చార్జి ఆర్డీడి తమకు తెలీకుండా వచ్చామని.. ఇకపై అలా విధినిర్వహణ సమయంలో రామని అదే కార్యక్రమానికి వచ్చిన వైద్యులందరితోనూ క్షమాపన లేఖలు కూడా రాయించారు. విచిత్రం ఏంటంటే ఆ విషయం కూడా మీడియా ద్వారా బయటకు వచ్చేసింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సీనియర్ వైద్యులు ఉండగా ఎక్కడో అట్టడుగున్న ఉన్న ఈమెకు గత ఆయుష్ కమిషనర్ ఇన్చార్జి ఆర్డీడి బాద్యతలు అప్పగించారు. అప్పటి నుంచి వైద్యులపై తన పవర్ ను చూపిస్తూ.. ఆయుష్ లో అంతా నేనే అన్నట్టుగా వ్యహరిస్తున్నారు ఇన్చార్జి ఆర్డీడి. ఈ విషయం కమిషనరేట్ అధికారులకి, సాక్షాత్తూ కమిషనర్ దృష్టికే వెళ్లినా తనని ఎవరూ చేయలేరని.. బీరాలు పోతూ దళిత ఉద్యోగులపై చేయి చేసుకునే వరకూ వచ్చారు.

 ఇక్కడ కూడా తన పలుకుబడిని వినియోగించి కేసు నమోదు కాకుండా చేసుకోవడంలో సఫలీ కృతులు అవుతున్నారు. చేసిన తప్పులు క్లియర్ గా కనిపిస్తున్నా.. దళిత వైద్యులు, సిబ్బంది లిఖిత పూర్వక ఫిర్యాదులున్నా.. విశాఖలో పోలీసులు మాత్రం దళిత ఉద్యోగిణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేయడం లేదు. బహుసా లోకా యుక్తా అయినా ఈ దళిత ఉద్యోగినికి, వైద్యులకు న్యాయం జరుగుతుందని భావించి దానిని ఆశ్రయించారేమో. చూడాలి ఇప్పటికైనా ఆయుష్ లో దళిత ఉద్యోగులకి, వైద్యులకి ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఏం జరుగుతుందనేది..?!

visakhapatnam

2025-02-22 07:47:54

మాల.. మాదిగనా కొడుకులని తిడుతున్నారండీ..! ఇన్చార్జి ఆర్డీడిపై కమిషనర్ కి దళిత వైద్యులు ఫిర్యాదు

మాల, మాదిగనా కొడుకుల్లారా.. మీ సంగతి చూస్తా..నేను చెప్పినట్టు చేయకపోతే మీరు ఏవిధంగా డ్యూటీలు చేస్తారో చూస్తాను.. మీకు జీతాలు ఎలా వస్తాయో చూస్తాను.. మీరు రాయిస్తే ఒకటి అరా పత్రికల్లో రాయించగలరు.. నేనుు తలచుకుంటే నా అనుకుల మీడియా ద్వారా ఏమైనా రాయించగలను.. నాతో పెట్టుకోవద్దు.. అయినా దళిత డాక్టర్లు, సిబ్బందీ మీకు కూడా అంత పౌరుషమా.. నాపైనే మీడియాలో నేను చేసినవన్నీ రాయిస్తారా..? మీ సంగతి చూస్తా..నేనే ఇక్కడ ఇన్చార్జి ఆర్డీడిగా ఉంటా..? ఎవరు ఏం చేస్తారో చూద్దాం.. ఏం పీకుతారో అదీ చూస్తాను.. నాకంటే సీనియర్లు ఎంతమంది ఉన్నా నేనే ఇన్చార్జి ఆర్డీడీగా రాగలిగానంటే నా రేంజ్ ఏంటో మీకు తెలియడం లేదు.. ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. జిల్లా కార్యాలయంలో దళిత ఉద్యోగిణిపై చేయిచేసుకోవడంతోపాటు.. వైద్యులను కూడా కులం పేరుతో దూషిస్తున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ వైద్యులు, సిబ్బందిపై కురిపిస్తున్న తిట్ల దండకంపై వైద్యులు లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదు అంశాలు..!

 విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఇన్చార్జి ఆర్డీడి డా. ఝాన్సీ లక్ష్మీభాయ్ పై దళిత వైద్యులు, కార్యాలయ సిబ్బంది, బిసి సామాజిక వైద్యులు ఆయుష్ కమిషనర్ డి.మంజుల కి తమను కులం పేరుతో దూషిస్తూ వేస్తున్నారంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా దళిత వైద్యులను, మాదిగనా కొడుకు, మాలనా కొడుకూ అంటూ సంభోదిస్తూ.. జిల్లా కార్యాలయంలోని సిబ్బంది ముందు అవహేళన చేస్తూ.. కించ పరుస్తూ మాట్లాడుతున్నారనే విషయాన్ని ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో దళిత ఉద్యోగిణి సుష్మపై చేయిచేసుకోవడంతోపాటు, కులం పేరుతో దూషించిన వ్యవహారంలో పీఎంపాలెం పోలీసు స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ  కేసు వ్యవహారం నడుస్తుంది.  

అదే సమయంలో వైద్యులు కూడా నేరుగా అమరావతిలోని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతోపాటు దానిని సీఎం కార్యాలయం, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయం, ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పంపిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. ఇన్చార్జి ఆర్డీడి ఉంటూ సీనియర్ దళిత వైద్యులను కులం పేరుతో దూషించడాన్ని వైద్యులు, సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వశాఖల్లోనూ అందునా ప్రజలకు వైద్యసేవలు అందించే వైద్యులను అంటరాని వాళ్లగా ఇన్చార్జి ఆర్డీడి చూటడం, నోటికొచ్చినట్టు తిట్ల దండకాన్ని తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. ఎంత దళిత వైద్యులం అయితే మాత్రం తమను ఈ విధంగా తిడతారా..? సంబోధిస్తారా..? మాకు న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులుగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా అని తమ ఆవేదనను కమిషనర్ ముందు ఉంచారు. 

