రాజధాని విషయం పై మాట్లాడే అర్హత మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కు లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. సోమవారం నర్సీపట్నంలో మీడియాకి విడుదల చేసిన వీడియోలో కీలక అంశాలపై మాట్లాడారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు అమరావతి ని పూర్తి చేయలేదన్నారు. ఆ విషయం మర్చిపోయి నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కి వస్తున్నా ప్రజాదరణను చూసి వార్వలేక ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు ఉత్తరాంధ్రా అభివ్రుద్ధి చెందడటం టిడిపికి ఇష్టం లేకే మూడు రాజధానుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి ఏ స్థాయిలో గొంతు చించుకున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజకీయ ఆటల్లో ఓడిపోయి మనస్సును చంపుకున్న అయ్యన్నపాత్రుడు ఇప్పటికైనా పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు...
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నుంచి కోలుకుంటూ ఆనందంగా ఇంటి బాటపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో కోలుకుని ఆరోగ్యంగా ఉన్న 29 5 మందిని ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాలు, హోమ్ ఐసోలేషన్ ల నుండి డిశ్చార్జు చేసారు. డిశ్చార్జు అవుతూ ఇంటికి వెళుతున్న వారు ఆనందంతో ఉన్నారు. ఆసుప త్రుల్లో మంచి సౌకర్యాలు అందుబాటులో ఉంచారని, వైద్య సేవలు అందుతున్నాయని వారు పేర్కొంటున్నారు. సకాలంలో లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, ఆలస్యం చేయకుండా వెంటనే ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చేర్చడం జరుగుతోంది. మానసికి ప్రశాంతతకు పెద్ద పీఠ వేస్తూ చికిత్స అందించడంతోపాటు పౌష్టికాహారం అందించడం తదితర చర్యల వలన త్వరగా కోలుకునే పరిస్ధితి ఏర్పడింది. ఇంటింటి సర్వే చేయడమే కాకుండా ప్రతి సచివాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తంచి వెంటనే ఆసుపత్రిలో చేర్పంచే చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికి సాధారణ జ్వరంగా భావించి ఇంటి వద్ద ఉండటం లేదా కోవిడ్ వివక్షకు గురి అవుతామని భావించి సమాచారం ఇచ్చే పరిస్ధితి ఉండేది కాదు. తద్వారా చివరి క్షణాల్లో ఆసుపత్రికి రావడం పూర్తి స్ధాయిలో చికిత్స అందించే స్ధితి లేకపోవడంతో మరణాలు సంభవిస్తుండటాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ జె నివాస్ సచివాలయాల్లో రేయింబవళ్ళు పనిచేసే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి ఎటువంటి ఆలస్యం జరగకుండా కేసుల వివరాలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. ఇటువంటి ఏర్పాట్ల వలన ప్రాథమిక స్దాయిలోనే చికిత్స అందించడం వలన కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 11,441 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాగా అందులో 6,769 మంది కోలుకుని ఇళ్ళకు చేరారు. ప్రస్తుతం జిల్లాలో చికిత్స పొందుతున్న 4,548 మందిలో 2,679 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 1165 మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నారు. కేవలం 704 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రుల్లో 1854 బెడ్లు ఉన్న సంగతి విదితమే. కోవిడ్ లక్షణాలు ఉంటూ అంబులెన్సు అవసరం అయ్యే వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లకు సమాచారం అందించవచ్చును. వారితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ కు గాని, జిల్లా కంట్రోల్ రూమ్ కు కూడా 08942 240605, 08942 240607 ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేయవచ్చును. కరోనా లక్షణాలు ఉంటే తెలియజేయాలని దండోరా ద్వారా, ఆటో ప్రచారం ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తున్నారు.
