1 ENS Live Breaking News

Whats Appలో ఇక మెసేజుని ఎడిట్ చేసుకోవచ్చు..

సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్ సరికొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మనం ఎవరికైనా పంపే మెసేజులో తప్పులుంటే వా టిని ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఏదైనా సమాచారం పంపితే అది నేరుగా అవతలి వ్యక్తికి దగ్గరకు వెళ్లి పోయేది..తప్పులున్నా..ఒప్పులున్నా..అయితే ఇపుడు కొత్తగా వచ్చిన అప్డేట్ లో వాట్సప్ మెసేజ్ ను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కూడా అం దుబాటులోకి వచ్చింది. ఈ విధానం కూడా కేవలం మెసేజ్ పంపిన 15 నిమిషాలలో మాత్రమే ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడా నికి వీలుపడుతుంది. ఆ సమయంలో సదరు మెసేజ్ ని ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపేసిన 15 నిమిషాల తరువాత మాత్రం ఎ డిట్ చేసుకునే వీలు లేదు. అయితే ఈ కొత్త ఫీచర్ వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఈ కొత్త ఫీచర్ వినియోగించాలంటే వాట్సప్ లేటెస్ట్ వెర్షన్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాల్సి వుంటుంది. ఇకపై ఎప్పుడైనా కంగారులో అరకొర సమాచారాన్ని పంపేసినా..వెంటనే గు ర్తించి సరిచేసుకునే వీలు కలగడం ఇపుడు వాట్సప్ యూజర్లకు ఊరట నిచ్చే అంశమనే చెప్పాలి..

అమెరికా

2023-05-15 10:19:01

తిరుమలలో ముగిసిన బాలకాండ పారాయణం

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై 2021  జులై 25న ప్రారంభిం చిన బాలకాండ పారాయణం సోమవారం ఘనంగా ముగిసింది.   తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ ధాని మాట్లాడుతూ, లోక క‌ల్యాణార్థం టీటీడీ నిర్వ‌హిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించిందన్నారు. ఇం దులోని ప్ర‌తి శ్లోకం మంత్ర‌మేన‌న్నారు. బాల‌కాండలోని మొత్తం 77 స‌ర్గ‌ల్లో 2,232 శ్లోకాలను  649 రోజులపాటు పారాయణం చేశామన్నారు. ప్ర‌తి శ్లోకానికి అర్థంతోపాటు ప్ర‌స్తుత స‌మాజానికి అన్వ‌యించి పండితులు వ్యాఖ్యానం అందించార‌ని వివ‌రించారు.

          శ్రీ బేడి ఆంజనేయ‌స్వామి, శ్రీ‌రాముని అవ‌తార‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌మ‌క్షంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై బాలకాండ పారాయ‌ణం చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. రామ‌నామ‌స్మ‌ర‌ణ ఎక్క‌డ జ‌రిగితే అక్క‌డ హ‌నుమంతుడు ఉంటార‌ని వాల్మీకి మ‌హ‌ర్షి తెలియ‌జేశార‌ని, ఆవిధంగా ఇన్నిరోజులు ఆంజ‌నేయుడు మ‌న‌మ‌ధ్యే ఉన్నార‌ని చెప్పారు. వాల్మీకి మహర్షి గురువుగా మారి రామాయణాన్ని లోకానికి అందించారన్నారు.   బాలకాండ పారాయణం నిర్వహించిన ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం అధ్యాప‌కులు డా. ప్ర‌వ రామ‌కృష్ణ సోమయాజులు, ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం పండితులు  రామానుజచార్యులు,  మారుతి,  శేషాచార్యులకు, ఈ కార్య‌క్ర‌మాన్ని కోట్లాది మంది భ‌క్తులకు చేరువ చేసిన‌ ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ కుమార్ కు, అద్భుత‌మైన కీర్త‌న‌లు ఆల‌పించిన అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. అనంత‌రం పండితుల‌ను, క‌ళాకారుల‌ను స‌న్మానించారు.

          బాలకాండలోని 74 నుండి 77వ సర్గ వరకు 4 సర్గలు, యోగ వాశిష్ఠం, ధన్వంతరి మహామంత్రం, అష్టాక్షర  శ్రీరామమంత్ర స్త్రోత్రం కలిపి మొత్తం 166 శ్లోకాలను శ్రీ అవధాని పర్యవేక్షణలో పండితులు పారాయ‌ణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వందన బృందం "శ్రీరామ జయరామ  శృంగార రామాయని..", కార్యక్రమ ప్రారంభంలో, హైదరాబాద్ కు చెందిన సాంప్రదాయ కళాశాల విద్యార్థుల బృందం "ప్రతి వారం వారం మానస భజారే రఘువీరం.." సంకీర్తనను చివరిలో ఆలపించారు. 