అంతేకాకుండా తాము లైంగిక పరమైన వేధింపులు చేస్తున్నామని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఒక జిల్లా అధికారిణిని క్రిందిస్థాయి వైద్యులు లైంగికంగా ఏ విధంగా వేధిస్తారనే విషయాన్ని కమిషనర్ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ.. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని, తన అనుకూల మీడియాని వెంటపెట్టుకొని డిస్పెన్సరీలకు వచ్చి.. వారిముందే తమను దుర్భాషలాడుతున్నారని, నానా హడావిడీ చేస్తున్నారని కూడా ఫిర్యాదులో పొందు పరిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రాజకీయ నాయకులను, కలవడంతోపాటు ఎన్నికల విషయమై చర్చలు జరుపుతూ ఎన్నికల కోడ్ ని కూడా ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. 

తమపై ఇన్చార్జి ఆర్డీడి చేస్తున్న వేధింపులు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న కార్యకలాపాలపైనా సమగ్ర విచారణ జరపడంతోపాటు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని.. రానున్న రోజుల్లో దళిత వైద్యులు, సిబ్బందిని మానసిక ఇబ్బందులకు గురిచేయకుండా న్యాయం చేయాలని వైద్యులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్, లోకాయుక్తాకి కూడా ఫిర్యాదులు పంపినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడి దళిత ఉద్యోగిపై చేయి చేసుకోవడంపై దళిత సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి.

-దళిత వైద్యుల ఫిర్యాదు వాస్తవమే-ఆయుష్ కమిషనర్ మంజుల
విశాఖలోని జోన్-1 పరిధిలోని ఆయుష్ వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ కులం పేరుతో దూషించడంతోపాటు,  టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నట్టు వైద్యులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారని ఆయుష్ కమిషనర్ డి.మంజుల ఈరోజు-ఈఎన్ఎస్ కి వివరణ ఇచ్చారు. గతంలోనూ ఈమె వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాయని, మొత్తం అన్ని వ్యవహారాలపైనా విచారణ చేస్తామని, వాస్తవాలు తేలితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు. అదే సమయంలో దళిత ఉద్యోగిని పై చేయిచేసుకున్న వ్యవహారంలో విచారణ చేస్తామని.. విధి నిర్వహణలో ఉద్యోగులపై అధికారులు చేయి చేసుకోవడం సర్వీస్ రూల్స్, సిసిఎల్ఏ రూల్స్ కి విరుద్దమని పేర్కొన్నారు. గతంలో డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వైద్యులందరితోనూ డిస్పెన్సిరీలకి తాళాలు వేయించి విశాఖలోని జిల్లా పరిషత్ హాలులో రోజంతా  కార్యక్రమం చేపట్టిన విషయమై కూడా విచారణ జరుగుతుందన్నారు. అసలు విశాఖలోని జోన్-1 ఆర్డీడి కార్యాలయంలోనూ, ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ఏం చేస్తున్నారనే విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తామని కమిషనర్  పేర్కొన్నారు.



visakhapatnam

2025-02-20 16:16:37

అనుకున్నదొక్కటి.. అయ్యింది ఇంకొక్కటి..?! గేట్లు మూసేసిన విమ్స్ సిబ్బంది

డామిట్ కథ అడ్డం తిరిగింది.. మనం ఒకటి అనుకుంటే విమ్స్ ఆసుపత్రి అధికారులు ఇంకోలా చేశారు.. మధురవాడలోని సొంత కార్యాల యం బాగాలేదని కమిషనర్ ని ఒప్పించి మరీ  ఖాళీచేసేయాలనుకుంటే.. ఆదిలోనే విమ్స్ అధికారులు గాలి తీసేశారు... ఆయుష్ ఆర్డీడి కార్యాలయానికి గదులు ఇస్తామని చెప్పారని తట్టాబుట్టా సర్దేసుకొని వెళితే గేట్లు మూసేసి అవమానించారే.. చఛా అందరి ముందు పరువు పోయింది..నేనేదో దర్జాగా విమ్స్ ఆసుపత్రిలో ఆయుష్ ఆర్డీడి కార్యాలయం పెట్టాలనుకుంటే.. మొత్తానికి అంతా బెడిసి కొట్టింది.. విమ్స్ ఆసుపత్రిలో కార్యాలయం ఇప్పిస్తామని చెప్పిన ఓ మంత్రి కార్యాలయ సిబ్బంది కూడా ఆఖరి నిమిషంలో ప్లేటు తిప్పేయడంతో ఏం చేయాలో తెలీక.. విమ్స్ సిబ్బంది గేట్లు మూసేయడంతో ఇన్చార్జి ఆర్డీడి అనుచరగణం.. కార్యాలయం ప్రారంభ వార్తలు బాగా రాసేద్దామని వచ్చిన అనుకూలా మీడియా చిరాకుతో వెనుతిరగాల్సి వచ్చింది..! 

  
నన్ను ఎవరూ ఆపలేరు.. నేను ఖచ్చితంగా విమ్స్ ఆసుపత్రిలోకి  ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని తరలిస్తాను.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని బీరాలు పోయి తట్టబుట్టా సర్దేసుకొని విమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్, కార్యాలయ సిబ్బంది చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సామాన్లతో విమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లాలని ప్రయత్నం చేయడంతో అక్కడి సిబ్బంది ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఎవరినీ లోనికి పంపవద్దని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో వెంటతెచ్చుకున్న సామాన్లతో తిరిగి మళ్లీ మధురవాడ వెళ్లాల్సి వచ్చింది. మంగళవారం జోన్-1 ఆయుష్ ఆర్డీడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుష్మ అనే దళిత ఉద్యోగిపే చేయి చేసుకోవడం, కులం పేరుతో దూషించడం, ఆమె దళిత సంఘాల నేతలతో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం మీడియాలో వైరల్ అయ్యింది.

