1 ENS Live Breaking News

సర్వేయర్లు అంకిత భావంతో పరిచేయాలి...జెసి

సర్వేయర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు.  శనివారం జెసి ఛాంబరులో గ్రామ సెక్రటేరియట్లలో నూతనంగా చేరిన సర్వేయర్లకు సర్వే కిట్లను అందించారు.  ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు మంచి సేవలను అందించడానికి ప్రభుత్వం సెక్రటేరియట్ వ్యవస్ధను ఏర్పాటు చేసిందన్నారు.  జిల్లాలో 835 సర్వేయర్ పోస్టులకు గాను 651 మంది జాయనయినట్లు తెలిపారు.  వీరు సర్వే ప్రక్రియను నిబధ్ధతతో చేపట్టి మంచి పేరు తీసుకురావాలన్నారు.   ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిబ్బంది, సర్వేయరలు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-07-04 19:33:49

నిరుపేదలకు తక్షణ వైద్యసహాయం..మంత్రి అవంతి

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అత్యవసర, ఆధునిక వైద్య సేవలు అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు ఆధునీకరించిన 108, 104 సర్వీసులను తీసుకువచ్చామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆర్కే బీచ్ లో ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన ఆధునీకరించిన 108,104 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మండలానికి 108 అంబులెన్స్ సర్వీస్, అత్యవసర చికిత్స వాహనాలను మొత్తం రాష్ట్రంలో 1,088 సర్వీసులను వాడుకలోనికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ వాహనాలకు కెమెరా, జిపిఎస్, మొబైల్ డేటా లను ఏర్పాటు చేశారని, 74వేల మందికి ఒక వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. రోగులకు అత్యవసరంగా చికిత్స అందించడం, దగ్గరలోని ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు 108 అంబులెన్స్ వాహనాలను ఉపయోగిస్తారన్నారు. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలలో మారుమూల వారికి షుగరు,బి.పి.,టి.బి., లెప్రసీ మొదలైన అనారోగ్యాలకు చికిత్స అందించడం, మందులు సరఫరా చేయడానికి 104 వాహనాలు ఉపయోగపడతాయన్నారు. పట్టణ ప్రాంతాలలో ఫోన్ కాల్ అందుకున్న 15 ని.లకు వాహనం వస్తుందని గ్రామీణ ప్రాంతంలో 20 ని.లు ఏజెన్సీ ప్రాంతంలో 25 ని.లలో సేవలు అందుతాయన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ సాంకేతిక పరంగా అభివృద్ధి చెంది, మరింత ప్రతిభావంతంగా సేవలు అందించే విధంగా 108 104 వాహనాలను తీర్చిదిద్దారని చెప్పారు. జిల్లాలో ఈ వాహనాల కు సంబంధించి 235 మందిని కొత్తగా నియమించినట్లు, వారిలో 52 మంది డాక్టర్లు 46 డేటా ఎంట్రీ ఆపరేటర్ లు 92 డ్రైవర్లు 45 టెక్నీషియన్లు ఉన్నారని తెలిపారు. వారి సర్వీసును బట్టి వేతనాలను కూడా అధికారులు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి సత్యవతి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కె భాగ్యలక్ష్మి, జెసి 2 అరుణ్ బాబు, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆర్ డి ఓ కె.పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Rk beach

2020-07-02 23:05:22

అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్-మంత్రి అవంతి

విశాఖపట్నం లో పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన కార్యక్రమాలు బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పథకాలు అమలుచేస్తుందన్నారు విద్యార్దులకు గుణాత్మకమైన, నాణ్యమైన విద్యను అందించేందుకు పలు పథకాలు ప్రేవేశపెడుతున్నారని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి అమ్మవడితో పాటు, వసతి దీవెన, విద్యా దీవెన ,పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన అభివృద్ధికి నాడు.. నేడు, పథకాలను అమలుచేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో పథకాలను అమలు చేస్తునట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. సింహచలంలోని 98 వార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడ స్థానిక పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, అక్కడ నుండి గాజువాక నియోజక వర్గంలో పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు కోసం హైస్కూల్ ప్రాంగణంలో 15 లక్షల రూపాయల ఎంపీ కోటా నిధులతో భోజనశాల భవన నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. 5వ జోన్ పరిధిలోని 59 వ వార్డులో దాదాపు 40 లక్షల రూపాయలతో రోడ్డు, ఆర్.సి.సి. కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక పేద ప్రజలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం 58 వార్డ్ లో సి.సి.డ్రైన్ లు, తదితర పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ లోక్ సభలో రాష్ట్ర ప్రయోజనాలు కోసం పోరాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యనారాయణ, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-07-02 11:06:51

రూ.115 కోట్ల ఉపాది పనులు మంజూరు:పీఓ

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకంలో చేపట్టిన నిర్మాణపు పనులు లక్ష్యాలను సాధించాలని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. గురువారం ఆయన కార్యాలయంలో పంచాయతీ రాజ్,గిరిజన సంక్షేమ శాఖ, ఎస్ ఎం ఐ ,ఉపాధిహామీ అధికారులతో ఉపాధిహామీ నిదులతో చేపట్టిన పనులపై సమీక్షించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.100 కోట్లు,గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.100 కోట్లు, ఎస్ ఎం ఐ రూ.16 కోట్లు విలువైన పనులు పూర్తి చేయాలన్నారు రైతుభోరోసా కేంద్రాలు, సచివాలయం భవన నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో పి.ఆర్. ఈ ఈ కుసుమభాస్కర్, గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ లు కుమార్,మురళి, ఎపిడి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