Tirumala

2023-05-15 10:09:57

ఈనెల 28న న్యూఢిల్లీలో CNNEO సమవేశం

కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ,న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్ సమావేశం దేశరాజధాని న్యూ ఢిల్లీ చాణిక్యపురి లోని హోటల్ సామ్రాట్ లొ జరుగుతుందని కాన్ఫెడరేషన్ సభ్యులు, అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు చలాది పూర్ణచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు, నూతన వేతన సంఘ ఏర్పాటు,  రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్, యూఎన్ఐ వార్త సంస్థ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేకసమస్యలు పరిష్కరించి యూ ఎన్ ఐ పిటిఐ లను జాతీయం చెసి 1977 కి ముందు కేంద్రం పరిధిలో పని చేసినట్లే సమాచార్ గా మార్చాలన్న ప్రతిపాధనలతో పాటు ఇతర అంశాలు కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళనున్నట్టు పేర్కొన్నారు. ఈ కాన్ఫడరేషన్ సమావేశనికి పిటిఐ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్ యాదవ్,యూ ఎన్ ఐ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మరియు కాన్ఫెడరేషన్ కొసధికారి ఎం.ఎల్ జోషి, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (i)(NUJI) అధ్యక్షులు రాస్ బీహారి,ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, (IJU),ది ట్రిబ్యున్ ఎంప్లాయిస్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ప్రతినిధులతో పాటు ఈ సభ్య యూనియన్ లనుండి మొత్తం 80 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆ ప్రకటనలో తెలిపారు.

Machilipatnam

2023-05-12 11:02:29

CIIయంగ్ ఇండియన్స్ వైజాగ్ చాప్టర్ పుదుచ్చేరి సందర్శన

సీఐఐ-యంగ్ ఇండియన్స్ వైజాగ్ చాప్టర్, పుదుచ్చేరి చాప్టర్ బృందం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిని, కార్మిక, రవాణా మంత్రి సి.ప్రియాంగతో భేటీ అయ్యారు. పుదుచ్చేరి చాప్టర్ ద్వారా ఈ బృందం క్రాస్ లెర్నింగ్ సందర్శనను నిర్వహించాయి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, మంత్రిలతో భేటీ అయ్యారు. సిఐఐ చేపడుతున్న పలు అంశాలపై బృందం మంత్రితో పూర్తిస్థాయిలో చర్చించింది. మెరుగైన పద్ధతులు, భాగస్వామ్యాల అమలు గురించి మంత్రితో మాట్లాడారు. ఈ చర్చల్లో యంగ్ ఇండియన్స్ బృందం పలు సూచనలు, సలహాలు పరస్పరం అందిపుచ్చుకున్నారు. తమ విభాగం చేపడుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తం చేసేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్టు ప్రతినిధులు వివరించారు. వైజాగ్ ప్రతినిధి బృందానికి వైజాగ్ చైర్ రాయ్ కొడాలి, పాండిచ్చేరి ప్రతినిధి బృందానికి పాండిచ్చేరి చైర్ దిలీప్ ఆనంద్ నేతృత్వం వహించారు. 

Puducherry

2023-05-04 07:37:27

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 65,910 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.2.80 కోట్లు వచ్చింది. 27,838 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. 06 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్ధానం మీడియాకి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-28 01:28:32

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 63,382 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.3.25 కోట్లు వచ్చింది. 27,478 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. 06 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్ధానం మీడియాకి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-27 02:30:16

శనివారం కూడా పాస్ పోర్ట్ కార్యాలయాలు పనిచేస్తాయ్

ఆంధ్రప్రదేశ్ లోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం సైతం పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు. దరఖాస్తుదారుల వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం సైతం పనిచేస్తాయని, ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా తరువాత చాలా మంది పాస్ పోర్టులకి దరఖాస్తులు చేసుకోవడం తగ్గించారు. గతంలో దరఖాస్తులు చేసుకున్నవారు చాలా మంది పెండింగ్ లో ఉన్నారు. కాగా అన్ని దరఖాస్తులను వేగంగా పరిశీలిండంతోపాటు, అత్యధికమందికి పాస్ పోర్టులు అందించడం ద్వారా విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లేవారికి వెసులుబాటుగా వుంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం కార్యాలయాలు పనిచేయడంతో ఇటు ఇతర రంగాలకు ఉపాది దొరకనుంది.

New Delhi

2023-04-26 10:46:58

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 56,680 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.54 కోట్లు వచ్చింది. 18,947 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. 06 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-21 01:07:09

తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 61,050 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.3.55 కోట్లు వచ్చింది. 22,996 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతున్నది. 03 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-20 01:13:11

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 69,781 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.5.16 కోట్లు వచ్చింది. 27,552  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 05 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.  రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-11 02:55:40

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 86,129  మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.4.86 కోట్లు వచ్చింది. 28,094  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 11కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు, స్వామివారిసేవలు కొనసాగుతున్నాయి. వసతి గదులు అందుబాటులో ఉన్నా యి. 

Tirumala

2023-04-10 01:29:17

మళ్లీ 25వేలు మార్కు దాటిన కరోనా వైరస్ కేసులు

భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికిపైగా రోజువారీ కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. నిన్న 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,335మందికి వైరస్ సోకిందని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిం చింది. మందురోజు ఆ సంఖ్య 4,435గా ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 25వేల మార్కు దాటాయి. మొ త్తం కేసుల్లో బాధితుల వాటా 0.06 %గా ఉంది. రికవరీ రేటు 98.75 % గా నమోదైంది. తాజాగా కేంద్రం ఆరుగురు మరణించినట్లు ప్రకటించిం ది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,929కి చేరింది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశంలో కొవిడ్‌(Covid 19) కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగు తున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.

New Delhi

2023-04-06 08:53:25

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 73,208  మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.4.12 కోట్లు వచ్చింది. 30,642 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నా లు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 19 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తు లు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వా మివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-06 02:25:12

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 70,497 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.56 కోట్లు వచ్చింది. 28,832 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 11 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-05 04:39:53