 ప్రభుత్వం ఆయుష్ కార్యాలయం ఏర్పాటుకి సొంత స్థలం ఇచ్చి అక్కడ భవనాలు ఏర్పాటుచేస్తే అక్కడ సిబ్బంది, వైద్యులతో గొడవలు పెట్టుకొని నారా రాద్దాం చేసిన ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి విషయం విమ్స్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఇన్చార్జి ఆర్డీడి ప్రయత్నం బెడిసి కొట్టింది.  ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక, లిఖత పూర్వక లేఖలు లేకుండా తానేమీ చేయలేనని.. అందునా ప్రశాంతంగా ఉన్న విమ్స్ ఆసుపత్రిని గొడవలకి వేదికలు చేయడానికి కాదని సామాన్లు తెచ్చిన సిబ్బందితోనే చెప్పించినట్టు తెలిసింది. అయితే విశాఖలోని మధురవాడ ఆర్డీడి కార్యాలయం తరలింపునకు సంబంధించి కమిషనర్ డి.మంజుల ఉత్తర్వులు ఇచ్చారని ఇన్చార్జి ఆర్డీడి కార్యాలయంలోని మొత్తం సామాన్లు.. కార్యాలయ సిబ్బందితో గొడవలు అనంతరం విమ్స్ ఆసుపత్రికి వెళ్లిపోయారు.  

తొలుత విమ్స్ లో రెండు గదులు కేటాయించడానికి అంగీకరించిన విమ్స్ అధికారులు ఆర్డీడి గొడవలు, పోలీసు కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, వైద్యులను తిట్టడం తదితర అంశాలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులు విమ్స్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేట్లు మూసేసి సామాన్లను, ఆయుష్ ఆర్డీడి కార్యాలయ సిబ్బందిని వెనక్కి పంపేశారట. గత్యంతరం లేక మళ్లీ అదే మధురవాడలోని ఆర్డీడి కార్యాలయానికి సర్దేసిన సామాన్లతో వెళ్లాల్సి వచ్చింది. విమ్స్ లో రెండు గదుల కేటాయింపునకి ఒక మంత్రితో సిఫారసు చేయడం ద్వారా గదులు కేటాయించారని.. దానికి కూడా ప్రాపర్ ఛానల్ లో అధికారిక లేకలు లేకపోవడంతో విమ్స్ సిబ్బంది, అధికారులు ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని విమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. 

ప్రస్తుతం బాదితురాలు ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి ఝాన్సీలక్ష్మీభాయ్ పై కేసు పెట్టడంతో వివరణ ఇవ్వడానికి ఆయుష్ కమిషనర్ వస్తారని పోలీస్ స్టేషన్ లో చెప్పడంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా నిలిపి వేసినట్టు సమాచారం అందుతుంది. అయితే విధి నిర్వహణ సమయంలో క్రింది స్థాయి సిబ్బంది..అందునా దళిన సిబ్బందిపై చేయిచేసుకున్న వ్యవహారంలో తానెందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చి వాంగూల్మం ఇస్తానని ఆయుష్ కమిషనర్ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఆయుష్ కార్యాలయంలోని దళిత ఉద్యోగిపై చేయిచేసుకున్న విషయంలో ఆయుష్ శాఖ ఇన్చార్జి ఆర్డీడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయితే డిపార్ట్ మెంట్ పరువు పోతుందని ఈ కేసును రాజీచేయాలని చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇదే విషయమై ఆయుష్ కమిషనర్ ను, విమ్స్ డైరెక్టర్ ను చరవాణిలో సంప్రదించాలని ప్రయత్నించినా వార అందుబాటులో లేరు..!

Visakhapatnam

2025-02-19 20:15:38

ఆయుష్ లో దళిత ఉద్యోగిపై చేయి చేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్..!

నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఏం పీకలేరు.. నిన్ను కొట్టినా నా వర్గం మీడియా అంతా నేను చెప్పిందే రాస్తారు.. ఎవరేంచేసినా నేనే ఇక్కడే ఆర్డీడిగా కొనసాగుతాను.. నేను కమిషనరేట్ లో ఎవరికి ఏం చేయాలో అది చేశాను.. నా నెట్వర్క్ వినియోగించి ఇన్చార్జి ఆర్డీడిగా వచ్చానంటే మీకు ఈపాటికే అర్ధం అయిపోవాలి.. ఇంకా నా నెట్వర్క్ సంగతి మీకు తెలీదు.. నేను గీసిన గీత కార్యాలయం సిబ్బంది దగ్గర నుంచి నాకు అనుకూలంగా ఉన్న వైద్యులతో సహా ఎవరూ దాటరు.. నువ్వేం చేసుకుంటావో చేసుకో.. నిన్నుకొట్టిన విషయానికి రుజులేవి.. నువ్వూ నన్ను కొట్టావని కంప్లైంట్ చేస్తాను.. నేను అధికారిని నా మాటే చెల్లుతుంది.. నువ్వు ఆఫ్ట్రాల్ సబార్డినేట్ వి.. నన్నే మీడియాకి ఎక్కిస్తారా.. నాపై వార్తలు రాయిస్తారా.. ఏం నేను రాయించుకోలేనా.. నా చేతులో పేపర్లు లేవా..? విలేఖరులు లేరా.. ఏం చేసుకుంటావో చేసుకో.. ఎవర్ని ఏ పాయింట్ మీద ఇరికించాలో నాకు తెలుసు.. కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుల్లో నాపై కంప్లైంట్ పెట్టినా.. అక్కడంతా నావాళ్లే ఉన్నారు..నేను ఏం చేయాలో నేను చేయగలరు.. ఇదీ ఒక దళిత ఉద్యోగిపై చేయిచేసుకోవడంతోపాట.. కులం పేరుతో దూషించడంతోపాటు క్రిందిస్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నా  ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ తీరు..! 

విశాఖలో ఆయుష్ జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్  ఉద్యోగులపై వేధింపులు పరాకాక్షష్టకు చేరుకొని క్రిందిస్థాయి దళిత ఉద్యోగిపై చేయి చేసుకునే వారకూ వచ్చాయి. మంగళవారం విశాఖలోని మధురవాడ ఆయుష్ ఆర్డీడీ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్డీడి కార్యాలయ  దళిత ఉద్యోగిని సుష్హపై కులందూషణ చేయడంతోపాటు చేయిచేసుకున్నారు. దీనితో ఈ విషయాన్ని సదరు దళిత ఉద్యోగిణి ఆయుష్ కమిషనర్ డి.మంజులకి ఫిర్యాదు చేశారు. ఆ వెనువెంటనే ఇన్చార్జి ఆర్డీడి కూడా కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.  అయితే తనపై కమిషనర్ కి ఫిర్యాదు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ దూషించడంతో, అవమానభారం తట్టుకోలేక ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల ప్రతినిధులు కూడా ఆమెకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఇన్చార్జి ఆర్డీడి తనపై చేయిచేసుకున్న విషయమై బాధితులు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. 