2020-06-25 19:59:48

రైల్వేస్టేషన్ రోడ్డులో భారీ బ్లీచింగ్ చైన్

అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్డులో పంచాయతీ అధికారులు భారీ బ్లీచింగ్ చైన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రాబ్యాంకు ఏరియాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ విస్తరించకుండా బ్లీచింగ్ చైన్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుంగా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కూడా పిచికారీ చేయిస్తున్నట్టు అన్నరవరం2 సచివాలయ కార్యదర్శి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 100 మీటర్లుకు పైగా ఈ బ్లీచింగ్ చైన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో కరోనా వైరస్ హెచ్చరికలు చేసినట్టు చెప్పారు.

Annavaram Temple

2020-06-23 11:18:04

రెడ్ జోన్ లోకి మారిన అన్నవరం

అన్నవరం ఆంధ్రాబ్యాంకు ఏరియా లో 2కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులు ఈప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. మంగళవారం కరోనా సోకిన వారిని అంబులెన్సులో కాకినాడ తరలించినట్టు ఆర్ఐ భాస్కర ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 3సచివాలయాల కార్యదర్శిలు సమన్వయంతో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో మెడికల్ ఔట్ పోస్టును ఏర్పాటుచేశామన్నారు. కరోనా వైరస్ అన్నవరంలో ప్రబలిన కారణంగా ఈ ప్రాంతంలో లాక్ డౌన్ విధించినట్టు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరలించాలన్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆయన కోరారు. సీనియర్ అసిస్టెంట్  నగేష్, 3 సచివాలయ కార్యదర్శిలు వీఆర్ఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Annavaram Temple

2020-06-23 11:16:51

అక్కడి ఇంటర్నెట్ కష్టాలపై..కన్నెత్తి చూడని అధికారులు

గ్రామసచివాలయాల్లో ఏపి ఫైబర్ నెట్ కనెక్ట్ కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం శంఖవరంలోని గ్రామసచివాలయాల్లో ఏపి ఫైబర్ నెట్ మొరాయించడంతో ప్రభుత్వం నిర్ధేశించిన సర్వీసు రిక్వెస్టులు చేయడానికి వీలుపడక వివిధ పనులకు దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన వారంతా వెనుతిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. నెట్ కనెక్ట్ కాకపోవడంతో సిబ్బంది తమ సొంత మొబైల్స్ లలో నెట్ వినియోగించి సచివాల పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఇంటరెన్ కష్టాలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఆ ప్రభావం సచివాల సిబ్బందిపై పడుతోంది.

Sankhavaram

2020-06-23 11:12:58

ఎన్ ఆర్ సి తీర్మానం పై ముస్లింలు హర్షం

దేశంలో మైనారిటీలను అబధ్రతా భావానికి గురి చేసిన ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తీర్మానం పట్ల రాష్ట్రంలోని మైనార్టీల హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ హెచ్ ఫరూఖి తెలిపారు. ఈ మేరకు ఆయన విజయసాయిరెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఫరూఖి మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం పట్ల కృతజ్ఞత తెలుపుతూ విశాఖ ముస్లింల అందరి తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రగతి భారతి ట్రస్ట్ తరఫున రంజాన్ సందర్భంగా 25 వేల కిట్లను ముస్లిం సోదరులకు అందజేశారు అన్నారు. అందుకు విజయసాయి రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. పెందుర్తి అహ్మద్ నగర్ సొసైటీ తరఫున రహదారి నిర్మాణానికి వినతిపత్రం అందజేశామని అన్నారు. కార్యక్రమంలో ఆల్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

2020-06-21 21:09:56

స్పందన విజ్ఞప్తులు ఆన్ లైన్ లో మాత్రమే..

 కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్పందన కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఆన్ లైన్ లో తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా వినతులు, ఫిర్యాదులు కాగిత రూపంలో స్వీకరించడం లేదని ఆయన వివరించారు. వినతులు, ఫిర్యాదులు spandanasrikakulam@gmail.com మెయిల్ ఐడికి లేదా 9491222122 వాట్సప్ పంపించ వచ్చని చెప్పారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయం లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేసినందున ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజలు అనవసరంగా వ్యయప్రయాసలు పడి శ్రీకాకుళం రావద్దని, ఇంటి వద్దనే ఉంటూ కరోనా వ్యాప్తి నివారణలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోనూ ఒకే చోట ఉండ వద్దని సూచిస్తూ వ్యక్తుల మధ్య దూరం పాటించాలని, మాస్కు విధిగా ధరించాలని కోరారు.

2020-06-21 19:11:37

డా.వైఎస్సార్ నేతన్న రైతులకు వరం కావాలి.. సీఎం జగన్

రాష్ట్రంలో పేదల బ్రతుకులు మార్చేందుకు ప్రభుత్వం కృషి  చేస్తుందని  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం వై.యస్.ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి

2020-06-20 22:28:23

కరోనా ప్రభలకుండా పటిష్ట చర్యలు..కలెక్టర్

జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనా నివారణ చర్యలపై మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహి

2020-06-20 22:04:04