జి.వి.ఎం.సి.లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 17 ఫోన్ కాల్స్ వచ్చాయని ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ మంగపతి రావు చెప్పారు. టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుండి ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03, 2వ జోనుకు సంబందించి 03, 3వ జోనుకు సంబందించి 02, 4వ జోనుకు సంబందించి 01, 5వ జోనుకు సంబందించి 01, 6వ జోనుకు సంబందించి 06, అనకాపల్లి జోనుకు సంబందించి 01, మొత్తము 17 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులతో పాటూ, స్పందన కార్యక్రమాలలో స్వీకరించిన ఫిర్యాదులు, మున్సిపల్ పరిపాలన శాఖ వెబ్ సైట్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి, వి. సన్యాసి రావు, సి.సి.పి. విద్యుల్లత, డి.సి.ఆర్. ఫణిరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు
అజాతశత్రువు మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందు తూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సాంబశివరాజు రెండు సార్లు మంత్రిగా, ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మంత్రి బొత్స వంటి హేమాహేమీలకు రాజకీయ గురువుగా సాంబశివరాజు గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిద విజయరాంపురం ఆయన స్వగ్రామం. రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలు, శత్రువులు లేని ఏకైక మహోన్నత వ్యక్తి. ఈయన మృుతిపట్ల వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మూడో వార్డు నారాయణపురం ప్రజల సౌకర్యార్థం కోసం నిర్వహిస్తున్న సి సి డ్రైవ్ 45 లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ గిరీష పరిశీలించారు. అనంతరం వార్డు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ మరియు కాంట్రాక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కాలవలుపైన అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూడాలని కాలువల పైన ఆక్రమణలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని ఆవార్డు ప్రజలకి సూచించారు. గతంలో రెండు పెద్ద కాలువలు కోసం 90 లక్షల రూపాయలతో నిర్వహించడం జరిగిందని, ఈ పెద్ద కాలువలు అంబేద్కర్ లా కాలేజ్ నుండి ఆటో నగర్ పెద్ద కాలువలోకి కలుస్తుందని తెలియజేశారు, గతంలో అవార్డు ప్రజలు కాలవలు లేక చాలా ఇబ్బంది కలుగుతుంది, వర్షం నీరు ఇళ్లల్లోకి వస్తున్నదని అభ్యర్థించడం జరిగిందని ఆ వార్డు ప్రజల కోసం 45 లక్షలు రూపాయలతో పెద్ద కాలువలు నిర్వహించడం జరుగుతుందని, మన నగరం అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అనంతరం కమిషనర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులు మరియు శానిటరీ సూపర్వైజర్లు తో రేణిగుంట రోడ్డు తుకివాకం వద్ద తడి చెత్త, పొడి చెత్త కోసం షెడ్లు, కొత్త రోడ్ల కు స్మార్ట్ సిటీ ద్వారా అంచనాలు వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఉత్పత్తయ్యే తడి, పొడి చెత్తలు వేరు చేసి వర్మి కంపోస్టు తయారు చేసే విధానం, ప్లాస్టిక్ వేరు చేసే విధానంలోకి రెండు కొత్త షెడ్లు వేయడం కోసం కమిషనర్ పరిశీలించి రెండు మూడు రోజుల లోపల అంచనాలు తయారు చేయాలని తుకివాకం నగరపాలక సంస్థ సంబంధించి స్థలాల్లో చుట్టు చెట్లు నాటాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్.ఈ. చంద్రశేఖర్,డి.ఈ.రఘుకుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ 2 షణ్ముగం, శానిటరి సూపర్వైజర్ చెంచయ్య, సర్వేయర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. కేసులతో పాటు మరణాలు కూడా అదే స్థాయిలో సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ కేసులు అధికమైన దగ్గర నుంచి ఆదివారం ఒక్కరోజే ఆరుగురు వ్యక్తులు కరోనాతో మ్రుతిచెందడం జిల్లా వాసులను భయపెట్టింది. విశాఖ జిల్లాలో 961 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు19,905 కేసులు నమోదు కాగా వీటిలో 12,361 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 74 12 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తాజాగా 20 నూతన క్లస్టర్ లను ఏర్పాటు చేశారు. అత్యవసర పనులకు తప్పా ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ జిల్లా వాసులను కోరారు.