సందట్లో సడేమియా అన్నట్టు ఇన్చార్జి ఆర్డీడి ఆయుష్ కార్యాలయాన్ని కూడా ఇదేరోజు విమ్స్ ఆసుపత్రికి ఆఘమేఘాలపై తరలించేశారు. అయితే ఈ విషయాలన్నీ బయటకు తెలియజేస్తున్నారని.. మీడియాలో వార్తలు ఎలా వస్తున్నాయని.. కార్యాలయ సిబ్బందే విషయాలన్నింటినీ మీడియాకి తెలియజేస్తున్నారంటూ కార్యాలయ సిబ్బందిపై ఇన్చార్జి ఆర్డీడి తిట్ల దండం మొదలు పెట్టారు. అయితే తొలుత కార్యాలయంలో సిబ్బందితో సమావేశం పెట్టి మాట్లాడి నట్టుగా మాట్లాడి.. ఉన్నతాధికారికి నమస్కారం కూడా లేచి ఒంగొని చెప్పలేదనే విషయమై గొడవకు దిగిన ఇన్చార్జి ఆర్డీడి గొడవ ముదిరేలా కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే తన అనుకూల మీడియా కార్యాలయం బయట ఉండటం, గొడవ జరిగిన వెంటనే లోనికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఉద్యోగినిపై దాడి జరగడంతో పోలీసు బాధిత ఉద్యోగిని ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నుంచి స్టేట్ మెంట్లు స్వీకరించారు. కావాలనే తనపై ఒక వర్గం మీడియా వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ ఇన్చార్జి ఆర్డీడి ఒంటికాలపై లేచారు. తాను ఎవరికీ సమాధానం చెప్పనని.. ఏం కావాలన్నా కమిషనర్ నే అడుక్కోవాలంటూ కార్యాలయం నోనికి వెళ్లిపోయారు. గొడవ జరిగిన రోజున మధురవాడలోని సొంత స్థలంలో ఉన్న ఆయుష్ కార్యాలయాన్ని తరలించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీబాయ్, దళిత ఉద్యోగిని సుష్మపై చేయిచేసుకున్న విషయమై కమిషనర్ డి.మంజులను ఈరోజు-ఈఎన్ఎస్ వివరణ కోరగా.. విధి నిర్వహనలో ఉన్న ఉద్యోగులు గొడవలు పడటం నేరమని.. అందునా ఇన్చార్జి ఆర్డీడి క్రింది స్థాయి ఉద్యోగిపై చేయి చేసుకోవడం కూదా తప్పేనని హెచ్చరించామన్నారు.

 అంతేకాకుండా విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై వైద్యులు కూడా పలు ఫిర్యాదులు చేశారని..అన్నింటిపైనా విచారణ చేసి, వాస్తవాలు తేలితే చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ని వివరణ కోరేందుకు చరవాణిలో ప్రయత్నించగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆయుష్ కార్యాలయంలో జరిగిన గొడవ, ఆందోళనకు దిగిన ఉద్యోగుల వీడియోలు, ఆయోడియో రికార్డింగ్ లు, ఇన్చార్జి ఆర్డీడికి అనుకూలంగా వ్యవహరించిన కొందరు అనుకూల మీడియా హాడావిడి సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. వీడియోలన్నీ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి క్రిష్ణబాబు, విశాఖజిల్లా కలెక్టర్ ఎం.హరేంధిరప్రసాద్ కు చేరడం ఆయన విచారణ చేస్తామని చెప్పడం విశేషం.

visakhapatnam

2025-02-18 15:20:32

జోన్-1 ఆయుష్ వైద్యులపై ఇన్చార్జి ఆర్డీడి వేధింపుల పర్వం..! దళిత వైద్యులపై కులం పేరుతో దూషణలు

డ్యూటీ టైమ్ లో డిస్పెన్సరీలు మూయించి.. డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ పెట్టాను.. పేపర్ లో వచ్చింది ఏమైనా చేయగలిగారా.. ఆ తప్పు మీరే చేసినట్టుగా సంజాయిషీ లెటర్లు రాయించాను అదీ మీడియాలో వచ్చింది అపుడూ ఏమీ చేయలేకపోయారు కదా.. ఆర్డీడి కార్యాల యాన్ని విమ్స్ లోకి తరలిస్తున్న విషయాన్ని మీడియాకి లీక్ చేశారు.. అయినా కమిషనర్ మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యద ర్శి ఎంటీ క్రిష్ణబాబు ఇద్దరూ ఏమీ చేయలేకపోయారంటే నా రేంజ్ ఏంటో మీకు ఇంకా అర్ధం కాలేదా.. మీరెన్నిసార్లు మీడియాలో రాయించినా నా టీమ్ కమిషనరేట్, సెక్రటేరియట్ లో పనిచేస్తుంది.. నాపై ఈగ కూడా వాలనివ్వరు.. అంతెందుకు రోస్టర్ పాయింట్స్ ని కాదని నేను ఇన్చార్జి ఆర్డీడిగా రాగలిగానంటే నా నెట్వర్క్ ఏ స్థాయంలో ఉందో మీకు ఇంకా అర్ధం కాలేదా..? నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. నేను మోనా ర్కురా లిని.. ఏంటి ఇవేవో సినిమాడైలాగులనుకుంటే.. తప్పులో కాలేసినట్టే.. అక్షరాలా ఆయుష్ లోని జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ వైద్యులను బెదిరించే తీరు..!