విశాఖ మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను తక్షణమే నిరోధించాలని పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి జిల్లా కలెక్టర్ను కోరారు. ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అనంతరం ఐటిడి ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి . వినయ్ చంద్ పాడేరుశాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి , అరుకువేలీ శాసన సభ్యులు చెట్టి పాల్గుణలతో సమావేశ మయ్యారు. గిరిజన ప్రాంతంలో ఉన్న రహదారి, తాగునీటి సదుపాయాలు, ఇంటర్నెట్ సేవలు, వైద్య సేవలు, సచివాలయ భవన నిర్మాణాలపై సుధీర్ఘంగా చర్చించారు. పాడేరుశాసన సభ్యురాలు, జి.కె. వీధి, కొయ్యూరు,పాడేరు చింతపల్లి రహదారి వ్యవస్దను కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అదే విధంగా చింతపల్లి మండలం రాజుపాకలు గ్రామం వద్ద ప్రభుత్వం ఇచ్చిన డి.ఫారం భూముల్లో అక్రమంగా లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే నిలుపుద ల చేయాలని చెప్పారు. రా ష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి మైనింగ్ అనుమతులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రెన్యువల్ చేయకుండా అక్రమంగా లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ ఏజెన్సీలో ఇటీవల కురిసిన వర్షాలకు ఘాట్రోడ్డులో కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయని వాటి తొలగింపు చర్యలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంజనీరింగ్ అధికారులు ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. నియోజక వర్గంలోని రోడ్లు, భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించాలని , తాగునీటి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వేంటనే రహదారులు భవనాల శాఖ ఎస్ ఇ తో ఫోనులో మాట్లాడి ఐటిడి ఏ పి ఓ నేతృత్వంలో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అరకు ఏరియా ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్ర చికిత్సలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రూ.1.50 లక్షల వేతనం ఇస్తామని జనరల్ మెడిషన్, గైనకాలజిస్టులు, అనస్తీషియా, చిన్న పిల్లల వైద్య నిపుణులను నియమించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ పి ఓ డా. వేంకటేశ్వర్ సలిజామల, మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా. నర్సింగరావు, గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కెవి ఎస్ ఎన్ మూర్తి, పంచాయతీరాజ్ ఈ ఈ కుసుమ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అందరి సహకారం,సమిష్టి కృషితో నిరంతరం ఆదివాసీల అభివృద్దికి కృషి చేస్తామని ఐటిడి ఏ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. ఆదివారం స్దానిక తలారిసింగ్ కేంద్రీయాశ్రమోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన 38వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పడు విశాఖపట్నం వచ్చినా గిరిజన ప్రాంతం అభివృధ్ది, సంక్షేమం, విద్య, వైద్య రంగాలపైనే ప్రత్యేకంగా తనతో చర్చిస్తారని చెప్పారు. మన్యానికి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి 35 ఎకరాల భూ సమీకరణ చేసామని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదగా శంఖుస్తాపన జరుతుందన్నారు.కోవిడ్ నేపధ్యంలో విశిష్టమైన సేవలందిస్తున్న వైద్యులను అభినందించారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో 5700 పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. ముందగా ఏజెన్సీలో ఖాళీలను భర్తీ చేసిన తరువాత మైదానంలో భర్తీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పధకాలు అందిస్తోందన్నారు. 212 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఒకే గొడుగు కింద ప్రభుత్వ సేవలను అందిస్తున్నారని చెప్పారు. అర్హులైన 33 255 మంది గిరిజనులకు 57546 ఎకరాలకు అటవీ హక్కుపత్రాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్పారు. గత వారం ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చింతపల్లి , జి.కె. వీధి మండలాల్లో పర్యటించి గిరిజనులతో చర్చించారన్నారు. మన్యంలో నవరత్నాలు అమలు తీరును వివరించారు. 11 మండలాల్లో మనబడి - నాడు నేడు కింద రూ.99.84 కోట్ల వ్యయంతో 367 పాఠశాలలను అభివృధ్ది చేసి మౌలిక సదుపాయలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 35 కోట్లతో 350 అంగన్వాడీ నిర్మాణాలు,రూ.25 కోట్లతో 135 వెల్నెస్ సెంటర్లు, రూ.500 కోట్లతో 1000 కిలో మీటర్ల రహదారి నిర్మాణాలు చేపట్టామని మార్చినాటికి పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ ఆసరా, వై ఎస్ ఆర్ చేయూత, అమ్మ ఒడి, వై ఎస్ ఆర్ కంటి వెలుగు,పసుపు ప్రాజెక్టు అమలు తీరును వివరించారు. సభాధ్యక్షలు పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించామని, వస్తానని హామీ ఇచ్చాని కరోనా నేపధ్యం లో పరిమితంగా ఆదివాసీ దినోత్సవం నిర్వహస్తున్నామన్నారు. ఆదివాసీలు గొప్ప దేశ భక్తులని పర్యావరణ సంరక్షకులని అన్నారు.గిరిజన సాంప్రదాయ పండగలు ఇటుకుల పండగ,కొర్రకొత్త పండగల వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందన్నారు. స్వాతంత్య్ర సాధనలో గిరిజనులు, అల్లూరి సీతారామ రాజు నేతృత్వంలో ఎన్నొ పోరాటాలు చేసారని చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో గాం మల్లుదొర, గంటందొర కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం రాష్ట్ర ఆర్దిక పరిస్దితిపై పడిందన్నారు. అయినా ముఖ్యమంత్రి అభివృధ్ది ఫలాలను పేదలకు అందిస్తున్నారన్నారు.
వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గిరిజన రైతులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పంపిణీ చేసారన్నారు. ముఖ్యమంత్రి 50 వేలమందికి లక్ష ఎకరాలకు పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రభుత్వ ఇచ్చిన డి.ఫారం పట్టా భూములో వ్యవసాయం చేయకుండా అక్రమంగా మైనింగ్ జరుగుతోందని దానిని నిరోధించాలని కోరారు. గిరిజన గ్రామాలకు నెట్వర్క్ సదుపాయాలు కల్పించాలన్నారు. కోవిడ్ మరణాలు సంభవించకుండా తగిన చర్యలు చేపట్టలన్నారు.
అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాలు పరిరక్షణకు , ఆదివాసీల అభివృధ్దికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జి. ఓ నెం.97ను వై ఎస్ సర్కారు రద్దు చేసిందన్నారు. జి. ఓ.నెం 3పై సుప్రీంకోర్టులో రిట్పిటిషన్ వేయడం జరిగిందని చెప్పారు. అరకులోయలో స్కిల్ డవలప్మెంట్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1/70 చట్టం, 5వషెడ్యూలు,6వ షెడ్యూలు ప్రకారం గిరిజనుల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా పరిపాలన జరుగుతోందని, అసత్యప్రచారాలు మానాలని చెప్పారు. అరకు నియోజక వర్గంలో రూ.49 కోట్ల 90 లక్షల వ్యయంతో 46రోడ్లు పనులు చేపట్టామన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. గిరిజన సాంప్రదాయ నృత్యం అలరించింది.
ఐటిడి ఏ పి. ఓ డా. వేంకటేశ్వర్సలిజామల మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల మేరకు కోవిడ్ నేపధ్యంలో పరిమిత జనాభాతో నిర్వహించామన్నారు. అనంతరం ఎన్ ఎస్ టి ఎఫ్ డిసి పధకం కింద 16 బొలేరో వాహనాలను, ఒక ట్రాక్టరును లబ్దిదారులకు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మెడికల్ కౌన్సిల్ సభ్యులు టి.నర్సింగరావు, మార్కెట్ కమిటీ అధ్యక్షలు గాయిత్రీ దేవి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ కోవిడ్ తీవ్రత ను అరికట్టేం దుకు జిల్లాలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, మందులు, మెటీరియల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు చెప్పారు. శనివారం విశాఖ ఉడా చిల్జ్రన్స్ థియేటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా లో నిన్నటి వరకు 17,488 పాజిటివ్ కేసులను గుర్తించారని, అందులో 8287 మంది ని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసారని, 121 మరణాలు సంభవించాయని తెలిపారు. మొత్తం 1,83,394 పరీక్షలు నిర్వహించామన్న మంత్రి ఇప్పటి వరకూ 9080 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, అందులో 302 మంది ఐసీయూలో ఉన్నారని, 926 మంది ఆక్సిజన్ బెడ్ లలో చికిత్స పొందుతు న్నార ని తెలిపారు. ఇంకా 3010 మంది హోం ఐసోలేషన్ లో, 3296 మంది కోవిడ్ కేర్ సెంటర్ లలో, 2748 మంది కోవిడ్ ఆసు పత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హోం క్వారంటైన్ లో 15042 మంది ఉన్నారని తెలిపారు.134 వెరీ యాక్టివ్ క్లస్టర్ లు, 279 యాక్టివ్ క్లస్టర్ లు ఉన్నాయని తెలిపారు. ప్రజలు గుంపు లు గా తిరగరాదని, స్వచ్ఛందంగా నియంత్రణ పాటించాలని కోరారు. కెజిహెచ్ కొత్త బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు, పీజీ ల స్టయిఫండ్ చెల్లింపు లు త్వరలో జరుగుతాయని తెలిపారు. నగరంలో అదనంగా 42 పిహెచ్ సి లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 54 పాత అంబులెన్స్ లకు మరమ్మతులు చేయిస్తున్నారని తెలిపారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టుల కు వైద్య సేవలు అందించేందుకు గీతం ఆసుపత్రిలో ప్రత్యేకంగా 20 బెడ్ లను కేటాయించారని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఏ. అదీప్ రాజ్, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, డిసిపి ఐశ్వర్య రస్తోగి, రూరల్ ఎస్పీ కృష్ణా రావు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