ఆయుష్ శాఖలో డబ్బున్నవారిదే రాజ్యం అనడానికి విశాఖ జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ఇన్చార్జి ఆర్డీడీ పోస్టు ఒక ప్రధాన ఉదాహరణ అయితే దానిని అడ్డం పెట్టుకొని వైద్యులను వేధించే తీరు మరీ విడ్డూరంగా ఉంది. చేసిన తప్పులు ఆధారాలతో సహా మీడియాలో వచ్చేస్తే.. దానిని తట్టుకోలేకపోతున్న ఆర్డీడీ డిస్పెన్సరీ వైద్యులను టార్గెట్ చేశారట. ఆసుపత్రులకు వెళ్లి కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారట. అయిదే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఏమైనా అంటే ఈ విషయం బయటకు రాకపోయేది. ఆ కుల దూషణ జరిగింది దళిత వైద్యులపై దానితో ఈ విషయం కాస్తా గుప్పుమని బయటకు వచ్చేసింది. విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడిగా డా.ఝాన్సీ లక్ష్మీభా య్ విధుల్లో చేరిన దగ్గర నుంచి వైద్యులు, సిబ్బంది నరకం చూస్తున్నామని లబో దిబో మంటున్నారు. 

అదే సమయంలో ఈమె చేస్తున్న వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా మీడియాలో వచ్చినా ఈమెపై కమిషనర్ మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులు సైతం చిన్న చర్య కూడా తీసుకోలేదంటే ఏ స్థాయిలో సదరు ఆర్డీడీ నెట్వర్క్ నడుపుతున్నారో అర్ధమ వుతున్నది. అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చిందే మొదలు అంతా కలక్షన్ పైనే గురిపెట్టారని.. అడిగిన మొత్తం ఇవ్వకపోతే డ్యూటీ లు సక్రమంగా చేయడం లేదని రిమార్కులు రాస్తానని బెదిరిస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. తాము విధినిర్వహణలో ఉన్నసమ యంలో కావాలని విశాఖలోని జిల్లా పరిషత్ లో డ్యూటీ టైమ్ లో యునానీ డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి రప్పించారని చెబుతున్నారు. ఆ విషయం పేపర్ లో ఆధారాలతో పాటు వచ్చిన తరువాత.. దాని నుంచి తప్పించుకోవడానికి మళ్లీ తమను బెదిరించి క్షమాపన లేఖలు కూడా రాయించా రని చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన వైద్యులను కూడా విధినిర్వహణ పేరుతో వేధిస్తున్నారనే ఆరోపణ లున్నాయి.

 కొత్తగా డ్యూటీలో చేరినపుడు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చే సమయంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10వేలు తీసుకున్నారని.. ఇపుడు మళ్లీ ఎస్ఆర్ లు ఓపెన్ చేయడానికి మరో రూ.5వేలు డిమాండ్ చేస్తున్నారని.. అవి ఇవ్వని కారణంగా విధినిర్వహణలో అలసత్వం అంటూ విశాఖ ఆర్డీడి కార్యాలయానికి రప్పించి మరీ అమ్మనా బూతులు తిట్టడంతోపాటు, కులం పేరుతోనూ, ఆచార వ్యవహారాల పేరుతోనూ దూషిస్తున్నారని ఆవేదన చెంతున్నారు. కాగా కులదూషణ ఎదుర్కొంటున్న వైద్యుల ఫిర్యాదులను కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రరటీలు పట్టించుకోకపోవడంతో వీరంతా లోకాయుక్తాను, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. నిజంగా అదే జరిగితే పరిపాలనా పరమైన నిర్లక్ష్యం పేరుతో ఆయుష్ కమిషనర్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులు సమాధానం చెప్పాల్సి వుంటుంది. విశాఖ ఇన్చార్జి ఆర్డీడి డా.లక్ష్మీభాయి అడ్డగోలు ఇన్చార్జి అపాయింట్ లో లుక లుకలపై విచారణ చేసినా.. ఇటీవల కాలంలో ఆర్డీడి విధినిర్వహణ సమయంలో జిల్లా పరిషత్ లో ఏర్పాటు చేసిన ఉద్యోగవిరమణ కార్యక్రమంపై విచారణ చేసినా, ఉద్యోగులను కులం పేరుతో దూషిస్తున్న విషయమై విచారణ చేపట్టినా ఆధారాలతో సహా వాస్తవాలు వెలుగుచూసే అవకాశం వుంది. చూడాలి ఇప్పటికైనా కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రరటీలు ఏ విధంగా స్పందిస్తారనేది..?!

visakhapatnam

2025-02-14 16:47:02

అంతా నాయిష్టం- ఆయుష్ ఆర్డీడి కార్యాలయం అడ్డగోలు తరలింపు..?!

ఆయుష్ లో జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి అనుకున్నదే జరగాలి..కమిషనర్ లేదు.. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అసలే లేరు.. ఏదైనా సొంత నిర్ణయం తీసుకొని అమలు చేసేస్తారు.. చేసిన తప్పులన్నీ అధారాలతో సహా కనిపిస్తున్నా.. ఆయుష్ కమిషనరేట్ అధికారులు కనీసం సదరు ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై వెంట్రుకవాసి చర్యలు కూడా తీసుకోరు. అదేమంటే కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు నేను ఎంత చెబితే అంత.. అసలు ఆయుష్ నా సలహా లేకుండా ప్రభుత్వ జీఓ కూడా తయారు కాదు.. కమిషనరేట్ లో ఎవరీ ఏమీ రాదు.. అన్నీ నేనే చెప్పాలి  తెలుసా అంటూ సిబ్బంది ముందే పదే పదే మాట్లాడతారు.. ఆ వాయిస్ రికార్డులన్నీ నేరుగా కమిషనర్ కి చేరినా.. ఫలితం శూన్యం.. ఇపుడు అదే దైర్యంలో తన సొంత నిర్ణయాలతో విశాఖలోని మధురవాడలో ఉన్న ఆయుష్ ఆర్డీడి ప్రాంతీయ కార్యాలయాన్ని విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోకి మార్చేయడానికి ప్లాన్ వేశారు ఆర్డీడి. 