పాడేరు ఐటీడిఎ పరిధిలోని ఈనెల 2 వతేదీన పెదబయలు మండ లం జి.చింతలవీధి పరిధిలో జరిగిన బ్లాస్టింగ్ లో మృతిచెందిన బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేసారు. ప్రభుత్వం ఆదేశాలు మేరకు బాధితులను శుక్రవారం ఉదయం ఐటీడీఏ కు పిలిపించి చెక్కులను అంద జేశారు. మృతుడు మెండిపల్లి మోహనరావు (29)భార్య అప్పలమ్మ కు రూ.లక్ష,మరొక మృతుడు మెండిపల్లి అజయ్ కుమార్(17) ,తల్లిదండ్రులు బూదన్న, జానకమ్మలకు రూ.లక్ష చెక్కును అందజేశారు. ల్యాండ్ మైన్ జరిగిన నేపద్యాన్ని అడిగి తెలుసుకున్నారు.అధైర్య పడకండి ఆదుకుంటామని భరోసాను ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామానికి రహదారి నిర్మించాలని బాధితులు వినతిపత్రం సమర్పించారు. రహదారి నిర్మాణానికి పి.వో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజకమల్, ఐటీడీఏ పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన ఉదారతను చాటారు. విశాఖలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో నెలలు నిండకుండా జన్మించి న ఓ పసిబిడ్డకు బాసటగా నిలిచారు .పూర్తిగా రూపాంతరం చెందని అవయవాలతో తక్కువ బరువుతో ఆ పసిబిడ్డ జన్మించ డంతో వెంటిలేటర్ మీద చికిత్స అనివార్యమైంది.ఈ క్రమంలో ఆసుపత్రి ఖర్చులు లక్ష పైబడి కావడంతో కైలాసపురం ప్రాంతానికి చెందిన ముత్యాల గౌరి శంకరరావు దంపతులు ఎంపీ ని ఆశ్రయిం చారు. తక్షణమే స్పందించిన ఎంవీవీ క్రెడాయ్ సహాయం తో రూ.1లక్ష చెక్ ను లా సన్స్ బేకోలనీ పార్టీ ఆఫీస్ లో అందజేశారు .ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ పీలా కోటేశ్వరరావు ,అధ్యక్షులు బి .శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
2018 బ్యాచ్ ప్రొబేషనర్ ఐఏఎస్లను సబ్ కలెక్టర్లుగా నియమి స్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నార పురెడ్డి మౌర్య - సబ్ కలెక్టర్ నర్సీపట్నం (విశాఖపట్నం),పృధ్వీ తేజ్ ఇమ్మడి - సబ్ కలెక్టర్ కడప (కడప),ప్రతిష్ఠ మాంగైన్ - సబ్ కలెక్టర్ నూజివీడు (కృష్ణ),హిమాన్షూ కౌశిక్ - సబ్ కలెక్టర్ అమలాపురం (తూర్పు గోదావరి),అమిలినేని భార్గవ్ తేజ - సబ్ కలెక్టర్ కందుకూరు (ప్రకాశం),విధే ఖారే - సబ్ కలెక్టర్ పార్వతీపురం (విజయనగరం) ( పార్వతీపురం ఐటిడిఎ పిఓ గా అదనపు బాధ్యతలు),శ్రీవాస్ అజయ్ కుమార్ - సబ్ కలెక్టర్ నరసరావుపేట (గుంటూరు),అనుపమ అంజలి - సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి),సూరజ్ ధనుంజయ్ - సబ్ కలెక్టర్ టెక్కలి (శ్రీకాకుళం),మేదిడ జాహ్నవి - సబ్ కలెక్టర్ మదనపల్లి (చిత్తూరు), కల్పన కుమారి - సబ్ కలెక్టర్ నంద్యాల (కర్నూల్), కేతన గార్గ్ - సబ్ కలెక్టర్ రాజంపేట (కడప) ఉన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసు పత్రిలో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టరు అధికారు లను ఆదేశించారు. గురువారం ఆయన విన్స్ ఆసుపత్రిని సంద ర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రి డైరెక్టర్, ఇతర అధికారులు, వైద్యులతో ఆయన సమావేశ మయ్యారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలు, వాటిని మెరుగుప రచడం గూర్చి ఆయన సమీక్షించారు. రానున్న కాలంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశమున్నందున, ముందు జాగ్రత్తగా అందుకు అవసరమైన వసతులు ఆసుపత్రులలో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందజేస్తున్న సేవలు వసతులను మరింత మెరుగు పరచుకోవాలి అన్నారు. ఆసుపత్రిలో గల వసతులను, సేవలను పూర్తి స్థాయిలో వినియో గించుకొనుటకు గాను అవసరమైన సిబ్బందిని నియమిం చుకోవాలని, అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి బెడ్డుకు ఆక్సిజన్ అందే విధంగా పరికరాలను అమర్చాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంటు ఆరోగ్య పరిస్థితిని వెంటనే పరీక్షించి, అందించవలసిన చికిత్సను నిర్దారించాలన్నారు. ఈ సమావేశంలో విమ్స్ డైరెక్టరు సత్యవరప్రసాదు, ప్రత్యేక ఉప కలక్టరు సూర్యకళ, జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.