ఏ ప్రభుత్వశాఖ అయినా, అధికారులైనా తమకు సొంత కార్యాయాలు, ప్రదేశాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ఆయుష్ శాఖలోని ఇన్చార్జి జోన్-1ఆర్డీడి మాత్రం. తన సొంత తెలివి వివియోగించి ఈ శాఖ సొంత ఆస్తులు వదించుకొని.. పొరుగింటి పుల్లకూర కూర రుచి అన్నట్టుగా విమ్స్ ఆసుపత్రిలో ఆర్డీడి కార్యాలయం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా విమ్స్ డైరెక్టర్ తో కూడా మంతనాలు జరిపేశారట. ఆయుష్ శాఖకు చెందిన ఆసుప్రతి బ్లాక్ విమ్స్ లో సిద్దమవుతుంది. అది పూర్తయ్యేలోగా ఆర్డీడి కార్యాలయాన్ని కూడా అదే విమ్స్ లోకి తరలించేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు ఆర్డీడీ. ఇంతకీ ఆయుష్ కమిషనర్ కి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ విషయం చెప్పారా అంటే అదేం అవసరం లేదు. నేను నిర్ణయం తీసుకుంటే చాలు అంటున్నారు. 

రేపే..మాపో ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని కూడా అనుకున్నప్రదేశాన్ని తరలించేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిని వైద్యులు, కమిషనరేట్ అధికారులు విబేదిస్తున్నా ఎవరి మాట పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, తరలింపు ఇతర ఆసుపత్రుల్లో కార్యాలయాలు పెట్టాలంటే ఆయుష్ కమిషనర్ అనుమతి ఉండాలి. కానీ ఇక్కడి ఇన్చార్జి ఆర్డీడి మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇటీవలే యునానీ వైద్యుడి రిటైర్ మెంట్ ఫంక్షన్ కి ఆయుష్ డిస్పెన్సిరీలన్నీ డోర్ లాక్ వేయించి మరీ విశాఖలోని జిల్లా పరిషత్ డాక్టర్ తోపాటు.. ఈమె కూడా చక్కటి సన్మానం చేయించుకున్నారు. అ విషయం మీడియాలో రావడంతో తనపై ఎక్కడ కమిషనర్ కన్నెర్ర చేస్తారోనని ముందుగానే కమిషనరేట్ లోని తన అనుచరుల ద్వారా సమాచారం తెలుసుకొని వైద్యులను బెదిరించి మరీ క్షమాపణ లేఖలు రాయించారు. అదీ కూడా మీడియాలో వచ్చేసింది.

 అయినా ఈమెపై కమిషనర్ మంజుల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలే ఇన్చార్జి ఆర్డీడి సీటులోకి కూడా రోస్టర్ పాయింట్, సీనియారిటీని పక్కనపెట్టి గత తేడా ఆయుష్ కమిషనర్ ద్వారా ఇన్చార్జి ఆర్డీడి పోస్టు కొట్టేశారని ఇప్పటికీ సీనియర్ వైద్యులు నెత్తీ నేరూ కొట్టుకుంటున్నారు. ఇపుడు అదే ఇన్చార్జి ఆర్డీడి పోస్టుని అడ్డం పెట్టుకొని ఇస్టానుసారం వ్యవహరిస్తున్న ఆయుష్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మధురవాడలోని సొంత కార్యాలయాన్ని విమ్స్ లోనికి తరలించడానికి ఏమైనా అనుమతులు ఇచ్చారానే అనేవిషయం తెలుసుకోవడానికి కమిషనర్ ను సంప్రదించినా ఎలాంటి సమాధానం రాలేదు. చూడాలి తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఇష్టాను సారం వ్యవహరించే జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో ఆయుష్ కమిషనర్ లేదా.. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది..?!

visakhapatnam

2025-02-04 19:39:47

నిన్న ఆసుపత్రులు మూయించి..నేడు వైద్యులతో బలవంతపు లేఖలు రాయించి..?!

కావాలని తప్పు చేయనేల.. చేసిన తప్పు ఆధారాలతో బయటపడి ఈరోజు-ఈఎన్ఎస్ లలో ప్రత్యేక కథనాలు రావడంతో ఎక్కడ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారోనని మరో తప్పుచేయనేల.. ఏం రాసుకుంటారో రాసుకోండి.. ఎవరితో ఏం మాట్లాడాలో మాకు తెలుసునంటూ బీరాలు పోయి.. రాత్రికి రాత్రికి ఎంతో కొంత తీసుకొని వార్తలు రాయడం మానేయమని బేరసారాలు ఆడనేల.. వచ్చిన వైద్యులకి ఫోటోలు తీసి ముందు మీపై వార్తలు రాస్తామని చెప్పడంతో వచ్చిన తేడా డాక్టర్లు లగెత్తనేల.. ఇన్ని వ్యవహారాలు ఆయుష్ లో ఇన్చార్జి ఆర్డీడీ చేస్తున్నా రంటే.. నిజంగా సదరు అధికారిణి చెప్పినట్టుగానే ఆయుష్ కమిషనర్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు.. ఇతర కమిషనరేట్ సిబ్బంది వ్యవహరిస్తారేమో.. ఆధారాలతో సహా రెడ్ హేండెడ్ గా వైద్యులందరినీతో డిస్పెన్సీలన్నీ మూయించేసి.. రోగులు ఇబ్బందులకు కారణమైన జోన్-1 ఆర్డీడిపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి మరి..!

ఆయుష్ కమిషనర్.. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలు నా చేతిలోనే ఉన్నారని.. నేను వారికి ఎంత చెబితే అంత అని బీరాలుపోయిన విశాఖజోన్ -1 ఆయుష్ ఆర్డీడీ ఇపుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే  ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనధికారికంగా వైద్యులను రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వైద్యుల విధి నిర్వహణ సమయంలో విశాఖ రప్పించి వారితో సన్మానాలు చేయించుకున్న ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ వ్యవహారం ఈరోజు-ఈఎన్ఎస్ సంయుక్తంగా ఆధారాలతో సహాయ బయట పెట్టింది. దీనితో విధినిర్వహణ సమయంలో ఆసుపత్రులు మూసేసి ఎలా రిటైర్ మెంట్ ఫంక్షన్లు చేసుకుంటారని..ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆయుష్ కమిషనర్ మంజుల ఆదేశాలు జారీ చేయడంతో ఇపుడు చేసిన తప్పుని వైద్యుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు విశాఖలోనీ ఆయుష్ ఆర్డీడి. అదీ ఎలా అంటే తమకు తెలియక యునానీ డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వచ్చేశామని.. మొదటి తప్పుగా భావించి తమను క్షమించాలని.. కార్యక్రమానికి వచ్చిన వైద్యులందరితోనూ ముందస్తుగా లేఖలు రాయించుకుని కార్యాలయానికి తెప్పించుకున్నారు. 

దీనితో సదరు వైద్యులు ఈరోజు-ఈఎన్ఎస్ ని సంప్రదించి. తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా తమను బెదిరించి తమతో క్షమాప లేఖలు రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వైద్యుల డిస్పెన్సరీలు పేర్లు బయటపెట్టడం ఇష్టం లేక.. కాంక్రీట్ ప్రూఫ్ లు ఈరోజు-ఈఎన్ఎస్ చేతికి చిక్కాయి. అయితే ఈ విషయం కాస్తా బయటకు రావడం, ఆ తరువాత తమకు బాకా కొట్టే మీడియాలో జరిగిన సంఘటన రాకుండా వారికి ముడుపులు ఇవ్వడం అన్నీ చక చకా జరిగిపోయాయని వైద్యులే చెబుతున్నారు. తాము రామన్నా.. బలవంతంగా కార్యక్రమానికి పిలిపించి.. ఒక్కొక్కరి నుంచి రెండువేలు పార్టీకి వసూలు కూడా చేశారని ఇపుడు తీరా.. తామే తప్పు చేసినట్టుగా.. క్షమాణ లేఖలు ఆయుష్ ఆర్డీడికి, కమిషనర్ కి రాయమని చెప్పడం ఏంటని వైద్యులు మండి పడుతున్నారు.  ఒక వేళ తప్పు చేసినట్టు కమిషనర్ ఇపుడు తమపై చర్యలు తీసుకుంటారేమోనని భయంగా కూడా ఉందని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. సదరు ఆర్డీడి వచ్చిన దగ్గర నుంచి చేసే వ్యవహారాలకు తాము మధ్యలో బలైపోతున్నామని వైద్యులు గగ్గోలు పెడుతున్నారు. 

అయితే ఆర్డీడి విషయంలో మీడియాలో వెలుగుచూస్తున్న వాస్తవాలు, ఆమెపై విచారణ కు ఆదేశించిన విషయాలు అమరావతి నుంచే కొందరు తేడా అధికారులు, సిబ్బంది ఆర్డీడికి ఉప్పందించడంతోనే.. ముందస్తుగా క్రమశిక్షణా చర్యలు పడకుండా వైద్యులతో క్షమాపణ లేఖలు రాయిస్తున్నట్టు తెలిసింది. ఆ విధంగా చేస్తే మెమోకానీ, సస్పెన్షన్ గానీ పడకుండా కేవలం వార్నింగ్ సరిపోతుందని అపుడే కమిషనర్ కార్యాలయం నుంచి ఆర్డీడికి సమాచారం వచ్చిందట. అయితే సదరు విషయంపై ఆర్డీడికి భజనలు చేసే కొందరు వైద్యులు శనివారం రాత్రి ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధులను సంప్రదించి.. ఇకపై మా ఆర్డీడిపై ఎలాంటి వార్తలూ రాయకుండా ఉండాలంటే ఎంతకావాలని బేరసారాలు కూడా జరపడం విశేషం. 

వాస్తవాలను బయట పెట్టే సమయంలో మీకు నచ్చింది రాసుకోమని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి ఆర్డీడి ఇపుడు ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని పంపించారని.. ముందు మీ ఫోటోలు, వివరాలతో న్యూస్ రాస్టే సరిపోతుందని చెప్పడంతో ఆగమేఘాలపై ఆ వైద్యులు బిచానా సర్దేశారు. ఇదే విషయాన్ని కమిషనర్ మంజుల దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు-ఈఎన్ఎస్  ప్రయత్నం చేసినా అమె అందుబాటులోకి రాలేదు. దీనిని బట్టి చూస్తుంటే ఇన్చార్జి ఆర్డీడిగా ఉన్నప్పుడే ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కేసి.. ఆ తప్పులను డిస్పెన్సీ వైద్యులకు మీదకి నెట్టేసి.. చల్లగా తప్పించుకోవాలని.. తాను చెప్పినట్టే అంతా జరగాలని చూసే ఆర్డీడిలు నిజంగా పదోన్నతిపై రెగ్యులర్ ఆర్డీడిలు అయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఆయుష్ కమిషనర్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలే ఆలోచించుకోవాల్సి వుంది..!

visakhapatnam

2025-02-01 19:36:50

ఇన్చార్జి ఆర్డీడి సన్మానం కోసం డిస్పెన్సిరీలు మూసేసిన ఆయుష్ వైద్యులు

పరిపాలన చేసేవాళ్లు మనోళ్లైతే.. విధినిర్వహణ చేయాల్సిన సమయంలో సన్మానాలు.. సత్కారాలు.. బాకా కొట్టే వైద్యులతో చక్క భజనలు చేయించుకున్నా.. రోగులుకు మందులివ్వాల్సిన సమయంలో డిస్పెన్సిరీలు మూసేసినా ఏం పర్లేదు.. వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడినా ఎవరూ పట్టించుకోరు.. కావాల్సిందల్లా ఒక్కటే అనుకున్న సమాయానికి అందరు వైద్యుల సమక్షంలో ఘనంగా సన్మానం.. దానికి ఆయుష్ కమిషనర్ అనుమతి కూడా.. కట్ చేస్తే.. విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ  యునానీ డాక్టర్ అక్తర్ సుల్తాన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం, పనిలో పనిగా తానా తందానా చెప్పే ఆయుష్ వైద్యులతో జోన్-1 ఇన్చార్జి ఆర్డీడికి ఘనసత్కారం ఇదీ విశాఖలోని ఆయుష్ ఆర్డీడి నిర్వాకం..ఇన్చార్జి ఆర్డీడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కమిషనర్ పేరుతో చేసే ఘనకార్యాలపై ప్రశ్నించే వారే లేరు..?!