తిరుపతిరావు, డా. చలం, డా. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆయన పేరు నాని...పేరుకు తగ్గట్టుగానే అందరినీ నావాళ్లు అను కుంటాడు... అంతేకాదు కరోనా కష్టకాలంలో నా అనుకునేవా రంద రికీ తనవంతుగా నిత్యవసర సరుకులు అందజేస్తూ అందరితోనూ నాని నా అనే మనవాడిగా సాయమందిస్తూ నాలుగువేళ్లు నోట్లోకి వెళ్లేలా చేస్తున్నాడంటూ మన్ననలు పౌందుతున్నాడు. వివరాలు తెలుసుకుంటే విశాఖ సీతంపేట ప్రాంతానికి చెందిన నాని విద్యుత్ సంస్థలో లైన్ మేన్ గా పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి పంజా విసరడంతో చాలామందికి కాయకష్టం చేసుకోవడానికి సైతం పని లేకపోవడంతో...గత నాలుగు నెలలుగా నాని ప్రతినిత్యం 20మం ది వరకూ నిత్యవసర సరుకులు అందిస్తూ వస్తున్నారు. గురువా రం నాని పుట్టినరోజు కావడంతో కొత్తబట్టలు, మిఠాయిలు కొనే డబ్బులతో 30 మంది కుటుంబాలకి నిత్యవసర సరుకులు కొని దానం చేశారు. ఇది చూసిన కుటుంబ సభ్యులు మరో 15 మందికి నిత్యవసర సరుకులు దానం చేశారు. కరోనా సమయంలో తమకు తోచిన సహాయం చేస్తూ నలుగురికి సహాయపడాలనే ఉద్దేశ్యంతో ఈసేవ చేస్తున్నట్టు నాని చెబుతున్నారు. తనతోపా టువతన స్నేహితులు కూడా తాను చేసే సేవకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. వీటితోపాటు చర్చిలోకూడా తమ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు నాని వివరించారు. కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్న యమయంలో నాని నిశ్వార్ధంగా చేస్తున్న సేవ అందరి ప్రశంసలను అందుకుంటోంది.
విశాఖ మన్యంలోని వనసంరక్షణ సమితి భూములకు అటవీ హ క్కుప త్రాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సి పల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. మంగళవారం చింత పల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వనసం రక్షణ సమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి పేదరికాన్ని నిర్ములిం చాలని సూచించారు. సిరిపురం గ్రామం నుంచి కొండపైకి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి తోటలు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. వి ఎస్ ఎస్ లలో సాగుచేసిన కాఫీ తోటలకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. అటవీ భూములు, వి ఎస్ ఎస్ లలో సాగుచేసి మరణించిన వారి వారసులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని స్పష్టంచేశారు. సిరిపురం గ్రామంలో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పట్టాలు సిద్ధం చేసారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన రైతులకు సిల్వర్ మొక్కలు, కాఫీ మొక్కలు సరఫరా చేయాలని చెప్పారు. కాఫీ తోటలు ,మిరియాలసాగు పై వస్తున్న పంట దిగుబడి, ఆదాయాన్ని, రైతులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి పంచాయతి కందులగాది వి ఎస్ ఎస్ తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్,
గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల, పిసిసి ఎఫ్ ప్రతీప్ కుమార్, విశాఖపట్నం సి ఎఫ్ పి.రామ్మోహనరావు, ఏ పి సిసి ఎఫ్ ప్రత్యేకాధికారి ఆర్ ఓ ఎఫ్ ఆర్ ఏ కె ఝా తదితరులు పాల్గొన్నారు.