ఆయుష్ శాఖలో విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ తనకు నచ్చినట్టుగా.. ప్రభుత్వ నిబంధనలు తొక్కిపెట్టి.. నన్ను అడిగేవారు ఎవరున్నారు అంటూ  ఇష్టారాజ్యంగా ముందుకి సాగుతున్నారు. ఆర్డీడి చేసే అడ్డగోలు వ్యవహారాలకు ఏకంగా ఆయుష్ కమిషనర్ కమిషనర్ డి.మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.క్రిష్ణబాబు పేర్లను కూడా ఎడా పెడా వాడేస్తున్నారు. విశాఖలో శుక్రవారం ఆయుష్ శాఖలోని యునానీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ ని కూడా వైద్యులంతా డిస్పెన్సరీల్లో ఓపీ చూసే సమయంలో.. అదీ కూడా అధికారికంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరాన్ని తీసుకొని మరీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సన్మాన సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. అదీ కూడా కమిషనర్ తనకు అధికారికంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పి జోన్ లోని 85 మంది మెడికల్ ఆఫీసర్లకు కబురు పెట్టించారు. 

అయితే సదరు ఆర్డీడిపై అనుమానం రావడంతో ఈ సన్మాన సత్కార కార్యక్రమానికి సుమారు 50 మంది వరకూ ఆయుష్ వైద్యులు, సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ కార్యక్రమాలు విధినిర్వహణ అయిపోయిన తరువాత సాయంత్రం 4.30 తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా అధిపతుల ఆధ్వర్యంలో చేపడతారు. కానీ ఆయుష్ శాఖలో తనదే రాజ్యమని ఇష్టమొచ్చినట్టుగా పరిపాలన చేస్తున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయి వైద్యులందరినీ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి రమ్మని పిలిచారు. ఇక్కడ విశేషం ఏంటంటే డా.అక్తర్ సుల్తానా రిటైర్ మెంట్ కార్యక్రమం వెంటనే అయిపోయింది. ఆ తరువాత ఇన్చార్జి ఆర్డీడికి చక్కభజనలు చేసే కొందరు వైద్యులు, విధులకు సక్రమంగా హాజరు కాని మరికొందరు వైద్యుల ఆధ్వర్యంలో  ఇన్చార్జి ఆర్డీకి సన్మాన, సత్కార కార్యక్రమం ఘనంగా.. మనస్పూర్తిగా పూబొకేలు, దుస్సాలువాలు, పొగడ్తలు పొగిడి మరీ  నిర్వహించారు. 

కష్టపడి డిస్పెన్సరీల్లో ఓపీలు మానేసి.. ఆసుపత్రులు మూసేసి వచ్చారేమో.. మధ్యాహ్నాం భోజనాలు కూడా సత్కారంలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పాపం ఇన్చార్జి ఆర్డీడి కూడా కేజిహెచ్ లోని ఓపీ వదిలేసి మరీ వచ్చారంటే విధినిర్వహణలో ఎంతటి అంకిత భావంమో అర్ధం చేసుకోవచ్చు.. ఆపై సన్మానాలు.. సత్కారాలు అంటే ఇంకెంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనీ కూడా లేదు. ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించానికి ఒక్కో ఆయుష్ వైద్యుడు చందా రూ.2వేలన్నమాట. రిటైర్ అయిన వైద్యుడికి చిన్న కానుకైతే.. ఇన్చార్జి ఆర్డీడికి మాత్రం నచ్చిన కానుకలు కూడా ఇచ్చి.. తమ స్వామి భక్తిని చాటుకున్నారు కొందరు వైద్యులు. ఈ సన్మాన, సత్కార కార్యక్రమం మొత్తం ఆర్డీడీ సేవలను పొగడటానికే వైద్యులకు సమయం సాయంత్రం అయిపోయింది. మరి ఉదయం విధులకు  వెళ్లి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్సు వేసిన వైద్యులు సాయంత్రం ఔట్ ఎఫ్ఆర్ఎస్ కూడా వేయాలి కదా అనే అనుమానం మీకు రావొచ్చు. దానికి కూడా వైద్యులకు ఇన్చార్జి ఆర్డీడి ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చారండోయ్... అదేమిటంటే వైద్యులతో రివ్యూ మీటింగ్ పెట్టినట్టుగా దానిని చిత్రీకరించారు. 

అలా వైద్యులు విధినిర్వహణ చేసే సమయంలో ఉమ్మడి మూడు జిల్లాల వైద్యులకు సమావేశం పెట్టాలన్నా ముందుగా కమిషనర్ అనుమతి కావాలి. కానీ ఎక్కడా ఇన్చార్జి ఆర్డీడి ఆనుమతి తీసుకోలేదు. పైగా ఈ విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే.. మీకు నచ్చింది రాసుకోండి.. అందులో ఎలాంటి అభ్యంతరమూ లేదు.. ఎందుకంటే మా ఆయుషన్  కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి నేను ఎంత చెబితే అంత.. వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో నాకు తెలుసునని బధులిచ్చారు. ఆ తరువాత ఈరోజు-ఈఎన్ఎస్ ఆయుష్ కమిషనర్ డి. మంజులను అనధికార సన్మాన, సత్కార వ్యవహారం విషయమై ప్రశ్నించగా..తనకు ఎలాంటి సమాచారం లేదని.. అయినా రిటైర్ మంట్ ఫంక్షన్లు విధినిర్వహణ సమయం పూర్తయిన తరువాత గానీ, సెలవు రోజుల్లో గానీ చేసుకోవాలి తప్పా.. డిస్పెన్సిరీలు మూసేసి.. అనధికార కార్యక్రమం చేపట్టడం నేరమని అన్నారు. 

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని చెప్పారు. అదే సమయంలో ఇన్చార్జి ఆర్డీడికి మీరు ఎంత చెబితే అంతా అని అంటున్నారని.. ఇది ఎంత వరకూ వాస్తవమని కూడా ప్రశ్నించగా.. తాము ప్రభుత్వానికి జవాబు దారులమని.. క్రింది స్థాయి అధికారులకు కాదని సమాధానమిచ్చారు. జోన్-1లో జరిగే అన్ని వ్యవహారాలపైనా విచారణ చేపట్టి.. వాస్తవాలు తేలితే చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఏది ఏమైనా ఒక గ్రూప్-1 స్థాయి అధికారి ఏకంగా అఖితభారత స్థాయి అధికారులు నేను ఎంత చెబితే అంత అని జోన్ లలో ఇష్టాను సారంగా వ్యవహరించడం ఆయుష్ శాఖలో చర్చనీయాంశం అవుతున్నది..!

visakhapatnam

2025-01-31 13:30:04